అన్వేషించండి

Telangana phone tapping case: విచారణ కన్నా లీకులపైనే ఆందోళన- తర్వాత కేసీఆర్‌కే నోటీసులు - బీఆర్ఎస్ వాట్ నెక్ట్స్ ?

Tapping case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో తర్వాత కేసీఆర్‌కే నోటీసులు జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే బీఆర్ఎస్ వ్యూహం ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.

Notices will be issued to KCR later in tapping case:  తెలంగాణ రాజకీయాల్లో కుదిపేస్తోన్న ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు అత్యంత కీలక దశకు చేరుకుంది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్  నేతృత్వంలో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం  విచారణను వేగవంతం చేయడంతో, ఈ వ్యవహారం మాజీ మంత్రుల నుంచి పార్టీ అధినేత వరకు పాకే అవకాశం కనిపిస్తోంది. కేసీఆర్‌కూ నోటీసులు వస్తాయని బీఆర్ఎస్ నేతలు కూడా గట్టిగా నమ్ముతున్నారు. 
 
సీరియస్ గా సజ్జనార్ సిట్ దర్యాప్తు 

ప్రారంభంలో సాధారణ పోలీసు విచారణగా మొదలైన ఈ కేసు, ఉన్నత స్థాయి వ్యక్తుల ప్రమేయం ఉందన్న అనుమానాలతో సజ్జనార్ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందానికి  బదిలీ అయింది. సున్నితమైన కేసులను ఛేదించడంలో, క్లిష్టమైన విచారణలను జరపడంలో సజ్జనార్‌కు ఉన్న ట్రాక్ రికార్డును పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా విచారణ సాగాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఉన్నత స్థాయి నాయకులను ప్రశ్నించే సమయంలో ఎదురయ్యే న్యాయపరమైన, పరిపాలనాపరమైన సవాళ్లను ఎదుర్కోవడానికి సిట్ పటిష్టమైన వ్యూహంతో ముందుకు వెళ్తోంది.

హరీష్, కేటీఆర్ విచారణ - తదుపరి లక్ష్యం కేసీఆర్? 

ఇప్పటికే మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్‌లను సిట్ అధికారులు గంటల తరబడి ప్రశ్నించడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ విచారణలు కేవలం ప్రారంభం మాత్రమేనని, త్వరలోనే బీఆర్ఎస్ అధినేత  కేసీఆర్‌ కు కూడా నోటీసులు వెళ్తాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. కేటీఆర్ సైతం తన విచారణ అనంతరం మాట్లాడుతూ, ఈ నోటీసుల పరంపర చివరకు కేసీఆర్ వద్దకే చేరుతుందనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ విభాగాన్ని రాజకీయ అవసరాల కోసం వాడుకున్నారనే ప్రధాన ఆరోపణను నిరూపించే దిశగా సిట్ అడుగులు వేస్తోంది.

లీకులు , వ్యక్తిత్వ హననంపై ఆందోళన 

కేసులు, విచారణల కంటే, దర్యాప్తు సంస్థల నుంచి అందుతున్న  లీకుల పట్ల బీఆర్ఎస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. విచారణ గదిలో ఏం జరుగుతుందో తెలియకముందే, కొన్ని మీడియా సంస్థల్లో తమకు వ్యతిరేకంగా కథనాలు రావడం వెనుక ప్రభుత్వ ప్రమేయం ఉందని వారు ఆరోపిస్తున్నారు. హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ వంటి సున్నితమైన అంశాలను లీకుల ద్వారా ప్రచారం చేయడం కేవలం తమ  వ్యక్తిత్వ హననానికి ఉద్దేశించినదేనని కేటీఆర్ మండిపడ్డారు. ప్రతి ప్రభుత్వంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుందని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం దానిని అక్రమ ట్యాపింగ్‌గా చిత్రించి విచారణ పేరుతో కాలయాపన చేస్తోందని బీఆర్ఎస్ నేతల వాదన. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ అనే అంశాన్ని ఒక పొలిటికల్ నేరేటివ్‌గా మార్చి, తమ పార్టీని మానసికంగా దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని వారు విశ్లేషిస్తున్నారు 
  
