అన్వేషించండి

Mylavaram Politics : మైలవరంలో వసంత సైలెంట్ అయ్యారా? సైలెంట్ గా వర్క్ చేస్తున్నారా?

మైలవరం రాజకీయం సైలెంట్ అయ్యింది. వరుసగా వివాదాలు చుట్టుముట్టిన తరుణంలో వైసీపీలోని ఇరువురు కీలక నేతలు ఒక్క సారిగా కామ్ అయ్యారు.సైలెంట్ అయ్యారా లేక...సైలెంట్ గా వర్క్ చేస్తున్నారా అనే చర్చ జరుగుతోంది.  

మైలవరం వైసీపీ రాజకీయం ఇటీవల వివాదాలకు దారి తీసిన విషయం తెలసిందే. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, మంత్రి జోగి రమేష్ మధ్య విభేదాలు పెద్ద ఎత్తున తెర మీదకు వచ్చాయి. దీంతో నియోజకవర్గంతో పాటుగా ఉమ్మడి కృష్ణ జిల్లాలో కూడా ఈ వ్యవహరం దుమారాన్ని రాజేసింది. మంత్రి జోగి రమేష్ తాను ప్రాతినిధ్యం వహించే పెడన నియోజకవర్గాన్ని కాదని, మైలవరం నియోజకవర్గంలో చక్రం తిప్పటం, తనకు వ్యతిరేకంగా సొంత పార్టీ నేతల వద్దనే జోగి రమేష్ ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయటంపై వసంత కృష్ణ ప్రసాద్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వీరిద్దరికి సఖ్యత కుదిర్చేందుకు ప్రయత్నించారు. దీంతో తాత్కాలికంగా ఈ వ్యవహరం సర్దుమణిగినప్పటికీ ఆ తరువాత కంటిన్యూ అయ్యింది. దీంతో సీఎం జగన్ ను ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ కలిశారు. నియోజకవర్గాల వారీగా నిర్వహించిన సమీక్షలో భాగంగా తన నియోజకవర్గంలో ఉన్న ఇబ్బందులు గురించి, సొంత పార్టీకి చెందిన నేతలే ఇస్టానుసారంగా వ్యాఖ్యలు చేయటంపై కృష్ణ ప్రసాద్ సీఎం వద్ద తన ఆవేదన వ్యక్తం చేశారు. అయినా ఈ వ్యవహారం సర్దుమణగలేదు. ఆ తరువాత కూడా జోగి తన వైఖరిని మార్చుకోకపోవటం, మైలవరం నియోజకవర్గంలో వరుసగా పర్యటించి, తన వర్గాన్ని ప్రోత్సహించే విధంగా వ్యవహారాలు నడిపారు. దీనిపై వసంత మరింత కినుకు వహించారు.

