By: ABP Desam | Updated at : 28 Feb 2022 02:28 PM (IST)
Edited By: RamaLakshmibai
Ardhanarishvara Tatvam
అర్థ-నారి-ఈశ్వర.....అంటే సగం స్త్రీ-సగం పురుషుడు....ఇద్దరూ కలిస్తే అర్థనారీశ్వరుడు. ఆధునిక శాస్త్ర పరిశోధన చెబుతున్నది ఏంటంటే పదార్థం-చైతన్యం కలయికే సృష్టి. రెండింటినీ తీసుకుని చక్కనైన దేవతా స్వరూపాలను కల్పన చేసుకుని ఆరాధిస్తాం. అదే అర్థనారీశ్వర తత్వం. అయితే ఫొటోల్లో చూస్తుంటే రెండు ముక్కలు కలిపినట్టు దేహం కనిపిస్తుంది. మనకు క్లియర్ గా అర్థం అయ్యేందుకు ఇలా రూపకల్పన చేశారు కానీ అర్థనారీశ్వర తత్వం అంటే స్త్రీ-పరుషులు కలసి ఒక్కటే అనే అర్థం.
సృష్టిలో ప్రతీది రెండుగా ఉంటుంది....
వీటిలో ఏ రెండూ ఒకేసారి ఉండవు. ఒకటి లేకుండా మరొకటి ఉండవు. రెండింటి సమ్మేళనం ఒకటవుతుంది. పగలు రాత్రి కలిస్తే రోజు, సుఖం-దుంఖం కలిస్తే జీవితం, బొమ్మ-బొరుసు ఉంటే ఓ నాణెం. ఇలా స్త్రీ-పరుషుడు కలిస్తే సృష్టి అని చెబుతుంది అర్థనారీశ్వరతత్వం. ఒక్కచోటే ఉంటారు ఒకరికొకరు కనపడరు. కానీ ఇద్దరూ కలిస్తేనే విశేషం.
Also Read: శివం పంచభూతాత్మకం అని ఎందుకు అంటారు
ప్రతిమనిషి లోనూ అర్థనారీశ్వర తత్వం ఉంటుంది. పిల్లలను తల్లి కన్నా సున్నితంగా పెంచే తండ్రులు ఉంటారు, తండ్రి కన్నా బాధ్యతగా భావించే తల్లులు ఉన్నారు. అంటే స్త్రీ-పురుషులిద్దరిలోనూ స్త్రీ తత్వం-పురుష తత్వం రెండూ ఉంటాయి. అది అర్థం చేసుకోపోవడం వల్లనే అభిప్రాయ బేధాలు వస్తున్నాయ్. ఇది గుర్తిస్తే వివక్ష ఉండదు. ప్రస్తుత సమాజానికి అర్థనారీశ్వర తత్వం అవసరం కూడా. తల ఆలోచనకి , పాదం ఆచరణకు సంకేతాలైతే , పార్వతీపరమేశ్వరులు తలనుంచి కాలివరకు..ప్రతి చర్య-ఆలోచనలోనూ సమానంగా ఉంటారని అర్థం. భార్యా భర్త అన్యోన్యంగా ఉంటూ... తప్పు అయినా ఒప్పు అయినా ... ఆచరణలోనూ ,ఆలోచనలోనూ కర్మలలోను , కార్యాలలోను , నిర్ణయాలలోనూ , నిర్మాణాలలోనూ ఒకటిగా ఉండాలని సూచించే హిందూ ధర్మమే అర్థనారీశ్వర తత్వం.
సాధారణంగా ఈశ్వరుడు స్థిరస్వభావం...తనలో మార్పులుండవు. అమ్మవారు మాయా స్వరూపం అంటే మారుతూఉంటుంది. సృష్టిలో రెండే శాశ్వతం ఒకటి మారేది మరొకటి మారనిది. స్థిర తత్వం పురుషతత్వం అయితే...మాయా తత్వం స్త్రీ సొంతం. మళ్లీ మాయాతత్వం అంటే తప్పుగా అర్థం చేసుకుంటారేమో....పురాణాల ఉద్దేశం అది కాదు. మార్పు అంటే పురుషుడి చతుర్విద ఆశ్రమాల్లో స్త్రీ అనేక పాత్రలు పోషిస్తుందని అర్థం.
Also Read: శివుడుని 'లయకారుడు' అని ఎందుకంటారు
అంటే పురుషుడు ఒక్కడే...కానీ ఒకే స్త్రీ మారుతూ వచ్చింది....అందుకే స్త్రీని మాయాస్వరూపం అంటారు. భార్యగా ఆమెకున్న ఘనతను గుర్తించే తనలో సగభాగం చేసుకుని అర్థనారీశ్వరడుగా మారాడు పరమశివుడు.
Heavy Rush at Tirumala: తిరుమలకు వెళ్తున్న భక్తులకు టీటీడీ కీలక సూచనలు, కిలోమీటర్లు మేర క్యూలైన్లలో గోవిందా గోవిందా !
Horoscope Today 29th May 2022: ఈ రోజు ఈ రాశివారు మాజీ ప్రియురాలు/ ప్రియుడిని కలుస్తారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Today Panchang 29 May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, దుఃఖం, శ్రీ సూర్య స్త్రోత్రం
Tirumala News : తిరుమలకు పోటెత్తిన భక్తులు, శ్రీవారి దర్శనానికి 48 గంటలు పట్టే అవకాశం!
Horoscope Today 28th May 2022: ఈ రాశులవారు తమ పనిని పక్కవారికి అప్పగించేందుకు ప్లాన్ చేస్తారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Vijayashanthi: విజయశాంతి - వీకే శశికళ రహస్య భేటీ! మూడేళ్ల క్రితం సాధ్యంకానిది ఇప్పుడవుతుందా?
Amalapuram Violence: కొనసాగుతున్న అరెస్టుల పర్వం - మరో 7 రోజులపాటు 144 సెక్షన్ పొడిగింపు, మరో కీలక నిర్ణయం
Boy Smoking: KGF 2 రాకీ భాయ్లా ట్రై చేసిన స్టూడెంట్, వెంటనే ఆసుపత్రిలో జాయిన్ చేసిన పేరెంట్స్
Khammam: కానిస్టేబుల్ దంపతుల పాడుపని! ఏకంగా కోటిన్నర దోచేసిన భార్యాభర్తలు