అన్వేషించండి

Ananthapuram News: ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీ నేతల్లో టెన్షన్ - ఆ నియోజకవర్గాల్లో టికెట్ ఎవరికి దక్కేనో?

Ap Politics: ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతల్లో టికెట్ టెన్షన్ నెలకొంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు.. 8 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేయగా.. రెండో జాబితా కోసం అంతా ఎదురు చూస్తున్నారు.

Ticket Tension in Ananthapurma TDP Leaders: ఉమ్మడి అనంతపురం (Ananthapuram) జిల్లా టీడీపీ నేతలకు టికెట్ టెన్షన్ నెలకొంది. ఇప్పటికే ఆ పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) జిల్లా వ్యాప్తంగా 70 శాతం మంది అభ్యర్థులను ఖరారు చేశారు. మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 పార్లమెంట్ స్థానాలుండగా.. తొలి జాబితాలో 8 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేశారు. దీంతో మిగిలిన నియోజకవర్గాల్లో ఎవరిని ప్రకటిస్తారోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. తెలుగుదేశం, జనసేన కూటమిలో అభ్యర్థులు ఎవరన్నది ఇంకా స్పష్టత లేకపోవడంతోనే మిగిలిన నియోజకవర్గాల్లో అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించడం లేదని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. టీడీపీ - జనసేన కూటమి, బీజేపీతో పొత్తు కుదిరితే జిల్లాలో కొన్ని స్థానాల్లో బీజేపీ పోటీ చేసే అవకాశం కూడా ఉంది. దీనికి అనుగుణంగానే జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో ఆయా పార్టీలకు సంబంధించిన నేతలు వారి అధినేతల ముందు వారి బయోడేటా ఉంచి తమకి టికెట్లు కేటాయించాలని పట్టుబడుతున్నారు. ఈ క్రమంలోనే రెండో జాబితాపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

ఆశావహుల ముమ్మర ప్రయత్నాలు

ఇప్పటికే ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా రాప్తాడు, హిందూపురం, పెనుగొండ, తాడిపత్రి, ఉరవకొండ, మడకశిర, రాయదుర్గం, శింగనమల, కళ్యాణదుర్గం నియోజకవర్గం అభ్యర్థులు ఖరారు కాగా.. మిగిలిన నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించలేదు. అనంత అర్బన్ ఇంఛార్జీగా ఉన్న వైకుంఠం ప్రభాకర్ చౌదరి మొదటి లిస్టులో తన పేరు రాకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ స్థానంపై జనసేన నేతలు కూడా తీవ్ర ఆశలు పెట్టుకున్నారు. ఈ మేరకు జనసేనాని పవన్ పై వారు ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. అర్బన్ నియోజకవర్గంలో బలిజ సామాజిక వర్గం ఎక్కువగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. గతంలో చంద్రబాబు కదిరి పర్యటనలో మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ను ఆశీర్వదించాలని ప్రజలని ఉద్దేశించి ప్రసంగించారు. దీంతో దాదాపుగా కదిరి టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ఆయన ఖరారైనట్లు తేలిపోయింది. అనూహ్యంగా మొదటి జాబితాలో కందికుంట వెంకటప్రసాద్ పేరు లేకపోవడంతో అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇప్పటికే అక్కడ వైసీపీ ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ఈనయ్ తుల్లను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడంతో సామాజిక సమీకరణాల నేపథ్యంలో తెలుగుదేశం కూడా ముస్లిం నేతనే బరిలోకి దించాలని ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది.

అటు, గుంతకల్లు నియోజకవర్గం ఇంఛార్జీగా ఉన్న జితేంద్ర గౌడ్ తనకే టికెట్ వస్తుందని ధీమాగా ఉన్న తరుణంలో తొలి జాబితాలో తన పేరు లేకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. అటు, మంత్రి గుమ్మనూరు జయరాం వైసీపీని వీడుతారన్న ప్రచారం ఊపందుకున్న క్రమంలో ఆయన కూడా టీడీపీ తరఫున ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం. ఆయన గత కొంతకాలంగా వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అటు, బీసీ సామాజికవర్గం ఎక్కువగా ఉన్న గుంతకల్లు నియోజకవర్గంలోనూ అభ్యర్థి ఖరారు విషయంలో ఉత్కంఠ నెలకొంది. ప్రశాంతతకు మారుపేరైన పుట్టపర్తి నియోజకవర్గంలోనూ రాజకీయ వేడి పెరిగింది. నియోజకవర్గంలో అన్ని తానై చూసుకునే మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డికి టికెట్ రాదనే ప్రచారం జరుగుతోంది. తొలి జాబితాలో ఆయన పేరు లేదు. అయితే, వడ్డే సామాజిక వర్గానికి చెందిన మరో నేత కూడా టీడీపీ నుంచి పుట్టపర్తి టికెట్ ఆశిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పల్లె రఘునాథ్ రెడ్డికే పుట్టపర్తి టికెట్ ఇస్తారా లేక వారి కుటుంబ సభ్యులకు కేటాయిస్తారా.? అనే దానిపై రెండో జాబితాలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ధర్మవరంలో ఎవరు.?

రాష్ట్రంలోనే చర్చనీయాంశంగా ఉన్న ధర్మవరం నియోజకవర్గంలో ఈసారి ఎవరు పోటీలో ఉంటారా అనేది ఉత్కంఠగా మారింది. 2019 ఎన్నికల అనంతరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి టీడీపీని వీడి బీజేపీ కండువా కప్పుకొన్నారు. ఈ నియోజకవర్గానికి పరిటాల శ్రీరామ్ ను ఇంఛార్జీగా చంద్రబాబు నియమించారు. ప్రస్తుతం ఆ టికెట్ ను మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ సైతం ఆశిస్తున్నారు. దీంతో శ్రీరామ్ కు టికెట్ గండం పొంచి ఉందనే ప్రచారం సాగుతోంది. అయితే, గోనుగుంట్ల ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో ఇంకా స్పష్టత లేదు. జనసేన టీడీపీ కూటమితో బీజేపీ పొత్తు కుదిరితే ధర్మవరం టికెట్ ను బీజేపీ తరఫున గోనుగుంట్లకు కేటాయిస్తారనే ప్రచారం జోరందుకుంది. మరోవైపు, టీడీపీ నుంచి కూడా పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది. ఏది ఏమైనప్పటికీ చంద్రబాబు రెండో జాబితా విడుదల చేసేంతవరకు ఈ నియోజకవర్గాల్లో స్పష్టత వచ్చే అవకాశం కనిపించటం లేదు. నియోజకవర్గాల్లో నేతలు మాత్రం ఎవరికి వారు టికెట్ తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Also Read: YS Sunitha News: జగన్‌ను ఓడిస్తేనే నా తండ్రి హత్యకేసులో న్యాయం- వివేక కుమార్తె సునీత సంచలన వ్యాఖ్యలు

టాప్ హెడ్ లైన్స్

Harish Rao: రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
Telangana Politics Black Magic Allegations:తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget