అన్వేషించండి

Central Funds : ఆంధ్రప్రదేశ్‌కు మిత్ర లాభం - కేంద్రం నుంచి దండిగా నిధులొస్తున్నాయా ? ప్రచారమేనా ?

Andhra Pradesh : ఎన్డీఏలో కీలక భాగస్వామిగా టీడీపీ ఉండటం వల్ల దండిగా నిధులు వస్తున్నాయని ఎక్కువగా ప్రచారం జరుగుతోంది. వాస్తవంగా చూస్తే ?ప్రత్యేకమైన నిధులు రావడం లేదని కొంత మంది చెబుతున్నారు. ఏది నిజం?

Andhra Getting Funds From Central : పన్నుల్లో వాటా కింద కేంద్రం ఏపీకి రూ. ఏడు వేల కోట్లకుపైగా మంజూరు చేసింది. అది తెలంగాణకు మూడున్నర వేల కోట్ల రూపాయలు మాత్రమే. అలాగే పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇచ్చింది. గోదావరి పుష్కరాలకు రూ. వంద కోట్లు విడుదల చేసింది. అమరావతికి రూ.పదిహేను వేల కోట్లు మంజూరు చేసింది. ఇక కేంద్ర ప్రాజెక్టుల సంగతి చెప్పాల్సిన పని లేదు.  ఇలా ఏపీకి కేటాయిస్తున్న నిధుల విషయంలో విస్తృత ప్రచారం జరుగుతోంది. టీడీపీ కేంద్రంలో కీలకంగా ఉండటం వల్లనే ఇన్ని నిధులు తెచ్చుకుంటున్నారని అంటున్నారు. మరి నిజంగానే అన్ని నిధులు వస్తున్నాయా ? 

ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నారా ?

పన్నుల్లో వాటాలను ఆర్థిక సంఘం డిసైడ్ చేస్తుంది. రాష్ట్రాల లోటును బట్టి ఆ పన్నుల్లో వాటాను డిసైడ్ చేస్తారు.తెలంగాణ మిగులు రాష్ట్రంగా ఉంది కాబట్టి పన్నుల్లో వాటా కాస్త తక్కువగా ఉంటుంది. ఏపీకి ఎక్కువగా ఉంటుంది. గత పదేళ్లుగా ఇంతే . ఏపీకి ప్రత్యేకంగా ఎక్కువ కేటాయించలేదు. అలాగే కేంద్ర ప్రాజెక్టులు.. ఇతర విషయాల్లో కూడా కేంద్రం ఆయా రాష్ట్రాలకు కేటాయించిన నిధుల్లో భాగంగానే ఏపీకి వచ్చాయి కానీ ఏపీకి ప్రత్యేకమైన కేటాయింపు కాదని చెబుతున్నారు. పోలరం ప్రాజెక్టు విషయంలో రీఎంబర్స్ చేయాల్సిన నిధుల్లో కొన్ని చేశారు. మరో రెండు వేల కోట్ల వరకూ అడ్వాన్స్‌గా ఇస్తామని చెప్పారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు. దానికి కేంద్రం వంద శాతం నిధులు భరించాల్సి ఉంది. ఇలా వచ్చిన నిధులను చూస్తే అన్నీ చట్టబద్దమైనవే కానీ ఏపీకి ప్రత్యేకంగా కేటాయించడం లేదని అంటున్నారు. 

Also Read: క్యాడర్‌లో కదలిక కోసం జగన్ ప్రయత్నాలు - గుడ్ బుక్ తాయిలం వర్కవుట్ అవుతుందా ?

