అన్వేషించండి

అసెంబ్లీ ఎన్నికలు 2026

(Source:  Poll of Polls)

Telangana Latest News: తెలంగాణ మంత్రుల నోటి దురుసు: వివాదాల సుడిగుండంలో ప్రభుత్వం! సుప్రీం కోర్టు ఆగ్రహం, రాజకీయ ప్రకంపనలు!

Telangana Latest News: తెలంగాణ మంత్రుల మాటలు మంటలు రేపుతున్నాయి. పరుష పదజాలంతోనూ, అనాలోచితంగా చేసే వ్యాఖ్యలు పార్టీకి ఇబ్బందులు సృష్టిస్తున్నాయి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మంత్రుల మధ్య మాటల యుద్ధం, సామాజిక వర్గాల మధ్య వివాదాలు చెలరేగాయి.
  • హెలికాప్టర్ ఆలస్యంపై సీనియర్ మంత్రుల మధ్య బహిరంగ వాగ్వాదం చోటుచేసుకుంది.
  • టీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికపై సీఎం వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తీవ్రంగా ఖండించింది.
  • తొందరపాటు వ్యాఖ్యలు పార్టీ, ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగిస్తున్నాయని స్పష్టమైంది.

Telangana Latest News: తెలంగాణ మంత్రుల మాటలు మంటలు రేపుతున్నాయి. పరుష పదజాలంతోనూ, అనాలోచితంగా చేసే వ్యాఖ్యలు పార్టీకి ఇబ్బందులు సృష్టిస్తున్నాయి. ఈ తరహా వ్యాఖ్యలు మంత్రుల మధ్య విబేధాలు సృష్టిస్తుంటే, ఇక ముఖ్యమంత్రి (సీఎం) చేసిన వ్యాఖ్యలను ఏకంగా సుప్రీంకోర్టే తప్పుబట్టింది. అందుకే నాలుకను 'రెండు అంచుల ఖడ్గం'గా చెబుతారు. అది పక్క పార్టీ వాళ్లనే కాదు, సొంత పార్టీ వాళ్లను కూడా ఖండించేయగల శక్తిగలది. అయితే, తెలంగాణలో ఈ మాటలు రేపుతున్న చిచ్చు ఏంటో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.

పొన్నం వర్సెస్ అడ్లూరి

ఒక కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ మధ్య మాటల యుద్ధానికి తెరలేచింది. అయితే, ఆ కార్యక్రమానికి ఆలస్యంగా వచ్చిన తనను పొన్నం ఒక జంతువుతో పోల్చి అమర్యాదగా మాట్లాడారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్, పొన్నం తీరుపై మండిపడ్డారు. అయితే, తాను అడ్లూరిని ఏమీ అనలేదని, ఢిల్లీ పర్యటనకు టికెట్ బుక్ చేయని తన సిబ్బందిని ప్రస్తావిస్తూ ఆ పదం వాడానని పొన్నం వివరణ ఇచ్చారు.

అయితే, ఇది ఇంతటితో ఆగలేదు. మరో మంత్రి వివేక్ కూడా తన పక్కన కూర్చోవడానికి ఇష్టపడడం లేదని, అందుకు కారణం తాను వచ్చిన సామాజిక వర్గమే అని అడ్లూరి హాట్ కామెంట్ చేయడం జరిగింది. ఈ వివాదం చివరకు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వరకు చేరింది. ఇద్దరూ ఈ విషయాన్ని మరిచిపోయి కలిసి పని చేయాలని ఆయన చెప్పినా, ఈ విషయంలో పొన్నం తనకు క్షమాపణ చెప్పాలని మంత్రి అడ్లూరి డిమాండ్ చేశారు.  

అయితే, మంత్రి అయినా, తన సిబ్బంది అయినా ఒక జంతువుతో పోల్చి తిట్టడం మాత్రం అనైతికమని పొన్నం వ్యాఖ్యలను నెటిజన్లు తప్పుబడుతున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన తొందరపాటు వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక వర్గాల మధ్య వివాదంగా మారాయి. అయితే, దీన్ని హస్తం (కాంగ్రెస్) పెద్దలు ఎలా కట్టడి చేస్తారో వేచి చూడాలి.

వేచి ఉంచినందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై మండిపడ్డ కోమటిరెడ్డి

నాగార్జున సాగర్ పర్యటన కోసం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట రెడ్డి, మరో ఇద్దరు మంత్రులు హెలికాప్టర్‌లో వెళ్లాల్సి ఉంది. అయితే, ఉదయం 9 గంటలకు వెళ్లాల్సింది, గంట ఆలస్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి రావడంతో ఆగ్రహించిన కోమటిరెడ్డి, బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి వెళ్లిపోయారు. ఇతర మంత్రులు ఫోన్ చేసినా కోమటిరెడ్డి వారి కాల్‌కు ప్రతిస్పందించలేదు. ఇది ఇద్దరి మధ్య బహిరంగ వాగ్వాదానికి దారి తీసింది.