నా కుటుంబాన్ని ఎందుకు పట్టించుకోరు  

మంత్రి జోగి రమేష్ ప్రస్తుతం ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఏకైక మంత్రి. వైసీపీ పార్టీ ఆవిర్భావం నుంచి జోగి మైలవరం కేంద్రంగా రాజకీయ వ్యవహారాలు నడిపించారు. అక్కడ టీడీపీ నుంచి మంత్రిగా పని చేసిన దేవినేని ఉమాను సైతం ఢీకొని జోగి నియోజకవర్గంలో నిలబడ్డారు. అయితే ఆ తరువాత ఎన్నికల సమయానికి పరిస్థితుల్లో మార్పు రావటంతో, అనూహ్యంగా వసంత కృష్ణ ప్రసాద్ తెర మీదకు వచ్చారు. సర్వేల్లో మైలవరం నియోజకవర్గం నుంచి అప్పటి మంత్రి దేవినేనిని ఓడించటానికి వసంత కృష్ణ ప్రసాద్ అవసరం ఉందని గుర్తించిన సీఎం జగన్, పెడన నియోజకవర్గానికి జోగి రమేష్ ను పంపి, మైలవరంలో బాధ్యతలను వసంతకు అప్పగించారు. ఆ తరువాత ఎన్నికల్లో వైసీపీ అనూహ్యంగా విజయం సాధిచటం, ఇప్పుడు జోగి రమేష్ మంత్రి అయ్యారు. అయితే మైలవరం నియోజకవర్గంలో ఉంటున్న జోగి కుటుంబం ఇప్పటికి వైసీపీ కోసమే పనిచేస్తుంది. వసంత గెలుపు కోసం తన కుటుంబం తీవ్రంగా శ్రమించిందని, మైలవరంతో వసంత కృష్ణ ప్రసాద్ గెలుపులో తన కుటుంబ పాత్ర కీలకంగా ఉన్న నేపథ్యంలో, నేడు అదే నియోజకవర్గంలో తన కుటుంబం, పార్టీ క్యాడర్, తన మనుషులు బయట వ్యక్తులుగా మారిపోవటంపై జోగి అసహనం వ్యక్తం చేశారు. అందులో భాగంగానే వసంత కృష్ణ ప్రసాద్ పై ఇప్పటి వరకు ఒత్తిడి తెచ్చిన జోగి తాను మంత్రి అయిన తరువాత నుంచి మరింత వేగాన్ని పెంచి ఏకంగా మైలవరంలోని వ్యవహరాల్లో జోక్యం చేసుకోవటం మొదలు పెట్టారు. దీంతో వసంత కృష్ణ ప్రసాద్ తీవ్ర అసహనంతో ఉన్నారని చెబుతున్నారు. 

సైలెంట్ గా వసంత కృష్ణ ప్రసాద్ 

ప్రస్తుతం వసంత కృష్ణప్రసాదర్ నియోజకవర్గంలో సైలెంట్ అయ్యారు. వసంత కృష్ణ ప్రసాద్ తండ్రి గతంలో వైసీపీ పార్టీపై చేసిన వ్యాఖ్యలు, ఆ తరువాత టీడీపీ ఎంపీ కేశినేని నానితో సమావేశం కావటంతో అందులో వసంత కృష్ణ ప్రసాద్ పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. దీంతో వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరుతున్నారని ప్రచారం జరిగింది. అదే సమయంలో జోగి రమేష్ తో వివాదాలు, తీవ్ర ఒత్తిడికి గురైన వసంత కృష్ణ ప్రసాద్ ప్రస్తుతం పార్టీలో సైలెంట్ గా ఉంటున్నారు. మరి ఆయన మౌనం ఎప్పటికి వీడుతారనే అంశంపై పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Election Commission: నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Assam Assembly Elections 2026: అస్సాం గణ పరిషత్ .. ఒకప్పుడు ఊపేసిన పార్టీ -ఇప్పుడెందుకు ఉనికి కోల్పోయింది?
అస్సాం గణ పరిషత్ .. ఒకప్పుడు ఊపేసిన పార్టీ -ఇప్పుడెందుకు ఉనికి కోల్పోయింది?

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Election Commission: నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Seetha Payanam OTT : ఓటీటీలోకి సీతాపయనం - అర్జున్ కుమార్తె లవ్ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలోకి సీతాపయనం - అర్జున్ కుమార్తె లవ్ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Petrol Pump Scam: ఇప్పుడు 0 కాదు.. పెట్రోల్- డీజిల్ సాంద్రతతో మోసం చేస్తున్న పెట్రోల్ పంపులు!
ఇప్పుడు 0 కాదు.. పెట్రోల్- డీజిల్ సాంద్రతతో మోసం చేస్తున్న పెట్రోల్ పంపులు!
Lavanya Tripathi : టార్గెట్ చేసి వేధించారు - ఒంటరిగా రూంలో కూర్చుని ఏడ్చేశా... మెగా కోడలి లైఫ్‌లో షాకింగ్ ఘటన
టార్గెట్ చేసి వేధించారు - ఒంటరిగా రూంలో కూర్చుని ఏడ్చేశా... మెగా కోడలి లైఫ్‌లో షాకింగ్ ఘటన
Embed widget