అన్వేషించండి

AP Politics : వరుస వివాదాలతో వైఎస్ఆర్‌సీపీ సతమతం - సంక్షేమ సంతకం పక్కకు పోతోందా ?

వివాదాలతోనే సహవాసం చేస్తున్న వైసీపీఎన్నికలకు ముందు లా అండ్ ఆర్డర్ ఇష్యూలు మేలు చేస్తాయా ?విపక్షాలపై కక్ష సాధింపులతో ఏం సాధిస్తారు ?ఎన్నికలకు ముందూ పథకాలపై ఎందుకు ప్రచారం చేసుకోలేకపోతున్నారు ?


AP Politics :   అధికారం చేతిలోకి వచ్చిన తర్వాత దాన్ని పోగొట్టుకోవాలని ఎవరూ అనుకోరు. నిలబెట్టుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు. మొదటి మూడేళ్లు ఎలా రాజకీయం చేసినా.. ఎలా పరిపాలన చేసినా.. చివరి రెండేళ్లు మాత్రం రాముడు మంచి  బాలుడు తరహాలో..  ప్రభుత్వం చాలా మంచిది అనే భావన ప్రజలకు కల్పించడానికి శతవిధాలా ప్రయత్నాలు చేస్తారు. విపక్షాలు ఎంత రెచ్చగొట్టినా.. తమ ప్లస్ పాయింట్లను హైలెట్ చేయడానికే ప్రయత్నిస్తాయి. కానీ ఈ సంప్రదాయ రాజకీయానికి వైసీపీ అధినేత జగన్ బ్రేకిచ్చారు. ఎన్నికల చివరి వరకూ.. తనదైన ఉద్రిక్తతల రాజకీయం నడిపించేస్తున్నారు. దీంతో ప్రభుత్వ ప్లస్ పాయింట్లు చర్చల్లోకి రావడం లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. 

ఒక దాని తర్వాత ఏదో ఓ వివాదం

ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కానీ.. వైఎస్ఆర్‌సీపీ నేతల దుందుడుకు చర్యల వల్ల కానీ.. ఏపీలో ప్రభుత్వ పాలనా తీరుపై ఎప్పుడూ ఏదో ఓ వ్యతిరేక ప్రచారమే జరుగుతూ ఉంటుంది. గత వారమే తీసుకుంటే పుంగనూరు దాడులతో కలకలం రేగింది. తర్వాత చిరంజీవి ఏదో అన్నారని ఆయనపై విరుచుకుపడ్డారు. ఈ రెండు అంశాల్లోనూ ప్రభుత్వ తీరు సామాన్యుల్లో .. విస్మయానికి గురి చేసింది. గత నాలుగేళ్లుగా అమరావతి దగ్గర నుంచి పోలవరం వరకూ అన్ని  విషయాల్లోనూ ఎప్పుడూ ఏదో ఓ వివాదం వెంటాడుతూనే ఉంది.  విపక్ష పార్టీలపై దాడులు, కేసులు.. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి వంటివి కూడా  హైలెట్ అయ్యాయి. అయితే ఎన్నికలు దగ్గర పడుతున్నా అవే ఉద్రిక్తలు కనిపిస్తున్నాయి. 

సంక్షేమ  ప్రచారం వెనక్కి పోతోందా ?

వైసీపీ ప్రభుత్వం ఏకైక లక్ష్యం సంక్షేమం.  అభివృద్ధిని పెద్దగా పట్టించుకోలేదు.  ప్రజలందరి ఇళ్లకూ పథకాలు అందించడమే టార్గెట్ గా పెట్టుకుంది. దీన్ని ప్రచారం చేసుకోవడానికి మూడేళ్ల కిందటి నుంచి ప్రణాళికలు రూపొందించుకుంది. గడప గడపకూ మన ప్రభుత్వం, స్పందన, జగనన్న సురక్ష, జగనన్నకు చెప్పుకుందాం.. ఇలా వరుస కార్యక్రమాలు ప్లాన్ చేశారు. కానీ ఎప్పుడూ అవి హైలెట్ కాలేదు. ఎక్కడైనా ప్రజలు ప్రజా ప్రతినిధుల్ని నిలదీస్తే అవే హైలెట్ అయ్యాయి. అదే సమయంలో బటన్ నొక్కే సభల్లో కూడా సీఎం జగన్ తన సంక్షేమ పథకాల గురించి పైపైన చెప్పుకుని మిగతా సమయం అంతా విపక్షాలను విమర్శించడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. దాంతో ఆ మాటలే హైలెట్ అవుతున్నాయి. అందుకే ఇప్పటి వరకూ ప్రభుత్వ పథకాల ప్రభావం ప్రజలపై ఎంత ఉందనేదానిపై రాజకీయవర్గాలు అంచనాకు రాలేకపోతున్నాయి. 

కక్ష సాధింపు రాజకీయాలతో వైసీపీ వ్యూహం దారి తప్పిందా ?

రాజకీయాల్లో కక్ష సాధింపులు అనేవి..  వేధింపులకు గురయ్యే వారికి  ఓ అద్భుతమైన అవకాశాన్ని ఇస్తాయి. ఎందుకంటే ప్రజలు సానుభూతి చూపిస్తారు. అందుకే ఎక్కడైనా రాజకీయ పార్టీలు .. ప్రత్యర్థులపై వేధింపులకు పాల్పడే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తాయి. ఇబ్బంది పెట్టాలని అనుకుంటాయి కానీ.. ప్రజల నుంచి సానుభూతి లభించే అంతగా చేయాలని అనుకోవు. కారణం ఏదైనా.. గత నాలుగేళ్లుగా ఏపీలో విపక్ష పార్టీ నేతలపై ఎప్పుడూ జరగనన్ని దారుణాలు జరిగాయని.. రాజకీయంగా ప్రభుత్వం మారితే అధికార పార్టీ నేతలు ఇబ్బంది పడుతారన్న చర్చ జరుగుతోంది. మొత్తంగా  రాజకీయాల్లో చర్చ అంతా..  వైసీపీ పాలనలోని మైనస్‌లపై నే సాగుతోంది ..కానీ వైసీపీ నమ్ముకున్న పథకాలు.. సంక్షేమంపై మాత్రం సాగడం లేదు. దీనికి  ఆ పార్టీ చేసుకున్న స్వయంకృతమే కారణం. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

BJP grip on communist strongholds: ఎర్రకోటల్లో కాషాయ జెండా - కమ్యూనిస్టు ఓటు బ్యాంక్ బీజేపీకి ఎలా మారుతోంది?
ఎర్రకోటల్లో కాషాయ జెండా - కమ్యూనిస్టు ఓటు బ్యాంక్ బీజేపీకి ఎలా మారుతోంది?
Nara Lokesh: అప్పట్లో డిప్యూటీ సీఎం - ఇప్పుడు సీఎం - నారా లోకేష్‌పై ఈ ప్రచారం వ్యూహాత్మకమేనా?
అప్పట్లో డిప్యూటీ సీఎం - ఇప్పుడు సీఎం - నారా లోకేష్‌పై ఈ ప్రచారం వ్యూహాత్మకమేనా?
Former Maoists Political hopes: రాజకీయ ఆశల్లో లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు - రేవంత్ రెడ్డి ప్రోత్సహించబోతున్నారా?
రాజకీయ ఆశల్లో లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు - రేవంత్ రెడ్డి ప్రోత్సహించబోతున్నారా?
Tamil Nadu Assembly Elections 2026: విడాకుల రచ్చతో ప్రత్యర్థులకు చిక్కిన విజయ్ - ఎలా బయటపడతారు?
విడాకుల రచ్చతో ప్రత్యర్థులకు చిక్కిన విజయ్ - ఎలా బయటపడతారు?

వీడియోలు

Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|
Pakistan Out of T20 World Cup 2026 | టీ20 వరల్డ్ కప్ నుంచి పాకిస్థాన్ అవుట్
India vs West Indies T20 World Cup Team India Batting Lineup | భార‌త అసిస్టెంట్ కోచ్ కీల‌క వ్యాఖ్య‌లు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Former Maoists Political hopes: రాజకీయ ఆశల్లో లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు - రేవంత్ రెడ్డి ప్రోత్సహించబోతున్నారా?
రాజకీయ ఆశల్లో లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు - రేవంత్ రెడ్డి ప్రోత్సహించబోతున్నారా?
Iran Israel Conflict: గల్ఫ్ దేశాల్లోని ఏపీ ప్రజలు ఆందోళన చెందొద్దు.. హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు
గల్ఫ్ దేశాల్లోని ఏపీ ప్రజలు ఆందోళన చెందొద్దు.. హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు
AP Judicial Academy: ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, రూ.165 కోట్లతో నిర్మాణం
ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, రూ.165 కోట్లతో నిర్మాణం
Virosh Couple : సీఎం రేవంత్ ఫ్యామిలీని కలిసిన రష్మిక - వివాహ రిసెప్షన్‌కు ఆహ్వానం
సీఎం రేవంత్ ఫ్యామిలీని కలిసిన రష్మిక - వివాహ రిసెప్షన్‌కు ఆహ్వానం
TTD Chairman BR Naidu: అలాంటి వీడియోలకు భయపడే వ్యక్తిని కాదు.. వాళ్ల బాగోతం బయటపెడతా: బీఆర్ నాయుడు
అలాంటి వీడియోలకు భయపడే వ్యక్తిని కాదు.. వాళ్ల బాగోతం బయటపెడతా: బీఆర్ నాయుడు
T20 World Cup 2026: సెమీఫైనల్స్ చేరిన నాలుగు జట్లు ఇవే.. భారత్‌ను ఢీకొట్టనున్న ఇంగ్లాండ్‌
సెమీఫైనల్స్ చేరిన నాలుగు జట్లు ఇవే.. భారత్‌ను ఢీకొట్టనున్న ఇంగ్లాండ్‌
Telugu TV Movies Today: ఈ సోమవారం (మార్చి 02) స్మాల్ స్క్రీన్‌‌పై సందడి చేసే సినిమాలివే.. టీవీ సినిమాల గైడ్!
ఈ సోమవారం (మార్చి 02) స్మాల్ స్క్రీన్‌‌పై సందడి చేసే సినిమాలివే.. టీవీ సినిమాల గైడ్!
Money Laundering Case: జైలులో జీవితం నరకమే... తీహార్‌లో చావు కోసం చూశానని నటి ఆవేదన
జైలులో జీవితం నరకమే... తీహార్‌లో చావు కోసం చూశానని నటి ఆవేదన
Embed widget