కేసీఆర్‌కు నోటీసులు ఇస్తే ఉద్యమం 
 
తమకు నోటీసులు ఇస్తే సహకరించాం కానీ కేసీఆర్ ను విచారణ పేరుతో వేధిస్తే ఊరుకునేది లేదని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. రాజకీయంగా ఈ అంశాన్ని పెద్ద ఇష్యూగా మార్చాలని ప్లాన్ చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అంటే కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చిన తర్వాత తెలంగాణ రాజకీయాలు మరింత ఉత్కంఠగా మారనున్నాయి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kerala BJP: కేరళలో బీజేపీ ఆశలు - కింగ్ మేకర్ అయ్యేనా?
కేరళలో బీజేపీ ఆశలు - కింగ్ మేకర్ అయ్యేనా?
Revanth Reddy Soft Hindutva: కాంగ్రెస్ మార్క్ రాజకీయాలకు భిన్నంగా రేవంత్ - సాఫ్ట్ హిందూత్వతో కొత్త ఓటు బ్యాంక్ సృష్టించుకుంటున్నారా?
కాంగ్రెస్ మార్క్ రాజకీయాలకు భిన్నంగా రేవంత్ - సాఫ్ట్ హిందూత్వతో కొత్త ఓటు బ్యాంక్ సృష్టించుకుంటున్నారా?
JanaSena MLA Problems: దారి తప్పుతున్న ఎమ్మెల్యేలతో జనసేనానికి చిక్కులు - కఠిన చర్యలకు సిద్ధం కావాల్సిందేనా?
దారి తప్పుతున్న ఎమ్మెల్యేలతో జనసేనానికి చిక్కులు - కఠిన చర్యలకు సిద్ధం కావాల్సిందేనా?
Opinion Poll 2026: పశ్చిమ బెంగాల్‌లో పాగా వేసేది ఎవరు? తమిళనాడులో విజయ్‌ ఎఫెక్ట్‌ ఎంత? సంచలనంగా మారుతున్న లేటెస్ట్ సర్వే!
పశ్చిమ బెంగాల్‌లో పాగా వేసేది ఎవరు? తమిళనాడులో విజయ్‌ ఎఫెక్ట్‌ ఎంత? సంచలనంగా మారుతున్న లేటెస్ట్ సర్వే!
Advertisement

వీడియోలు

CSK Bowling Failure vs RCB IPL 2026 | చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించిన ఆర్సీబీ
IPL 2026 RCB VS CSK Highlights | ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ
LSG Owner Sanjiv Goenka Tears Up IPL 2026 | కన్నీటి పర్యంతమైన ఓనర్ సంజీవ్ గోయెంకా
IPL 2026 SRH VS LSG Highlights | ఐపీఎల్ లో బోణీ కొట్టిన ల‌క్నో
RCB 250 vs CSK Chinnaswamy IPL 2026 | చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ పరుగుల వరద
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Weather Update: ఏపీ వెదర్ అలర్ట్.. మరో 2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు! కొన్నిచోట్ల వడగాల్పులు
ఏపీ వెదర్ అలర్ట్.. మరో 2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు! కొన్నిచోట్ల వడగాల్పులు
Amaravati: ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధాని అమరావతి! 2024 నుంచి అమలు చేస్తూ కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధాని అమరావతి! 2024 నుంచి అమలు చేస్తూ కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు నిర్మిస్తాం - ఆదిలాబాద్ పర్యటనలో రేవంత్ సంచలన ప్రకటన
తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు నిర్మిస్తాం - ఆదిలాబాద్ పర్యటనలో రేవంత్ సంచలన ప్రకటన
True Love: మచిలీపట్నంలో ఆదర్శ వివాహం.. ప్రేమికుడ్ని పెళ్లాడి నిజమైన ప్రేమకు అర్థం చెప్పిన యువతి
మచిలీపట్నంలో ఆదర్శ వివాహం.. ప్రేమికుడ్ని పెళ్లాడి నిజమైన ప్రేమకు అర్థం చెప్పిన యువతి
Child Born on Moving Train: రైలులో గర్భిణికి నొప్పులు.. పురుడు పోసి తల్లీ బిడ్డ ప్రాణాలు కాపాడిన విజయవాడ టీటీఈ జ్యోతి
రైలులో గర్భిణికి నొప్పులు.. పురుడు పోసి తల్లీ బిడ్డ ప్రాణాలు కాపాడిన విజయవాడ టీటీఈ జ్యోతి
World Health Day : ప్రపంచ ఆరోగ్య దినోత్సవం స్పెషల్.. ఆరోగ్యం బాగుండాలంటే పిల్లలు, పెద్దలు రోజూ ఫాలో అవ్వాల్సిన టిప్స్
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం స్పెషల్.. ఆరోగ్యం బాగుండాలంటే పిల్లలు, పెద్దలు రోజూ ఫాలో అవ్వాల్సిన టిప్స్
Donald Trump Warning: రేపు రాత్రి దాకా టైమ్ ఇస్తున్నా.. లేకపోతే రాతియుగానికి పంపిస్తా- Trump డెడ్లీ వార్నింగ్ 
రేపు రాత్రి దాకా టైమ్ ఇస్తున్నా.. లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు- Trump డెడ్లీ వార్నింగ్ 
Chandrababu Naidu: రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మార్చేందుకు లక్ష కోట్లు - జగన్‌పై ఏపీపై పగ - తాడిపత్రిలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మార్చేందుకు లక్ష కోట్లు - జగన్‌పై ఏపీపై పగ - తాడిపత్రిలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Embed widget