అన్వేషించండి

YSR Internal Politics : పార్లమెంటరీ పార్టీ పదవులన్నీ ఒక వర్గానికే - వైసీపీ అధినేత సామాజికన్యాయాన్ని వదిలేశారా ?

Andhra Politics : వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకులుగా ముగ్గురూ ఒకే వర్గానికి చెందిన వారిని నియమించారు. సామాజిక న్యాయం గురించి చెప్పే జగన్ ఇలాంటి నియామకాలు చేయడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.

YSRCP News :  వైఎస్ఆర్‌సీపీ పార్లమెంట్ పార్టీ నాయకుడిగా వైవీ సుబ్బారెడ్డి,  రాజ్యసభలో పార్టీ నాయకుడిగా విజయసాయిరెడ్డి, లోక్‌సభలో పార్టీ పక్ష నాయకుడిగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి వైసీపీ అధినేత జగన్ నియమించారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఎంపీలతో సమావేశం అయిన తర్వాత జగన్ చేసిన ఈ ప్రకటన చాలా మందిని ఆశ్చర్య పరిచింది. ఎందుకంటే మూడు పదవులు ఒకే వర్గానికి నిర్మోహమాటంగా కేటాయించారు. సీనియర్ ఎంపీలు ఉన్నప్పటికీ వారిని పరిగణనలోకి తీసుకోలేదు.

ఇతర ఎంపీలు ఉన్నా రెడ్డి వర్గానికే ప్రాధాన్యం                             

వైసీపీకి లోక్ సభలో నలుగురు మాత్రమే ఎంపీలు ఉన్నారు. అందులో ఇద్దరు రెడ్డి సామాజికవర్గం వారు, ఒకరు ఎస్సీ, మరొకర ఎస్టీ. అదే రాజ్యసభలో మాత్రం పదకొండు మంది సభ్యులు ఉన్నారు. ఇందులో ఐదుగురు రెడ్డి సామాజికవర్గం వారు. మరో ఆరుగురు నలుగురు బీసీ, ఒకరు ఎస్సీ, మరొకరు గుజరాత్ కు చెందిన పరిమళ్ నత్వానీ. నలుగురు బీసీ నేతల్లో  ఆర్ కృష్ణయ్య, మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, బీద మస్తాన్ రావు వంటి సీనియర్లు ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇతర సామాజికవర్గాల వారి పేర్లను అసలు పరిగణనలోకి తీసుకోలేదు. ముగ్గురు తమకు సన్నిహితులైన రెడ్డి సామాజికవర్గం వారికే పదవుల కట్టబెట్టారు. 

వైవీ సుబ్బారెడ్డికి పార్లమెెంటరీ పార్టీ అధ్యక్ష పదవి                    

అందులోనూ విజయసాయిరెడ్డికి ప్రాధాన్యత తగ్గించడం మరింత ఆసక్తికరంగా మారింది. గతంలో విజయసాయిరెడ్డి పార్లమెంటరీ పార్టీ నేతగా ఉంటూనే రాజ్యసభ పక్ష నేతగా ఉండేవారు. మిధన్ రెడ్డి లోక్ సభ పక్ష నేతగా ఉండేవారు. ఈ సారి విజయసాయిరెడ్డి ప్రాధాన్యాన్ని తగ్గించి వైవీ సుబ్బారెడ్డికి పార్లమెంటరీ పార్టీ నేత పదవి ఇచ్చారు. నిజానికి విజయసాయిరెడ్డినే ఢిల్లీలో విస్తృత పరిచయాలు కలిగి ఉన్నారు. వైసీపీ తరపున అవసరమైన లాబీయింగ్‌లను ఆయన ఢిల్లీలో చేస్తూంటారు. అయితే ఈ సారి మాత్రం వైవీ సుబ్బారెడ్డికి జగన్ ప్రాధాన్యం ఇచ్చారు. 

సీనియర్ బీసీ నేతలకు నిరాశే                                          

జగన్మోహన్ రెడ్డి సామాజిక న్యాయం చేశామని ఎక్కువగా చెబుతూ ఉంటారు. అయితే పార్టీ పరమైన నిర్ణయాలు, పదవుల విషయంలో మాత్రం ఆయన కే వర్గానికి ప్రాధాన్యం ఇస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. పార్టీ పదవుల్లో ఇతర కులాల వారిని ఎందుకు కూర్చోబెట్టరన్న ప్రశ్నలు వస్తున్నాయి.అయినా  జగన్ ఈ సారి కూడా మూడు పార్లమెంటరీ పార్టీ పదవుల్ని ఒకే వర్గానికి కేటాయించారు. దీనిపై వైసీపీలో ఎవరూ నోరు మెదిపే పరిస్థితి ఉండదు కానీ..  జగన్ చెప్పే సామాజిక న్యాయం అంతా మాటల్లోనేనని విపక్షాలు విమర్శించడానికి అవకాశం దొరుకుతుంది.      

