అన్వేషించండి

Telangana phone tapping case: విచారణ కన్నా లీకులపైనే ఆందోళన- తర్వాత కేసీఆర్‌కే నోటీసులు - బీఆర్ఎస్ వాట్ నెక్ట్స్ ?

Tapping case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో తర్వాత కేసీఆర్‌కే నోటీసులు జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే బీఆర్ఎస్ వ్యూహం ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.

Notices will be issued to KCR later in tapping case:  తెలంగాణ రాజకీయాల్లో కుదిపేస్తోన్న ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు అత్యంత కీలక దశకు చేరుకుంది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్  నేతృత్వంలో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం  విచారణను వేగవంతం చేయడంతో, ఈ వ్యవహారం మాజీ మంత్రుల నుంచి పార్టీ అధినేత వరకు పాకే అవకాశం కనిపిస్తోంది. కేసీఆర్‌కూ నోటీసులు వస్తాయని బీఆర్ఎస్ నేతలు కూడా గట్టిగా నమ్ముతున్నారు. 
 
సీరియస్ గా సజ్జనార్ సిట్ దర్యాప్తు 

ప్రారంభంలో సాధారణ పోలీసు విచారణగా మొదలైన ఈ కేసు, ఉన్నత స్థాయి వ్యక్తుల ప్రమేయం ఉందన్న అనుమానాలతో సజ్జనార్ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందానికి  బదిలీ అయింది. సున్నితమైన కేసులను ఛేదించడంలో, క్లిష్టమైన విచారణలను జరపడంలో సజ్జనార్‌కు ఉన్న ట్రాక్ రికార్డును పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా విచారణ సాగాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఉన్నత స్థాయి నాయకులను ప్రశ్నించే సమయంలో ఎదురయ్యే న్యాయపరమైన, పరిపాలనాపరమైన సవాళ్లను ఎదుర్కోవడానికి సిట్ పటిష్టమైన వ్యూహంతో ముందుకు వెళ్తోంది.

హరీష్, కేటీఆర్ విచారణ - తదుపరి లక్ష్యం కేసీఆర్? 

ఇప్పటికే మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్‌లను సిట్ అధికారులు గంటల తరబడి ప్రశ్నించడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ విచారణలు కేవలం ప్రారంభం మాత్రమేనని, త్వరలోనే బీఆర్ఎస్ అధినేత  కేసీఆర్‌ కు కూడా నోటీసులు వెళ్తాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. కేటీఆర్ సైతం తన విచారణ అనంతరం మాట్లాడుతూ, ఈ నోటీసుల పరంపర చివరకు కేసీఆర్ వద్దకే చేరుతుందనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ విభాగాన్ని రాజకీయ అవసరాల కోసం వాడుకున్నారనే ప్రధాన ఆరోపణను నిరూపించే దిశగా సిట్ అడుగులు వేస్తోంది.

లీకులు , వ్యక్తిత్వ హననంపై ఆందోళన 

కేసులు, విచారణల కంటే, దర్యాప్తు సంస్థల నుంచి అందుతున్న  లీకుల పట్ల బీఆర్ఎస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. విచారణ గదిలో ఏం జరుగుతుందో తెలియకముందే, కొన్ని మీడియా సంస్థల్లో తమకు వ్యతిరేకంగా కథనాలు రావడం వెనుక ప్రభుత్వ ప్రమేయం ఉందని వారు ఆరోపిస్తున్నారు. హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ వంటి సున్నితమైన అంశాలను లీకుల ద్వారా ప్రచారం చేయడం కేవలం తమ  వ్యక్తిత్వ హననానికి ఉద్దేశించినదేనని కేటీఆర్ మండిపడ్డారు. ప్రతి ప్రభుత్వంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుందని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం దానిని అక్రమ ట్యాపింగ్‌గా చిత్రించి విచారణ పేరుతో కాలయాపన చేస్తోందని బీఆర్ఎస్ నేతల వాదన. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ అనే అంశాన్ని ఒక పొలిటికల్ నేరేటివ్‌గా మార్చి, తమ పార్టీని మానసికంగా దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని వారు విశ్లేషిస్తున్నారు 
  
కేసీఆర్‌కు నోటీసులు ఇస్తే ఉద్యమం 
 
తమకు నోటీసులు ఇస్తే సహకరించాం కానీ కేసీఆర్ ను విచారణ పేరుతో వేధిస్తే ఊరుకునేది లేదని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. రాజకీయంగా ఈ అంశాన్ని పెద్ద ఇష్యూగా మార్చాలని ప్లాన్ చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అంటే కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చిన తర్వాత తెలంగాణ రాజకీయాలు మరింత ఉత్కంఠగా మారనున్నాయి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Election Commission: నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Assam Assembly Elections 2026: అస్సాం గణ పరిషత్ .. ఒకప్పుడు ఊపేసిన పార్టీ -ఇప్పుడెందుకు ఉనికి కోల్పోయింది?
అస్సాం గణ పరిషత్ .. ఒకప్పుడు ఊపేసిన పార్టీ -ఇప్పుడెందుకు ఉనికి కోల్పోయింది?
Advertisement

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Embed widget