ఈ క్రమంలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి, "ప్రభుత్వ వనరులను ఇష్టానుసారం వాడుకోకూడదు. కొందరు అతిగా ప్రవర్తిస్తున్నారు" అంటూ కోమటిరెడ్డిని ఉద్దేశించి పరోక్ష విమర్శలు చేశారు. దీనికి స్పందించిన కోమటిరెడ్డి, "ప్రభుత్వ వనరులను వాడుకునే హక్కు మాకు ఉంది. దీనిపై కొందరు అనవసరంగా రచ్చ చేస్తున్నారు" అని వ్యాఖ్యానించారు. ఇలా నల్గొండ జిల్లాలోనూ, క్యాబినెట్‌లోనూ ఇద్దరు సీనియర్ మంత్రుల మధ్య ఆధిపత్య పోరుకు ఈ ఘటన నిదర్శనమైంది.

అనుచిత వ్యాఖ్యల వివాదంలో కొండా సురేఖ

రాజకీయ విమర్శల్లో భాగంగా కేటీఆర్‌ను ఉద్దేశిస్తూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో తీవ్ర దుమారం లేపాయి. సినీ నటుడు నాగార్జున, నటి సమంతపై కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వారు తీవ్రంగా ప్రతిస్పందించడం జరిగింది. సమంత విడాకులకు కారణం కేటీఆర్ అంటూ చేసిన తీవ్ర వ్యాఖ్యలపై సినీ పరిశ్రమ కూడా తీవ్ర స్థాయిలో తన ప్రతిస్పందన తెలియజేసింది. కొండా సురేఖ వ్యాఖ్యలను తప్పుబడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అంతే కాకుండా, కేటీఆర్ దీనిపై బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ లీగల్ నోటీసులు కూడా పంపడం జరిగింది. ఈ క్రమంలో, తన వ్యాఖ్యలను కొండా సురేఖ బహిరంగంగా ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. ఈ వివాదం తొందరపాటు వ్యాఖ్యల ఫలితంగా చెప్పవచ్చు.

తొందరపాటు వ్యాఖ్యలతో సీఎంను హెచ్చరించిన సుప్రీంకోర్టు

మంత్రుల మధ్య వివాదాస్పద వ్యాఖ్యలు ఇలా ఉంటే, ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరినా ఉప ఎన్నికలు వచ్చేది లేదని అన్నారు. అయితే, కాంగ్రెస్ లో చేరిన బీఆర్‌ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ చేస్తోన్న సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టింది.

ఈ వ్యాఖ్యలు రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ (Anti-Defection Law - పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం)ను అపహాస్యం చేస్తున్నాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి అలా ఎలా మాట్లాడతారని ప్రశ్నించింది. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా సీఎం వ్యాఖ్యలు చేయకూడదని హితవు పలికింది. సుప్రీంకోర్టు స్పందనతో సీఎం రేవంత్ రెడ్డి తిరిగి అసెంబ్లీలో తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేయడం జరిగింది. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా, రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా మాట్లాడకూదన్న అంశం ఈ వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా అర్థం అవుతోంది.