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bengal Assembly Elections 2026 : బెంగాల్‌లో ఉన్నట్లుగా కూడా తెలియకుండా మాయమైన కమ్యూనిస్టులు - ఇలా ఎలా?
బెంగాల్‌లో ఉన్నట్లుగా కూడా తెలియకుండా మాయమైన కమ్యూనిస్టులు - ఇలా ఎలా?
Telangana Govt: కూల్చివేతల్లో ప్రజాస్వామ్య దారి మర్చిపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం - వ్యతిరేకతను ఎందుకు గుర్తించలేకపోతున్నారు?
కూల్చివేతల్లో ప్రజాస్వామ్య దారి మర్చిపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం - వ్యతిరేకతను ఎందుకు గుర్తించలేకపోతున్నారు?
BJP grip on communist strongholds: ఎర్రకోటల్లో కాషాయ జెండా - కమ్యూనిస్టు ఓటు బ్యాంక్ బీజేపీకి ఎలా మారుతోంది?
ఎర్రకోటల్లో కాషాయ జెండా - కమ్యూనిస్టు ఓటు బ్యాంక్ బీజేపీకి ఎలా మారుతోంది?
Nara Lokesh: అప్పట్లో డిప్యూటీ సీఎం - ఇప్పుడు సీఎం - నారా లోకేష్‌పై ఈ ప్రచారం వ్యూహాత్మకమేనా?
అప్పట్లో డిప్యూటీ సీఎం - ఇప్పుడు సీఎం - నారా లోకేష్‌పై ఈ ప్రచారం వ్యూహాత్మకమేనా?

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vemulawada Dargah History: వేములవాడ ఆలయంలో 800 ఏళ్ల చరిత్ర ఉన్న దర్గా తరలింపుపై వివాదమేంటీ? కోర్టు ఏం చెప్పింది
వేములవాడ ఆలయంలో 800 ఏళ్ల చరిత్ర ఉన్న దర్గా తరలింపుపై వివాదమేంటీ? కోర్టు ఏం చెప్పింది
United Nations On Iran crisis: ఇరాన్ పై దాడులను ఐక్యరాజ్యసమితి ఎందుకు అడ్డుకోవడం లేదు, UNO స్థాపన ఉద్దేశ్యం ఏంటీ?
ఇరాన్ పై దాడులను ఐక్యరాజ్యసమితి ఎందుకు అడ్డుకోవడం లేదు, UNO స్థాపన ఉద్దేశ్యం ఏంటీ?
Bengal Assembly Elections 2026 : బెంగాల్‌లో ఉన్నట్లుగా కూడా తెలియకుండా మాయమైన కమ్యూనిస్టులు - ఇలా ఎలా?
బెంగాల్‌లో ఉన్నట్లుగా కూడా తెలియకుండా మాయమైన కమ్యూనిస్టులు - ఇలా ఎలా?
Kesineni Chinni vs MLA Kolikapudi: కళ్యాణోత్సవంలో టీడీపీ ఎంపీకి షాక్.. ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీనివాస‌రావు అనుచిత ప్ర‌వ‌ర్త‌న
కళ్యాణోత్సవంలో టీడీపీ ఎంపీకి షాక్.. ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీనివాస‌రావు అనుచిత ప్ర‌వ‌ర్త‌న
AI for Income : AIతో నెలకు లక్షల్లో సంపాదించవచ్చు.. ఇలా వాడితే డబ్బే డబ్బు
AIతో నెలకు లక్షల్లో సంపాదించవచ్చు.. ఇలా వాడితే డబ్బే డబ్బు
Hyderabad Traffic Diversion: అమెరికా, ఇరాన్ ఉద్రిక్తతల కారణంగా హైదరాబాద్ లోని US consulate రోడ్ మూసివేత
అమెరికా, ఇరాన్ ఉద్రిక్తతల కారణంగా హైదరాబాద్ లోని US consulate రోడ్ మూసివేత
Sabarimala Issue: అయ్యప్ప దేవాలయంలోకి మహిళల్ని అనుమతించం -సుప్రీంకోర్టుకు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు అఫిడవిట్
అయ్యప్ప దేవాలయంలోకి మహిళల్ని అనుమతించం -సుప్రీంకోర్టుకు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు అఫిడవిట్
Iran-Israel War : ఒమన్‌లో ఆయిల్ ట్యాంకర్ లక్ష్యంగా డ్రోన్ దాడి- అటాక్‌లో భారతీయుడు మృతి!
ఒమన్‌లో ఆయిల్ ట్యాంకర్ లక్ష్యంగా డ్రోన్ దాడి- అటాక్‌లో భారతీయుడు మృతి!
Embed widget