అన్వేషించండి

CM Revanth Reverse policy on Lands sale: భూముల అమ్మకంపై రివర్స్ పాలసీ - నాడు వ్యతిరేకించి నేడు అమలు - సీఎం రేవంత్‌కు మరో మార్గం లేదా ?

Telangana Lands: ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో భూముల వేలాన్ని రేవంత్ వ్యతిరేకించారు. కానీ ఇప్పుడు ఎక్కువగా వేలం వేస్తున్నారు. ప్రభుత్వానికి కావాల్సిన నిధులు భూముల వేలం ద్వారానే వస్తాయనుకుంటున్నారు.

Revanth and Land Auctions: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కోకాపేట నియోపొలిస్ స్థలాలను బీఆర్ఎస్ ప్రభుత్వం వేలం వేసినప్పుడు వ్యతిరేకించారు. బావి అవసరాలకు స్థలాలు ఉంచకుండా ఇష్టం వచ్చినట్లుగా వేలం వేయడం ఏమిటని ఆదోళనలు చేశారు. హైకోర్టుకు కూడా వెళ్లారు. తాము వచ్చాక ల్యాండ్ ఆక్షన్స్ రద్దు చేస్తామని కూడా హెచ్చరించారు. కానీ  సీఎంగా రేవంత్ బాధ్యతలు చేపట్టిన భూముల వేలం మరింత ఊపందుకుంది. ప్రభుత్వానికి అసరమైన నిధులు భూముల ద్వారానే వస్తాయని అనుకుంటున్నారు. 

భూముల వేలం, హై రైజ్ భవనాలకు అనుమతులపై గతంలో రేవంత్ వ్యతిరేకత

తెలంగాణలో అత్యంత ఖరీదైన  భూముల్ని వేలం వేయకూడదన్నది రేవంత్రెడ్డి పాలసీ.కానీ అది ప్రతిపక్ష నేతగా ఉన్నపుడే. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుకూలంగా బీఆర్ఎస్ ప్రభుత్వం భూములు అమ్ముతోందని..ఆ భూముల్లో హైరైజ్ భవనాలకు అనుమతులు ఇచ్చి  అధికార దుర్వినియోగం, పర్యావరణ నిబంధనలు ఉల్లంఘన చేస్తోందని తీవ్రంగా విమర్శించేవారు. ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్.. అంటే..  అపార్టుమెంట్లు ఎంన్ని అంతస్తులు ఉండాలన్నదానిపై నియంత్రణ లేకపోవడంపైనా రేవంత్ విమర్శలు గుపపించేవారు.  హైరైజ్ అపార్ట్‌మెంట్లు "పర్యావరణ వ్యవస్థ , మౌలిక సదుపాయాలపై ప్రతికూల ప్రభావం చూపుతాయి." అనే అభిప్రాయంతో ఉండేవారు.  "3,000 చదరపు గజాల టవర్‌లో 500 కార్లు, 1,000 బైక్‌లు ఉంటాయి. ఇవన్నీ రోడ్లపైకి వస్తే ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌కు ఏమవుతుంది?" అని ఓ టీవీ చానల్ తో చెప్పిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. 

సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విరుద్ధంగా నిర్ణయాలు

సాధారణంగా ముఖ్యమంత్రి కాక ముందు రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనలపై అవగాహన ఉన్న వారు..   భూముల అమ్మకాన్ని పరిమితం చేస్తారని..  ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ పరిమితులు పెట్టి హైరైజ్‌లపై పరిమితులు విధిస్తారని అనుకున్నారు. కొన్నాళ్లు  హై రైజ్‌లకు  అనుమతులు ఇవ్వకపోవడంతో అదే జరుగుతుందని అనుకున్నారు.కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. భూముల వేలం చురుగ్గా సాగుతోంది. అత్యధిక ఫ్లోర్లు ఉన్న అపార్టుమెంట్లకు అనుమతులు ఇస్తున్నారు. రాయదుర్గంలో భూమల వేలంలో ఎకరానికి రూ. 177కోట్ల చొప్పున వచ్చాయి.గతంలో నియోపొలిస్‌లో రూ. వంద కోట్లకు అమ్ముడు అయితే రేవంత్ విమర్శలు చేశారు. కానీ ఇలా అమ్ముడు కావడం రికార్డు అని కాంగ్రెస్ ప్రభుత్వ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. 

రాయదుర్గంలో మరో పాతిక ఎకరాల వేలానికి సిద్ధం ! 

