అన్వేషించండి

AP Politics : వరుస వివాదాలతో వైఎస్ఆర్‌సీపీ సతమతం - సంక్షేమ సంతకం పక్కకు పోతోందా ?

వివాదాలతోనే సహవాసం చేస్తున్న వైసీపీఎన్నికలకు ముందు లా అండ్ ఆర్డర్ ఇష్యూలు మేలు చేస్తాయా ?విపక్షాలపై కక్ష సాధింపులతో ఏం సాధిస్తారు ?ఎన్నికలకు ముందూ పథకాలపై ఎందుకు ప్రచారం చేసుకోలేకపోతున్నారు ?


AP Politics :   అధికారం చేతిలోకి వచ్చిన తర్వాత దాన్ని పోగొట్టుకోవాలని ఎవరూ అనుకోరు. నిలబెట్టుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు. మొదటి మూడేళ్లు ఎలా రాజకీయం చేసినా.. ఎలా పరిపాలన చేసినా.. చివరి రెండేళ్లు మాత్రం రాముడు మంచి  బాలుడు తరహాలో..  ప్రభుత్వం చాలా మంచిది అనే భావన ప్రజలకు కల్పించడానికి శతవిధాలా ప్రయత్నాలు చేస్తారు. విపక్షాలు ఎంత రెచ్చగొట్టినా.. తమ ప్లస్ పాయింట్లను హైలెట్ చేయడానికే ప్రయత్నిస్తాయి. కానీ ఈ సంప్రదాయ రాజకీయానికి వైసీపీ అధినేత జగన్ బ్రేకిచ్చారు. ఎన్నికల చివరి వరకూ.. తనదైన ఉద్రిక్తతల రాజకీయం నడిపించేస్తున్నారు. దీంతో ప్రభుత్వ ప్లస్ పాయింట్లు చర్చల్లోకి రావడం లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. 

ఒక దాని తర్వాత ఏదో ఓ వివాదం

ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కానీ.. వైఎస్ఆర్‌సీపీ నేతల దుందుడుకు చర్యల వల్ల కానీ.. ఏపీలో ప్రభుత్వ పాలనా తీరుపై ఎప్పుడూ ఏదో ఓ వ్యతిరేక ప్రచారమే జరుగుతూ ఉంటుంది. గత వారమే తీసుకుంటే పుంగనూరు దాడులతో కలకలం రేగింది. తర్వాత చిరంజీవి ఏదో అన్నారని ఆయనపై విరుచుకుపడ్డారు. ఈ రెండు అంశాల్లోనూ ప్రభుత్వ తీరు సామాన్యుల్లో .. విస్మయానికి గురి చేసింది. గత నాలుగేళ్లుగా అమరావతి దగ్గర నుంచి పోలవరం వరకూ అన్ని  విషయాల్లోనూ ఎప్పుడూ ఏదో ఓ వివాదం వెంటాడుతూనే ఉంది.  విపక్ష పార్టీలపై దాడులు, కేసులు.. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి వంటివి కూడా  హైలెట్ అయ్యాయి. అయితే ఎన్నికలు దగ్గర పడుతున్నా అవే ఉద్రిక్తలు కనిపిస్తున్నాయి. 

సంక్షేమ  ప్రచారం వెనక్కి పోతోందా ?

వైసీపీ ప్రభుత్వం ఏకైక లక్ష్యం సంక్షేమం.  అభివృద్ధిని పెద్దగా పట్టించుకోలేదు.  ప్రజలందరి ఇళ్లకూ పథకాలు అందించడమే టార్గెట్ గా పెట్టుకుంది. దీన్ని ప్రచారం చేసుకోవడానికి మూడేళ్ల కిందటి నుంచి ప్రణాళికలు రూపొందించుకుంది. గడప గడపకూ మన ప్రభుత్వం, స్పందన, జగనన్న సురక్ష, జగనన్నకు చెప్పుకుందాం.. ఇలా వరుస కార్యక్రమాలు ప్లాన్ చేశారు. కానీ ఎప్పుడూ అవి హైలెట్ కాలేదు. ఎక్కడైనా ప్రజలు ప్రజా ప్రతినిధుల్ని నిలదీస్తే అవే హైలెట్ అయ్యాయి. అదే సమయంలో బటన్ నొక్కే సభల్లో కూడా సీఎం జగన్ తన సంక్షేమ పథకాల గురించి పైపైన చెప్పుకుని మిగతా సమయం అంతా విపక్షాలను విమర్శించడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. దాంతో ఆ మాటలే హైలెట్ అవుతున్నాయి. అందుకే ఇప్పటి వరకూ ప్రభుత్వ పథకాల ప్రభావం ప్రజలపై ఎంత ఉందనేదానిపై రాజకీయవర్గాలు అంచనాకు రాలేకపోతున్నాయి. 

కక్ష సాధింపు రాజకీయాలతో వైసీపీ వ్యూహం దారి తప్పిందా ?

