అన్వేషించండి

28న ఢిల్లీలో ఓట్ల పంచాయితీ- పోటాపోటీగా వైసీపీ, టీడీపీ ఫిర్యాదులు

ఆంధ్రప్రదేశ్ లోని అధికార, విపక్షాలు ఢిల్లీ వేదికగా యుద్దానికి సిద్ధమయ్యాయ్. దొంగ ఓట్ల వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘానికి పోటాపోటీగా ఫిర్యాదు చేసేందుకు....రెడీ అవుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లోని అధికార, విపక్షాలు ఢిల్లీ వేదికగా యుద్దానికి సిద్ధమయ్యాయ్. రాష్ట్రంలో వెలుగుచూస్తున్న దొంగ ఓట్ల వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘానికి పోటాపోటీగా ఫిర్యాదు చేసేందుకు....ఇరు పార్టీల నేతలు రెడీ అవుతున్నారు. ఈ నెల 28న తెలుగుదేశం, వైసీపీ నేతలు ఢిల్లీ ఫ్లైట్ ఎక్కనున్నారు. రెండు పార్టీల నేతలు కేంద్ర ఎన్నికల సంఘం అపాయింట్ మెంట్ కోరారు.

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ...దొంగ ఓట్ల వ్యవహారం దుమారం రేపుతోంది. వాలంటీర్లను అడ్డుపెట్టుకొని...వైసీపీ దొంగ ఓట్లను  చేర్పించిందంటూ తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. టీడీపీ అనుకూలమైన ఓట్లను వేల సంఖ్యలో తొలగించారని...వైసీపీ సానుభూతిపరుల ఓట్లను జాబితాలో చేర్పించిందంటే విమర్శిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో దొంగ ఓట్ల వివరాలు సేకరించిన టీడీపీ...పక్కా ఆధారాలతో ఢిల్లీకి వెళ్తోంది.

పార్టీ అధినేత చంద్రబాబుతో కీలక నేతలు హస్తినకు వెళ్లేందుకు రెడీ అయ్యారు. ఏ నియోజకవర్గంలో ఎన్ని దొంగ ఓట్లు చేర్పించారు ? టీడీపీ సానుభూతిపరుల ఓట్లు ఎక్కడెక్కడ తొలగించారన్న దానిపై స్పష్టమైన ఆధారాలు సేకరించింది. దొంగ ఓట్లను జాబితాలో చేర్చడానికి సహకరించిందెవరు ? ఎవరి ప్రొద్బలంతో ఓట్లను తొలగించారు ? ఓట్లను తొలగించాలంటూ దరఖాస్తు చేసుకున్నది ఎవరు ? ఇలా అనేక వివరాలతో ఢిల్లీకి వెళ్తున్నారు చంద్రబాబు. 

చంద్రబాబుకు పోటీగా వైసీపీ నేతలు...ఢిల్లీకి వెళ్తున్నారు. ఏపీలో 60 లక్షల ఓట్లు ఎవరివో తెలియని పరిస్థితి ఉందన్నారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామక్రిష్ణారెడ్డి.  60 లక్షల ఓట్లపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే చంద్రబాబునాయుడులో వణుకు మొదలైందని, అందుకే ఆయన హడావిడిగా ఢిల్లీ వెళ్తున్నారని ఆరోపించారు. ఉరవకొండలో ఓట్ల రద్దును ఎన్నికల సంఘం తప్పు పట్టలేదని, రద్దు ప్రక్రియను మాత్రమే తప్పుబట్టిందని వివరించారు. ఇదేదో జాతీయ సమస్య అయిపోయినట్టు టీడీపీ ఎందుకంత గగ్గోలు పెడుతోందని ప్రశ్నించారు.  అక్రమాలలో చంద్రబాబు పీహెచ్డీ చేశారని.. మాయ మాటలు చెప్పడం, గోడలు దూకడం ఆయనకి ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచినప్పటి నుంచి అలవాటేనన్నారు. సేవా మిత్ర అనే యాప్ ద్వారా గతంలో చంద్రబాబు 50లక్షలకు పైగా ఓట్లు తొలగించారని ఆరోపించారు సజ్జల.

దొంగ ఓట్ల వ్యవహారంలో అనంతపురం జడ్పీ సీఈవో భాస్కర్ రెడ్డి పాత్ర ఉన్నట్లు ఈసీ తేల్చింది. దీంతో అతన్ని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. 2021లో జడ్పీ సీఈవోగా పని చేసిన శోభా స్వరూపరాణిపై చర్యలు తీసుకుంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget