అన్వేషించండి

Modi Cabinet Reshuffle: పార్లమెంట్‌కు ముందే మోదీ క్యాబినెట్ రీసెట్.. రాజ్యాంగ సవరణల వేళ అసలు వ్యూహం ఇదే!

Constitutional Bills: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందే కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ప్రధాని మోదీ కసరత్తు ముమ్మరం చేశారు. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ పై రాజ్యాంగసవరణలు ఖాయంగా కనిపిస్తున్నాయి.

Modi Amit Shah Surprise Political Strategy:  న్యూఢిల్లీ వేదికగా కేంద్ర ప్రభుత్వ అగ్రనాయకత్వంలో అంతర్గత రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. త్వరలో ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు  ముందే ప్రధాని నరేంద్ర మోదీ తన మంత్రివర్గంలో భారీ మార్పులు చేర్పులు  చేయబోతున్నారనే చర్చ దేశవ్యాప్తంగా జోరందుకుంది. ఇందుకు సంబంధించి పొలిటికల్ సర్కిల్స్‌లో  ఇన్ అండ్ అవుట్ లిస్టులు, కొత్తగా మంత్రిపదవులు దక్కే ప్రాబబుల్స్ పేర్లు సోషల్ మీడియాలో విపరీతంగా హైలైట్ అవుతున్నాయి. అయితే, ఈసారి జరగబోయే విస్తరణ కేవలం కొందరికి పదవులు ఇచ్చి, మరికొందరిని తొలగించే సాధారణ ప్రక్రియ కాదు. ఇది రాబోయే రోజుల్లో దేశ రాజకీయ భవిష్యత్తును మార్చబోయే ఒక వ్యూహాత్మక  మిడ్-టర్మ్ రీసెట్ అని స్పష్టమవుతోంది.

భారీగా ప్రక్షాళన

ఈ సారి మంత్రివర్గ విస్తరణను   పార్లమెంట్ సమావేశాల కంటే ముందే పూర్తి చేయాలనుకోవడం వెనుక మోదీ-షా ద్వయం ఒక భారీ వ్యూహాత్మక రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేసింది. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో మోదీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన, దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే సరికొత్త రాజ్యాంగ సవరణ బిల్లులను  ప్రతిపాదించబోతోంది. ముఖ్యంగా గతేడాది చట్టంగా మారిన మహిళా రిజర్వేషన్ బిల్లును   క్షేత్రస్థాయిలో తక్షణమే అమలు చేయడానికి వీలుగా.. నియోజకవర్గాల పునర్విభజన  ప్రక్రియను వేగవంతం చేయడమే ఈ బిల్లుల ప్రధాన ఉద్దేశం.  సభలో ప్రవేశపెట్టనున్న  రాజ్యాంగ  సవరణ బిల్లు  ద్వారా లోక్‌సభ స్థానాల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 543 నుండి ఏకంగా 850 సీట్లకు పెంచేలా కేంద్రం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. 1971 జనాభా లెక్కల ఆధారంగా ఉన్న పాత నిబంధనలను సవరిస్తూ, 2011 జనాభా లెక్కల ప్రకారం కొత్త సరిహద్దులను నిర్ణయించే అధికారాన్ని పార్లమెంట్‌కు కట్టబెట్టడం ఇందులో అత్యంత కీలకం.

కొత్త టీమ్‌తోనే కీలక నిర్ణయాలు

 ఈ చారిత్రాత్మక బిల్లులను పార్లమెంట్‌లో నెగ్గించుకోవడానికి పూర్తి స్థాయి సమర్థులైన, దూకుడు ప్రదర్శించే మంత్రుల బృందం అవసరమని మోదీ భావిస్తున్నారు. అందుకే, గతంలో విఫలమైన మంత్రులను, అండర్ పర్ఫార్మర్లను తొలగించి.. కూటమి భాగస్వామ్య పక్షాల  సమీకరణాలకు లోబడి కొత్త ముఖాలకు క్యాబినెట్‌లో చోటు కల్పించనున్నారు. జూన్ చివరి వారంలో ప్రధాని మోదీ నిర్వహించిన హై-లెవెల్ సమీక్షా సమావేశాలు, వికసిత్ భారత్ రోడ్‌మ్యాప్ చర్చలు కూడా ఈ విస్తరణకు బలమైన పునాదిగా మారాయి.  ఈ కీలకమైన బిల్లులను ప్రస్తుత వర్షాకాల సమావేశాల్లోనే పాస్ చేయిస్తారా.. లేక గతంలో మాదిరిగానే విపక్షాలకు మైండ్ బ్లాంక్ అయ్యేలా హఠాత్తుగా  ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు పెట్టి  ఆమోదింపజేస్తారా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. ఏ పని చేసినా, ఏ పెద్ద నిర్ణయం తీసుకున్నా.. ఎలాంటి లీకులు ఇవ్వకుండా, అత్యంత నిశ్శబ్దంగా తమ వ్యూహాన్ని అమలు చేయడంలో నరేంద్ర మోదీ, అమిత్ షాలకు ఒక ప్రత్యేకమైన శైలి ఉంది. ఆర్టికల్ 370 రద్దు, నోట్ల రద్దు వంటి చారిత్రాత్మక నిర్ణయాలన్నీ ఇలాంటి సైలెంట్ ఆపరేషన్ల ద్వారానే సాధ్యమయ్యాయి.

కీలక మలుపులు ఖాయమే 

  ఈ సారి క్యాబినెట్ విస్తరణ ముగిశాక, పార్లమెంట్ లోపల జరిగే సవరణల పర్వం భారత రాజకీయాల్లో ఒక పెద్ద మలుపు కాబోతోంది. 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్లు అమల్లోకి తేవాలన్నా, 850 సీట్లతో కొత్త పార్లమెంట్ పూర్తి స్థాయిలో కళకళలాడాలన్నా.. ఈ రాజ్యాంగ సవరణలు తప్పనిసరి. విపక్షాల నుంచి ఎంత వ్యతిరేకత వచ్చినా, సంఖ్యాబలంతో సంబంధం లేకుండా తమ ప్లాన్‌ను ఎగ్జిక్యూట్ చేయడంలో సిద్ధహస్తులైన మోదీ-షా.. ఈ వర్షాకాల సమావేశాల వేదికగా దేశానికి ఎలాంటి సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నారనేది ఇప్పుడు అత్యంత ఉత్కంఠభరితంగా మారింది. 
 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP NDA Alliance: వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
West Bengal Politics : బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget