అన్వేషించండి

BRS With Auto Drivers: బాకీ కార్డు ఉద్యమాన్ని ముమ్మరం చేసిన బీఆర్ఎస్.. ఆటోడ్రైవర్లకు రూ.24 వేలు చెల్లించాలని డిమాండ్

ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ బాకీ కార్డు ఉద్యమాన్ని ముమ్మరం చేశారు. చేతికాని హామీలు ఎందుకిచ్చారని.. రెండేళ్లలో 161 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని హరీష్ రావు ఆరోపించారు.

Hyderabad Latest News | హైదరాబాద్: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, చేతగాని హామీలు ఎవరు ఇవ్వమన్నారు? అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. బన్సీలాల్ పేటలోని జబ్బార్ కాంప్లెక్స్ నుండి స్వయంగా ఆటో డ్రైవింగ్ చేసి, అక్కడి ఆటో డ్రైవర్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

కాంగ్రెస్ మోసపూరిత హామీలు
ఎన్నికల ముందు మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ. 12 వేలు ఇస్తామని హామీ ఇచ్చిందని, అయితే ఇప్పుడు రెండేళ్లు పూర్తయినా ఆ మొత్తాన్ని చెల్లించలేదని గుర్తు చేశారు. వెంటనే ఆటో డ్రైవర్లకు చెల్లించాల్సిన రూ. 24 వేలు విడుదల చేయాలని తలసాని డిమాండ్ చేశారు.

లక్ష ఆటోలతో ఆందోళన చేస్తామని వార్నింగ్ 
ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం బీఆర్‌ఎస్‌ పార్టీ పోరాడుతుందని తలసాని అన్నారు. ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం లక్ష ఆటోలతో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఆటో డ్రైవర్లు తలచుకుంటే ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తారు, జాగ్రత్త అని ప్రభుత్వ పెద్దలను హెచ్చరించారు. ఆటో డ్రైవర్ల కుటుంబాల ఉసురు కాంగ్రెస్ ప్రభుత్వానికి తగులుతుందని తలసాని వ్యాఖ్యానించారు. 


BRS With Auto Drivers: బాకీ కార్డు ఉద్యమాన్ని ముమ్మరం చేసిన బీఆర్ఎస్.. ఆటోడ్రైవర్లకు రూ.24 వేలు చెల్లించాలని డిమాండ్

161 మంది ఆటోడ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు- హరీష్ రావు
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆటో డ్రైవర్ల పరిస్థితి పూర్తిగా అధ్వానంగా తయారైందని, 161 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. రాహుల్ గాంధీ ఆటో కార్మికులను మోసం చేసి ఓట్లు దండుకున్నాడని, ఏడాదికి రూ. 12,000 ఆటో కార్మికులకు ఇస్తామని మోసం చేశారని విమర్శించారు. ఎర్రగడ్డలో ఆటో కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు హరీష్ రావు. అనంతరం ఎర్రగడ్డ నుంచి తెలంగాణ భవన్ కు ఆటోలో బయలుదేరారు. 

రేవంత్ రెడ్డి రెండేళ్లలో ఆటో కార్మికులకు ఏ ఒక్క హామీ అమలు చెయ్యకపోగా, తమ అనాలోచిత నిర్ణయాలు, మోసపూరిత హామీలతో ఆటో కార్మికులను రోడ్డు పైన పడేశారు. ఆటో కార్మికులకు బాకీ పడ్డ 24 వేల రూపాయలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. మంత్రి అడ్లూరీ లక్ష్మణ్ వ్యాఖ్యలపై స్పందించిన హరీష్ రావు.. మంత్రి వర్గంలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసునన్నారు. 
అడ్లూరీ లక్ష్మణ్ వ్యాఖ్యలపై కొప్పుల ఈశ్వర్ స్పందించారు. కొప్పుల ఈశ్వర్ సవాల్ ను స్వీకరించి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం దగ్గరకు మంత్రి లక్ష్మణ్ రావాలన్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Donald Trump Tariffs on India: నాపై ప్రధాని మోదీ అసంతృప్తి, అధిక టారిఫ్‌లే అందుకు కారణం- డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
నాపై ప్రధాని మోదీ అసంతృప్తి, అధిక టారిఫ్‌లే అందుకు కారణం- డొనాల్డ్ ట్రంప్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Advertisement

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Donald Trump Tariffs on India: నాపై ప్రధాని మోదీ అసంతృప్తి, అధిక టారిఫ్‌లే అందుకు కారణం- డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
నాపై ప్రధాని మోదీ అసంతృప్తి, అధిక టారిఫ్‌లే అందుకు కారణం- డొనాల్డ్ ట్రంప్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Embed widget