అన్వేషించండి

Padayatra season in Telugu politics: 2027లో ఏపీ, తెలంగాణల్లో ఎటు వైపు చూసినా పాదయాత్రలే - అందరూ చేస్తే ప్రజలు పట్టించుకుంటారా?

padayatra: తెలుగు రాజకీయాల్లో పాదయాత్రల సీజన్ 2027 నుంచి ప్రారంభం కానుంది. రెండు రాష్ట్రాల్లో కలిపి కనీసం ఐదుగురు కీలక నేతలు ఏడాదిన్నర పాటు పాదయాత్రలు చేయనున్నారు.

padayatra season in Telugu politics will start from 2027: తెలుగు రాష్ట్రాల రాజకీయం ఇప్పుడు సరికొత్త మలుపు తిరుగుతోంది. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో అగ్రనేతలంతా జనం బాట పట్టేందుకు సిద్ధమయ్యారు. వచ్చే ఏడాది నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పాదయాత్రల జాతర మొదలుకాబోతోంది. ఒకప్పుడు అధికార మార్పిడికి అస్త్రంగా మారిన పాదయాత్రలు, ఇప్పుడు ఉనికిని చాటుకోవడానికి ,  వారసత్వ పోరులో పైచేయి సాధించడానికి ప్రధాన వేదికలుగా మారుతున్నాయి.

జగన్ మాత్రమే కాదు.. షర్మిల కూడా ! 

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ కుటుంబం మధ్య నెలకొన్న రాజకీయ విభేదాలు ఇప్పుడు వీధులపైకి చేరబోతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సుమారు 18 నెలల పాటు సుదీర్ఘ పాదయాత్రకు ప్రణాళికలు సిద్ధం చేస్తుండగా, ఆయన సోదరి షర్మిల  కూడా పాదయాత్ర చేయాలనుకుంటున్నారు. రాజన్న వారసత్వంపై తమకే హక్కు ఉందని ఇద్దరు నేతలు ప్రజల్లోకి వెళ్తుండటం ఏపీ రాజకీయాల్లో మునుపెన్నడూ చూడని వింత పరిస్థితిని కల్పిస్తోంది. కేవలం అధికార పక్షాన్ని విమర్శించడమే కాకుండా, సొంత కుటుంబ సభ్యుల మధ్యే ఈ యాత్రల పోటీ సాగనుంది.

తెలంగాణలో కేటీఆర్‌తో పాటు కవిత కూడా !

తెలంగాణలోనూ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీకి పాత వైభవం తెచ్చేందుకు సిద్ధమవుతుంటే, ఆయన సోదరి కవిత స్వతంత్ర రాజకీయ ప్రయాణం మొదలుపెడుతున్నారు. కొత్త పార్టీ పెట్టగానే  పాదయాత్ర చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఒకే ఇంటి నుంచి అన్నచెల్లెళ్లు వేర్వేరు జెండాలతో ప్రజల ముందుకు రావడం అటు కార్యకర్తలను, ఇటు ప్రజలను అయోమయంలోకి నెట్టే అవకాశం ఉంది. ఈ పరిణామాలు గులాబీ దళంలో గందరగోళానికి దారితీస్తున్నాయి.

బండి సంజయ్ కూడా హైకమాండ్ అనుమతి కోసం ప్రయత్నాలు

మరోవైపు బీజేపీ అగ్రనేత బండి సంజయ్ తన ప్రజా సంగ్రామ యాత్ర తదుపరి దశను ప్రారంభించేందుకు సమాయత్తమవుతున్నారు. గతంలో ఆయన చేసిన యాత్రలు  మంచి క్రేజ్ తెచ్చి పెట్టాయి.  ఈ సారి కూడా తమదైన శైలిలో యాత్రలు చేపట్టి తమ బలాన్ని నిరూపించుకోవాలని చూస్తున్నారు. ఇలా అన్ని పార్టీల నేతలు రోడ్లపైకి రావడంతో తెలుగు రాష్ట్రాల వీధులన్నీ వచ్చే ఏడాది నుంచి జెండాలు, నినాదాలతో హోరెత్తిపోనున్నాయి.  

పాదయాత్ర అంటే చాలా కాస్ట్ లీ 

ఈ పాదయాత్రలు కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా భారీ ఆర్థిక కదలికకు కారణమవుతున్నాయి. నేతల రాక కోసం ఏర్పాటు చేసే సభలు, ఫ్లెక్సీలు, ప్రచార వాహనాలు ,  సోషల్ మీడియా మేనేజ్‌మెంట్ కోసం కోట్లాది రూపాయల ఖర్చు అవుతుంది.  దీనివల్ల వేల మందికి తాత్కాలికంగా ఉపాధి  లభిస్తుంది. మీడియా సంస్థలు, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీలు ఈ యాత్రల కవరేజీ కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించుతానాయి. ఒక రకంగా చెప్పాలంటే, రాజకీయం ఇప్పుడు ఒక పెద్ద ఈవెంట్‌లా మారిపోయింది.  ఈ పాదయాత్రలు ఎవరిని గెలిపిస్తాయి అనేది పక్కన పెడితే, ప్రజల మధ్య నేతలు నిరంతరం ఉండటం ప్రజాస్వామ్యానికి మంచి పరిణామమే. అయితే ఈ నడకలు ప్రజల కష్టాలను తీర్చడానికా లేక కేవలం రాజకీయ ఆధిపత్యం కోసమా అనేది కాలమే తేల్చాలి.  2026 నుండి తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం గరం గరంగా ఉండబోతుందనే విషయంలో ఎటువంటి సందేహం లేదు. నేతల నడక ప్రజల తీర్పును ఎలా మారుస్తుందో వేచి చూడాలి. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Malla Reddy Skips KTR Meeting:కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
HYDRAA Inaction On Owaisi Encroachments: ఓవైసీ కాలేజీలకు ప్రభుత్వం క్లీన్ చిట్ - చెరువులోనే లేదని క్లారిటీ - మజ్లిస్ కోసం రూల్స్ మార్చేశారా?
ఓవైసీ కాలేజీలకు ప్రభుత్వం క్లీన్ చిట్ - చెరువులోనే లేదని క్లారిటీ - మజ్లిస్ కోసం రూల్స్ మార్చేశారా?
Allu Arjun Political Party Rumors: ఐకాన్ స్టార్ టు పొలిటికల్ స్టార్? అల్లు అర్జున్ నయా పార్టీ ప్రచారం వెనుక అసలు నిజమెంత?
ఐకాన్ స్టార్ టు పొలిటికల్ స్టార్? అల్లు అర్జున్ నయా పార్టీ ప్రచారం వెనుక అసలు నిజమెంత?
Telangana Political Mind Games: విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?
విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
IND vs ENG T20I: బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
Embed widget