అన్వేషించండి

వైసీపీలో ఆ వారసులకు లైన్ క్లియర్‌- ఎమ్మిగనూరు నుంచి జగన్మోహన్ రెడ్డి పోటీ !

వారసులు వచ్చేస్తున్నారు. నిన్నటివరకు సీనియర్లకే అన్న జగన్‌ ఇప్పుడు వారసులకు కూడా ఓకే చెప్పారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇంటికొకరన్న కండిషన్‌ మీద రానున్న ఎన్నికల్లో పోటీలోకి దిగబోతున్నారట.

గత రెండు మూడు రోజులుగా వైసీపీలో జరుగుతున్న మార్పులతో ఏపీ రాజకీయాలు హీటెక్కాయి. వైసీపీ నేతల్లో మాత్రంఉత్కంఠతను రేపుతున్నాయి. కీలక నేతలతోపాటు నమ్మిన బంట్లకి కూడా పక్కన పెట్టారు జగన్. పార్టీ జిల్లా అధ్యక్ష, రీజనల్‌ కో ఆర్డినేటర్ల పదవులు విషయంలో జగన్‌ తీసుకున్న నిర్ణయాలు ఇంకా ఆపార్టీ శ్రేణులను షాక్‌లోనే ఉంచాయి. ఇప్పుడు దీనికి మరింత హీటు పెంచేలా 9మంది నేతలను తాడేపల్లి పార్టీ ఆఫీసుకి రమ్మనడం కూడా చర్చనీయాంశంగా మారింది. 

పనితీరు ఆధారంగా వచ్చే ఎన్నికల్లో సీట్లు ఉంటాయని ఇప్పటికే చెప్పిన జగన్‌ వారసుల విషయంలో నిన్నటి వరకు కఠినంగానే వ్యవహరించారు. సీనియర్లు, పని చేసే వారికే టిక్కెట్లు ఉంటాయని స్పష్టం చేాశారు. అయితే పరిస్థితులు ఇతర కారణాలతో వైసీపీ అధినేత ఇప్పుడు కాస్తంత మెత్తబడి మెట్టుదిగారట. వారసులను వచ్చే ఎన్నికల్లో దింపాలనుకుంటున్న కొందరి సీనియర్ల కోరికకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూనే షరతులు వర్తిస్తాయని గట్టిగానే చెప్పారట. అలా జగన్‌ షరతులతో ఎంట్రీ ఇవ్వబోతున్న ఆ నలుగురు వారసులు ఎవరన్నదానిపై రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. 

చిత్తూరు జిల్లాలో భూమన, చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి వచ్చే ఎన్నికల్లో తమ కుమారులను రంగంలోకి దింపాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఇంటింటికి మన ప్రభుత్వం కార్యక్రమంలో వారసులను దింపి జగన్‌ దృష్టిలో పడేలా చేసుకున్నారు. జగన్‌ కూడా వీళ్ల పనితీరుపై కాస్తంత సంతృప్తితోనే ఉన్నారని టాక్. రానున్న ఎన్నికల్లో తిరుపతి నుంచి భూమన కొడుకు అభినయ్‌, చంద్రగిరి నుంచి చెవిరెడ్డి కుమారుడు మోహిత్‌ పోటీ చేయనున్నారన్న వార్తలు హడావుడి చేస్తున్నాయి. 

భూమనకు పల్నాడు జిల్లా బాధ్యతలను, చెవిరెడ్డికి పార్టీ అనుబంధ విభాగాల సమన్వయకర్తగా నియమించడంతో పార్టీ సేవలకు ఇక వారు పరిమితం కానున్నారని సమాచారం. అనారోగ్యంతో ఉన్న మంత్రి విశ్వరూప్‌ కోరిక మేరకు ఆయన వారసుల్లో ఒకరికి ఛాన్స్‌ ఇవ్వడానికి జగన్‌ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మంత్రి ఇంట టిక్కట్ల గోల నడుస్తోంది. కొడుకులిద్దరినీ పోటీలోకి దింపాలని మంత్రి కుటుంబం భావిస్తోందట. ఇంటికి ఒకరికే అవకాశం ఇస్తానని జగన్‌ స్పష్టం చేయడంతో విశ్వరూప్‌ కొడుకల్లో ఎవరికి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. 

ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి కూడా తన వారసుడికి టిక్కెట్‌ ఇవ్వాలని కోరుతున్నారు. వృద్ధాప్యం, అనారోగ్య కారణాల రీత్యా తన కొడుక్కి ఛాన్స్‌ ఇవ్వాలని కోరడంతో రానున్న ఎన్నికల్లో ఎమ్మిగనూరు నుంచి జగన్మోహన రెడ్డి పోటీలో దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. గత ఎన్నికల్లోనే కొడుక్కి ఇవ్వమని చెన్నకేశవరెడ్డి కోరినా జగన్‌ మాత్రం సీనియార్టికే పెద్ద పీట వేశారు. అయితే ఇప్పుడు మాత్రం వారసుడికే ఇచ్చేందుకు జగన్‌ అంగీకరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పేర్ని నాని, కొడాలి నాని కూడా తమ వారసులను రంగంలోకి దింపాలనుకుంటున్నా జగన్‌ మాత్రం ఆసక్తిచూపించడం లేదు. ఇప్పుడు ఈ నలుగురికి కూడా పలు కారణాలను దృష్టిలో ఉంచుకొనే వారసులకు అవకాశం ఇస్తున్నట్లు పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

టాప్ హెడ్ లైన్స్

AP NDA Alliance: వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
West Bengal Politics : బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget