అన్వేషించండి

Central Funds : ఆంధ్రప్రదేశ్‌కు మిత్ర లాభం - కేంద్రం నుంచి దండిగా నిధులొస్తున్నాయా ? ప్రచారమేనా ?

Andhra Pradesh : ఎన్డీఏలో కీలక భాగస్వామిగా టీడీపీ ఉండటం వల్ల దండిగా నిధులు వస్తున్నాయని ఎక్కువగా ప్రచారం జరుగుతోంది. వాస్తవంగా చూస్తే ?ప్రత్యేకమైన నిధులు రావడం లేదని కొంత మంది చెబుతున్నారు. ఏది నిజం?

Andhra Getting Funds From Central : పన్నుల్లో వాటా కింద కేంద్రం ఏపీకి రూ. ఏడు వేల కోట్లకుపైగా మంజూరు చేసింది. అది తెలంగాణకు మూడున్నర వేల కోట్ల రూపాయలు మాత్రమే. అలాగే పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇచ్చింది. గోదావరి పుష్కరాలకు రూ. వంద కోట్లు విడుదల చేసింది. అమరావతికి రూ.పదిహేను వేల కోట్లు మంజూరు చేసింది. ఇక కేంద్ర ప్రాజెక్టుల సంగతి చెప్పాల్సిన పని లేదు.  ఇలా ఏపీకి కేటాయిస్తున్న నిధుల విషయంలో విస్తృత ప్రచారం జరుగుతోంది. టీడీపీ కేంద్రంలో కీలకంగా ఉండటం వల్లనే ఇన్ని నిధులు తెచ్చుకుంటున్నారని అంటున్నారు. మరి నిజంగానే అన్ని నిధులు వస్తున్నాయా ? 

ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నారా ?

పన్నుల్లో వాటాలను ఆర్థిక సంఘం డిసైడ్ చేస్తుంది. రాష్ట్రాల లోటును బట్టి ఆ పన్నుల్లో వాటాను డిసైడ్ చేస్తారు.తెలంగాణ మిగులు రాష్ట్రంగా ఉంది కాబట్టి పన్నుల్లో వాటా కాస్త తక్కువగా ఉంటుంది. ఏపీకి ఎక్కువగా ఉంటుంది. గత పదేళ్లుగా ఇంతే . ఏపీకి ప్రత్యేకంగా ఎక్కువ కేటాయించలేదు. అలాగే కేంద్ర ప్రాజెక్టులు.. ఇతర విషయాల్లో కూడా కేంద్రం ఆయా రాష్ట్రాలకు కేటాయించిన నిధుల్లో భాగంగానే ఏపీకి వచ్చాయి కానీ ఏపీకి ప్రత్యేకమైన కేటాయింపు కాదని చెబుతున్నారు. పోలరం ప్రాజెక్టు విషయంలో రీఎంబర్స్ చేయాల్సిన నిధుల్లో కొన్ని చేశారు. మరో రెండు వేల కోట్ల వరకూ అడ్వాన్స్‌గా ఇస్తామని చెప్పారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు. దానికి కేంద్రం వంద శాతం నిధులు భరించాల్సి ఉంది. ఇలా వచ్చిన నిధులను చూస్తే అన్నీ చట్టబద్దమైనవే కానీ ఏపీకి ప్రత్యేకంగా కేటాయించడం లేదని అంటున్నారు. 

Also Read: క్యాడర్‌లో కదలిక కోసం జగన్ ప్రయత్నాలు - గుడ్ బుక్ తాయిలం వర్కవుట్ అవుతుందా ?

గత ప్రభుత్వంతో పోలిస్తే మాత్రం మెరుగు 

గత వైసీపీ ప్రభుత్వంతో పోలిస్తే ఏపీకి నిధులు ఎక్కువగా వస్తున్నాయని అనుకోవచ్చు. గతంలో పోలవరం పనులు చేయించలేదు కాబట్టి నిధులు మంజూరు చేయలేదు. అమరావతి నిర్మాణం ఆపేశారు కాబట్టి అమరావతికి ఎలాంటి నిధులు, అప్పులు ఇప్పించలేదు. అలాగే రైల్వే ప్రాజెక్టుు, రోడ్ల విషయంలో మ్యాచింగ్ గ్రాంట్లు కూడా కేటాయించలేదు కాబట్టి ఆ నిధులు కూడా రాలేదని చెబుతున్నారు. ఇప్పుడు కేంద్రం నుంచి రాష్ట్రానికి రూపాయి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ వాటిని మంజూరు చేయించుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. అందుకే ఎక్కువ నిధులు వస్తున్నాయన్న భావన కలుగుతోందని చెబుతున్నారు. 

