అన్వేషించండి

Delhi Liquor ScaM : ఢిల్లీ లిక్కర్ స్కాంలో అప్రూవర్ల టార్గెట్ ఎవరు ? కేజ్రీవాలా ? కవితనా ?

ఢిల్లీ లిక్కర్ స్కాంలో వరుసగా నిందితులు అప్రూవర్లుగా మారుతున్నారు. ఎవరిని టార్గెట్ చేసినట్లు ?


Delhi Liquor ScaM : ఢిల్లీ లిక్కర్ స్కాంలో  నిందితులంతా వరుసగా అప్రూవర్లుగా మారుతున్నారు. తాము ఎలా నేరం చేశామో చెబుతామని క్షమించేయాలని పిటిషన్లు వేస్తున్నారు. ఇలా అప్రూవర్లుగా మారిన వారిలో మొదట దినేష్ అరోరా ఉన్నారు. తర్వాత బుచ్చిబాబు ఉన్నారు. ఇప్పుడు శరత్ చంద్రారెడ్డి కూడా తాను అప్రూవర్ గా మారిపోతానని పిటిషన్ వేశారు. ఈ మధ్యలో అరుణ్ రామచంద్ర పిళ్లై కూడా మొత్తం చెప్పేసి.. తర్వాత తన స్టేట్ మెంట్ వెనక్కి తీసుకుంటానని  పిటిషన్ వేశారు. అప్రూవర్లుగా మారడానికి తెర వెనుక చాలా జరుగుతున్నాయన్న ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. నెలల తరబడి జైల్లో ఉన్న వీరు హఠాత్తుగా ఎందుకు అప్రూవర్లుగా మారుతున్నారన్నది కీలకం. వీరంతా నిజాలు చెప్పి ఆర్థిక లావాదేవీలు,స్కాం గురించి పూర్తిగా బయటపెడితే.. నిండా మునిగేది ఎవరు అన్న చర్చలు కూడా ఈ కారణంగానే  వస్తున్నాయి. 

అప్రూవర్లు ఏం చెబుతారు ?

ఢిల్లీ లిక్కర్ స్కాంలో  మొదట అప్రూవర్ గా మారింది  దినేష్ అరోరా.   దినేష్ అరోరాను అప్రూవర్‌గా మారినట్లుగా ప్రకటించిన బీజేపీ .. ఆయనను సాక్షిగా పరిగణించాలని కోర్టులో పిటిషన్ వేసింది.  ఈ కేసులో మొదట్లో సీబీఐ అరెస్ట్  ముగ్గురిలో దినేష్ అరోరా ఒకరు. మరో నిందితుడు సమీర్ మహేంద్రు.. అరోరా నిర్వహిస్తున్న రాధా ఇండస్ట్రీస్ బ్యాంక్ ఖాతాకు కోటి రూపాయలు బదిలీ చేసినట్లు సీబీఐ విచారణలో తేలింది. దినేష్ అరోరా, ఢిల్లీ డిప్యూటీ సిఎం మనీష్ సిసోడియా సహా నిందితులందరిపై ఐపీసీ సెక్షన్ 120 బి, 477 ఏతో పాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7 కింద కేసు నమోదు చేశారు. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో 2021, 2022లో రూపొందించిన ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా జూలైలో సీబీఐ విచారణకు సిఫార్సు చేశారు. గతేడాది నవంబర్ 17న అమలులోకి వచ్చిన ఈ విధానంలో భాగంగా నగరాన్ని 32 జోన్‌లుగా విభజించి 849 షాపులకు సంబంధించి ప్రైవేట్ బిడ్డర్లకు రిటైల్ లైసెన్సులు ఇచ్చారు. ఈ మొత్తం వ్యవహారాల్లో దినేష్ అరోరా కీలకపాత్ర పోషించారని సీబీఐ చెబుతోంది. ఆయన అప్రూవర్ గా సాక్ష్యాలు ఇస్తే.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిండా మునిగిపోతారని న్యాయనిపుణులు అంచనా వేస్తున్నారు. తర్వాత విజయ్ నాయర్ కూడా అప్రూవర్ గా మారారు. 
 
సౌత్ లాబీ నుంచి వరుసగా అప్రూవర్లు 

ఇక సౌత్ లాబీ నుంచి వరుసగా ఆప్రూవర్లు వస్తున్నారు.  బీఆర్‌‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ ఆడిటర్‌‌ గోరంట్ల బుచ్చిబాబు అప్రూవర్‌‌గా మారాడు. కేసులో  దర్యాప్తు సంస్థల విచారణకు సహకరిస్తానని చెప్పాడు. అంతకు ముందు అరుణ్ రామచంద్ర పిళ్లై కూడా అప్రూవర్ అయ్యారు. లిక్కర్ పాలసీ స్కామ్‌లో సౌత్‌గ్రూప్‌ నుంచి అరుణ్‌రామచంద్రపిళ్లై,బుచ్చిబాబు కీలకంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఎవరూ ఊహించని విధంగా  ఈ కేసులో కీలక నిందితుడుగా ఉన్న శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారారు. ను అప్రూవర్ గా మారినట్లుగా శరత్ చంద్రారెడ్డి రౌస్ అవెన్యూ కోర్టులో మెమో దాఖలు చేశారు. అప్రూవర్ గా మారటానికి తనకు అకాశం కల్పించాలని కోరుతు అభ్యర్థించారు. దానికి ఢిల్లీ రోస్ అవెన్యూ కోర్టు అంగీకరించింది.  దీంతో కీలక నిందితులు కూడా అప్రూవర్ గా మారడంతో అసలు టార్గెట్ ఇక ఎవరు అన్నచర్చ వినిపిస్తోంది. 

సౌత్ లాబీ నుంచి కవితను టార్గెట్ చేశారా ? 

ఇప్పటికే సీబీఐ,ఈడీ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్లలో పలుమార్లు కవిత పేరును ప్రస్తావించారు.అరుణ్‌ రామచంద్రపిళ్లై ఇచ్చిన స్టేట్‌మెంట్స్‌,ఆధారాలను కోర్టుకు సమర్పించారు.  గా కవిత మాజీ ఆడిటర్, సౌత్‌గ్రూప్ ఆడిటర్‌‌గా పనిచేసిన గోరంట్ల బుచ్చిబాబు అప్రూవర్‌‌గా మారడంతో... బుచ్చిబాబు వెల్లడించే వివరాల ఆధారంగా  కీలక వివరాలు బయట పెడుతున్నారు.  ప్రధానంగా హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించిన షెల్ కంపెనీలు,బినామీల అకౌంట్స్‌ నుంచి జరిగిన హవాలా లెక్కలను ఈడీ ఒక్కోటిగా బయటపెండుతోంది. కవిత కొన్న భూముల వివరాలంటూ కోర్టుకు సమర్పిస్తున్న చార్జిషీట్లలో డాక్యుమెంట్లు సమర్పిస్తున్నారు. 
 ఏపీలో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవ ఇప్పటికే అరెస్ట్ అయి జైల్లో ఉన్నారు. ఈకేసులో ఆప్ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తీహార్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్నారు. కవితను పక్కాగా ఫ్రేమింగ్ చేయడానికి ఇలా నిందితుల్ని అప్రూవర్లుగా మారుస్తున్నాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 

 
ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితులు అప్రూవర్లుగా మారితే స్కాం జరగలేదని వాదించడానికి అవకాశం ఉండదు. ఇలాంటి పరిస్థితి ఈ కేసులో కీలక నిందితులుగా భావిస్తున్న వారికి చిక్కులు తెచ్చి పెట్టడం కూడా ఖాయంగా కనిపిస్తోంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

PM Modi 7 Appeals: అప్రమత్తతే రక్ష - ప్రధాని మోదీ ఏడు సూత్రాలు రాజకీయం కాదు, ఆర్థిక యుద్ధ తంత్రం!
అప్రమత్తతే రక్ష - ప్రధాని మోదీ ఏడు సూత్రాలు రాజకీయం కాదు, ఆర్థిక యుద్ధ తంత్రం!
Bandi Sanjay Son POCSO Case: కుమారుడి పోక్సో కేసు - బండి సంజయ్ రాజకీయ ఎదుగుదలకు ఇది శాపమా?
కుమారుడి పోక్సో కేసు - బండి సంజయ్ రాజకీయ ఎదుగుదలకు ఇది శాపమా?
Jagan towards Congress: మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
Modi Mind Game on Revanth Reddy: మోదీ మైండ్ గేమ్ .. రేవంత్ రెడ్డి చుట్టూ రాజకీయ చక్రవ్యూహం! కాంగ్రెస్ హైకమాండ్ అప్రమత్తం కావాల్సిందేనా?
మోదీ మైండ్ గేమ్ .. రేవంత్ రెడ్డి చుట్టూ రాజకీయ చక్రవ్యూహం! కాంగ్రెస్ హైకమాండ్ అప్రమత్తం కావాల్సిందేనా?

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Chiranjeevi: బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Embed widget