అన్వేషించండి

Tirupati Laddu Controversy: లడ్డూ కల్తీ వివాదంలో వైఎస్ఆర్‌సీపీ ఎదురుదాడి - బెడిసి కొడుతుందా ? డిఫెండ్ చేసుకోగలుగుతుందా ?

YSRCP : తిరుపతి లడ్డూ కల్తీ వివాదంలో ఎదురుదాడికి వైసీపీ రెడీ అయింది. ఓ వైపు తప్పు జరగలేదని వాదిస్తూనే.. తప్పుడు ఆరోపణలు చేసి తిరుమలను కించ పరిచారని ప్రజల్లోకి వెళ్లాలని డిసైడయ్యారు.

YCP is ready to counterattack in the Tirupati laddu adulteration controversy: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాద కల్తీ విషయంలో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్ వ్యూహం మార్చారు. ఇప్పటి వరకూ నిజాలు తెలుసుకోవాలని ఆయన చాలా మందికి లేఖలు రాశారు. పార్టీ పరంగా ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు. కానీ లడ్డూ లో కల్తీ జరగనే లేదు అన్న వాదన మాత్రం గట్టిగా వినిపిస్తున్నారు. అందు కోసం రకరకాల వాదనలతో తెరపైకి వస్తున్నారు. తాజాగా జగన్ స్వయంగా రంగంలోకి దిగాలని నిర్ణయించారు. తిరుమలకు కాలి నడకన వెళ్లడంతో పాటు శనివారం ఆలయాల్లో పూజలు చేయాలని పార్టీ క్యాడర్ కు పిలుపునిచ్చారు.

హిందువుల్లో వస్తున్న అనుమానాలకు క్లారిటీ ఇవ్వాలనే ప్రయత్నం

తిరుమల లడ్డూ ఇష్యూలో జగన్ అన్యమతస్తుడు కాబట్టే హిందూ సంప్రదాయాలు, సనాతన ధర్మం విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారని పైగా కించ పరుస్తున్నారని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ విషయంలో ఎదురుదాడికి వైసీపీ వ్యూహం సిద్ధం చేసుకుంది. చాలా రోజులుగా బయటకు రాని కొడాలి నాని వంటి వారితోనూ ప్రెస్‌మీట్లు పెట్టారు. కల్తీ నెయ్యితో వచ్చిన ట్యాంకర్లను వెనక్కి పంపించామని కల్తీ జరగనే లేదని వాదించారు. అందరూ ఇదే వాదనతో తెరపైకి వస్తున్నారు. శనివారం ఆలయాల్లో పూజలు.. ఆ తర్వాత జగన్ తిరుమల పర్యటన తర్వాత మరంత అగ్రెసివ్ గా కల్తీ జరగలేదన్న వాదనను వినిపించాలనుకుంటున్నారు. 

Also Read: Tirumala Laddu: ప్రాయశ్చిత్తానికి పోటీగా పాప ప్రక్షాళణ- ఈనెల 28న వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త పూజలు 

మరో వైపు బయటకు వస్తున్న సంచలన విషయాలు ! 

మరోవైపు లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీకి కాంట్రాక్ట్ ఇవ్వడానికి అనేక రూల్స్ మార్చారని తేలింది. కనీస అర్హత లేకపోయినా.. రూల్స్ మార్చి ఏఆర్ డెయిరీకి కాంట్రాక్ట్ ఇచ్చారు. అలాగే ఆ డెయిరీ నెయ్యి కేంద్ర ఆరోగ్య శాఖ చేసిన పరక్షల్లోనూ కల్తీగా తేలింది. వీటన్నింటిపై ఇప్పుడు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించారు. ఆ సిట్ నివేదికలో అసలు విషయాలు వెలుగులోకి వస్తాయి. అసలు నెయ్యి టెండర్ల వెనుక ఉన్నగోల్ మాల్.. ఆయా సంస్థలు నెయ్యిని ఎలా ప్రొక్యూర్ చేస్తాయి.. అసలు తిరుమలలో టెస్టింగ్ చేశారా లేదా అంటి విషయాలు అన్నీ వెలుగులోకి వస్తాయి. ఇవన్నీ తమకు ఇబ్బందికరంగా ఉంటాయని వైసీపీ గట్టిగా నమ్ముతోంది. అందుకే ఆ సిట్ ..చంద్రబాబు చెప్పిందే చెబుతుందని ముందుగానే ఖండిస్తున్నారు.కానీ దర్యాప్తు సంస్థలు చెప్పేదే ఫైనల్. 

