అన్వేషించండి

YSRCP: విశాఖ జిల్లా వైసీపీ అభ్యర్థులకు రీసర్వే టెన్షన్ పట్టుకుందా ? తేడా వస్తే మార్పులే ? 

ఉత్తరాంధ్ర వైసీపీ నేతలకు రీ-సర్వే టెన్షన్ పట్టుకుందా ? అభ్యర్థిత్వం ఖరారైన నేతలు...ఆయా నియోజకవర్గాల్లో ప్రచారం షురూ చేశారు. భారీగా ఖర్చు చేస్తున్న నేతలకు... వైసీపీ షాకిచ్చింది.

Visakha YSRCP Leaders : ఉత్తరాంధ్ర వైసీపీ (Ysrcp) నేతలకు రీ-సర్వే ( Reservey) టెన్షన్ పట్టుకుందా ? అభ్యర్థిత్వం ఖరారైన నేతలు...ఆయా నియోజకవర్గాల్లో ప్రచారం షురూ చేశారు. భారీగా ఖర్చు చేస్తున్న నేతలకు...వైసీపీ షాకిచ్చింది. ఆయా నియోజకవర్గాల్లో మళ్లీ రీ సర్వే చేయిస్తున్నట్లు బాంబు పేల్చింది.  విశాఖ( Visakha ) జిల్లాలోని నేతల పరిస్థితి కక్కలేక... మింగలేక అన్నట్లు తయారైంది. వచ్చే ఎన్నికల్లో (Assembly Elections ) గెలుపే లక్ష్యంగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ((Jagan ) అభ్యర్థుల ఎంపిక చేస్తున్నారు. స్థానిక సమీకరణాలు, కుల సమీకరణాలు ఆధారంగా విస్తృతమైన వడపోత పోసింది. ఆ తర్వాత సమన్వయకర్తలు మార్పులు చేసింది. విశాఖ జిల్లాలో అనూహ్యమైన నిర్ణయాలను అమలు చేసింది. సర్వేలు ఆధారంగా కొత్త నాయకత్వం ఎంపిక చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో పుంజు  కోలేదనే అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో రీ సర్వేలు జరుగుతుండటంతో చివర వరకు రేసులో మిగిలేది ఎవరన్న దానిపై చర్చ జరుగుతోంది. 

వెలగపూడి రామకృష్ణ బాబును ఓడించడమే లక్ష్యం! 
విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబును ఓడించాలన్న లక్ష్యంతో ఉంది. 2019లో యాదవ సామాజిక వర్గానికి చెందిన విజయ నిర్మలను బరిలోకి దించింది. జనసేన ప్రభావంతో వైసీపీ ఓట్లు చీలిపోవడంతో వెలగపూడి 25వేల ఓట్లతో గెలుపొందారు. వైసీపీ, జనసేన అభ్యర్థులు యాదవ సామాజిక వర్గానికే చెందిన వారు కావడంతో విజయ నిర్మల ఓటమి పాలయిందని వైసీపీ లెక్కలు వేసుకుంది. ఆమెకు సీటు గ్యారెంటీ అన్న సమయంలో సిట్టింగ్ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఎంట్రీ ఇచ్చారు.

కమ్మ సామాజిక వర్గానికి చెందిన వెలగపూడిని ఎదుర్కోవాలంటే... అదే కులం అభ్యర్థి అయితే కరెక్ట్ అనే అంచనాలు ఉన్నాయి. దీంతో ఎంవీవీ సత్యనారాయణను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని వైసీపీ అదేశించింది. గెలిచి తీరాలనే లక్ష్యంతో...పండుగలు, వేడుకల్లో కులాలు, మతాల వారీగా ప్రజలు, కేడర్ అవసరాలకు భారీగా డబ్బు కుమ్మరిస్తున్నారు. ఇంత చేసినా తూర్పులో ఎంవీవీకి ఆశించిన స్థాయిలో మైలేజ్ రావడం లేదనే చర్చ జరుగుతోంది. 

అరకు రీ సర్వే 
అరకులోయలో ఎంపీ మాధవి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది వైసీపీ అధిష్ఠానం. స్థానిక వ్యతిరేకత కారణంగా పునరాలోచనలో పడింది. ఎంపీ మాధవి స్థానంలో నూతన సమన్వయకర్తగా రేగం మత్స్యలింగంకు బాధ్యతలు అప్పగించింది. ఈ మార్పులు తర్వాత మరికొన్ని నియోజకవర్గాలలో రీ సర్వే చేయిస్తోంది. కేప్రజాదరణతో పాటు నాయకత్వం అంగ, అర్ధబలం  ఆధారంగా మరోసారి మార్పులు సాధ్యం అనే దిశగా చర్చ జరుగుతోంది. అటు భీమిలిలో విజయ నిర్మల కుటుంబంపై అధినాయకత్వానికి పాజిటివిటీ ఉండటంతో....యాదవులకు అవకాశం ఇవ్వాలనే పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే ఈక్వేషన్ ను అధిష్ఠానం వర్కవుట్ చేస్తే ఎంటన్న చర్చ జోరుగా జరుగుతోంది.

మేయర్ గొలగాని హరి వెంకట కుమారి... అసెంబ్లీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో రీ-సర్వే ప్రభావం ఇక్కడ మార్పులను ప్రభావితం చేస్తుందా...? లేక ఎంవీవీ సత్యనారాయణ సమర్థత వైపే మొగ్గు చూపుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. గాజువాక లో సిట్టింగ్ ఎమ్మెల్యే నాగిరెడ్డిని ఫస్ట్ లిస్టులోనే వైసీపీ మార్చేసింది. కార్పొరేటర్ ఉరుకూటి చందును నియమించి షాక్ ఇచ్చింది. ఈ మార్పులు ముందుగా ఎమ్మెల్యేకు చెప్పే చేశామని పార్టీ పెద్దలు చెప్పినప్పటికీ కేడర్ అంగీకరించడం లేదు. గాజువాక,తూర్పు సీట్లలో రీ సర్వేలు ఎవరిని ప్రభావితం చేస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

PM Modi 7 Appeals: అప్రమత్తతే రక్ష - ప్రధాని మోదీ ఏడు సూత్రాలు రాజకీయం కాదు, ఆర్థిక యుద్ధ తంత్రం!
అప్రమత్తతే రక్ష - ప్రధాని మోదీ ఏడు సూత్రాలు రాజకీయం కాదు, ఆర్థిక యుద్ధ తంత్రం!
Bandi Sanjay Son POCSO Case: కుమారుడి పోక్సో కేసు - బండి సంజయ్ రాజకీయ ఎదుగుదలకు ఇది శాపమా?
కుమారుడి పోక్సో కేసు - బండి సంజయ్ రాజకీయ ఎదుగుదలకు ఇది శాపమా?
Jagan towards Congress: మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
Modi Mind Game on Revanth Reddy: మోదీ మైండ్ గేమ్ .. రేవంత్ రెడ్డి చుట్టూ రాజకీయ చక్రవ్యూహం! కాంగ్రెస్ హైకమాండ్ అప్రమత్తం కావాల్సిందేనా?
మోదీ మైండ్ గేమ్ .. రేవంత్ రెడ్డి చుట్టూ రాజకీయ చక్రవ్యూహం! కాంగ్రెస్ హైకమాండ్ అప్రమత్తం కావాల్సిందేనా?

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్ఫీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్ఫీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Jagan towards Congress: మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
CM Revanth Reddy: తెలంగాణలో ఇంటర్ బోర్డ్ రద్దు ? విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులపై ప్రభుత్వం ఫోకస్
తెలంగాణలో ఇంటర్ బోర్డ్ రద్దు ? విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులపై ప్రభుత్వం ఫోకస్
AP Rains: ఏపీ ప్రజలకు చల్లని వార్త.. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు- ఎండల నుంచి బిగ్ రిలీఫ్
ఏపీ ప్రజలకు చల్లని వార్త.. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు- ఎండల నుంచి బిగ్ రిలీఫ్
Gadwal Vijayalakshmi: తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా గద్వాల్ విజయలక్ష్మి.. ఆమె బ్యాగ్రౌండ్ తెలుసా !
తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా గద్వాల్ విజయలక్ష్మి.. ఆమె బ్యాగ్రౌండ్ తెలుసా !
IPL 2026 DC VS PBKS Result Updates: DC అద్భుత విజ‌యం.. ఫిఫ్టీల‌తో రాణించిన అక్ష‌ర్, మిల్ల‌ర్, ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు స‌జీవం.. పంజాబ్ కు నాలుగో ప‌రాజ‌యం
DC అద్భుత విజ‌యం.. ఫిఫ్టీల‌తో రాణించిన అక్ష‌ర్, మిల్ల‌ర్, ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు స‌జీవం.. పంజాబ్ కు వరుసగా నాలుగో ప‌రాజ‌యం
Viral News: యానాంలో యువకుడి హైడ్రామా.. లవర్ మెసేజ్‌లు చదివారంటూ సెల్ టవర్ ఎక్కి నిరసన
యానాంలో యువకుడి హైడ్రామా.. లవర్ మెసేజ్‌లు చదివారంటూ సెల్ టవర్ ఎక్కి నిరసన
Piles Cases : ఐటీ ఉద్యోగుల్లో పెరుగుతోన్న పైల్స్ సమస్యలు.. కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
ఐటీ ఉద్యోగుల్లో పెరుగుతోన్న పైల్స్ సమస్యలు.. కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
Embed widget