అన్వేషించండి

TTD Pink Diamond: బాల్యంలో ధరించిన హారాన్ని శ్రీవారికి సమర్పించిన మైసూరు మహారాజు- వీడిన పింక్ డైమండ్ మిస్టరీ!

Tirumala News: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి పింక్‌ డైమండ్‌ వ్యవహారం మరోసారి చర్చకు వచ్చింది. అయితే అది పింక్ డైమండ్ కాదు రూబీ అని తేలింది.

Tirumala: తిరుమల శ్రీవారి పింక్ డైమండ్ మిస్టరీ వీడింది. అసలు నిజం వెలుగులోకి వచ్చింది. అది అసలు పింక్ డైమండ్ కాదు కెంపు... 1945లో మైసూరు మహారాజు శ్రీవారికి బహూకరించారు

1945 జనవరి 9న మైసూరు మహారాజు జయచామరాజేంద్ర వడియార్ తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చి, తాను బాల్యంలో ధరించిన హారాన్ని స్వామికి సమర్పించారు. ఈ హారంలో ఉన్నది పింక్ డైమండ్ కాదని, కెంపు (రూబీ) అని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) అధ్యయనంలో వెల్లడైంది. మైసూరు ప్యాలెస్ రికార్డుల ప్రకారం, ఈ హారంలో కెంపులు, ఇతర రత్నాలు మాత్రమే ఉన్నాయి, పింక్ డైమండ్ గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. 

ఈ సర్వే వెల్లడించిన విషయాలతో పింక్ డైమండ్ కథ కంచికి చేరినట్టైంది. గతంలో రాజకీయ విమర్శలతో పింక్ డైమండ్ వ్యవహారం భారీగా చర్చకు తావిచ్చింది. ప్రభుత్వాన్ని, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేసేలా అప్పట్లో వైసీపీ చేసిన ప్రచారం అసత్యం అని తేల్చి చెప్పేలా కొన్ని ఆధారాలను బయపెట్టారు ఆర్కియాలజీ డైరెక్టర్ మునిరత్నం. తిరుమల శ్రీవారికి విలువైన ఆభరణాలు సమర్పించిన రాజుల్లో  మైసూరు మహారాజు జయచామరాజేంద్ర వడియార్‌ కూడా ఉన్నారు.

1945 జనవరి 9న తిరుమల శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చారు. ఈ పర్యటనకు సంబంధించి మైసూర్ ప్యాలెస్ నుంచి 1944 డిసెంబరు 29న రామయ్య అనే ప్యాలెస్‌ అధికారి TTD కమిషనర్‌కు లేఖ రాసినట్టు ఆధారాలున్నాయి.  రైలు ద్వారా 1945 జనవరి 9న ఉదయం 8 గంటలకు రేణిగుంటకు చేరుకున్న రాజావారు  తిరుపతి, శ్రీకాళహస్తి రాకపోకలకు 2 కార్లు ఏర్పాటు చేసేందుకు సహకరించాలంటూ ఆ లేఖలో ఉంది. టూర్ షెడ్యూల్ కాపీని కూడా పంపించారు. ఈ పర్యటనకు వచ్చినప్పుడే మహారాజు శ్రీవారికి హారాన్ని సమర్పించారు. అప్పటి నుంచి ఆ హారాన్ని విశేష ఉత్సవాల సమయంలో ఉత్సవమూర్తులకు అలంకరిస్తోంది టీటీడీ. ఇందులో భాగంగా 2001 అక్టోబరు 21న జరిగిన గరుడ సేవలో మలయప్పస్వామికి అలంకరించిన ఆహారం..కెంపు విరిగిపోయింది. 

భక్తులు విసిరిన నాణేలు తగిలి ఇలా జరిగిందని ఆ విషయాన్ని తిరువాభరణం రిజిస్టర్ లో నమోదు చేశారు. అయితే మైసూర్ మహారాజు సమర్పించిన హారంలో ఉన్నది కెంపు కాదు పింక్ డైమండ్ అని.. దాన్ని అపహరించి జెనీవాలో జరిగిన వేలంలో విక్రయించారని 2018లో తిరుమల ఆలయ ప్రధాన అర్చకుడు రమణదీక్షితుల వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయ్. ఆ ఆరోపణల్లో వాస్తవం లేదంటూ జగన్నాధరావు కమిటీ ఇచ్చిన నివేదికలో పగిలిన కెంపు ముక్కలు పేష్కార్‌ ఆధీనంలో ఉన్నాయని స్పష్టంగా వివరణ ఇచ్చారు. అయినప్పటికీ స్వామికి కొన్నేళ్లుగా కైంకర్యాలు నిర్వహిస్తున్న రమణ దీక్షితులు ఈ మాట చెప్పడంతో భక్తులు సందేహంలో పడ్డారు. 

శ్రీకృష్ణ దేవరాయలు ఇచ్చిన ఆభరణాల్లో కొన్ని మాయమయ్యాయనే ఆరోపణలు రావడంతో 2009 సెప్టెంబరులో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ జగన్నాధరావు నేతృత్వంలో ఓ కమిటీ, 2010లో జస్టిస్‌ వాద్వా నేతృత్యంలో మరో కమిటీ వేశారు. ఆభరణాలన్నీ సక్రమంగానే ఉన్నాయని తేలింది.  జగన్నాథరావు కమిటీ కూడా 1952 నుంచి ఉన్న రికార్డుల ప్రకారం ఆభరణాలన్నీ పదిలంగా ఉన్నాయని నివేదికలో పేర్కొంది. 2001బ్రహోత్సవాల సమయంలో పగిలిన కెంపు స్థానంలో వెంటనే ఓ పగడం తిరిగి అమర్చినట్టు కమిటీ వివరించింది. 

