అన్వేషించండి

Where are the YCP senior leaders : పొలిటికల్ రాడార్‌లో కనిపించని వైఎస్ఆర్‌సీపీ సీనియర్ నేతలు - ఎందుకు ఆజ్ఞాతంలో ఉంటున్నారు?

YSRCP : వైఎస్ఆర్‌సీపీ సీనియర్ నేతలు ఇప్పటికీ బయటకు రావడం లేదు. ఒకరిద్దరే తమ వాయిస్ వినిపిస్తున్నారు. మిగిలిన వారు పార్టీ మారిపోతారా ? బయటకు వస్తారా ?

Why are YSRCP senior leaders not coming out  :  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రులు, మాజీ మంత్రులు, ఇతర సీనియర్ల బలగం కనీసం యాభై మంది వరకూ ఉంటారు. పార్టీ ఓడిపోక ముందు వీరు తరచూ మీడియా ముందుకు వచ్చి మాట్లాడేవారు. ఇప్పుడు ఒకరిద్దరు తప్ప ఎవరూ కనిపించం లేదు. జిల్లాల్లో కనీసం పార్టీ క్యాడర్ కూ కనిపించడం లేదని చెబుతున్నారు. పార్టీ కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని పిలుపునిస్తున్నా చాలా మంది స్పందించడం లేదు. కొంత మంది తప్పనిసరిగా పార్టీ ఆఫీసుకు, కార్యక్రమాలకు వస్తున్నా నోరు తెరవడం లేదు. కొత్త ప్రభుత్వంపై అప్పుడే విమర్శలు ఎందుకుని చాలా మంది అనుకుంటున్నారు. 

ఘోరమైన ఓటమితో నేతల మైండ్ బ్లాంక్

వైసీపీ ఓటమి చిన్నది కాదు. ముఖ్యంగా శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకూ సీనియర్ నేతలు అనే ట్యాగులున్న వారు కూడా వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. మరోసారి పార్టీకి భవిష్యత్ ఉందా లేదా అన్న  స్థాయిలో ఫలితాలు వచ్చాయి. ఉత్తరాంధ్ర వైసీపీ లో కింగులుగా ఉన్న ధర్మాన,  బొత్స వంటి వారు ఘోరంగా ఓడిపోయారు. వారే కాదు.. కంచుకోటల్లాంటి నియోజకవర్గాల్లో పరాజయం పాలయ్యారు. ఉత్తరాంధ్రలో కూటమి నేతలకు వచ్చిన మెజార్టీలు చూస్తే.. తమ ఐదేళ్ల పాలనపై ప్రజలు ఎంత ఆగ్రహంతో ఉన్నారో వైసీపీ ముఖ్యులకు అర్థమయింది. అందుకే వీలైనంత వరకూ సైలెన్స్ పాటించడం మంచిదని అనుకుంటున్నారు. ఇప్పటికిప్పుడు ఆవేశపడి ప్రయోజనం లేదని అనుకుంటున్నారు. 

పులివర్తి నానిపై హత్యాయత్నం కేసు, బెంగళూరులో చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డి అరెస్ట్

నోరున్న నేతలూ నోరు తెరవలేకపోతున్నారు !

వైసీపీ హయాంలో నోరున్న నేతలకు మంచి పలకుబడి ఉండేది. చాలా మంది ప్రెస్ మీట్లు పెట్టి దడదడలాడించేవారు. రోజా దగ్గర నుంచి కొడాలి నాని వరకూ  ఓ పది మంది ఇలాంటి ప్రెస్ మీట్లకు ప్రసిద్ధి. ఇప్పుడు అడపాదడపా పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్ మాత్రమే ప్రెస్ మీట్ పెడుతున్నారు. వినుకొండలో జరిగిన హత్యాయత్నం ఘటనపై గుంటూరుకు చెందిన నేతలెవరూ ప్రెస్ మీట్ పెట్టలేకపోయారు.. విశాఖలో ఉన్న గుడివాడ అమర్నాత్ ఆ  బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది. ఓడిపోయినప్పటి నుంచి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎవరికీ కనిపించలేదు. బడ్జెట్ పై శ్వేతపత్రం తర్వాత హఠాత్తుగా హైదరాబాద్ లో ప్రత్యక్షమైన ప్రెస్ మీట్ పెట్టారు. మిగిలిన నేతలు ఆ మాత్రం దర్శనం కూడా ఇవ్వకపోతూండటంతో వైసీపీ క్యాడర్ కూడా కంగారు పడుతోంది. 

