అన్వేషించండి

Andhra Assembly Ethics Committee: అసెంబ్లీకి రాకుండా జీతాలు, టీఏలు, డీఏలు డ్రా - ఆరుగురు వైసీపీ ఎమ్మెల్యేలపై కఠినచర్యలు?

Andhra Pradesh Assembly: వైసీపీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు చిక్కుల్లో పడ్డారు. వారు అసెంబ్లీకి రాకుండా జీతభత్యాలు డ్రా చేస్తూండటంపై ఎథిక్స్ కమిటీ సమావేశం అయింది.

Strict action against six YSRCP MLAs: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో నైతిక విలువల కమిటీ  సమావేశం అయింది.  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) కి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు సభా కార్యక్రమాలకు హాజరుకాకుండానే, అన్ని రకాల ప్రభుత్వ ప్రయోజనాలను పొందుతున్నారనే  ఫిర్యాదులపై ఈ కమిటీ చర్చించింది.               

సభకు హాజరు కాకుండా జీతభత్యాలు తీసుకుంటున్న వైసీపీ ఎమ్మెల్యేలు       

ఆంధ్రప్రదేశ్ శాసనసభ నిబంధనలను ధిక్కరిస్తూ, సభా కార్యక్రమాలకు గైర్హాజరవుతున్న ఆరుగురు వైసీపీ ఎమ్మెల్యేల తీరుపై ఎథిక్స్ కమిటీ సీరియస్ అయింది. శాసనసభ సమావేశాలకు రాకుండా పార్టీ నిర్ణయం పేరుతో బయటే ఉంటున్న ఈ ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఖజానా నుండి అందే  జీతాలు, టీఏ  , డీఏ  లను మాత్రం క్రమంతప్పకుండా తీసుకుంటున్నట్లు కమిటీ ప్రాథమికంగా గుర్తించింది. ప్రజాప్రతినిధులుగా ప్రజల గొంతుకను సభలో వినిపించాల్సిన బాధ్యతను విస్మరించి, కేవలం ఆర్థిక ప్రయోజనాల కోసం పదవులను వాడుకోవడం నైతికంగా నేరమని కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు.       

కఠినంగా వ్యవహరించాలని భావిస్తున్న స్పీకర్            

 స్పీకర్  కూడా ఈ విషయంలో అత్యంత కఠినంగా ఉండాలని భావిస్తున్నారు.  సభకు రావడం అనేది ఎమ్మెల్యేల హక్కు మాత్రమే కాదు, అది వారి ప్రాథమిక బాధ్యత. ప్రజల సొమ్మును జీతాలుగా తీసుకుంటూ సభను బహిష్కరించడం శాసనసభను అవమానించడమే  అని స్పీకర్ కార్యాలయ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. నిబంధనల ప్రకారం, స్పీకర్ అనుమతి లేకుండా వరుసగా  60 రోజుల పాటు  సభకు హాజరుకాకపోతే సదరు సభ్యత్వంపై అనర్హత వేటు వేసే అధికారం సభకు ఉంటుంది. అయితే, ఇప్పుడు జీతాల రికవరీ ,  ఇతర కఠిన చర్యల దిశగా అడుగులు పడుతున్నాయి.

ఎథిక్స్ కమిటీ ఎలాంటి సిఫారసులు చేయవచ్చు? 

శాసనసభ నిబంధనల ప్రకారం ఎథిక్స్ కమిటీ స్పీకర్‌కు సిఫారసులు చేసే అవకాశం ఉంది. సభకు హాజరుకాని రోజులకు సంబంధించిన జీతాన్ని, అలవెన్సులను నిలిపివేయడం లేదా రికవరీ చేయడం, నిబంధనల ఉల్లంఘన తీవ్రతను బట్టి నిర్దిష్ట కాలం పాటు సభ నుండి సస్పెండ్ చేయడం, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ, నిరంతరం గైర్హాజరవుతున్న వారి సభ్యత్వాన్ని రద్దు చేయాలని సభకు నివేదించడం చేయవచ్చు.             

ఆరుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసే అవకాశం ?                            

ప్రస్తుతం ఈ వ్యవహారంలో ఆ ఆరుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసి, వివరణ కోరాలని కమిటీ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.  వారిచ్చే వివరణ సంతృప్తికరంగా లేకపోతే, రాబోయే అసెంబ్లీ సమావేశాల్లోనే వీరిపై కఠిన చర్యలు తీసుకునేలా స్పీకర్‌కు తుది నివేదిక సమర్పించనుంది. విపక్ష హోదా లేదన్న సాకుతో సభకు రాకుండా తప్పించుకుంటున్న ఎమ్మెల్యేలకు ఈ పరిణామం ఒక పెద్ద హెచ్చరికగా మారనుంది.    

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND vs NZ 3rd ODI: మూడో వన్డేలో న్యూజిలాండ్ రికార్డ్ స్కోర్.. టీమిండియా బ్యాటర్లు ఛేజ్ చేస్తారా?
మూడో వన్డేలో న్యూజిలాండ్ రికార్డ్ స్కోర్.. టీమిండియా బ్యాటర్లు ఛేజ్ చేస్తారా?
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Advertisement

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs NZ 3rd ODI: మూడో వన్డేలో న్యూజిలాండ్ రికార్డ్ స్కోర్.. టీమిండియా బ్యాటర్లు ఛేజ్ చేస్తారా?
మూడో వన్డేలో న్యూజిలాండ్ రికార్డ్ స్కోర్.. టీమిండియా బ్యాటర్లు ఛేజ్ చేస్తారా?
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Hyundai Venue లేదా Kia Syros.. టాప్ వేరియంట్లో ఏ SUV బెస్ట్, కొనే ముందు ఇది తెలుసుకోండి
Hyundai Venue లేదా Kia Syros.. టాప్ వేరియంట్లో ఏ SUV బెస్ట్, కొనే ముందు ఇది తెలుసుకోండి
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
Embed widget