Also Read: YS Jagan: లడ్డూ వివాదం - కాలి నడకన తిరుమలకు వెళ్లనున్న వైఎస్ జగన్

వైసీపీ హయాంలో తిరుమలలో లెక్కలేనన్ని అవకతవకలు జరిగాయని ఇప్పటికే లీకులు వచ్చాయి. ఒక్క టీటీడీ చైర్మనే సగటున రోజుకు ఐదు వందల వరకూ వీఐపీ దర్శన టిక్కెట్లు కేటాయించారని.. నాలుగేళ్లలో మూడున్నర లక్షల మందికి దర్శన టిక్కెట్లు ఇచ్చారని అవన్నీ అమ్ముకున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పెద్దిరెడ్డి, రోజా ట్రావెల్స్ పేరుతో టిక్కెట్లు అమ్ముకున్నారు. అలాగే ఇతర వైసీపీ నేతలు కూడా అదే పని చేశారని అంటున్నారు. ఇక ఎన్నికలకు ముందు తిరుపతిలో పనులకు టీటీడీ నిధులు మళ్లించడం సహా అనేక అవకతవకలు బయటకు వచ్చాయని వాటన్నింటినీ ప్రభుత్వం టైం చూసి బయట పెడుతుందని అంటున్నారు. 

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ వాదనను అంత బలంగా వెళ్లడం లేదు. అందుకే ఎదురుదాడి చేస్తున్నారు. దానికి టీడీపీ ..  తిరుమలలో అక్రమాల డాక్యుమెంట్లను రిలీజ్ చేస్తూ కౌంటర్ ఇస్తుంది. ఈ రాజకీయం మరింత రసవత్తరంగా జరగడం ఖాయంగా కనిపిస్తోంది. 

 

టాప్ హెడ్ లైన్స్

CJP Protest: ధర్మేంద్ర ప్రధాన్ బలిపశువు అయ్యారు, చాలా బాధాకరం- కేంద్ర మంత్రి రాజీనామాపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు
ధర్మేంద్ర ప్రధాన్ బలిపశువు అయ్యారు, చాలా బాధాకరం- కేంద్ర మంత్రి రాజీనామాపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు
Dharmendra Pradhan Resignation Reasons: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
CJP GenZ Protest Success Story: కాక్రోచ్‌ల తొలి పోరాటమే సూపర్‌హిట్ - రాజకీయ పార్టీలకు సాధ్యం కానిది సాధించిన జెన్జీలు !
కాక్రోచ్‌ల తొలి పోరాటమే సూపర్‌హిట్ - రాజకీయ పార్టీలకు సాధ్యం కానిది సాధించిన జెన్జీలు !
Rahul Gandhi Student Paper Leak Protest: విద్యార్థుల పోరులో రాహుల్ గాంధీ వ్యూహం - మైలేజీ వచ్చిందా? ఉద్యమం కాంగ్రెస్ సొంతమైందా?
విద్యార్థుల పోరులో రాహుల్ గాంధీ వ్యూహం - మైలేజీ వచ్చిందా? ఉద్యమం కాంగ్రెస్ సొంతమైందా?

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Indiramma Towers Helpline Number: ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
IND vs ZIM 3rd T20 Update:  వైభవ్ సూర్యవంశీ స్ట‌న్నింగ్ ఫిఫ్టీ .. టీమిండియా భారీ స్కోరు, క్లీన్ స్వీప్ దిశగా శ్రేయ‌స్ సేన సూప‌ర్ స్కెచ్!
వైభవ్ సూర్యవంశీ స్ట‌న్నింగ్ ఫిఫ్టీ .. టీమిండియా భారీ స్కోరు, క్లీన్ స్వీప్ దిశగా శ్రేయ‌స్ సేన సూప‌ర్ స్కెచ్!
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Dharmendra Pradhan Resignation: విద్యార్థుల ఆందోళన తొలిరోజే రాజీనామాకు సిద్ధపడిన ధర్మేంద్ర ప్రధాన్, కానీ!: విజయ్‌ వర్గీయా
విద్యార్థుల ఆందోళన తొలిరోజే రాజీనామాకు సిద్ధపడిన ధర్మేంద్ర ప్రధాన్, కానీ!: విజయ్‌ వర్గీయా
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Second Marriage OTT : ఓటీటీలోకి సరికొత్త రొమాంటిక్ సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి సరికొత్త రొమాంటిక్ సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Cheruvugattu Fire Accident: చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
Embed widget