అన్వేషించండి

YSR Birth Anniversary: నేడు వైఎస్సార్ జయంతి.. పులివెందులకు జగన్, షర్మిల, విజయమ్మ- అన్నా చెల్లెళ్ళు కలుస్తారా?

Y. S. Rajasekhara Reddy Jayanti | నేడు YSR జయంతి.. పులివెందుల కు జగన్, షర్మిల, విజయమ్మ వెళ్లారు. ఈ సందర్భంగానైనా అన్నా చెల్లెళ్ళు కలుస్తారా? లేదా అని వైఎస్సార్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.

YS Jagan and YS Sharmila | దివంగత సీఎం  YS రాజశేఖర్ రెడ్డి జయంతి నేడు.  ఆయన జన్మస్థలమైన పులివెందులలో  ఘనంగా నివాళులర్పించేందుకు  వైయస్ జగన్ , షర్మిల, విజయమ్మ అక్కడికి వెళుతున్నారు.  అయితే ప్రస్తుతం అందరిలో ఉన్న ప్రశ్న అన్నా చెల్లెళ్లు ఇద్దరూ తండ్రి జయంతి సందర్భంగానన్నా కలుస్తారా   లేక విడివిడిగానే  తమ నివాళులర్పించి వచ్చేస్తారా  అని. సగటు వైయస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు మాత్రం  అన్నా చెల్లెలు ఈ సందర్భంగానన్నా కలిస్తే బాగుంటుందని ఆశ పడుతున్నారు కానీ  పరిస్థితులు దానికి అనుకూలించేలా లేవని జగన్ షర్మిల మనస్తత్వాలు తెలిసినవాళ్లు  అంటున్నారు.


బద్ధ శత్రువులుగా మారిన అన్న చెల్లెళ్లు !

 ఒకప్పుడు జగనన్న వదిలిన బాణం అంటూ  జగన్ కోసం పాదయాత్ర చేసిన షర్మిల  ఇప్పుడు అన్న పేరు చెబితేనే మండిపడుతోంది.  రాజకీయంగా ఆర్థికంగా తనకు అన్యాయం చేశారు అన్న భావం అన్న వదినల పై ఆమెకు బలంగా ఉంది. మొదట్లో ఆమె ఇంటి నుంచి బయటకు వచ్చేయగా తర్వాత తల్లి విజయమ్మ కూడా ఆమెవద్దకే చేరుకుంది. ఇక ఎన్నికల ముందు ఏపీ రాజకీయాల్లో  కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు హోదాలో ప్రవేశించిన  షర్మిల అప్పటి ఏపీ సీఎం జగన్ ఓటమికి తన వంతు ప్రయత్నం తాను చేసింది. అయితే ప్రస్తుతం రాజకీయంగా ఇద్దరి పరిస్థితి మరీ గొప్పగా ఏమీ లేదు.

కూటమి పాలనపై  ప్రజల్లో అసంతృప్తి, కానీ..

వైసిపి ఓడిపోయింది కాబట్టి  ఆ పార్టీలోని వైయస్సార్ అభిమానులు  తన వద్దకు వచ్చేస్తారు అనుకున్న షర్మిల ఆశలు పెద్దగా నెరవేరలేదు. జగన్ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది.  జగన్ పర్యటనలకు జనం వస్తున్నారు కానీ  అవన్నీ ఓట్లుగా మారేంత పరిస్థితి ఉందా అనే డౌట్ చాలా మందిలో ఉంది. కూటమి ఏడాది పాలనపై  ప్రజల్లో అసంతృప్తి ఉంది గానీ  అది ఇంకా వ్యతిరేకత స్థాయికి మారలేదని ఎనలిస్ట్ లు అంటున్నారు. ఇలాంటి పరిస్థితులు అన్న చెల్లెళ్ళ మధ్య  గతంలో ఉన్నంత తీవ్రమైన విభేదాలు ఉంటాయా అని విశ్లేషణ లు వెలువడుతున్నాయి. అయితే వాళ్ళిద్దరి మధ్య విభేదాలు  సమసి పోయే స్థితి దాటి చాలా దూరం వచ్చేసాయి అనేది  వారి సన్నిహితుల మాట.

మరోవైపు బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య  కేసు లో వైయస్ షర్మిల,సునీత  ఒకే మాట పై ఉన్నారు. అది తేలకుండా జగన్ తో కలవడం కాదు కదా కనీసం పలకరించే పని కూడా వాళ్ళిద్దరూ చేయరు అనేది గతంలోని సంఘటనలే నిరూపించాయి. ఇలాంటి పరిస్థితుల్లో  వైయస్సార్ జయంతి సందర్భంగా  అన్నా చెల్లెలు కలుస్తారా అనేది  సందేహమే అంటున్నారు ఆ కుటుంబ సన్నిహితులు. కలవడం మాట అంటుంచి కనీసం ఒకే సమయంలో తండ్రికి నివాళులర్పించడానికి  పులివెందుల ఎస్టాట్ కి వెళతారా అనేది కూడా డౌటే అంటున్నారు వారు.

అయితే తల్లి విజయమ్మ కూడా ఆ కార్యక్రమానికి వెళుతున్నారు కాబట్టి  ఆమెను పలకరించడానికన్నా వైయస్ జగన్ షర్మిలను ఫేస్ చేయాల్సి వస్తుందని  భావించే వాళ్ళు కూడా లేకపోలేదు. ఏమైనా తండ్రి YS రాజశేఖర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా  జగన్,షర్మిల పులివెందుల వెళుతుండడంతో  వాళ్ళిద్దరూ  కలుస్తారా లేదా అనే దానిపై  పొలిటికల్ సర్కిల్లో ఆసక్తి ఏర్పడింది.

టాప్ హెడ్ లైన్స్

AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Tamil Nadu Politics Vijay: వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
ECI Special Summary Revision: తెలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా ఓట్ల గల్లంతు - రాజకీయ పార్టీలు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు?
తెలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా ఓట్ల గల్లంతు - రాజకీయ పార్టీలు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget