అన్వేషించండి

Central Funds : ఆంధ్రప్రదేశ్‌కు మిత్ర లాభం - కేంద్రం నుంచి దండిగా నిధులొస్తున్నాయా ? ప్రచారమేనా ?

Andhra Pradesh : ఎన్డీఏలో కీలక భాగస్వామిగా టీడీపీ ఉండటం వల్ల దండిగా నిధులు వస్తున్నాయని ఎక్కువగా ప్రచారం జరుగుతోంది. వాస్తవంగా చూస్తే ?ప్రత్యేకమైన నిధులు రావడం లేదని కొంత మంది చెబుతున్నారు. ఏది నిజం?

Andhra Getting Funds From Central : పన్నుల్లో వాటా కింద కేంద్రం ఏపీకి రూ. ఏడు వేల కోట్లకుపైగా మంజూరు చేసింది. అది తెలంగాణకు మూడున్నర వేల కోట్ల రూపాయలు మాత్రమే. అలాగే పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇచ్చింది. గోదావరి పుష్కరాలకు రూ. వంద కోట్లు విడుదల చేసింది. అమరావతికి రూ.పదిహేను వేల కోట్లు మంజూరు చేసింది. ఇక కేంద్ర ప్రాజెక్టుల సంగతి చెప్పాల్సిన పని లేదు.  ఇలా ఏపీకి కేటాయిస్తున్న నిధుల విషయంలో విస్తృత ప్రచారం జరుగుతోంది. టీడీపీ కేంద్రంలో కీలకంగా ఉండటం వల్లనే ఇన్ని నిధులు తెచ్చుకుంటున్నారని అంటున్నారు. మరి నిజంగానే అన్ని నిధులు వస్తున్నాయా ? 

ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నారా ?

పన్నుల్లో వాటాలను ఆర్థిక సంఘం డిసైడ్ చేస్తుంది. రాష్ట్రాల లోటును బట్టి ఆ పన్నుల్లో వాటాను డిసైడ్ చేస్తారు.తెలంగాణ మిగులు రాష్ట్రంగా ఉంది కాబట్టి పన్నుల్లో వాటా కాస్త తక్కువగా ఉంటుంది. ఏపీకి ఎక్కువగా ఉంటుంది. గత పదేళ్లుగా ఇంతే . ఏపీకి ప్రత్యేకంగా ఎక్కువ కేటాయించలేదు. అలాగే కేంద్ర ప్రాజెక్టులు.. ఇతర విషయాల్లో కూడా కేంద్రం ఆయా రాష్ట్రాలకు కేటాయించిన నిధుల్లో భాగంగానే ఏపీకి వచ్చాయి కానీ ఏపీకి ప్రత్యేకమైన కేటాయింపు కాదని చెబుతున్నారు. పోలరం ప్రాజెక్టు విషయంలో రీఎంబర్స్ చేయాల్సిన నిధుల్లో కొన్ని చేశారు. మరో రెండు వేల కోట్ల వరకూ అడ్వాన్స్‌గా ఇస్తామని చెప్పారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు. దానికి కేంద్రం వంద శాతం నిధులు భరించాల్సి ఉంది. ఇలా వచ్చిన నిధులను చూస్తే అన్నీ చట్టబద్దమైనవే కానీ ఏపీకి ప్రత్యేకంగా కేటాయించడం లేదని అంటున్నారు. 

Also Read: క్యాడర్‌లో కదలిక కోసం జగన్ ప్రయత్నాలు - గుడ్ బుక్ తాయిలం వర్కవుట్ అవుతుందా ?

గత ప్రభుత్వంతో పోలిస్తే మాత్రం మెరుగు 

గత వైసీపీ ప్రభుత్వంతో పోలిస్తే ఏపీకి నిధులు ఎక్కువగా వస్తున్నాయని అనుకోవచ్చు. గతంలో పోలవరం పనులు చేయించలేదు కాబట్టి నిధులు మంజూరు చేయలేదు. అమరావతి నిర్మాణం ఆపేశారు కాబట్టి అమరావతికి ఎలాంటి నిధులు, అప్పులు ఇప్పించలేదు. అలాగే రైల్వే ప్రాజెక్టుు, రోడ్ల విషయంలో మ్యాచింగ్ గ్రాంట్లు కూడా కేటాయించలేదు కాబట్టి ఆ నిధులు కూడా రాలేదని చెబుతున్నారు. ఇప్పుడు కేంద్రం నుంచి రాష్ట్రానికి రూపాయి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ వాటిని మంజూరు చేయించుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. అందుకే ఎక్కువ నిధులు వస్తున్నాయన్న భావన కలుగుతోందని చెబుతున్నారు. 

రీల్స్ చేశారని వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ ప్రియురాలు దివ్వల మాధురిపై కేసు నమోదు

కేంద్ర ప్రాజెక్టుల సాధనకు చంద్రబాబు కృషి

ఏపీకి నేరుగా నగదు బదిలీ ద్వారా సాయం చేయమని మాత్రమే చంద్రబాబు కోరడం లేదు. కేంద్రం తరపున పెట్టుబడులు కూడా పెట్టాలని కోరుతున్నారు. బీపీసీఎల్‌తో పాటు బుల్లెట్ ట్రైన్... ఇతర ప్రతిపాదనల్లో ఏపీ ఉండేలా చూసుకుంటున్నారు. అమరావతికి అప్పును ప్రపంచ బ్యాంక్ ద్వారా కేంద్రం ఇప్పిస్తోంది. మంజూరు అయింది కూడా. నిర్మాణాలు ప్రారంభించడమే మిగిలింది. కేంద్రం నుంచి ఎప్పుడూ వచ్చే నిధులు కాకుండా.. అదనంగా వస్తున్న నిధులు పూర్తిగా అడ్మినిస్ట్రేషన్, చంద్రబాబు ప్రయత్నాలు ద్వారానే వస్తున్నాయని చెబుతున్నారు. గోదావరి పుష్కరాల కోసం ఏర్పాట్లు చేసేందుకు కేంద్రం రూ. వంద కోట్లు మంజూరు చేసింది. తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని బీఆర్ఎస్ విమర్శలు చేసింది. ఇలాంటివి ప్రత్యేక ప్రయత్నాల ద్వారా వస్తాయని అనుకోవచ్చు. 

 

టాప్ హెడ్ లైన్స్

CM Vijay Delimitation Meeting: తమిళనాడు సీఎం విజయ్‌కు బిగ్ షాక్! డీలిమిటేషన్ మీటింగ్‌ను బహిష్కరించిన 37 మంది ఎంపీలు
తమిళనాడు సీఎం విజయ్‌కు బిగ్ షాక్! డీలిమిటేషన్ మీటింగ్‌కు 37 మంది ఎంపీలు డుమ్మా!
Polavaram Banakacherla Project : పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు తిరస్కరణ - రేవంత్ విజయమా? చంద్రబాబు వైఫల్యమా?
పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు తిరస్కరణ - రేవంత్ విజయమా? చంద్రబాబు వైఫల్యమా?
Ambati Rambabu Padayatra Postponed : వైసీపీలో అంబటి పాదయాత్ర రద్దు కలకలం - నేతల వ్యక్తిగత మైలేజ్ రాజకీయాలను జగన్ అంగీకరించరా?
వైసీపీలో అంబటి పాదయాత్ర రద్దు కలకలం - నేతల వ్యక్తిగత మైలేజ్ రాజకీయాలను జగన్ అంగీకరించరా?
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
Embed widget