అన్వేషించండి

YSR Congress MPs : రాష్ట్ర ప్రయోజనాల కోసం నిరంతరం పోరాడుతున్నాం - ఢిల్లీలో వైఎస్ఆర్‌సీపీ ఎంపీల ప్రకటన !

రాష్ట్ర ప్రయోజనాల కోసం నిరంతరం పోరాడుతున్నామని వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు ప్రకటించారు. కేంద్రం పట్టించుకోకపోయినా రామాయపట్నం పోర్టుకు సీఎం జగన్ శంకుస్థాపన చేస్తున్నారని తెలిపారు.


YSR Congress MPs :  ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, విభజన హామీలపై రాజీలేని పోరాటం చేస్తున్నామని వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు ప్రకటించారు. ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న రామాయపట్నం పోర్టుకు సీఎం జగన్ మోహన్ రెడ్  శంఖుస్థాపన చేస్తున్నారని..  ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి రామాయపట్నం పోర్టుకు సీఎం శ్రీకారం చట్టారని తెలిపారు.  974 కిలో మీటర్ల సముద్ర తీరం ఉన్న ఆంధ్రప్రదేశ్ లో పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు అభివృద్ధి చేసి, తద్వారా రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి   ఎంతో ప్రతిష్టాత్మకంగా పోర్టుల నిర్మాణం చేపట్టారని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తెలిపారు.  మొత్తం 14 పోర్టులు నిర్మాణం చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికను రూపొందించిందని గుర్తు చేశారు. 

కేంద్రం పట్టించుకోకపోయినా రామాయపట్నం పోర్టుకు జగన్ శంకుస్థాపన

 ఏపీ పునర్విభజన చట్టంలో దుగ్గరాజుపట్నం పోర్టును పొందుపరిచినా, ఆ పోర్టు నిర్మాణానికి ఆలస్యం జరుగుతున్న పరిస్థితుల్లో, రామాయపట్నం పోర్టును కేంద్ర ప్రభుత్వం చేపట్టాలని అనేకమార్లు పార్లమెంటు లోపల, బయటా కోరాం. చివరికి కేంద్రం చేపట్టకపోయినా, రామాయపట్నం పోర్టు కూడా ఆలస్యమౌతున్నందువల్ల, పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం.. ఈ పోర్టును  ఏపీ ప్రభుత్వమే చేపట్టిందన్నారు.  దాదాపు రూ. 5 వేల కోట్లతో ఈ ప్రాజెక్టును రూపకల్పన చేశామన్నారు.  ఈ పోర్టు వస్తే..  ప్రకాశం, నెల్లూరు జిల్లాలో కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ఎంపీ మాగుంట తెలిపారు.  

రాష్ట్ర ప్రయోజనాల కోసం గళం వినిపిస్తున్నాం 

పోర్టులు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కీలకం కానున్నాయి. ఎయిర్ పోర్టులు, రోడ్లు, ఫిషింగ్ హార్బర్లు  ఏర్పాటు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలుగా మేమంతా మా గళాన్ని వినిపిస్తున్నాం. రాజీ లేకుండా పోరాటం చేస్తున్నామని కాకినాడ ఎంపీ వంగా గీత తెలిపారు. పోర్టులు, హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడం కోసం కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పలు దఫాలుగా ప్రతిపాదనలు పంపించాంమన్నారు.  వీటన్నింటికీ కేంద్ర ప్రభుత్వం త్వరితగతిన ఆమోదించాలని కోరారు.   టూరిజం అభివృద్ధికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పలు ప్రతిపాదనలు పంపాం. సింహాచలం, అంతర్వేది, అన్నవరం దేవాలయాలను టూరిజం పరిధిలోకి తీసుకుని అభివృద్ధి చేయాలని  కోరాం. అలానే,  రాష్ట్రంలో ఉన్న ఎయిర్ పోర్టులను అభివృద్ధి చేయాలి. కొత్తగా జిల్లాలు ఏర్పాటైన నేపథ్యంలో జిల్లాల్లో కూడా ఎయిర్ పోర్టులు అభివృద్ధి చేయాలని ప్రెస్ మీట్‌లో వంగా గీత విజ్ఞప్తి చేశారు. 

పోలవరం పై వివాదం సరి కాదు !

