అన్వేషించండి

YS Jagan : రూట్ మార్చిన జగన్‌- సరికొత్త కార్యక్రమంతో నాయకుల్లో ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం

Andhra Prades :వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 15 నుంచి ప్రజాదర్బార్ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కలవనున్నారు.

YS Jagan will start Praja Durbar In Tadepalli : వైఎస్ఆర్  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలతో మమేకమయ్యేందుకు సిద్ధమవుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో సమావేశమైన ఆయన పార్టీ ఓటమి సంబంధించి నేతలకు భరోసాను కల్పించే ప్రయత్నం చేశారు. ప్రజలకు మంచి చేశామని, కానీ ఎందుకో ఓడిపోయామంటూ వెల్లడించారు. ప్రజల్లో ఉంటూ ప్రజలకు మంచి చేసే ప్రయత్నం చేయడం ద్వారా మళ్ళీ అధికారాన్ని దక్కించుకుంటామన్న భరోసాను కల్పించారు. ఆ తర్వాత పులివెందులలోనూ జగన్ పర్యటించారు. ఈ క్రమంలోనే టిడిపి నాయకులు దాడిలో తీవ్రంగా గాయపడిన కార్యకర్తలను జగన్ పరామర్శించారు. అనంతరం పులివెందులలో ప్రజల నుంచి  ఫిర్యాదులను స్వీకరించారు. ఇదే క్రమంలో ఈ నెల 15 నుంచి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించేందుకు జగన్ సిద్ధమవుతున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకోసం పార్టీ నాయకులకు జోరుగా ఏర్పాటు చేస్తున్నట్లు చెబుతున్నారు.

ప్రజలను కలిసేందుకు గతంలోనే ఏర్పాటు..

ప్రతిరోజు ప్రజలను కలిసేందుకు జగన్ క్యాంపు కార్యాలయంలో ప్రత్యేకమైన ఏర్పాట్లను ఆ భవన నిర్మాణ సమయంలోనే చేయించుకున్నారు. క్యూ లైన్లలో నిలబడ లేని వారు కూర్చునేందుకు అనుగుణంగా షెడ్లు దాని కింద కుర్చీలు ఏర్పాటు చేయించారు. కానీ, సీఎంగా ఉన్న ఐదేళ్లలో ఒకసారి కూడా ఆయన అక్కడ ప్రజలను కలవలేదు. కనీసం పార్టీ నేతలను కూడా అక్కడి వరకు రానివ్వలేదు. ఈ క్రమంలోనే నేరుగా ప్రజలు తనను కలిసి సమస్యలు చెప్పుకునేందుకు స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తానని సీఎంగా ఉన్నప్పుడు జగన్ చెప్పడం దానికోసం అధికారులు ఏర్పాటు చేయడం తర్వాత ఆయన వాయిదా వేయడం ఇలా ఐదేళ్ల కాలం గడిచిపోయింది. స్పందన, ప్రజా దర్బార్, రచ్చబండ, సచివాలయాల సందర్శన, పల్లెబాట.. ఇలా పేర్లు మారినా ప్రజలను కలిసే కార్యక్రమం మాత్రం కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వీటిలో ఏదో ఒక కార్యక్రమాన్ని చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీనికి ప్రజాదర్బార్ అని పేరును పెట్టబోతున్నట్లు చెబుతున్నారు. 

ప్రజల నుంచి వినతుల స్వీకరణ 

ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే పార్టీ నాయకులు కార్యకర్తలతో మాట్లాడటంతోపాటు వారి నుంచి వినతులను స్వీకరించనున్నారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ నుంచి తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి నుంచి కూడా ఈ సందర్భంగా వినతులను ఆయన స్వీకరించనున్నారు. వారికి పార్టీ పరంగా అవసరమైన సహకారాన్ని అందించనున్నారు. న్యాయపరమైన, ఆర్థిక పరమైన సహకారాన్ని అందించేందుకు అనుగుణంగా చర్యలు తీసుకునేలా ప్రజాదర్బార్ లో జగన్ హామీ ఇవ్వనున్నారు. ఈ ప్రజా దర్బార్ కు కొంత సమయాన్ని జగన్మోహన్ రెడ్డి కేటాయించనున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం పార్టీ కీలక నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజా దర్బార్ నిర్వహణకు సంబంధించిన ఎంత సమయం కేటాయించాలి, ప్రతిరోజు ఎంత మందికి అవకాశం కల్పించాలని అనే దానిపై పార్టీ నాయకులు వర్కౌట్ చేస్తున్నట్లు చెబుతున్నారు. 

ఇప్పటికీ కొందరు నేతల్లో కనిపిస్తున్న అసహనం 

సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా జగన్ ను కలిసేందుకు వస్తున్న నేతలకు ఆయన దర్శన భాగ్యం కలగడం లేదన్న ఆవేదన ఆ పార్టీ నేతల్లో వ్యక్తం అవుతోంది. సీఎంగా ఉన్నప్పుడు ఎలాగో కలిసే అవకాశం కల్పించలేదని, ఇప్పుడు కలిసేందుకు వస్తున్న వెళ్లనీయడం లేదంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు అపాయింట్మెంట్ లేకపోతే ఎవరిని లోపల అనుమతించడం లేదని పలువురు పేర్కొంటున్నారు. లోపలకు పంపిస్తారేమోనని గేటు దగ్గర నిరీక్షించి వెనక్కి వెళ్ళిపోతున్నామంటూ పలువురు నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Also Read: సమీక్షలో పవన్ మైక్ విసిరికొట్టారంటూ వైరల్ వీడియో - అసలు నిజం మాత్రం వేరే

టాప్ హెడ్ లైన్స్

Actress Trisha Controversy: త్రిష చుట్టూ తిరుగుతున్న తమిళ రాజకీయం - డిప్యూటీ సీఎంను ను చేస్తారా?
త్రిష చుట్టూ తిరుగుతున్న తమిళ రాజకీయం - డిప్యూటీ సీఎంను ను చేస్తారా?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Agri Gold Victims: అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం - ఆస్తులు వేలం వేసి చెల్లింపులు - ఆటంకాలు లేకుండా పూర్తి చేయగలరా?
అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం - ఆస్తులు వేలం వేసి చెల్లింపులు - ఆటంకాలు లేకుండా పూర్తి చేయగలరా?
Tesseract Company Land Allocation Controversy: రేవంత్ సోదరులే టార్గెట్‌గా బీఆర్ఎస్ పొలిటికల్ మైండ్‌గేమ్ - టెస్సరాక్ట్ భూముల వివాదంలో కాంగ్రెస్ డిఫెన్స్‌లో పడిందా?
రేవంత్ సోదరులే టార్గెట్‌గా బీఆర్ఎస్ పొలిటికల్ మైండ్‌గేమ్ - టెస్సరాక్ట్ భూముల వివాదంలో కాంగ్రెస్ డిఫెన్స్‌లో పడిందా?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget