అన్వేషించండి

Telangana cabinet : కొండా సురేఖ సహా ఆ ముగ్గురు అవుట్‌- విజయశాంతి సహా ముగ్గురు ఇన్‌; జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తర్వాత తెలంగాణ కేబినెట్ విస్తరణ!

Telangana cabinet:కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు కావొస్తోంది. కానీ, అనుకున్న రీతిలో ప్రజల్లో ప్రభుత్వానికి మంచి పేరు రాలేదన్న అసంతృప్తిలో కాంగ్రెస్ హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది.

Telangana cabinet Reshuffle : జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు ముందు మంత్రిగా అజారుద్ధీన్‌ను క్యాబినెట్‌లో తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి, ఈ ఎన్నిక తర్వాత మంత్రివర్గ మార్పులు చేయనున్నట్లు విస్తృతంగా ప్రచారం సాగుతోంది. అయితే, ఈ వార్తా కథనాలను కాంగ్రెస్ పార్టీ ఖండించడం లేదు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ కొంత వెనుకబడిందని హస్తం నేతలు అంతర్గతంగానే చర్చించుకుంటున్నారు. అయితే, ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అనుకున్న విధంగా ఫలితాలు రాకపోతే మాత్రం సీఎం రేవంత్ రెడ్డి కొద్ది మంది మంత్రులకు క్యాబినెట్ నుంచి ఉద్వాసన పలికే అవకాశాలున్నాయన్న చర్చ సాగుతోంది.

క్యాబినెట్ ప్రక్షాళనకు కారణాలు ఇవేనా...?

కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు కావొస్తోంది. కానీ, అనుకున్న రీతిలో ప్రజల్లో ప్రభుత్వానికి మంచి పేరు రాలేదన్న అసంతృప్తిలో కాంగ్రెస్ హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆరు గ్యారంటీలలో మహిళలకు ఉచిత ఫ్రీ బస్, రైతులకు పెంచిన ఆర్థిక సాయం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటివి అందిస్తున్నా ప్రజల్లో అనుకున్నంత పాజిటీవ్ వేవ్ పార్టీకి లేదని కాంగ్రెస్ అధినాయకత్వం భావిస్తున్నట్లు పార్టీ వర్గాలే చెబుతున్నాయి. మరోవైపు ఆరు గ్యారంటీల్లో ఇతర పథకాలు ఇంకా పట్టాలు ఎక్కలేదు. వీటిపై ప్రజల్లో కొంత అసంతృప్తి ఉంది. వీటిని ప్రతిపక్షాలు ప్రతీ వేదికపై చెబుతూ ప్రజల్లోకి వెళుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కొందరు మంత్రుల పనితీరుపైన పార్టీ హైకమాండ్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు మంత్రులు పార్టీ లైన్ దాటి మితిమీరిన స్వాతంత్రంతో చేస్తున్న వ్యాఖ్యలు పార్టీకి తీవ్ర నష్టం చేస్తున్నాయన్న భావనలోనూ హైకమాండ్ ఉంది.

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తర్వాతే ఎందుకు..?

