అన్వేషించండి

Merugu Nagarjuna Comments : రోజా మాటలను వక్రీకరించారు - ఆమెకు దళితులంటే ఎంతో గౌరవమన్న మంత్రి నాగార్జున !

రోజా దళితుల్ని అవమానంచలేదని ఆమెకు దళితులంటే చాలా గౌరవం ఉందని మంత్రి నాగార్జున ప్రకటించారు. గతంలో ఆమె అన్న మాటల్ని వక్రీకరించారన్నారు

Merugu Nagarjuna Comments :  ఏపీ మంత్రి రోజా  దళితులను ఎప్పుడూ అవమానపర్చలేదని .. గతంలో ఓ పోలీసు అధికారితో అన్న వివాదాస్పద వ్యాఖ్యలను వక్రీకరించారని మంత్రి మెరుగు నాగార్జున వివరించారు.  మంత్రి రోజా గతంలో తిరుపతిలో దర్నా చేస్తున్నప్పుడు పోలీసులు దూరంగా నిలబడి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంలో ఆమె దళితులను కించ పరిచేలా వ్యాఖ్యలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పటికీ వైరల్ అవుతోంద. ఈ అంశంపై అదే పార్టీకి చెందిన మంత్రి మెరుగు నాగార్జున స్పందించారు. ఆమె మాటలను వక్రీకరించారని..రోజాకు దళితుల పట్ల ఎంతో గౌరవం ఉందన్నారు. 

చంద్రబాబే దళితుల్ని అవమానించారని మెరుగు నాగార్జున ఆరోపణ

టీడీపీ అధినేత చంద్రబాబే దళితుల్ని అవమానించారని మండిపడ్డారు.  దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న చంద్రబాబు దగ్గర ఇంకా ఎందుకున్నారోనని బాధకలుగుతుందని..  చంద్రబాబు దగ్గర మీరెందుకు ఇంకా ఛప్రాసీ ఉద్యోగం చేస్తున్నారో అర్ధం కావడం లేదని టీడీపీ నేతలను ఉద్దేశించి ్నారు. నిజంగా దళితుల్లో పుట్టిన వారెవరూ చంద్రబాబు దగ్గర ఉండరని మరోసారి వివాదాస్పద కామెంట్లు చేశారు.  దళితులను వాడుకుని వంచించిన వ్యక్తి చంద్రబాబు..అంబేద్కర్ విగ్రహం పెడతానని చెప్పి మోసం చేశారన్నారు.   ఏమీ లేని చోట చెట్లు, పుట్టలో అంబేడ్కర్ విగ్రహం పెడతారా ..చంద్రబాబు మోసాలను ఎండగట్టడానికి అంబేద్కర్ పాదాల సాక్షిగా ఎక్కడైనా చర్చకు సిద్ధమని మెరుగు నాగార్జున ప్రకటించారు. 

వేమూరు పాదయాత్రలో రాజధాని రైతులు లేరు !

రాజధానికి సంబంధించి వేమూరు నియోజకవర్గంలో టీడీపీ పాదయత్రలు చేస్తోందని... ఆ పాదయాత్రలో రాజధాని ప్రాంత రైతులు, దళితులు ఎంత మంది  ఉన్నారని నాగార్జున ప్రశ్నించారు. మీ ఉద్యమంలో ఉన్నవారంతా బయటి నుంచి వచ్చినవారేనన్నారు.  నక్కా ఆనంద్ బాబుకు..  జగన్ మోహన్ రెడ్డి గురించి మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. మా ముఖ్యమంత్రి పై టీడీపీ నేతలు బరితెగించి మాట్లాడతున్నారని... టీడీపీ నేతలు ప్రజల్లో మనగలిగే పరిస్థితి లేదని విమర్శించారు.  తెలంగాణ కోసం కేసీఆర్, వైసీపీ పార్టీ ఏర్పాటు కోసం జగన్ ధైర్యంగా రాజీనామాలు చేశారు ..మీకు దమ్ముంటే మీవాళ్లంతా రాజీనామా చేయండి ...ఎన్నికలకు వెళ్దాం అని సవాల్ చేశారు. 

టీడీపీ దళిత ఎమ్మెల్యేపై చేసిన వ్యాఖ్యలతో నాగార్జున తీరు వివాదాస్పదం

రాజధాని ఎక్కడ వస్తుందో ముందే తెలుసు నా దగ్గర డబ్బులు లేకే భూములు కొనలేకపోయానని మీరే చెప్పారని టీడీపీ నేతలను ఉద్దేశించి నాగార్జున వ్యాఖ్యానించారు. అందుకే ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని చెబుతున్నామన్నారు. అసెంబ్లీలో టీడీపీ దళిత ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామిని ఉద్దేశించి మెరుగు నాగార్జున దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన తల్లిదండ్రుల్ని కూడా అవమానించారని.. స్పీకర్‌కు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అయితే స్పీకర్ రికార్డులు పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఏ చర్యా తీసుకోలేదు. ఈ అంశంపై టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kerala Assembly Elections 2026: కేరళ ఫలితాలను తేల్చేది గల్ఫ్‌లో ఉపాధి పొందుతున్న వారే - ఉద్యోగ సంక్షోభం, యుద్ధం ఆగ్రహం ఎవరిపై చూపిస్తారు?
Kerala Assembly Elections 2026: కేరళ ఫలితాలను తేల్చేది గల్ఫ్‌లో ఉపాధి పొందుతున్న వారే - ఉద్యోగ సంక్షోభం, యుద్ధం ఆగ్రహం ఎవరిపై చూపిస్తారు?
Revanth Reddy: నాడు ఆవేశం.. నేడు ఆలోచన - రేవంత్ రెడ్డి ఘాటు భాష లేని హై క్వాలిటీ రాజకీయం చేయబోతున్నారా?
నాడు ఆవేశం.. నేడు ఆలోచన - రేవంత్ రెడ్డి ఘాటు భాష లేని హై క్వాలిటీ రాజకీయం చేయబోతున్నారా?
AP Cabinet Reshuffle: ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
Election Commission: నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dubai Airport Drone Attack: ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
Hyderabad Crime News: చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
AP Cabinet Reshuffle: ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
Oscar 2026 : ఆస్కార్ వేడుకల్లో అరుదైన ఇన్సిడెంట్ - 14 ఏళ్ల తర్వాత టై... ఆ కేటగిరీలో ఇద్దరికి అవార్డ్
ఆస్కార్ వేడుకల్లో అరుదైన ఇన్సిడెంట్ - 14 ఏళ్ల తర్వాత టై... ఆ కేటగిరీలో ఇద్దరికి అవార్డ్
Rythu Bharosa Funds: తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
Potti Sriramulu Statue: నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Loose Motions : వాతావరణం మారగానే విరేచనాలు అవుతున్నాయా? అయితే ఈ జాగ్రత్తలతో పాటు ఈ ఫుడ్స్ తీసుకోండి
వాతావరణం మారగానే విరేచనాలు అవుతున్నాయా? అయితే ఈ జాగ్రత్తలతో పాటు ఈ ఫుడ్స్ తీసుకోండి
Embed widget