విమర్శలు, సూచనలు, అభిప్రాయాలు ఏవైనా తొందరపాటుతనంతో చేస్తే అది పార్టీకి, ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగిస్తాయనడానికిపై ఉదంతాలు ఉదాహరణలుగా చెప్పవచ్చు. ఇది పాలనపైనా, పార్టీ ఎదుగుదలపైనా ప్రభావం చూపుతోంది. అంతే కాకుండా, కొందరు రాజకీయ నేతల రాజకీయ జీవితాలు సమాప్తమైన ఘటనలు సమకాలీన రాజకీయాల్లోనూ ఉన్నాయి. అందుకే, ఆచి తూచి మాట్లాడిన నేతలకే గౌరవం దక్కుతుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu Bengal Trends: తమిళనాడు, బెంగాల్‌లలో బెట్టింగ్ మార్కెట్ ట్రెండ్ చెబుతోంది ఇదే - ఎవరూ ఊహించని ఫలితాలు ఖాయమా
తమిళనాడు, బెంగాల్‌లలో బెట్టింగ్ మార్కెట్ ట్రెండ్ చెబుతోంది ఇదే - ఎవరూ ఊహించని ఫలితాలు ఖాయమా
Kaleshwaram issue: కాళేశ్వరంలోకి సీబీఐ దింపడం ఎలా ? - సీఎం రేవంత్ ముందున్న పెద్ద టాస్క్ ఇదే !
కాళేశ్వరంలోకి సీబీఐ దింపడం ఎలా ? - సీఎం రేవంత్ ముందున్న పెద్ద టాస్క్ ఇదే !
TDP Lokesh regime: టీడీపీలో లోకేష్ శకం - వారసుడి నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సరికొత్త ప్రస్థానం - మెప్పించగలరా?
టీడీపీలో లోకేష్ శకం - వారసుడి నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సరికొత్త ప్రస్థానం - మెప్పించగలరా?
West Bengal Election 2026 Phase 2 Voting: పశ్చిమ బెంగాల్‌లో 142 స్థానాలకు పోలింగ్ ప్రారంభం.. ఆసక్తికరంగా మమతా వర్సెస్ సువేందు పోరు!
పశ్చిమ బెంగాల్‌లో 142 స్థానాలకు పోలింగ్ ప్రారంభం.. ఆసక్తికరంగా మమతా వర్సెస్ సువేందు పోరు!

వీడియోలు

RR vs PBKS IPL 2026 Highlights | రాజస్థాన్ రాయల్స్ సంచలన విజయం
Vaibhav Fun With Kids IPL 2026 | పిల్లలతో వైభవ్ సూర్యవంశీ ఫన్నీ ప్రాంక్
Yashasvi Jaiswal about Vaibhav IPL 2026 | వైభవ్ సూర్యవంశీపై యశస్వి జైస్వాల్ కామెంట్స్
RR vs DC IPL 2026 Suyash Sharma | ఐపీఎల్ చరిత్రలోనే సుయాశ్ శర్మ వరల్డ్ రికార్డ్
RCB vs DC IPL 2026 Highlights | ఢిల్లీని వణికించిన ఆర్‌సీబీ బౌలర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP SSC Exam Results 2026: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి మార్క్‌షీట్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? ఫలితాలు చూడటానికి ఉన్న మార్గాలేంటీ?
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి మార్క్‌షీట్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? ఫలితాలు చూడటానికి ఉన్న మార్గాలేంటీ?
Congress vs BRS: కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్యలో యాంకర్లు - ఈ రాజకీయం గీత దాటిపోతోంది !
కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్యలో యాంకర్లు - ఈ రాజకీయం గీత దాటిపోతోంది !
Dhurandhar Japan Release: జపాన్‌లో రిలీజ్‌కు 'ధురంధర్' రెడీ... జూలైలో ఎప్పుడంటే?
జపాన్‌లో రిలీజ్‌కు 'ధురంధర్' రెడీ... జూలైలో ఎప్పుడంటే?
Komatireddy Rajagopal Reddy: తండ్రికి విలువ ఇవ్వని కవిత ప్రజలకేం మేలు చేస్తారు - కొత్తపార్టీపై రాజగోపాల్ రెడ్డి విమర్శలు
తండ్రికి విలువ ఇవ్వని కవిత ప్రజలకేం మేలు చేస్తారు - కొత్తపార్టీపై రాజగోపాల్ రెడ్డి విమర్శలు
Delhi High Court: ఢిల్లీ హైకోర్టులో కలకలం - వర్చువల్ విచారణలో అశ్లీల వీడియోలు.. హ్యాకింగ్‌ చేసినట్లు అనుమానాలు!
ఢిల్లీ హైకోర్టులో కలకలం - వర్చువల్ విచారణలో అశ్లీల వీడియోలు.. హ్యాకింగ్‌ చేసినట్లు అనుమానాలు!
Raghurama: కోర్టులో రఘురామకు షాక్ - మీ పరిధి దాటొద్దని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు!
కోర్టులో రఘురామకు షాక్ - మీ పరిధి దాటొద్దని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు!
Hormuz: హోర్ముజ్ చిక్కులకు గల్ఫ్ దేశాల చెక్ - భారత్‌కు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చమురు సరఫరా!
హోర్ముజ్ చిక్కులకు గల్ఫ్ దేశాల చెక్ - భారత్‌కు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చమురు సరఫరా!
TS SSC Supplementary Exams Date: తెలంగాణ టెన్త్ క్లాస్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ షెడ్యూల్ వచ్చేసింది, ఈ తేదీ నుంచే పరీక్షలు
తెలంగాణ టెన్త్ క్లాస్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ షెడ్యూల్ వచ్చేసింది, ఈ తేదీ నుంచే పరీక్షలు
Embed widget