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కూడా కాంగ్రెస్‌కు అనుకున్న ఫలితం వచ్చేలా లేదన్న భావంతో పార్టీ హైకమాండ్ ఉన్నట్లు సమాచారం. పార్టీ అంతర్గత సర్వేలు కూడా ఆశించిన రీతిలో లేవని హస్తం నేతలు చెబుతున్నారు. అటు మైనార్టీ వర్గాలను మచ్చిక చేసుకునేందుకు ఎం.ఐ.ఎం.తో దోస్తీ, అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడం వంటి చర్యలు చేపట్టినా ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీనే ముందంజలో ఉన్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. వారే కాకుండా బయటి సర్వేలు కూడా ఇదే అంశాన్ని ప్రస్పుటం చేస్తున్నాయి. అయినా సీఎం రేవంత్ రెడ్డి తన శక్తివంచన లేకుండా పార్టీని గెలిపించేందుకు ప్రచారంలోకి దిగినప్పటికీ, ఏం జరుగుతుందో అన్న భావనలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. అయితే, జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ ఓటమి పాలైతే, అది పార్టీ పైన తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని కాంగ్రెస్ హైకమాండ్ అంచనా వేస్తోంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపైన ఆ ప్రభావం ఉంటుందని విశ్లేషిస్తోంది. ఇదే జరిగితే పార్టీని రెండో సారి అధికారంలోకి తేవడం అంత సుళువు కాదన్న విషయాన్ని పసిగట్టిన పార్టీ పెద్దలు క్యాబినెట్ ప్రక్షాళన చేయడం మంచిదన్న అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. క్యాబినెట్ మార్పుల ద్వారా ప్రజల అసంతృప్తిని కొంచెం తగ్గించడమో, డైవర్ట్ చేయడమో చేయవచ్చన్న వ్యూహంతో పార్టీ పెద్దలు ఉన్నట్లు కాంగ్రెస్ సీనియర్లు చెబుతున్నారు.

ఎవరిపై వేటు? ఎవరికి అవకాశం?

అయితే ప్రస్తుతం ఎవరికి అవకాశం ఇస్తారు, ఎవరికి క్యాబినెట్ నుంచి ఉద్వాసన చెబుతారన్న దానిపై పూర్తి స్పష్టత లేకున్నా, పార్టీలో మాత్రం కొందరి పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖను తప్పించి, ఆమె స్థానంలో విజయశాంతికి అవకాశం కల్పిస్తారన్న ప్రచారం సాగుతోంది. మంత్రి పొన్నం ప్రభాకర్‌ను పీసీసీ చీఫ్‌గా నియమించి, ప్రస్తుత చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌ను మంత్రివర్గంలోకి తీసుకుంటారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. సీఎంతో నేరుగా తలపడిన మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఉద్వాసన తప్పదన్న చర్చ కాంగ్రెస్ పార్టీలో సాగుతోంది. ఆయన స్థానంలో మరో బలమైన సామాజిక వర్గం నుంచి అవకాశం ఇస్తారని చెబుతున్నారు. మల్ రెడ్డి రంగారెడ్డికి అవకాశం ఉందన్న ప్రచారం ఉంది. ఇక కోమటి రెడ్డి వెంకటరెడ్డిని తొలగించి ఆయన స్థానంలో కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డికి అవకాశం ఇవ్వవచ్చన్న చర్చ నడుస్తోంది. గత కొంత కాలంగా రాజగోపాల్ రెడ్డి పార్టీపై అసంతృప్తి వెళ్లగక్కుతున్న విషయం తెలిసిందే. తనకు మంత్రి పదవి ఇస్తామని పార్టీ పెద్దలు హామీ ఇచ్చారని, మాట నిలబెట్టుకోలేదని విమర్శలు చేస్తున్నారు. ఈ టైంలో కుటుంబానికి ఒకే పదవి' అన్న పార్టీ లైన్ ప్రకారం కోమటి రెడ్డి వెంకటరెడ్డిని తొలగించి ఆయన సోదరుడు రాజ్ గోపాల్ రెడ్డికి అవకాశం దక్కవచ్చని తెలుస్తోంది.

About the author Yedla Sudhakar Rao

జర్నలిజంలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గత పాతికేళ్లుగా పలు ప్రముఖ తెలుగు  ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలలో ఆయన పనిచేశారు.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత జర్నలిజం కోర్సు చేసి, అదే వృత్తిని కెరీర్‌గా ఎంచుకున్నారు. వివిధ తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో సీనియర్ రిపోర్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు, ఆ తర్వాత ఇన్‌పుట్ ఎడిటర్‌గా కూడా సేవలందించారు. తెలంగాణ ప్రభుత్వ ఇరిగేషన్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లకు PUBLIC RELATION OFFICER గా  ఐదేళ్లపాటు పనిచేశారు.

ఆయనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సమకాలీన అంశాలపై మంచి పట్టు ఉంది. పరిశోధనాత్మక కథనాలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్‌బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన ఏబీపీ దేశం డిజిటల్ మీడియాలో కొన్నేళ్లుగా అసిస్టెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu Assembly Elections 2026: అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన DMK.. సీఎం స్టాలిన్ పోటీ చేసేది ఎక్కడంటే..
అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన DMK.. సీఎం స్టాలిన్ పోటీ చేసేది ఎక్కడంటే..
AP Capital Amaravati: ఏపీ రాజధాని అమరావతిపై చట్ట సవరణ! ట్రెండ్‌ సెట్ చేస్తున్న తీర్మానంపై సమగ్ర విశ్లేషణ!
ఏపీ రాజధాని అమరావతిపై చట్ట సవరణ! ట్రెండ్‌ సెట్ చేస్తున్న తీర్మానంపై సమగ్ర విశ్లేషణ!
Bengal Elections 2026: ప్రాంతీయ సెంటిమెంట్‌తో మమత ఎత్తుగడ.. జాతీయవాద మంత్రంతో బీజేపీ ఎదురుదాడి - బెంగాల్‌లో పైచేయి ఎవరిది?
ప్రాంతీయ సెంటిమెంట్‌తో మమత ఎత్తుగడ.. జాతీయవాద మంత్రంతో బీజేపీ ఎదురుదాడి - బెంగాల్‌లో పైచేయి ఎవరిది?
Andhra Pradesh Delimitation Politics: అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనతో వైసీపీ పెనుగండమే - టీడీపీ అడ్వాంటేజ్ తీసుకుంటుందా?
అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనతో వైసీపీ పెనుగండమే - టీడీపీ అడ్వాంటేజ్ తీసుకుంటుందా?

వీడియోలు

IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam
Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 RCB Vs SRH Result Update: ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ- రాణించిన ప‌డిక్క‌ల్, కోహ్లీ, డ‌ఫీ- స‌న్ రైజ‌ర్స్ కు నిరాశ‌
ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ- రాణించిన ప‌డిక్క‌ల్, కోహ్లీ, డ‌ఫీ- స‌న్ రైజ‌ర్స్ కు నిరాశ‌
Khammam Devarapalli Greenfield Highway: ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
CM Revanth Reddy Assembly: అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
Amaravati What Next: అమరావతికి చట్టబద్ధత - అసెంబ్లీ తీర్మానం తర్వాత అసలు ప్రక్రియ ఇదే!
అమరావతికి చట్టబద్ధత - అసెంబ్లీ తీర్మానం తర్వాత అసలు ప్రక్రియ ఇదే!
Railway Advertisements: మద్యం, పొగాకు, అశ్లీల ప్రకటనలు రైల్వేలో ప్రదర్శించడంపై నిషేధం: అశ్విని వైష్ణవ్
మద్యం, పొగాకు, అశ్లీల ప్రకటనలు రైల్వేలో ప్రదర్శించడంపై నిషేధం: అశ్విని వైష్ణవ్
Family Entertainers : వీకెండ్ ఈ మూవీస్ చూసి ఎంజాయ్ చెయ్యండి - తెలుగు టాప్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఇవే
వీకెండ్ ఈ మూవీస్ చూసి ఎంజాయ్ చెయ్యండి - తెలుగు టాప్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఇవే
CM Revanth Reddy: 2034లో హైదరాబాద్‌లో ఒలింపిక్స్ లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు: సీఎం రేవంత్ రెడ్డి
2034లో హైదరాబాద్‌లో ఒలింపిక్స్ లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు: సీఎం రేవంత్ రెడ్డి
Iran War Updates: గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి దాడులు - కువైట్ ఎయిర్ పోర్టుపై దాడి - విస్తరిస్తున్న యుద్ధం!
గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి దాడులు - కువైట్ ఎయిర్ పోర్టుపై దాడి - విస్తరిస్తున్న యుద్ధం!
Embed widget