అన్వేషించండి

Amaravati News: అమరావతి రైతుల సమస్యలపై ప్రభుత్వం ఫోకస్ -త్రిసభ్య కమిటీ కీలక సమావేశం 

Amaravati News: అమరావతి రైతుల సమస్యల పరిష్కారం కోసం త్రిసభ్య కమిటీ సమావేశమైంది. రైతులు లేవనెత్తిన ఇష్యూలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Amaravati News: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిలో పనులు ఊపందుకుంటున్నాయి. ఇప్పటికే సీఆర్‌డీఏ భవనం ప్రారంభోత్సవం జరిగింది. మరో ఆరేడు నెలల్లో మరికొన్ని భవనాలుపూర్తి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు రాజధాని ప్రాంత రైతుల్లో వ్యతిరేకత రాకుండా ఉండేందుకు వారి సమస్యలపై కూడా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. దీని కోసం వేసిన త్రిసభ్య కమిటీ ఇవాళ సమావేశమై కీలకాంశాలపై క్లారిటీ ఇచ్చింది. 

అమరావతిలో త్రిముఖ వ్యూహంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఓవైపు రాజధాని పనులు వేగవంతం చేసేందుకు ప్రణాళికలు వేస్తోంది. మరోవైపు పరిష్కారం కాని సమస్యలపై రైతుల్లో ఉన్న అసంతృప్తిని చల్లార్చి వాటిని రిజాల్వ్‌ చేసేం ప్రయత్నాల్లో ఉంది. రెండో విడత సమీకరణకు ఎలాంటి ఆటంకం లేకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. అందుకే రైతుల సమస్యల పరిష్కారానికి ముగ్గురు సభ్యులతో కమిటీ వేసింది. ఇందులో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌, మంత్రి నారాయణ, స్థానిక ఎమ్మెల్యే శ్రావణ కుమార్ ఉన్నారు. అమరావతి ప్రాంత రైతులకు, అధికారులకు అనుసంధానంగా ఉంటూ వారి సమస్యలు పరిష్కరిస్తూ అనుమానాలు నివృత్తి చేసే బాధ్యతను ఈ కమిటీకి అప్పగించారు. 

రాజధాని ప్రాంత రైతుల సమస్యల పరిష్కారానికి ఇప్పటికే పలుమార్లు సమావేశమైన ఈ కమిటీ ఇవాళ మరోసారి సమావేశమైంది. సమావేశానికి హాజరైన కేంద్ర మంత్రి పెమ్మసాని, రాష్ట్ర మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్‌తోపాటు సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు, గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా,రాజధాని రైతులు హాజరయ్యారు. రైతులు తాము ఎదుర్కొంటున్న సమస్యలు, ఇంకా పరిష్కారం కాని ఇష్యూలను వివరించారు. వాటి పురోగతిని అధికారులను కమిటీ సభ్యులు అడిగి తెలుసుకున్నారు. ఒకేసారి అన్ని సమస్యలకు పరిష్కారం లభించదని ఒక్కొక్కటిగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ప్రజలకు కమిటీ సభ్యులు వివరించారు. 

సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రినారాయణ.." రాజధాని రైతుల సమస్యల పరిష్కారం పై ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు ఇస్తున్నాం. గ్రామ కంఠాల ప్లాట్‌లు, వీధి పోటు ప్లాట్‌లు, జరీబు,అసైన్డ్ భూముల సమస్యలపై చర్చించాం. గ్రామ కంఠాలలో ప్లాట్‌లు పొందిన వారు నిబంధనల ప్రకారం తీసుకున్నారా లేదా అనేది వెరిఫై చేస్తాం. జారీబు - నాన్ జరీబు సమస్యలపై చర్చించాం. రోడ్డు పోటు ఉన్న ప్లాట్‌లు వెరిఫై చేసి మార్చేలా చర్యలు తీసుకుంటాం. అసైన్డ్ భూముల సమస్యపై ప్రత్యేకంగా కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. ఆర్ అండ్ బీ రోడ్లలో స్థలం కోల్పోతున్న వారికి TDR బాండ్లు ఇస్తాం. రైతు సోదరులందరూ 58 రోజుల్లో 34 వేలు ఎకరాలు ల్యాండ్ పూలింగ్‌కు ఇచ్చి ఎంతో సహకరించారు. రైతులకు వ్యక్తిగతంగా బెనిఫిట్ కావాలంటే నిబంధనల ప్రకారం అవకాశం ఉండదు. నిబంధనల ప్రకారం ఉంటే 100 శాతం న్యాయం చేస్తాం. డిసెంబర్ 3 న కోర్టు కేసులు విత్ డ్రా అయితే వెంటనే భూసేకరణ కు వెళ్తాం. ఇప్పటికీ ల్యాండ్ పూలింగ్ కోసం ముందుకు వచ్చిన రైతుల వద్ద భూములు తీసుకున్నాం. " అని వివరించారు.         

టాప్ హెడ్ లైన్స్

Breaking News:ఏపి సంపర్క్ క్రాంతి ట్రైన్ లో పొగలు- టెన్షన్ పడ్డ ప్రయాణికులు 
ఏపి సంపర్క్ క్రాంతి ట్రైన్ లో పొగలు- టెన్షన్ పడ్డ ప్రయాణికులు 
Perni Nani Avigan: అవిగన్ రాజకీయం - వైఎస్‌ఆర్‌సీపీ మావిగన్‌పై మళ్లీ రూటు మార్చిందా?
అవిగన్ రాజకీయం - వైఎస్‌ఆర్‌సీపీ మావిగన్‌పై మళ్లీ రూటు మార్చిందా?
Breaking News:
"నన్ను జైల్లో అవమానించారు" కర్నూలు పర్యటనలో జగన్ విమర్శలు 
Amaravati Seed Access Road inauguration:
"గ్రాఫిక్స్ అన్న వాళ్లే తలదించుకునేలా అమరావతి" సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభోత్సవంలో చంద్రబాబు కామెంట్స్!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
iPhone Sypware Alert: ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
Embed widget