పోలవరం జాతీయ ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టుకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) - కేంద్రం సమన్వయంతోనే జరుగుతుందని ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి తెలిపారు.  రాష్ట్రంలో మూడు ప్రధాన పోర్టులు రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడు అభివృద్ధి చేయాలని ప్రణాళికలు రూపొందించామన్నారు.  వీటికి సంబంధించి ల్యాండ్ యాక్విజేషన్, పర్యావరణ అనుమతులు, పునరావాసం.. పూర్తి చేస్తున్నాం. మొట్టమొదట రామాయపట్నం పోర్టుకు సంబంధించి అన్ని అనుమతులు తీసుకువచ్చామని తెలిపారు.  రూ. 20 వేల కోట్ల రూపాయలతో రాష్ట్రంలో నేషనల్ హైవేల నిర్మాణం జరుగుతుంది,  వచ్చే రెండేళ్ళలో  పూర్తి చేయాలని కేంద్రాన్ని కోరామన్నారు.   రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులపై కేంద్రంతో నిత్యం పోరాడుతూనే ఉన్నాం. భోగాపురం ఎయిర్ పోర్టుకు ఇప్పటికే టెండర్లు పిలవడం జరిగిందన్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bondi Beach Attack Case Update : 27 ఏళ్ల నిరీక్షణ... 27 సార్లు ప్రయత్నం- సాజిద్‌ సిటిజన్‌షిప్‌ మిస్టరీపై ఇంటెలిజెన్స్‌ ఆరా
27 ఏళ్ల నిరీక్షణ... 27 సార్లు ప్రయత్నం- సాజిద్‌ సిటిజన్‌షిప్‌ మిస్టరీపై ఇంటెలిజెన్స్‌ ఆరా
Jagruti Kavitha: కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్

వీడియోలు

G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
గిల్ విషయంలో బీసీసీఐ షాకిండ్ డెసిషన్..గాయం సాకుతో వేటు?
జాక్‌పాట్ కొట్టేసిన ఆర్సీబీ.. ఐపీఎల్‌ మినీ వేలంలో ఆర్సీబీ ఆ పాయింట్‌పైనే ఫోకస్ చేసిందా?
విధ్వంసం c/o SRH.. ఈసారి టైటిల్ ఆరెంజ్ ఆర్మీదే?
అక్కడే ఎందుకు?.. 4వ టీ20 మ్యాచ్ రద్దుపై ఫ్యాన్స్ సిరియస్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bondi Beach Attack Case Update : 27 ఏళ్ల నిరీక్షణ... 27 సార్లు ప్రయత్నం- సాజిద్‌ సిటిజన్‌షిప్‌ మిస్టరీపై ఇంటెలిజెన్స్‌ ఆరా
27 ఏళ్ల నిరీక్షణ... 27 సార్లు ప్రయత్నం- సాజిద్‌ సిటిజన్‌షిప్‌ మిస్టరీపై ఇంటెలిజెన్స్‌ ఆరా
Jagruti Kavitha: కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
T20 World Cup 2026: టి20 ప్రపంచ కప్ అడే భారత్ జట్టు ఇదేనా? సూర్యకుమార్ సారథ్యంలో తుది జట్టుపై బిగ్ అప్డేట్!
టి20 ప్రపంచ కప్ అడే భారత్ జట్టు ఇదేనా? సూర్యకుమార్ సారథ్యంలో తుది జట్టుపై బిగ్ అప్డేట్!
Ram Charan : 'ఛాంపియన్'... యాక్షన్ ఓరియెంటెడ్ లగాన్‌ - 'పెద్ది'పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
'ఛాంపియన్'... యాక్షన్ ఓరియెంటెడ్ లగాన్‌ - 'పెద్ది'పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
VBG RAM Gలో VB అంటే ఏమిటి? 99 శాతం మందికి తెలియని విషయం ఇదే!
VBG RAM Gలో VB అంటే ఏమిటి? 99 శాతం మందికి తెలియని విషయం ఇదే!
Railway Rules : రైలులో టికెట్ తనిఖీ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? రైల్వే పోలీసులు అడిగితే ఏంచేయాలి? తప్పక తెలుసుకోండి!
రైలులో టికెట్ తనిఖీ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? రైల్వే పోలీసులు అడిగితే ఏంచేయాలి? తప్పక తెలుసుకోండి!
Embed widget