మైసూరు మహారాజు సమర్పించిన హారంలో పింక్‌ డైమండ్‌ లేదనే విషయాన్ని తేల్చి చెప్పారు మైసూరులోని ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా డైరెక్టర్‌ మునిరత్నం రెడ్డి. మైసూరు మహారాణి ప్రమోద దేవిని కలవడంతో పాటూ ప్యాలెస్ లో రికార్డులు పరిశీలించగా ఈ విషయాలు వెలుగుచూశాయ్. దీంతో గతంలో చేసిన విమర్శలు అవాస్తవాలే అని తేలింది.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: విద్యుత్ శాఖపై తెలంగాణ మంత్రులకే అవగాహన లేదు..! లెక్కలు బయటపెట్టిన హరీష్ రావు
విద్యుత్ శాఖపై మంత్రులకే అవగాహన లేదు..! లెక్కలు బయటపెట్టిన హరీష్ రావు
Pawan Kalyan vs Congress: పవన్ కల్యాణ్ క్షమాపణకు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే డిమాండ్ - లేకపోతే ?
పవన్ కల్యాణ్ క్షమాపణకు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే డిమాండ్ - లేకపోతే ?
IND vs SA 1st ODI Live Streaming: రాంచీ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా తొలి వన్డే.. మ్యాచ్ లైవ్ ఎక్కడ చూడాలంటే..
రాంచీ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా తొలి వన్డే.. మ్యాచ్ లైవ్ ఎక్కడ చూడాలంటే..
Nuvvu Naaku Nachav Re Release: జనవరిలో నువ్వు నాకు నచ్చావ్ రీ రిలీజ్... శ్రీ స్రవంతి మూవీస్ సెంటిమెంట్‌ డేట్‌లో!
జనవరిలో నువ్వు నాకు నచ్చావ్ రీ రిలీజ్... శ్రీ స్రవంతి మూవీస్ సెంటిమెంట్‌ డేట్‌లో!
Advertisement

వీడియోలు

Ro - Ko at India vs South Africa ODI | రాంచీలో రో - కో జోడి
Rajasthan Royals to be Sold IPL 2026 | అమ్మకాన్ని రాజస్థాన్ రాయల్స్ టీమ్ ?
Ab De Villiers comment on Coach Gambhir | గంభీర్ పై డివిలియర్స్ కామెంట్స్
Lionel Messi India Tour 2025 | భారత్‌కు లియోనెల్ మెస్సీ
Asifabad DCC President Athram Suguna Interview | ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా రాణిస్తానంటున్న ఆత్రం సుగుణ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: విద్యుత్ శాఖపై తెలంగాణ మంత్రులకే అవగాహన లేదు..! లెక్కలు బయటపెట్టిన హరీష్ రావు
విద్యుత్ శాఖపై మంత్రులకే అవగాహన లేదు..! లెక్కలు బయటపెట్టిన హరీష్ రావు
Pawan Kalyan vs Congress: పవన్ కల్యాణ్ క్షమాపణకు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే డిమాండ్ - లేకపోతే ?
పవన్ కల్యాణ్ క్షమాపణకు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే డిమాండ్ - లేకపోతే ?
IND vs SA 1st ODI Live Streaming: రాంచీ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా తొలి వన్డే.. మ్యాచ్ లైవ్ ఎక్కడ చూడాలంటే..
రాంచీ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా తొలి వన్డే.. మ్యాచ్ లైవ్ ఎక్కడ చూడాలంటే..
Nuvvu Naaku Nachav Re Release: జనవరిలో నువ్వు నాకు నచ్చావ్ రీ రిలీజ్... శ్రీ స్రవంతి మూవీస్ సెంటిమెంట్‌ డేట్‌లో!
జనవరిలో నువ్వు నాకు నచ్చావ్ రీ రిలీజ్... శ్రీ స్రవంతి మూవీస్ సెంటిమెంట్‌ డేట్‌లో!
Peddi Reddy Folk Song Lyrics : యూట్యూబ్ ట్రెండింగ్... నాగదుర్గ 'పెద్దిరెడ్డి' సాంగ్ - 'బుల్లెట్ బండి' లక్ష్మణ్ హార్ట్ టచింగ్ లిరిక్స్
యూట్యూబ్ ట్రెండింగ్... నాగదుర్గ 'పెద్దిరెడ్డి' సాంగ్ - 'బుల్లెట్ బండి' లక్ష్మణ్ హార్ట్ టచింగ్ లిరిక్స్
Krishna Scrub Typhus Fever: కృష్ణా జిల్లాలో  వింత జ్వరాలు!
కృష్ణా జిల్లాలో వింత జ్వరాలు! "స్క్రబ్ టైఫస్ "తో జాగ్రత్త పడకపోతే ప్రాణాంతకం అంటున్న డాక్టర్లు
Hyderabad Cyber Fraud :హైదరాబాద్‌లో భారీ సైబర్ మోసం - మోనికా పేరుతో వైద్యుడిపై వల- రూ. 14 కోట్లు కొట్టేసిన నేరగాళ్లు
హైదరాబాద్‌లో భారీ సైబర్ మోసం - మోనికా పేరుతో వైద్యుడిపై వల- రూ. 14 కోట్లు కొట్టేసిన నేరగాళ్లు
Amaravati News: అమరావతి రైతుల సమస్యలపై ప్రభుత్వం ఫోకస్ -త్రిసభ్య కమిటీ కీలక సమావేశం 
అమరావతి రైతుల సమస్యలపై ప్రభుత్వం ఫోకస్ -త్రిసభ్య కమిటీ కీలక సమావేశం 
Embed widget