అన్వేషించండి

KCR Strategy On Kavitha : కవిత విషయంలో అంటీముట్టనట్లుగా కేసీఆర్ రాజకీయం - కుమార్తె కోసం మాస్టర్ ప్లాన్ అమలు చేస్తున్నారా ?

KavitHa Case : కవిత కేసు విషయంలో కేసీఆర్ అరెస్ట్ దగ్గర నుంచి రిలీజ్ వరకూ ఇంకా చెప్పాలంటే రిలీజ్ తర్వాత కూడా అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారు. ఇలా ఉండటం వెనుక కేసీఆర్ బలమైన రాజకీయ వ్యూహం ఉందని అంటున్నారు.

KCR :  రాజకీయ చాణక్యుడు కేసీఆర్. ఆయన ప్రతి అడుగులోనూ రాజకీయం ఉంటుంది. పబ్లిక్ లైఫ్ లోకి వచ్చిన తర్వాత కుటుంబ వ్యవహారాలు కూడా రాజకీయాలతో ముడిపడి ఉంటాయి.  ఈ విషయం ఆయనకు బాగా తెలుసు. అందుకే కవిత కేసు, ఆమె అరెస్టు విషయంలో చాలా లో ప్రోఫైల్ పాటించారు కేసీఆర్. ఇప్పుడు కవిత అరెస్టు వరకూ గుంభనంగా ఉన్నారు. కనీసం ఒక్క సారి అంటే ఒక్క సారి కూడా ఆమెను  పరామర్శించేందుకు ఢిల్లీ వెళ్లలేదు. అంతే కాదు.. ఆ కేసు గురించి ఎక్కడా పెద్దగా మాట్లాడలేదు కూడా. వీలైనంత వరకూ తన కుమార్తె జైల్లో ఉందన్న సంగతి తనకు తెలియన్నట్లుగా వ్యవహరించారు. ఒకటి రెండు సందర్భాల్లో పార్టీ అంతర్గత సమావేశఆల్లో మాత్రం తాను రగిలుతున్న అగ్నిపర్వతంలా ఉన్నానని చెప్పారు. నిజంగా ఆయన అలాగే ఉంటారని .. కానీ ఆవేశ పడకుండా..రాజకీయ వ్యూహాలు పన్నుతున్నారని అంటున్నారు. 

లిక్కర్ కేసుకు ప్రాధాన్యం దక్కకుండా వ్యూహం

కవితపై లిక్కర్ కేసు ఖచ్చితంగా రాజకీయ ప్రేరేపితమని ప్రజల్లోకి వెళ్లేలా చేసేందుకు కేసీఆర్ పక్కా వ్యూహంతోనే కుమార్తె విషయంలో అంటీ ముట్టనట్లుగా వ్యవహరించారని  బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.  కవిత ఎపిసోడ్ మొత్తం కేసీఆర్ సైలంట్ గా ఉండటానికి కారణం తన సమయం వచ్చే వరకు వేచి చూసే ధోరణి అవలంభించడమేనని అంటున్నారు.  మీడియా అంతా కవితపై నెగిటీవ్ మాట్లాడుతున్నా... కేసీఆర్  ఒక్క మాట  ఏం మాట్లాడలేదు. ఏం మాట్లాడినా అది ఆ కేసు విషయంలో మరింత విస్తృతమైన చర్చకు కారణం అవుతుంది.  ఓ  మీడియా సమావేశంలోనే కడిగిన ముత్యంలా తన కూతురు వస్తుందని కామెంట్ చేశారు. ఆ తర్వాత కవిత కేసు విషయంలో  ఎక్కడా మాట్లాడలేదు.

కవిత బెయిల్ పై బీజేపీ, కాంగ్రెస్ ల పొలిటికల్ వార్ వెనుక కథ ఇదేనా?

ఒక్క సారి కూడా పరామర్శకు ఢిల్లీ వెళ్లని  కేసీఆర్ 

ఐదున్నప నెలల పాటు కవిత జైల్లో ఉన్నారు.  కానీ ఒక్క సారి కూడా  పరామర్శించలేదు.   తను వెళ్లడం వల్ల  జాతీయ స్థాయిలో మీడియా నెగిటీవ్ గా ప్రోజెక్ట్ చేస్తుందని...  ఈ కేసుకు ప్రాధాన్యత పెరుగుతుందన్న కారణంగా ఆగిపోయి ఉంటారని అంచనా వేస్తున్నారు.  బీజేపీతో కలవడానికే కేసీఆర్ ఢిల్లీ వెళ్లారన్న ప్రచారం జరిగే ప్రమాదం ఉందని..   ఇలాంటి వాటికి అవకాశం ఇవ్వకుండా కేసీఆర్ వ్యూహాత్మకంగా  ఢిల్లీ వెళ్లలేదని చెబుతున్నారు. లకేటీఆర్ మాత్రమే కాకుండా హరీశ్ రావును అక్కడి పంపి  కేటీఆర్ కూడా బీజేపీతో చర్చలు   అన్న ప్రచారం జరగకుండా హరీశ్ రావును తోడుగా పంపారని భావిస్తున్నారు.  కవిత విడుదల తర్వాత  అంతా కవిత మీద ఉన్న నెగిటీవ్ ప్రచారం వెనక్కు పోయేలా డిజైన్ చేశారు. నిన్న విడుదల అంతా మీడియాలో వచ్చేలా చూశారని ఇదంతా కేసీఆర్ వ్యూహమేనని అంటున్నారు. హైదరాాబాద్ ఎయిర్ పోర్టు నుంచి  బయటకు రాగానే  కవిత జై తెలంగాణ నినాదాలు చేశారు. ఇది కూడా రాజకీయ కేసులో బయటకు వచ్చారన్న అభిప్రాయాన్ని కల్పించడానికేనని భావిస్తున్నారు.  

Also Read: Kavitha Bail: కవిత, కనిమొళిల జైలు జీవితం ఒకేలా ఉందా ? ఈ సారూప్యతలు గమనించారా ?

కవిత వేధింపులకు గురయ్యారన్న సానుభూతి కలిగేలా ప్రచారం 

తన కూతురు ఇమేజ్ పెరిగేలా  ఎయిర్ పోర్టు నుండి భారీగా స్వాగత సత్కారాలను కేసీఆర్ ఏర్పాటు చేశారు.  కవిత  రాజకీయ భవిష్యత్తుకు ఉపయోగపడేలా బెయిల్ నుండి వచ్చిన కవిత కవరేజి మీడియాలో వచ్చేలా పక్కా ప్లానింగ్ తో వ్యవహరించారు.  సాయింత్రం ఇంటి వద్ద కవితను కలవకుండా జాగ్రత్తలు. తాను వస్తే మీడియా అంతా కవితను వదిలి.. తనపో ఫోకస్ చేస్తారని కేసీఆర్ కు తెలుసు. అందుకే రాకుండా  ఉన్నారు.గురువారం ఫాం హౌస్ లో కలవడం మరో రోజు మీడియాలో ప్రముఖ వార్త అవుతుందని  కవిత తప్ప ఎక్కడా ఈ విషయంలో కేటీఆర్, హరీశ్ రావు లు మాట్లాడకుండా జాగ్రత్తలు తీసుకోవడం వ్యూహంలో భాగమే. తాను మాట్లాడకుండా కవిత తోనే మాట్లాడించడం ఇమేజ్ ను క్రియేట్ చేయడంలో భాగమని అంటున్నారు. మొత్తగా కేసీఆర్ కవిత జైలు జీవితం పునాదులుగా మంచి రాజకీయ జీవితాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు వేసినట్లుగా అర్తం చేసుకోవచ్చంటున్నారు.

 

టాప్ హెడ్ లైన్స్

New Political Parties in Telangana: తెలంగాణలో కొత్త పార్టీల ప్రచారం - కల్వకుంట్ల కవిత తెలంగాణ రక్షణ సేన స్పీడ్.. రేవంత్ రెడ్డి, హరీష్ రావులపై పొలిటికల్ రూమర్స్!
తెలంగాణలో కొత్త పార్టీల ప్రచారం - కల్వకుంట్ల కవిత తెలంగాణ రక్షణ సేన స్పీడ్.. రేవంత్ రెడ్డి, హరీష్ రావులపై పొలిటికల్ రూమర్స్!
Almatti Dam Height Dispute 2026: దక్షిణాది జలవివాదాలకు ముగింపు - ముగ్గురు సీఎంలది ఒకే సంకల్పం - ఆల్మట్టి వివాదాలూ తేల్చేసుకుంటారా?
దక్షిణాది జలవివాదాలకు ముగింపు - ముగ్గురు సీఎంలది ఒకే సంకల్పం - ఆల్మట్టి వివాదాలూ తేల్చేసుకుంటారా?
Telangana Cabinet Expansion Postponed 2026: తెలంగాణ కాంగ్రెస్‌లో మీనాక్షి నటరాజన్ సెగ - కేబినెట్ విస్తరణ ఒక మిథ్యేనా? శల్యపరీక్షలో రాహుల్-రేవంత్ వ్యూహం!
తెలంగాణ కాంగ్రెస్‌లో మీనాక్షి నటరాజన్ సెగ - కేబినెట్ విస్తరణ ఒక మిథ్యేనా? శల్యపరీక్షలో రాహుల్-రేవంత్ వ్యూహం!
Modi Cabinet Reshuffle 2026: కేంద్ర కేబినెట్ విస్తరణ - విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అవుట్? జెన్‌జీని మోదీ చల్లబరుస్తారా?
కేంద్ర కేబినెట్ విస్తరణ - విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అవుట్? జెన్‌జీని మోదీ చల్లబరుస్తారా?

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Politics: కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
NRI Priest Arrest: పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
Vizag Land Scam: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
Pawan Kalyan Comments :
"క్రిమినల్స్‌కి వత్తాసు పలికే వైసీపీ కమిట్‌మెంట్‌ చూసి ముచ్చటేస్తుంది- వారు అలానే ఉండి, మరింత కరిగిపోవాలి" పవన్ కామెంట్స్ వైరల్ 
K Bhagyaraj : భాగ్యరాజ్ చివరి వీడియో - రెండు రోజుల క్రితం పెళ్లి వేడుకలో సందడి... ఫ్యాన్స్ ఎమోషనల్
భాగ్యరాజ్ చివరి వీడియో - రెండు రోజుల క్రితం పెళ్లి వేడుకలో సందడి... ఫ్యాన్స్ ఎమోషనల్
పల్సర్ N250 నుంచి KTM 250 డ్యూక్ వరకు - 200cc-250cc రేంజ్‌లో 5 బెస్ట్ బైక్‌లు, ధరలు ఎంతంటే?
ఈ ఏడాది యువతను ఊపేస్తున్న 200cc-250cc బైక్‌లు, వాటి రేట్లు
YSRCP Leaders: అమరావతిలో పర్యటనకు వెళ్లిన వైసీపీ లీడర్లు! కోడిగుడ్లతో దాడి చేసిన రాజధాని రైతులు!
అమరావతిలో పర్యటనకు వెళ్లిన వైసీపీ లీడర్లు! కోడిగుడ్లతో దాడి చేసిన రాజధాని రైతులు!
Crime Thriller OTT : ఏడాది తర్వాత ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఏడాది తర్వాత ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Embed widget