గత ప్రభుత్వంతో పోలిస్తే మాత్రం మెరుగు 

గత వైసీపీ ప్రభుత్వంతో పోలిస్తే ఏపీకి నిధులు ఎక్కువగా వస్తున్నాయని అనుకోవచ్చు. గతంలో పోలవరం పనులు చేయించలేదు కాబట్టి నిధులు మంజూరు చేయలేదు. అమరావతి నిర్మాణం ఆపేశారు కాబట్టి అమరావతికి ఎలాంటి నిధులు, అప్పులు ఇప్పించలేదు. అలాగే రైల్వే ప్రాజెక్టుు, రోడ్ల విషయంలో మ్యాచింగ్ గ్రాంట్లు కూడా కేటాయించలేదు కాబట్టి ఆ నిధులు కూడా రాలేదని చెబుతున్నారు. ఇప్పుడు కేంద్రం నుంచి రాష్ట్రానికి రూపాయి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ వాటిని మంజూరు చేయించుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. అందుకే ఎక్కువ నిధులు వస్తున్నాయన్న భావన కలుగుతోందని చెబుతున్నారు. 

రీల్స్ చేశారని వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ ప్రియురాలు దివ్వల మాధురిపై కేసు నమోదు

కేంద్ర ప్రాజెక్టుల సాధనకు చంద్రబాబు కృషి

ఏపీకి నేరుగా నగదు బదిలీ ద్వారా సాయం చేయమని మాత్రమే చంద్రబాబు కోరడం లేదు. కేంద్రం తరపున పెట్టుబడులు కూడా పెట్టాలని కోరుతున్నారు. బీపీసీఎల్‌తో పాటు బుల్లెట్ ట్రైన్... ఇతర ప్రతిపాదనల్లో ఏపీ ఉండేలా చూసుకుంటున్నారు. అమరావతికి అప్పును ప్రపంచ బ్యాంక్ ద్వారా కేంద్రం ఇప్పిస్తోంది. మంజూరు అయింది కూడా. నిర్మాణాలు ప్రారంభించడమే మిగిలింది. కేంద్రం నుంచి ఎప్పుడూ వచ్చే నిధులు కాకుండా.. అదనంగా వస్తున్న నిధులు పూర్తిగా అడ్మినిస్ట్రేషన్, చంద్రబాబు ప్రయత్నాలు ద్వారానే వస్తున్నాయని చెబుతున్నారు. గోదావరి పుష్కరాల కోసం ఏర్పాట్లు చేసేందుకు కేంద్రం రూ. వంద కోట్లు మంజూరు చేసింది. తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని బీఆర్ఎస్ విమర్శలు చేసింది. ఇలాంటివి ప్రత్యేక ప్రయత్నాల ద్వారా వస్తాయని అనుకోవచ్చు. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Jeevan Reddy Quits Congress: కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గుడ్‌బై.. రాజీనామా లేఖలో తీవ్ర ఆరోపణలు
కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గుడ్‌బై.. రాజీనామా లేఖలో తీవ్ర ఆరోపణలు
Cases against KTR: ఫార్ములా ఈ రేసు కేసుతో కేటీఆర్‌ను పక్కాగా ఇరికించారా? అరెస్టులు లేకుండా నేరుగా చార్జిషీటు వెనుక రేవంత్ వ్యూహం ఏమిటి?
ఫార్ములా ఈ రేసు కేసుతో కేటీఆర్‌ను పక్కాగా ఇరికించారా? అరెస్టులు లేకుండా నేరుగా చార్జిషీటు వెనుక రేవంత్ వ్యూహం ఏమిటి?
Jagan friendship with NDA: చిత్తుగా ఓడించిన ప్రత్యర్థితోనే స్నేహం - వైసీపీ భవిష్యత్‌కు జగన్ పాలసీనే గండంగా మారిందా?
చిత్తుగా ఓడించిన ప్రత్యర్థితోనే స్నేహం - వైసీపీ భవిష్యత్‌కు జగన్ పాలసీనే గండంగా మారిందా?
Kerala Assembly Elections2026: సర్పంచ్ ఎన్నికల మాదిరిగా కేరళ అసెంబ్లీ ఎలక్షన్స్‌! గల్ఫ్‌ ఓటర్ల కోసం చార్టర్డ్ విమానాలు బుక్ చేస్తున్న పార్టీలు!
సర్పంచ్ ఎన్నికల మాదిరిగా కేరళ అసెంబ్లీ ఎలక్షన్స్‌! గల్ఫ్‌ ఓటర్ల కోసం చార్టర్డ్ విమానాలు బుక్ చేస్తున్న పార్టీలు!