ప్రభుత్వానికి టార్గెట్ కాకుండా ఉండటానికేనా ?

వైసీపీ హయాంలో టీడీపీ నేతల్ని.. వ్యక్తిగత శత్రువులుగానే చూశారు. ఎక్కడ అవకాశం దొరికి అక్కడ కేసులు పెట్టి అరెస్టులు చేశారు. ఆస్తుల విధ్వంసం చేశారు. వారాంతాల్లో బుల్ డోజర్లతో విరుచుకుపడేవారు. ఇలాంటి పరిణామాలతో ఐదేళ్ల పాటు టీడీపీ నేతలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. మాకు అధికారం అందితే మీ సంగతి చూస్తామంటూ టీడీపీ నేతలు ఎన్నో సార్లు హెచ్చరించారు. ఇప్పుడు వైసీపీ ఘోర పరాజయం పాలు కావడంతో... వారిని రెచ్చగొట్టడం ఎందుకన్న ఉద్దేశంలో ఎక్కువ మంది సీనియర్ నేతలు సైలెంట్ గా ఉన్నట్లుగా భావిస్తున్నారు. వీరిలో ఎంత మంది పార్టీలో ఉంటారో.. ఎంత మంది ఉండరో కూడా స్పష్టత ఉండటం లేదు. ఏ పార్టీలో చాన్స్ లేకపోయినప్పటికీ గుంటూరులో ఇప్పటికే ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు గుడ్ బై  చెప్పారు. 

'జగన్ గారూ మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?' - ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ వైఎస్ షర్మిల కౌంటర్

పార్టీ నేతల్ని కాపాడుకోవడం కష్టమే !

జగన్మోహన్ రెడ్డి వ్యవహార  శైలి టీడీపీని మరింత రెచ్చగొట్టేలా ఉండటంతో..  అది ఆయన కన్నా పార్టీ నేతలకే ఎక్కువ ముప్పు వచ్చేలా ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పటికే పీకల్లో సమస్యల్లో మునిగిపోయి ఉంటే.. ఆయన ఎప్పుడై యాభై ఏళ్ల కిందట చంద్రబాబును కొట్టారని అదే కోపమని.. సరికొత్త రూమర్ ను ప్రచారంలోకి తీసుకు వచ్చారు. ఇది పెద్దిరెడ్డికి మరింత సమస్యగా మారనుంది.  వైసీపీ ముఖ్యనేతలు ఇప్పటికిప్పుడు గతంలో తాము చేసిన వ్యవహారాలకు సంబంధించి తమను తాము కాపాడుకోవడమే కీలకమన్నట్లుగా ఉన్నారు. లఅందుకే ఎవరూ పెద్దగా నోరు తెరవడం లేదని.. ముందుకు రావడం లేదని అంటున్నారు. 

 

టాప్ హెడ్ లైన్స్

Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
BRS YSRCP Silent on BJP Centre: జాతీయ అంశాలపై రీజినల్ పార్టీల సైలెంట్ రాజకీయం! BRS, YSRCP మౌనం వెనుక మర్మమేంటి?
జాతీయ అంశాలపై రీజినల్ పార్టీల సైలెంట్ రాజకీయం! BRS, YSRCP మౌనం వెనుక మర్మమేంటి?
Telangana Delimitation 2026: తెలంగాణలో డిలిమిటేషన్ ధమాకా - గ్రేటర్ హైదరాబాద్ కేంద్రంగా మారబోతున్న రాష్ట్ర రాజకీయం?
తెలంగాణలో డిలిమిటేషన్ ధమాకా - గ్రేటర్ హైదరాబాద్ కేంద్రంగా మారబోతున్న రాష్ట్ర రాజకీయం?
AP Local Body Direct Elections: ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi On Paper Leak: పేపర్ లీక్‌లపై ప్రత్యేక బిల్లు తెస్తామన్న ప్రధాని మోదీ.. అర్ధరాత్రి దీక్ష విరమించిన వాంగ్‌చుక్
పేపర్ లీక్‌లపై ప్రత్యేక బిల్లు తెస్తామన్న ప్రధాని మోదీ.. అర్ధరాత్రి దీక్ష విరమించిన వాంగ్‌చుక్
AP Local Body Direct Elections: ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Rahul Gandhi Delhi NEET Protest: ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
IND vs ZIM 1st T20 Result Update: శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
Minster Lokesh: అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
Vallabhaneni Vamsi Letter to CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
Tech Mahindra Employee Protest: 3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
Embed widget