రాజకీయాల్లో కక్ష సాధింపులు అనేవి..  వేధింపులకు గురయ్యే వారికి  ఓ అద్భుతమైన అవకాశాన్ని ఇస్తాయి. ఎందుకంటే ప్రజలు సానుభూతి చూపిస్తారు. అందుకే ఎక్కడైనా రాజకీయ పార్టీలు .. ప్రత్యర్థులపై వేధింపులకు పాల్పడే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తాయి. ఇబ్బంది పెట్టాలని అనుకుంటాయి కానీ.. ప్రజల నుంచి సానుభూతి లభించే అంతగా చేయాలని అనుకోవు. కారణం ఏదైనా.. గత నాలుగేళ్లుగా ఏపీలో విపక్ష పార్టీ నేతలపై ఎప్పుడూ జరగనన్ని దారుణాలు జరిగాయని.. రాజకీయంగా ప్రభుత్వం మారితే అధికార పార్టీ నేతలు ఇబ్బంది పడుతారన్న చర్చ జరుగుతోంది. మొత్తంగా  రాజకీయాల్లో చర్చ అంతా..  వైసీపీ పాలనలోని మైనస్‌లపై నే సాగుతోంది ..కానీ వైసీపీ నమ్ముకున్న పథకాలు.. సంక్షేమంపై మాత్రం సాగడం లేదు. దీనికి  ఆ పార్టీ చేసుకున్న స్వయంకృతమే కారణం. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: నా జీవితంలో ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి: చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
CM Chandrababu: నా జీవితంలో ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి: చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
Ramarajyam Raghav Reddy: చిలుకూరి పూజారినే కాదు చిన్న జీయర్ నూ టార్గెట్ చేసిన
చిలుకూరి పూజారినే కాదు చిన్న జీయర్ నూ టార్గెట్ చేసిన "రామరాజ్యం " రాఘవ రెడ్డి, అతడి లక్ష్యం ఇదే!
Sankranthiki Vasthunam: 'సంక్రాంతికి వస్తున్నాం' సీక్వెల్ పై హింట్ ఇచ్చిన వెంకటేష్... రిలీజ్ డేట్ కూడా ఫిక్స్
'సంక్రాంతికి వస్తున్నాం' సీక్వెల్ పై హింట్ ఇచ్చిన వెంకటేష్... రిలీజ్ డేట్ కూడా ఫిక్స్
Crime News: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, 7 మంది తెలుగు భక్తులు మృతి - కుంభమేళాకు వెళ్లొస్తుంటే విషాదం
మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, 7 మంది తెలుగు భక్తులు మృతి - కుంభమేళాకు వెళ్లొస్తుంటే విషాదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Attack on Chilkur Balaji Temple Rangarajan | రామరాజ్యం స్థాపించటానికి వచ్చాం అంటూ దాడి | ABP DesamVishwak sen on Prudhviraj Controversy | 11 గొర్రెలు కాంట్రవర్సీపై విశ్వక్ సారీ | ABP DesamAllu Aravind on Ram Charan | రామ్ చరణ్ పై వ్యాఖ్యల వివాదం మీద అల్లు అరవింద్ | ABP DesamPresident Murmu in Maha kumbh 2025 | మహా కుంభమేళాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: నా జీవితంలో ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి: చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
CM Chandrababu: నా జీవితంలో ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి: చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
Ramarajyam Raghav Reddy: చిలుకూరి పూజారినే కాదు చిన్న జీయర్ నూ టార్గెట్ చేసిన
చిలుకూరి పూజారినే కాదు చిన్న జీయర్ నూ టార్గెట్ చేసిన "రామరాజ్యం " రాఘవ రెడ్డి, అతడి లక్ష్యం ఇదే!
Sankranthiki Vasthunam: 'సంక్రాంతికి వస్తున్నాం' సీక్వెల్ పై హింట్ ఇచ్చిన వెంకటేష్... రిలీజ్ డేట్ కూడా ఫిక్స్
'సంక్రాంతికి వస్తున్నాం' సీక్వెల్ పై హింట్ ఇచ్చిన వెంకటేష్... రిలీజ్ డేట్ కూడా ఫిక్స్
Crime News: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, 7 మంది తెలుగు భక్తులు మృతి - కుంభమేళాకు వెళ్లొస్తుంటే విషాదం
మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, 7 మంది తెలుగు భక్తులు మృతి - కుంభమేళాకు వెళ్లొస్తుంటే విషాదం
Rana Daggubati: తెలుగులో రిలీజ్ కాని రానా దగ్గుబాటి మూవీ... సమంత నటించిన ఆ ఫ్లాప్ సినిమా పేరేంటో తెలుసా?
తెలుగులో రిలీజ్ కాని రానా దగ్గుబాటి మూవీ... సమంత నటించిన ఆ ఫ్లాప్ సినిమా పేరేంటో తెలుసా?
Romantic Destinations : రొమాంటిక్ డెస్టినేషన్స్.. మీ ప్రేయసితో కలిసి వెళ్లేందుకు ఇండియాలో బెస్ట్ ప్లేస్​లు ఇవే
రొమాంటిక్ డెస్టినేషన్స్.. మీ ప్రేయసితో కలిసి వెళ్లేందుకు ఇండియాలో బెస్ట్ ప్లేస్​లు ఇవే
New Ration Cards: మీసేవ వెబ్‌సైట్‌లో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుకు అవకాశం, వాళ్లు అప్లై చేయవద్దన్న అధికారులు
మీసేవ వెబ్‌సైట్‌లో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుకు అవకాశం, వాళ్లు అప్లై చేయవద్దన్న అధికారులు
Allu Aravind: 'రామ్ చరణ్‌పై అలా మాట్లాడకుండా ఉండాల్సింది' - ట్రోలింగ్ వ్యాఖ్యలపై స్పందించిన అల్లు అరవింద్, ఫుల్ క్లారిటీ ఇచ్చేశారుగా!
'రామ్ చరణ్‌పై అలా మాట్లాడకుండా ఉండాల్సింది' - ట్రోలింగ్ వ్యాఖ్యలపై స్పందించిన అల్లు అరవింద్, ఫుల్ క్లారిటీ ఇచ్చేశారుగా!
Embed widget