వీడియోలు

RCB Sold to Aditya Birla Group IPL 2026 | భారీ ధరకు అమ్ముడైన RCB | ABP Desam Bangalore
Women Reservations 2029 | లోక్ సభ, అసెంబ్లీలో 50 శాతం స్థానాల పెంపు | ABP Desam
RCB KSCA Tributes Stampede Victims | విషాధ ఘటనను జ్ఞాపకంగా మార్చిన ఆర్సీబీ | ABP Desam
Petro Effect on PSL 2026 | పాపం పాకిస్తాన్ సూపర్ లీగ్ కాస్తా పెట్రోల్ షార్టేజ్ లీగ్ అయ్యిందే | ABP Desam
BCCI IPL 2026 New Rules | ఐపీఎల్ లో స్ట్రిక్ట్ రూల్స్...బీసీసీఐ సంచలన నిర్ణయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Assembly Indiramma Controversy: తెలంగాణ అసెంబ్లీలో ఇప్పసారా చిచ్చు - ఇందిరమ్మ పేరు తెచ్చిన బీజేపీ ఎమ్మెల్యే - తర్వాత మాటల యుద్ధమే!
తెలంగాణ అసెంబ్లీలో ఇప్పసారా చిచ్చు - ఇందిరమ్మ పేరు తెచ్చిన బీజేపీ ఎమ్మెల్యే - తర్వాత మాటల యుద్ధమే!
Varanasi Movie Set: వారణాసి సెట్‌లో ఏమున్నాయి..? రాజమౌళిని ఇండియన్ క్రిస్టోఫర్ నోలన్ అని విదేశీ మీడియా ఎందుకు అంటోంది..?
వారణాసి సెట్‌లో ఏమున్నాయి..? రాజమౌళిని ఇండియన్ క్రిస్టోఫర్ నోలన్ అని విదేశీ మీడియా ఎందుకు అంటోంది..?
Deputy CM Pawan Kalyan: రామతీర్థంలో భక్తుల కల సాకారం- గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
రామతీర్థంలో భక్తుల కల సాకారం- గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Rakasa Trailer : ఊరిలో కోట మిస్టరీ ఏంటి? - భయపెడుతూనే నవ్వించిన రాకాస ట్రైలర్
ఊరిలో కోట మిస్టరీ ఏంటి? - భయపెడుతూనే నవ్వించిన రాకాస ట్రైలర్
New Corona: ఉన్నవి సరిపోనట్లుగా మళ్లీ కరోనా కొత్త రకం వచ్చేస్తోందట - వ్యాక్సిన్ కూడా పని చేయదని తేల్చిన శాస్త్రవేత్తలు
ఉన్నవి సరిపోనట్లుగా మళ్లీ కరోనా కొత్త రకం వచ్చేస్తోందట - వ్యాక్సిన్ కూడా పని చేయదని తేల్చిన శాస్త్రవేత్తలు
AP Assembly special meeting: 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం - అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ తీర్మానం !
28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం - అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ తీర్మానం !
Vijayawada Terror Links Case: విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు
విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు
West Asia Conflict: ప్రపంచ ఇంధన సంక్షోభం! భారత్ అప్రమత్తం! మైలేజీ పెంచుకోవడానికి నిపుణుల కీలక సూచనలు !
ప్రపంచ ఇంధన సంక్షోభం! భారత్ అప్రమత్తం! మైలేజీ పెంచుకోవడానికి నిపుణుల కీలక సూచనలు !
Embed widget