రాయదుర్గంలో లభించిన  ఆదాయంతో తెలంగాణ ప్రభుత్వం మరింత ఉత్సాహంగా ఇతర భూమలను వేలం వేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అత్యంత ఖరీదైన భూములుగా మారిన కోకాపేట నియోపొలిస్ ప్రాంతంలో ఉన్న 25 ఎకరాలను వేలం వేసేందుకు  సన్నాహాలు చేస్తోంది.  ఈ వేలం ద్వారా ప్రభుత్వ ఖజనాకు సుమారు రూ.3,000 కోట్ల ఆదాయం సమకూర్చాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రాంతంలో గత ప్రభుత్వం రెండు దశల్లో ఇక్కడి భూములను వేలం వేసింది. అప్పట్లో  రూ.5,300 కోట్లు వచ్చాయి.  ఈ వేలం ఫేజ్-3గా జరగనుంది. నవంబర్ మొదటి వారంలో లేదా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల తర్వాత HMDA నోటిఫికేషన్ జారీ చేయనుంది. అనుకున్న ప్రకారం జరిగితే, నవంబర్ చివరి వారంలో ఈ-వేలం ప్రక్రియ పూర్తవుతుంది. కంచ గచ్చిబౌలి ల్యాండ్స్ వేలం విషయంలో రేగిన దుమార సంగతి అందరికీ తెలుసు. 

హై రైజ్ భవనాలకు అనుమతులతో భారీ ఆదాయం అని ప్రచారం  
 
మరో వైపు చాలా కొద్ది ప్రదేశంలో  అత్యంత ఎత్తున నిర్మించే ఆకాశహర్య్మాలకు గత ప్రభుత్వంలో కంటే ఎక్కువగా అనుమతులు ఇస్తున్నారు.  నేషనల్ బిల్డింగ్ కోడ్  ప్రకారం, ఎకరానికి 30 నుంచి 100 నివాస యూనిట్లు మాత్రమే అనుమతించవచ్చు. మహానగరాల్లో 200 వరకు అనుమతిస్తారు.  కానీ హైదరాబాద్‌లో ఏడున్నర ఎకరాల్లో 3,500 యూనిట్లు నిర్మిస్తున్నారు.  హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నియోపోలిస్ ప్రాంతాల్లో ఒక  కిలోమీటరులో 60కి పైగా టవర్లు నిర్మిస్తున్నారు.ఇందులో వేల కొద్దీ ప్లాట్లు ఉంటున్నాయి.  ఈ కారణంగా ట్రాఫిక్ ఉదయం, సాయంత్రం 2-3 కిలోమీటర్ల దూరానికి అరగంట నుంచి గంట సమయం పడుతోంది. తాగునీరు, డ్రైనేజీ, ఇతర మౌలిక సదుపాయాలపై విపరీత ఒత్తిడి పెరిగిందన్న  నివేదికలు ఉన్నాయి. అయితే అత్యధిక ఆదాయం వస్తోందని ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటోంది. 

భూముల వేలం వేస్తే తప్ప ప్రభుత్వం నడవదా?

ఇటీవలి కాలంలో హెచ్‌ఎండీతో పాటు, తెలంగాణ హౌసింగ్ బోర్డు ఎక్కడ ఖాళీ స్థలాలు ఉంటే అక్కడ వేలం వేసేందుకు  వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొన్ని చోట్ల అత్యశకుపోయి అత్యధిక ధర నిర్ణయించడంతో  ఒక్క ప్లాట్ కూడా అమ్ముడుకాని సందర్భాలు ఉన్నాయి. అయినా ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ప్రభుత్వ పథకాలు అమలు చేయాలంటే.. భూముల అమ్మకం తప్పదని.. హై రైజ్ భవనాలను ప్రోత్సహించక తప్పదని అనుకుంటున్నారు. కానీ ముఖ్యమంత్రి అధికారంలోకి రాక ముందు చెప్పిన మాటలకు..ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయాలకు పొంతన లేకపోవడం ప్రజల్ని ఆశ్చర్య పరుస్తోంది.                   

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bengal Assembly Elections 2026: బెంగాల్‌లో త్రిముఖ పోరు దిశగా రాజకీయం - లెఫ్ట్, కాంగ్రెస్ దూకుడు - టీఎంసీకి ముచ్చెమటలు?
బెంగాల్‌లో త్రిముఖ పోరు దిశగా రాజకీయం - లెఫ్ట్, కాంగ్రెస్ దూకుడు - టీఎంసీకి ముచ్చెమటలు?
TDP MLAs: భారీ మెజార్టీనే టీడీపీకి సమస్య- దారి తప్పిన ఎమ్మెల్యేలు - చంద్రబాబు చర్యలు తీసుకోలేకపోతున్నారా?
భారీ మెజార్టీనే టీడీపీకి సమస్య- దారి తప్పిన ఎమ్మెల్యేలు - చంద్రబాబు చర్యలు తీసుకోలేకపోతున్నారా?
Telangana Politics: చట్టం కళ్లకు గంతలు కట్టారు కానీ ప్రజల్ని ఏమార్చగలరా? - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నైతికత ఉంటుందా?
చట్టం కళ్లకు గంతలు కట్టారు కానీ ప్రజల్ని ఏమార్చగలరా? - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నైతికత ఉంటుందా?
MLAs Disqualification Petitions: దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు భారీ ఊరట.. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ - బీఆర్ఎస్ ఆగ్రహం
దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు భారీ ఊరట.. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ - బీఆర్ఎస్ ఆగ్రహం

వీడియోలు

IPL 2026 First Phase Schedule | ఐపీఎల్ 2026 సమరానికి షెడ్యూల్ ఖరారు | ABP Desam
Irfan Pathan Predicts Future Captain of Team India | శ్రేయాస్ పై ఇర్ఫాన్ పఠాన్ కామెంట్స్ | ABP Desam
ICC T20 Rankings after T20WC | ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా హవా | ABP Desam
Shivam Dube's Secret Train Journey | ట్రైన్ లో ప్రయాణించిన వరల్డ్ కప్ హీరో | ABP Desam
Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CEC Gyanesh Kumar : సీఈసీపై అభిశంసన - దేశ చరిత్రలో మొదటి సారి - 193 మంది ఎంపీల సంతకాలు!?
సీఈసీపై అభిశంసన - దేశ చరిత్రలో మొదటి సారి - 193 మంది ఎంపీల సంతకాలు!?
Ustaad Bhagat Singh : సెకండాఫ్ ఇంటెన్స్ సీన్ పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది - ఫ్యాన్స్ గెట్ రెడీ అంటున్న హరీష్ శంకర్
సెకండాఫ్ ఇంటెన్స్ సీన్ పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది - ఫ్యాన్స్ గెట్ రెడీ అంటున్న హరీష్ శంకర్
LPG Delivery Delay : గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత సిలిండర్ డెలివరీ కాకపోతే.. ఇలా ఫిర్యాదు చేయండి
గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత సిలిండర్ డెలివరీ కాకపోతే.. ఇలా ఫిర్యాదు చేయండి
Harish Shankar: హీరోయిన్ రాశీ ఖన్నాతో స్టెప్పులు వేసిన దర్శకుడు హరీష్ శంకర్ - ఫోటోలు చూశారా?
హీరోయిన్ రాశీ ఖన్నాతో స్టెప్పులు వేసిన దర్శకుడు హరీష్ శంకర్ - ఫోటోలు చూశారా?
Crime Thriller Telugu OTT: భర్త తల నరికి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన భార్య... తెలుగులో ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ చూశారా?
భర్త తల నరికి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన భార్య... తెలుగులో ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ చూశారా?
Affordable Mileage Bikes: హార్డ్‌ రూరల్‌ రోడ్లకు ఏ బైక్ మంచిది? బైక్ కొనే ముందు ఈ టూవిలర్స్ గురించి తెలుసుకోవడం చాలా మంచిది! 
హార్డ్‌ రూరల్‌ రోడ్లకు ఏ బైక్ మంచిది? బైక్ కొనే ముందు ఈ టూవిలర్స్ గురించి తెలుసుకోవడం చాలా మంచిది! 
Shivam Dube's Secret Train Journey | ట్రైన్ లో ప్రయాణించిన వరల్డ్ కప్ హీరో | ABP Desam
Shivam Dube's Secret Train Journey | ట్రైన్ లో ప్రయాణించిన వరల్డ్ కప్ హీరో | ABP Desam
Viral Girl Love Jihad Controversy: వైరల్ గర్ల్ మోనాలిసా లవ్ జీహాద్ బారిన పడ్డారా? - ఆమె సమాధానం ఇదే !
వైరల్ గర్ల్ మోనాలిసా లవ్ జీహాద్ బారిన పడ్డారా? - ఆమె సమాధానం ఇదే !
Embed widget