అన్వేషించండి

Tirupati Laddu Controversy: లడ్డూ కల్తీ వివాదంలో వైఎస్ఆర్‌సీపీ ఎదురుదాడి - బెడిసి కొడుతుందా ? డిఫెండ్ చేసుకోగలుగుతుందా ?

YSRCP : తిరుపతి లడ్డూ కల్తీ వివాదంలో ఎదురుదాడికి వైసీపీ రెడీ అయింది. ఓ వైపు తప్పు జరగలేదని వాదిస్తూనే.. తప్పుడు ఆరోపణలు చేసి తిరుమలను కించ పరిచారని ప్రజల్లోకి వెళ్లాలని డిసైడయ్యారు.

YCP is ready to counterattack in the Tirupati laddu adulteration controversy: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాద కల్తీ విషయంలో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్ వ్యూహం మార్చారు. ఇప్పటి వరకూ నిజాలు తెలుసుకోవాలని ఆయన చాలా మందికి లేఖలు రాశారు. పార్టీ పరంగా ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు. కానీ లడ్డూ లో కల్తీ జరగనే లేదు అన్న వాదన మాత్రం గట్టిగా వినిపిస్తున్నారు. అందు కోసం రకరకాల వాదనలతో తెరపైకి వస్తున్నారు. తాజాగా జగన్ స్వయంగా రంగంలోకి దిగాలని నిర్ణయించారు. తిరుమలకు కాలి నడకన వెళ్లడంతో పాటు శనివారం ఆలయాల్లో పూజలు చేయాలని పార్టీ క్యాడర్ కు పిలుపునిచ్చారు.

హిందువుల్లో వస్తున్న అనుమానాలకు క్లారిటీ ఇవ్వాలనే ప్రయత్నం

తిరుమల లడ్డూ ఇష్యూలో జగన్ అన్యమతస్తుడు కాబట్టే హిందూ సంప్రదాయాలు, సనాతన ధర్మం విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారని పైగా కించ పరుస్తున్నారని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ విషయంలో ఎదురుదాడికి వైసీపీ వ్యూహం సిద్ధం చేసుకుంది. చాలా రోజులుగా బయటకు రాని కొడాలి నాని వంటి వారితోనూ ప్రెస్‌మీట్లు పెట్టారు. కల్తీ నెయ్యితో వచ్చిన ట్యాంకర్లను వెనక్కి పంపించామని కల్తీ జరగనే లేదని వాదించారు. అందరూ ఇదే వాదనతో తెరపైకి వస్తున్నారు. శనివారం ఆలయాల్లో పూజలు.. ఆ తర్వాత జగన్ తిరుమల పర్యటన తర్వాత మరంత అగ్రెసివ్ గా కల్తీ జరగలేదన్న వాదనను వినిపించాలనుకుంటున్నారు. 

Also Read: Tirumala Laddu: ప్రాయశ్చిత్తానికి పోటీగా పాప ప్రక్షాళణ- ఈనెల 28న వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త పూజలు 

మరో వైపు బయటకు వస్తున్న సంచలన విషయాలు ! 

మరోవైపు లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీకి కాంట్రాక్ట్ ఇవ్వడానికి అనేక రూల్స్ మార్చారని తేలింది. కనీస అర్హత లేకపోయినా.. రూల్స్ మార్చి ఏఆర్ డెయిరీకి కాంట్రాక్ట్ ఇచ్చారు. అలాగే ఆ డెయిరీ నెయ్యి కేంద్ర ఆరోగ్య శాఖ చేసిన పరక్షల్లోనూ కల్తీగా తేలింది. వీటన్నింటిపై ఇప్పుడు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించారు. ఆ సిట్ నివేదికలో అసలు విషయాలు వెలుగులోకి వస్తాయి. అసలు నెయ్యి టెండర్ల వెనుక ఉన్నగోల్ మాల్.. ఆయా సంస్థలు నెయ్యిని ఎలా ప్రొక్యూర్ చేస్తాయి.. అసలు తిరుమలలో టెస్టింగ్ చేశారా లేదా అంటి విషయాలు అన్నీ వెలుగులోకి వస్తాయి. ఇవన్నీ తమకు ఇబ్బందికరంగా ఉంటాయని వైసీపీ గట్టిగా నమ్ముతోంది. అందుకే ఆ సిట్ ..చంద్రబాబు చెప్పిందే చెబుతుందని ముందుగానే ఖండిస్తున్నారు.కానీ దర్యాప్తు సంస్థలు చెప్పేదే ఫైనల్. 

Also Read: YS Jagan: లడ్డూ వివాదం - కాలి నడకన తిరుమలకు వెళ్లనున్న వైఎస్ జగన్

వైసీపీ హయాంలో తిరుమలలో లెక్కలేనన్ని అవకతవకలు జరిగాయని ఇప్పటికే లీకులు వచ్చాయి. ఒక్క టీటీడీ చైర్మనే సగటున రోజుకు ఐదు వందల వరకూ వీఐపీ దర్శన టిక్కెట్లు కేటాయించారని.. నాలుగేళ్లలో మూడున్నర లక్షల మందికి దర్శన టిక్కెట్లు ఇచ్చారని అవన్నీ అమ్ముకున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పెద్దిరెడ్డి, రోజా ట్రావెల్స్ పేరుతో టిక్కెట్లు అమ్ముకున్నారు. అలాగే ఇతర వైసీపీ నేతలు కూడా అదే పని చేశారని అంటున్నారు. ఇక ఎన్నికలకు ముందు తిరుపతిలో పనులకు టీటీడీ నిధులు మళ్లించడం సహా అనేక అవకతవకలు బయటకు వచ్చాయని వాటన్నింటినీ ప్రభుత్వం టైం చూసి బయట పెడుతుందని అంటున్నారు. 

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ వాదనను అంత బలంగా వెళ్లడం లేదు. అందుకే ఎదురుదాడి చేస్తున్నారు. దానికి టీడీపీ ..  తిరుమలలో అక్రమాల డాక్యుమెంట్లను రిలీజ్ చేస్తూ కౌంటర్ ఇస్తుంది. ఈ రాజకీయం మరింత రసవత్తరంగా జరగడం ఖాయంగా కనిపిస్తోంది. 

 

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu BJP: తమిళనాడు బీజేపీలో అన్నామలై సంక్షోభం! భారీ సంఖ్యలో పార్టీని వీడుతున్న నేతలు!
తమిళనాడు బీజేపీలో అన్నామలై సంక్షోభం! భారీ సంఖ్యలో పార్టీని వీడుతున్న నేతలు!
Gaddar Daughter On Pawan Kalyan: పవన్ మాటలకు గద్దర్ కుటుంబం ఎందుకు నొచ్చుకుంది? వివాదంలో వాస్తవాలేంటి.? గద్దర్ కుమార్తెతో ప్రత్యేక ఇంటర్వూ
పవన్ మాటలకు గద్దర్ కుటుంబం ఎందుకు నొచ్చుకుంది? వివాదంలో వాస్తవాలేంటి.? గద్దర్ కుమార్తెతో ప్రత్యేక ఇంటర్వూ
Mamata Banerjee Lok Sabha: బెంగాల్‌ పీఠం కోల్పోయిన మమత ఢిల్లీ కోటపై కన్నేశారా? యూసఫ్‌ పఠాన్ సీటు ఖాళీ వెనుక అసలు కథేంటీ?
బెంగాల్‌ పీఠం కోల్పోయిన మమత ఢిల్లీ కోటపై కన్నేశారా? యూసఫ్‌ పఠాన్ సీటు ఖాళీ వెనుక అసలు కథేంటీ?
K Annamalai New Political Party: అన్నామలై సొంత పార్టీ ప్రకటన - రజనీకాంత్ ప్రస్తావన - తమిళనాడు రాజకీయాల్లో కలకలం
అన్నామలై సొంత పార్టీ ప్రకటన - రజనీకాంత్ ప్రస్తావన - తమిళనాడు రాజకీయాల్లో కలకలం

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gaddar Daughter On Pawan Kalyan: పవన్ మాటలకు గద్దర్ కుటుంబం ఎందుకు నొచ్చుకుంది? వివాదంలో వాస్తవాలేంటి.? గద్దర్ కుమార్తెతో ప్రత్యేక ఇంటర్వూ
పవన్ మాటలకు గద్దర్ కుటుంబం ఎందుకు నొచ్చుకుంది? వివాదంలో వాస్తవాలేంటి.? గద్దర్ కుమార్తెతో ప్రత్యేక ఇంటర్వూ
Latha Rajinikanth Makkal Madai: తమిళనాడు రాజకీయాల్లో రజనీకాంత్ సంచలనం - ప్రజావేదిక ఏర్పాటు - సతీమణే కీలకం !
తమిళనాడు రాజకీయాల్లో రజనీకాంత్ సంచలనం - ప్రజావేదిక ఏర్పాటు - సతీమణే కీలకం !
Kakinada Senior Assistant Shiva Kumar ACB Raids: కలెక్టర్‌లో సీనియర్ అసిస్టెంట్ - అవినీతిలోనూ సీనియరే - ఆస్తులు లెక్కేయడం కష్టమే!
కలెక్టర్‌లో సీనియర్ అసిస్టెంట్ - అవినీతిలోనూ సీనియరే - ఆస్తులు లెక్కేయడం కష్టమే!
Karnataka Congress Crisis: డీకే శివకుమార్‌కు షాక్ ఇస్తున్న మంత్రులు! కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం!
డీకే శివకుమార్‌కు షాక్ ఇస్తున్న మంత్రులు! కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం!
Revanth Reddy target GHMC :తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
Nandus World Scam: నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
K. Annamalai:
"అందుకే బీజేపీలో చేరా, ఏడాదిన్నర నుంచి విభేదాలు"అన్నామలై సంచలన వ్యాఖ్యలు! కొత్త రాజకీయ వేదిక ప్రకటన!
Breaking News: భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
Embed widget