అన్వేషించండి

Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిరంలో ధ్వజారోహణం| అభిజిత్ ముహూర్తంలో జెండా ఎగురవేసిన ప్రధాని మోదీ!

అయోధ్య రామ మందిర్లో 2025లో వివాహ పంచమి సందర్భంగా కాషాయ ధ్వజం ఎగురవేశారు. 44 నిమిషాల అభిజిత్ ముహూర్తంలో ధ్వజ ప్రతిష్టాపన జరిగింది.

Ram Mandir Dhwajarohan 2025 Abhijit Muhurat: అయోధ్యలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన రామ మందిరంలో నవంబర్ 25, 2025న ధ్వజారోహణం జరగింది. ఈ శుభకార్యం వివాహ పంచమి రోజున అభిజిత్ ముహూర్తంలో  ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ గొప్ప క్రతువు కోసం రామ మందిరంతో పాటు అయోధ్య నగరాన్ని సుందరంగా  అలంకరించారు.  ఈ శుభ సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ  హాజరై  ధ్వజారోహణం చేశారు. 

 ధర్మ ధ్వజాన్ని ఎగురవేసేందుకు  అయోధ్యకు చేరుకున్న ప్రధాని మోదీ ...దీనికి ముందు అక్కడ రోడ్‌ షో నిర్వహించారు (Ayodhya Ram Temple). 
మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న మోదీకి.. ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, గవర్నర్‌ ఆనందీబెన్ పటేల్‌  స్వాగతం పలికారు. అనంతరం కట్టుదిట్టమైన భద్రత మధ్య మోదీ రోడ్‌ షో నిర్వహించారు. చిన్నారులు, మహిళలు స్వాగతం పలుకుతూ పూల వర్షం కురిపించారు. రోడ్‌షో తర్వాత రామజన్మభూమి ఆలయంలో శేషావతార్‌ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కొత్తగా నిర్మించిన సప్త మందిర్‌ను సందర్శించారు. మాతా అన్నపూర్ణాదేవికి కూడా పూజలు చేశారు. అనంతరం రామ మందిర గర్భగుడిపై కాషాయ వర్ణంలోని ధర్మ ధ్వజాన్ని ప్రధాని ఎగురవేశారు.

 రామ మందిరం శిఖరంపై ప్రతిష్టించనున్న ధ్వజం కాషాయ (కాషాయం) రంగులో ఉంది. దీనిపై ఓం, కోవిదార్ వృక్షం , సూర్య దేవుడు పొటోలు చెక్కి ఉన్నాయి.   ఈ ధ్వజాన్ని రామరాజ్య ఆదర్శాలకు చిహ్నంగా భావిస్తున్నారు. ఆలయంలో ధ్వజం కోసం పురోహితులు అభిజిత్ ముహూర్తం సమయాన్ని నిర్ణయించారు.  

అభిజిత్ ముహూర్తం అంటే ఏంటి?

అభిజిత్ ముహూర్తం ఏదైనా శుభ లేదా మంగళకరమైన పని చేయడానికి చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు.. ఈ ముహూర్తంలో చేసిన పనులు విజయవంతమవుతాయి..ఏ లోపం ఉండదు. ఏదైనా శుభ లేదా మంగళకరమైన పని చేయడానికి మీకు యోగం లేదా ముహూర్తం దొరకకపోతే అభిజిత్ ముహూర్తంలో అన్ని పనులు చేయవచ్చు. పంచాంగం ప్రకారం, సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు 15 ముహూర్తాలు ఉన్నాయి, వీటిలో అభిజిత్ ముహూర్తం ఒకటి. వారంలోని 7 రోజుల‌లో బుధవారం మినహా మిగిలిన 6 రోజులలో అభిజిత్ ముహూర్తం ఉంటుందని చెబుతారు పంచాంగకర్తలు

రామ మందిరంలో ధ్వజారోహణం కోసం కేవలం 44 నిమిషాల సమయం

అయోధ్య రామ మందిరంలో ధ్వజారోహణం కోసం నవంబర్ 25న  అభిజిత్ ముహూర్తం ఉదయం 11:45 నుంచి మధ్యాహ్నం 12:29 వరకు ఉంటుంది. ఈ ముహూర్తంలోనే ఆలయ శిఖరంపై ధ్వజం ఎగురవేశారు. శ్రీరాముడు కూడా అభిజిత్ ముహూర్తంలోనే జన్మించాడని నమ్ముతారు. అందుకే ధ్వజారోహణం కోసం పురోహితులు కూడా ఇదే ముహూర్తాన్ని శుభప్రదంగా భావించారు. అలాగే, ఈరోజు నవంబర్ 25న అభిజిత్ ముహూర్తంతో పాటు రాముడు-సీత వివాహం జరిగిన రోజు అంటే వివాహ పంచమి కూడా ఉంది. అందుకే ఈరోజు ఆధ్యాత్మికంగా మరింత పవిత్రమైనది.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించి అందించినది మాత్రమే . ఇక్కడ ABPదేశం ఎటువంటి నమ్మకం లేదా సమాచారాన్ని ధృవీకరించదని చెప్పడం ముఖ్యం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
YSRCP Politics: ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
Hyderabad Crime Report: హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 3rd T20 Highlights | మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం
Rohit Sharma Golden Duck | రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్
Virat Kohli Half Century in Vijay Hazare Trophy | 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన కింగ్
Rinku Singh Century in Vijay Hazare Trophy | విజయ్ హజారే ట్రోఫీలీ రింకూ సింగ్ సెంచరీ
Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
YSRCP Politics: ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
Hyderabad Crime Report: హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
Shambhala Review : 'శంబాల' టీం ఫుల్ జోష్ - హిందీ వెర్షన్‌కు రిలీజ్ డేట్ ఫిక్స్!... ముంబైలో ప్రమోషన్స్
'శంబాల' టీం ఫుల్ జోష్ - హిందీ వెర్షన్‌కు రిలీజ్ డేట్ ఫిక్స్!... ముంబైలో ప్రమోషన్స్
Prakash Raj : వారిని మొరుగుతూనే ఉండనివ్వండి - అనసూయకు ప్రకాష్ రాజ్ సపోర్ట్
వారిని మొరుగుతూనే ఉండనివ్వండి - అనసూయకు ప్రకాష్ రాజ్ సపోర్ట్
Duvvada Srinivas: నా హత్యకు కృష్ణదాస్‌ కుట్ర, దువ్వాడ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు! ఘాటుగా స్పందించిన మాజీ డిసీఎం
నా హత్యకు కృష్ణదాస్‌ కుట్ర, దువ్వాడ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు! ఘాటుగా స్పందించిన మాజీ డిసీఎం
Tata Sierra లేదా Hyundai Creta లలో మీకు ఏ SUV సరైనది ? ఫీచర్లు చూసి డిసైడ్ అవ్వండి
Tata Sierra లేదా Hyundai Creta లలో మీకు ఏ SUV సరైనది ? ఫీచర్లు చూసి డిసైడ్ అవ్వండి
Embed widget