రీల్స్ చేశారని వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ ప్రియురాలు దివ్వల మాధురిపై కేసు నమోదు

కేంద్ర ప్రాజెక్టుల సాధనకు చంద్రబాబు కృషి

ఏపీకి నేరుగా నగదు బదిలీ ద్వారా సాయం చేయమని మాత్రమే చంద్రబాబు కోరడం లేదు. కేంద్రం తరపున పెట్టుబడులు కూడా పెట్టాలని కోరుతున్నారు. బీపీసీఎల్‌తో పాటు బుల్లెట్ ట్రైన్... ఇతర ప్రతిపాదనల్లో ఏపీ ఉండేలా చూసుకుంటున్నారు. అమరావతికి అప్పును ప్రపంచ బ్యాంక్ ద్వారా కేంద్రం ఇప్పిస్తోంది. మంజూరు అయింది కూడా. నిర్మాణాలు ప్రారంభించడమే మిగిలింది. కేంద్రం నుంచి ఎప్పుడూ వచ్చే నిధులు కాకుండా.. అదనంగా వస్తున్న నిధులు పూర్తిగా అడ్మినిస్ట్రేషన్, చంద్రబాబు ప్రయత్నాలు ద్వారానే వస్తున్నాయని చెబుతున్నారు. గోదావరి పుష్కరాల కోసం ఏర్పాట్లు చేసేందుకు కేంద్రం రూ. వంద కోట్లు మంజూరు చేసింది. తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని బీఆర్ఎస్ విమర్శలు చేసింది. ఇలాంటివి ప్రత్యేక ప్రయత్నాల ద్వారా వస్తాయని అనుకోవచ్చు. 

 

టాప్ హెడ్ లైన్స్

Vedma Bojju Patel: ఎమ్మెల్యేగా ఉన్నా, ఏం జరుగుతుందో తెలియడం లేదు: వెడ్మ బొజ్జు పటేల్
ఎమ్మెల్యేగా ఉన్నా, ఏం జరుగుతుందో తెలియడం లేదు: వెడ్మ బొజ్జు పటేల్
New Political Parties in Telangana: తెలంగాణలో కొత్త పార్టీల ప్రచారం - కల్వకుంట్ల కవిత తెలంగాణ రక్షణ సేన స్పీడ్.. రేవంత్ రెడ్డి, హరీష్ రావులపై పొలిటికల్ రూమర్స్!
తెలంగాణలో కొత్త పార్టీల ప్రచారం - కల్వకుంట్ల కవిత తెలంగాణ రక్షణ సేన స్పీడ్.. రేవంత్ రెడ్డి, హరీష్ రావులపై పొలిటికల్ రూమర్స్!
Almatti Dam Height Dispute 2026: దక్షిణాది జలవివాదాలకు ముగింపు - ముగ్గురు సీఎంలది ఒకే సంకల్పం - ఆల్మట్టి వివాదాలూ తేల్చేసుకుంటారా?
దక్షిణాది జలవివాదాలకు ముగింపు - ముగ్గురు సీఎంలది ఒకే సంకల్పం - ఆల్మట్టి వివాదాలూ తేల్చేసుకుంటారా?
Telangana Cabinet Expansion Postponed 2026: తెలంగాణ కాంగ్రెస్‌లో మీనాక్షి నటరాజన్ సెగ - కేబినెట్ విస్తరణ ఒక మిథ్యేనా? శల్యపరీక్షలో రాహుల్-రేవంత్ వ్యూహం!
తెలంగాణ కాంగ్రెస్‌లో మీనాక్షి నటరాజన్ సెగ - కేబినెట్ విస్తరణ ఒక మిథ్యేనా? శల్యపరీక్షలో రాహుల్-రేవంత్ వ్యూహం!

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indiramma Housing Scheme: ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
Afghanistan Earthquake: అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
Tirumala Devotees Rush: తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Made in Jonnagiri Gold Biscuits: బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
KTR Politics: కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
NRI Priest Arrest: పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
Vizag Land Scam: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
Jai Moondra Cricket Career: ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
Embed widget