అన్వేషించండి

Rahul Gandhi: లక్ష ఓట్ల చోరీ నుంచి నిబంధనల మార్పుల వరకు;ECపై రాహుల్ గాంధీ చేసిన ఐదు ప్రధాన ఆరోపణలు ఇవే!

Rahul Gandhi: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఎన్నికల సంఘంపై మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల్లో జరుగుతున్న అక్రమాలను ఈసారి సాక్ష్యాలతో వెలుగులోకి తీసుకొచ్చారు.

Rahul Gandhi: లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గురువారం (ఆగస్టు 7, 2025) నాడు ఒక పత్రికా సమావేశం నిర్వహించి ఎన్నికల సంఘంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఎన్నికల సంఘం భారతీయ జనతా పార్టీ (BJP)తో కలిసి ఎన్నికలలో మోసాలకు పాల్పడుతోందని, ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తోందని ఆయన విమర్శించారు.

రాహుల్ గాంధీ మాట్లాడుతూ, "మన రాజ్యాంగ పునాది ఒక వ్యక్తి, ఒక ఓటు అనే సూత్రంపై ఆధారపడి ఉంది. కాబట్టి ఎన్నికలు జరిగినప్పుడు, సరైన వ్యక్తులు ఓటు వేయడానికి అనుమతి లభిస్తుంది? ఓటర్ల జాబితాలో నకిలీ పేర్లు చేరుస్తున్నారా? ఓటర్ల జాబితా కచ్చితమైనదా? అని అనుమానం కలుగుతోంది." అని అన్నారు.

గత కొంతకాలంగా ప్రజలలో అనుమానాలు పెరుగుతున్నాయని రాహుల్ అన్నారు. ఆయన ఐదు ప్రధాన అంశాలను ప్రస్తావిస్తూ, బీజేపీకి ఎప్పుడూ వ్యతిరేకత ఎదురుకావడం లేదని అన్నారు. బీజేపీ ఊహించని విధంగా భారీ విజయాలు సాధిస్తోంది. ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ పదేపదే తప్పు అని నిరూపితమవుతోంది. మీడియా ద్వారా సృష్టించిన వాతావరణం ,ఎన్నికల షెడ్యూల్‌ను అనుకూలంగా మార్చుకోవడం ఈ ఐదు అంశాల్లో భాగమే అని ఆయన అన్నారు.

ఐదు నెలల్లో ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ మంది కొత్త ఓటర్లు చేరారు

రాహుల్ గాంధీ మాట్లాడుతూ, "మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఈ అనుమానాల వెనుక ఉన్న అసలు వాస్తవాన్ని తాను చూశానని అన్నారు. మహారాష్ట్రలో కేవలం 5 నెలల్లో చేర్చిన కొత్త ఓటర్లు గత ఐదు సంవత్సరాలలో చేర్చిన వారి కంటే ఎక్కువ. చాలా ప్రాంతాల్లో చేర్చిన ఓటర్లు ఆ ప్రాంతాల మొత్తం జనాభా కంటే ఎక్కువ. సాయంత్రం 5 గంటల తర్వాత ఓటింగ్లో అకస్మాత్తుగా పెరుగుదల కనిపించింది, కాని పోలింగ్ కేంద్రాల్లో క్యూలు లేవు." అని అన్నారు.

ఎన్నికల సంఘం మెషిన్ రీడబుల్ ఓటర్ల జాబితా ఇవ్వడానికి నిరాకరించింది - రాహుల్ గాంధీ

ప్రతిపక్ష నాయకుడు ఎన్నికల సంఘం మెషిన్-రీడబుల్ ఓటర్ల జాబితాను ఇవ్వడానికి నిరాకరించిందని ఆరోపించారు. "మాకు సాఫ్ట్ కాపీ ఉంటే, మేము మొత్తం డేటాను 30 సెకన్లలో విశ్లేషించగలిగేవాళ్ళం. కానీ మాకు కట్టలు కట్టలుగా కాగితాలు పంపించారు. వాటిని చదవడానికి, సరిపోల్చడానికి ఆరు నెలలు పట్టింది. ఒక అసెంబ్లీ స్థానానికి 30-40 మంది బృందం పగలు రాత్రి కష్టపడింది." అని ఆయన అన్నారు.

ఎవరూ విచారణ చేయకూడదని, అందుకే అన్ని నిబంధనలు మార్చారు - రాహుల్ గాంధీ

ఎన్నికల సంఘం కావాలనే స్కాన్ చేసి చదవలేని డేటాను ఇస్తోందని రాహుల్ ప్రశ్నించారు. కమిషన్ సిసిటివి ఫుటేజ్‌ను యాక్సెస్ చేయడానికి నిబంధనలను మార్చింది. దీనితోపాటు, ఎన్నికల సంఘం డిజిటల్ డేటాను ఇవ్వడానికి నిరాకరిస్తోంది. ఎవరూ విచారణ చేయకూడదనే ఉద్దేశ్యంతో ఇదంతా చేస్తున్నారు అని ఆయన అన్నారు.

కర్ణాటకలోని మహాదేవపుర అసెంబ్లీ స్థానంలో 1 లక్షకు పైగా ఓట్ల అవకతవకలు - రాహుల్ గాంధీ

లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ కర్ణాటకలోని మహాదేవపుర అసెంబ్లీ స్థానంలో 1,00,250 ఓట్ల అవకతవకలు జరిగాయని అన్నారు. నకిలీ ఓటర్లు, నకిలీ, చెల్లని చిరునామాలు, ఒక చిరునామాలో చాలా మంది ఓటర్లు, నకిలీ ఫోటోలు, ఫారం-6 దుర్వినియోగం వంటి ఐదు రకాల లోపాలను ఆయన ప్రస్తావించారు.

"ప్రజలకు పారదర్శకతపై పూర్తి హక్కు ఉంది. ఎన్నికలకు సంబంధించిన రికార్డులను నాశనం చేయకూడదు. కాంగ్రెస్ బృందం మొత్తం వ్యవస్థను అర్థం చేసుకుంది. ప్రజల ముందు నిజం ఉంచుతుంది." అని రాహుల్ అన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget