అన్వేషించండి

ఎన్నికలు 2024 ఎగ్జిట్ పోల్

(Source:  ABP CVoter)
×
Top
Bottom

YSRCP: విశాఖ జిల్లా వైసీపీ అభ్యర్థులకు రీసర్వే టెన్షన్ పట్టుకుందా ? తేడా వస్తే మార్పులే ? 

ఉత్తరాంధ్ర వైసీపీ నేతలకు రీ-సర్వే టెన్షన్ పట్టుకుందా ? అభ్యర్థిత్వం ఖరారైన నేతలు...ఆయా నియోజకవర్గాల్లో ప్రచారం షురూ చేశారు. భారీగా ఖర్చు చేస్తున్న నేతలకు... వైసీపీ షాకిచ్చింది.

Visakha YSRCP Leaders : ఉత్తరాంధ్ర వైసీపీ (Ysrcp) నేతలకు రీ-సర్వే ( Reservey) టెన్షన్ పట్టుకుందా ? అభ్యర్థిత్వం ఖరారైన నేతలు...ఆయా నియోజకవర్గాల్లో ప్రచారం షురూ చేశారు. భారీగా ఖర్చు చేస్తున్న నేతలకు...వైసీపీ షాకిచ్చింది. ఆయా నియోజకవర్గాల్లో మళ్లీ రీ సర్వే చేయిస్తున్నట్లు బాంబు పేల్చింది.  విశాఖ( Visakha ) జిల్లాలోని నేతల పరిస్థితి కక్కలేక... మింగలేక అన్నట్లు తయారైంది. వచ్చే ఎన్నికల్లో (Assembly Elections ) గెలుపే లక్ష్యంగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ((Jagan ) అభ్యర్థుల ఎంపిక చేస్తున్నారు. స్థానిక సమీకరణాలు, కుల సమీకరణాలు ఆధారంగా విస్తృతమైన వడపోత పోసింది. ఆ తర్వాత సమన్వయకర్తలు మార్పులు చేసింది. విశాఖ జిల్లాలో అనూహ్యమైన నిర్ణయాలను అమలు చేసింది. సర్వేలు ఆధారంగా కొత్త నాయకత్వం ఎంపిక చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో పుంజు  కోలేదనే అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో రీ సర్వేలు జరుగుతుండటంతో చివర వరకు రేసులో మిగిలేది ఎవరన్న దానిపై చర్చ జరుగుతోంది. 

వెలగపూడి రామకృష్ణ బాబును ఓడించడమే లక్ష్యం! 
విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబును ఓడించాలన్న లక్ష్యంతో ఉంది. 2019లో యాదవ సామాజిక వర్గానికి చెందిన విజయ నిర్మలను బరిలోకి దించింది. జనసేన ప్రభావంతో వైసీపీ ఓట్లు చీలిపోవడంతో వెలగపూడి 25వేల ఓట్లతో గెలుపొందారు. వైసీపీ, జనసేన అభ్యర్థులు యాదవ సామాజిక వర్గానికే చెందిన వారు కావడంతో విజయ నిర్మల ఓటమి పాలయిందని వైసీపీ లెక్కలు వేసుకుంది. ఆమెకు సీటు గ్యారెంటీ అన్న సమయంలో సిట్టింగ్ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఎంట్రీ ఇచ్చారు.

కమ్మ సామాజిక వర్గానికి చెందిన వెలగపూడిని ఎదుర్కోవాలంటే... అదే కులం అభ్యర్థి అయితే కరెక్ట్ అనే అంచనాలు ఉన్నాయి. దీంతో ఎంవీవీ సత్యనారాయణను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని వైసీపీ అదేశించింది. గెలిచి తీరాలనే లక్ష్యంతో...పండుగలు, వేడుకల్లో కులాలు, మతాల వారీగా ప్రజలు, కేడర్ అవసరాలకు భారీగా డబ్బు కుమ్మరిస్తున్నారు. ఇంత చేసినా తూర్పులో ఎంవీవీకి ఆశించిన స్థాయిలో మైలేజ్ రావడం లేదనే చర్చ జరుగుతోంది. 

అరకు రీ సర్వే 
అరకులోయలో ఎంపీ మాధవి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది వైసీపీ అధిష్ఠానం. స్థానిక వ్యతిరేకత కారణంగా పునరాలోచనలో పడింది. ఎంపీ మాధవి స్థానంలో నూతన సమన్వయకర్తగా రేగం మత్స్యలింగంకు బాధ్యతలు అప్పగించింది. ఈ మార్పులు తర్వాత మరికొన్ని నియోజకవర్గాలలో రీ సర్వే చేయిస్తోంది. కేప్రజాదరణతో పాటు నాయకత్వం అంగ, అర్ధబలం  ఆధారంగా మరోసారి మార్పులు సాధ్యం అనే దిశగా చర్చ జరుగుతోంది. అటు భీమిలిలో విజయ నిర్మల కుటుంబంపై అధినాయకత్వానికి పాజిటివిటీ ఉండటంతో....యాదవులకు అవకాశం ఇవ్వాలనే పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే ఈక్వేషన్ ను అధిష్ఠానం వర్కవుట్ చేస్తే ఎంటన్న చర్చ జోరుగా జరుగుతోంది.

మేయర్ గొలగాని హరి వెంకట కుమారి... అసెంబ్లీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో రీ-సర్వే ప్రభావం ఇక్కడ మార్పులను ప్రభావితం చేస్తుందా...? లేక ఎంవీవీ సత్యనారాయణ సమర్థత వైపే మొగ్గు చూపుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. గాజువాక లో సిట్టింగ్ ఎమ్మెల్యే నాగిరెడ్డిని ఫస్ట్ లిస్టులోనే వైసీపీ మార్చేసింది. కార్పొరేటర్ ఉరుకూటి చందును నియమించి షాక్ ఇచ్చింది. ఈ మార్పులు ముందుగా ఎమ్మెల్యేకు చెప్పే చేశామని పార్టీ పెద్దలు చెప్పినప్పటికీ కేడర్ అంగీకరించడం లేదు. గాజువాక,తూర్పు సీట్లలో రీ సర్వేలు ఎవరిని ప్రభావితం చేస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Formation Day 2024 Live: ట్యాంక్ బండ్‌పై తెలంగాణ దశాబ్ది వేడుకలు - సీఎం రేవంత్, గవర్నర్ హాజరు
ట్యాంక్ బండ్‌పై తెలంగాణ దశాబ్ది వేడుకలు - సీఎం రేవంత్, గవర్నర్ హాజరు
Southwest Monsoon: నైరుతి రుతుపవనాలు వచ్చేశాయ్ - ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు
Southwest Monsoon: నైరుతి రుతుపవనాలు వచ్చేశాయ్ - ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు
Janhvi Kapoor: అమ్మ ఎప్పుడూ నేను నటిని కావాలని కోరుకోలేదు - నన్ను ఆ ప్రోఫెషన్‌లో చూడాలనుకుంది, జాన్వీ కపూర్‌ కామెంట్స్‌ 
అమ్మ ఎప్పుడూ నేను నటిని కావాలని కోరుకోలేదు - నన్ను ఆ ప్రోఫెషన్‌లో చూడాలనుకుంది, జాన్వీ కపూర్‌ కామెంట్స్‌ 
Rafah News: పాపం పసివాళ్లు, గాజాలో చిన్నారుల ఆకలి చావులు - రోజుల తరబడి తిండిలేక చిక్కిశల్యం
పాపం పసివాళ్లు, గాజాలో చిన్నారుల ఆకలి చావులు - రోజుల తరబడి తిండిలేక చిక్కిశల్యం
Advertisement
Advertisement
Advertisement
metaverse

వీడియోలు

Sajjala Ramakrishna Reddy on Exit Polls | ఏపీ ఎగ్జిట్ పోల్స్ పై మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డిKallakurichi Temple Demolition Viral Video | తమిళనాడులో వివాదాస్పదంగా మారిన గుడి కూల్చివేత దృశ్యాలుBuddha Venkanna Challenge Aara Mastan | ఆరా మస్తాన్ ది ఫేక్ సర్వే అన్న టీడీపీ నేత బుద్ధా వెంకన్నSurya Kumar Yadav Weight loss | కప్పు కోసం కొవ్వు కరిగించుకున్న సూర్యకుమార్ యాదవ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Formation Day 2024 Live: ట్యాంక్ బండ్‌పై తెలంగాణ దశాబ్ది వేడుకలు - సీఎం రేవంత్, గవర్నర్ హాజరు
ట్యాంక్ బండ్‌పై తెలంగాణ దశాబ్ది వేడుకలు - సీఎం రేవంత్, గవర్నర్ హాజరు
Southwest Monsoon: నైరుతి రుతుపవనాలు వచ్చేశాయ్ - ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు
Southwest Monsoon: నైరుతి రుతుపవనాలు వచ్చేశాయ్ - ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు
Janhvi Kapoor: అమ్మ ఎప్పుడూ నేను నటిని కావాలని కోరుకోలేదు - నన్ను ఆ ప్రోఫెషన్‌లో చూడాలనుకుంది, జాన్వీ కపూర్‌ కామెంట్స్‌ 
అమ్మ ఎప్పుడూ నేను నటిని కావాలని కోరుకోలేదు - నన్ను ఆ ప్రోఫెషన్‌లో చూడాలనుకుంది, జాన్వీ కపూర్‌ కామెంట్స్‌ 
Rafah News: పాపం పసివాళ్లు, గాజాలో చిన్నారుల ఆకలి చావులు - రోజుల తరబడి తిండిలేక చిక్కిశల్యం
పాపం పసివాళ్లు, గాజాలో చిన్నారుల ఆకలి చావులు - రోజుల తరబడి తిండిలేక చిక్కిశల్యం
Pushpa 2 Vs Raghu Thatha: 'పుష్ప 2'కు పోటీగా కేజీఎఫ్ ప్రొడక్షన్ హౌస్ నుంచి 'రఘు తాత'
'పుష్ప 2'కు పోటీగా కేజీఎఫ్ ప్రొడక్షన్ హౌస్ నుంచి 'రఘు తాత'
Paris Olympics: అమిత్‌ పంగాల్‌కు ఒలింపిక్‌ బెర్తు, క్వాలిఫికేషన్ టోర్నమెంట్‌లో సత్తా చాటిన బాక్సర్
అమిత్‌ పంగాల్‌కు ఒలింపిక్‌ బెర్తు, క్వాలిఫికేషన్ టోర్నమెంట్‌లో సత్తా చాటిన బాక్సర్
Bomb Threat: విస్తారా విమానానికి బాంబు బెదిరింపు, ముంబై ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ప్రకటన
Bomb Threat: విస్తారా విమానానికి బాంబు బెదిరింపు, ముంబై ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ప్రకటన
Hyderabad Rains Alert: హైదరాబాద్ వాసులకు చల్లని కబురు - నేడు భారీ వర్ష సూచనతో పలు జిల్లాలకు IMD ఎల్లో అలర్ట్
హైదరాబాద్ వాసులకు చల్లని కబురు - నేడు భారీ వర్ష సూచనతో పలు జిల్లాలకు IMD ఎల్లో అలర్ట్
Embed widget