అన్వేషించండి

INDIA Alliance Splits: ప్రాంతీయ పార్టీల్లో చీలికలు - ఇండీ కూటమిలో ప్రకంపనలు - మరి కాంగ్రెస్ ఎంపీలు సైలెంట్‌గా ఉంటారా?

Congress Defections: ప్రాంతీయ పార్టీల ఎంపీలు ఎన్డీఏ గూటికి చేరిపోతున్నారు.దీని కోసం ఆపరేషన్ ఆకర్ష్ నడుస్తోంది. మరి కాంగ్రెస్ ఎంపీలు ఆ పార్టీతోనే ఉంటారా?

BJP Strategy Anti Defection Law:   జాతీయ రాజకీయాల్లో ఎవరూ ఊహించని సరికొత్త సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. విపక్షాల  ఇండీ  కూటమిలో ప్రాంతీయ పార్టీల ఉనికి ప్రస్తుతం తీవ్రమైన ఒత్తిడిలో పడింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తదుపరి పరిణామాలతో తృణమూల్ కాంగ్రెస్  తీవ్ర సంక్షోభంలో మునిగిపోయింది. ఆ పార్టీకి చెందిన 20 మంది లోక్‌సభ ఎంపీలు ఎన్సీపీఐ పార్టీలో విలీనం అయ్యారు. దీనికి తోడు డీఎం  కూటమి నుంచి బయటకు రావడం, ఆమ్ ఆద్మీ పార్టీ  కి చెందిన రాఘవ్ చద్దా నేతృత్వంలో ఏడుగురు రాజ్యసభ ఎంపీలు ఏకంగా బీజేపీలో విలీనమవ్వడం చూస్తుంటే, ప్రాంతీయ శక్తులను బలహీనపరిచే వ్యూహంలో బీజేపీ చాణక్యం స్పష్టంగా కనిపిస్తోంది. మహారాష్ట్రలో ఉద్ధవ్ సేన కూడా చీలిపోయింది. యూపీలో సమాజ్ వాదీ పార్టీలపై కూడా ఇదే తరహా కత్తి వేలాడుతోంది. అయితే ఇక్కడ పొలిటికల్ సర్కిల్స్‌లో ఎదురవుతున్న అతిపెద్ద ప్రశ్న ఒకటి ఉంది... ప్రాంతీయ పార్టీలన్నింటినీ చీలుస్తున్న బీజేపీ వ్యూహకర్తలు, కాంగ్రెస్ పార్టీని మాత్రం అలానే వదిలేస్తారా?

 కాంగ్రెస్ ఎంపీలు ఖాళీగా ఉంటారా? 

ప్రాంతీయ పార్టీల నేతలు ఒకరి తర్వాత ఒకరు అధికార ఎన్డీయే   వైపు లేదా బీజేపీ వైపు మొగ్గు చూపుతుంటే, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కూడా నిశ్శబ్దంగా ఉండరనే సంకేతాలు అందుతున్నాయి. కేంద్రంలో మూడోసారి బలమైన అధికారంలో ఉన్న బీజేపీ, ప్రస్తుతం పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణలకు  అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ప్రాంతీయ పార్టీల ఎంపీలను లాక్కోవడంతో పాటు, కాంగ్రెస్‌లోని అసంతృప్త ఎంపీలపై కూడా కన్నేసింది. రాజకీయం ఎటువైపు మొగ్గుతుందో గమనించే కాంగ్రెస్ ఎంపీలు కూడా తమ రాజకీయ భవిష్యత్తు కోసం లోపాయికారీగా అధికార పక్షంతో టచ్‌లోకి వెళ్తున్నట్లు సమాచారం.

 యాంటీ-డిఫెక్షన్ లా   చిక్కుముడులు 

రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం ఒకరిద్దరు ఎంపీలు పార్టీ మారితే వారి పదవులు ఊడిపోతాయి. కానీ, మొత్తం ఎంపీలలో మూడింట రెండొంతుల   మంది కలిసి విడిపోతే లేదా వేరే పార్టీలో విలీనమైతే చట్టబద్ధంగా వారిపై ఎలాంటి చర్యలు ఉండవు. ఆప్   విషయంలో రాఘవ్ చద్దా సరిగ్గా ఇదే ఫార్ములాను వాడారు. తృణమూల్ ఎంపీలదీ ఇదే ఫార్ములా.  ఇప్పుడు కాంగ్రెస్‌లోనూ ఇదే తరహా గ్రూపును తయారు చేయడం బీజేపీ వ్యూహకర్తలకు అసాధ్యమేమీ కాదు.   ప్రాంతీయ పార్టీలలోనైనా, కాంగ్రెస్‌లోనైనా విచ్ఛిన్నానికి ప్రధాన కారణం అంతర్గత అసంతృప్తి, బలమైన నాయకత్వం లేకపోవడమే. ఎన్నికల్లో ఓటములు, కూటముల వైఫల్యాలు ఎదురైనప్పుడు ఎంపీలలో రక్షణ లేని భావన  మొదలవుతుంది. ఈ బలహీనతనే బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్  కు ముడిసరుకుగా వాడుకుంటుంది. ప్రాంతీయ పార్టీల నేతలు కేంద్ర దర్యాప్తు సంస్థల ఒత్తిడి ,  రాజకీయ మనుగడ కోసం లొంగిపోతుంటే, కాంగ్రెస్ ఎంపీలు సైతం తాము ఎన్నాళ్లు ప్రతిపక్షంలో కూర్చోవాలనే నైరాశ్యంతో ఈ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

 బీజేపీ అల్టిమేట్ ప్లాన్ - కాంగ్రెస్ ముక్త్ భారత్ 

బీజేపీ అగ్రనాయకత్వానికి ప్రాంతీయ పార్టీలను దెబ్బతీయడం ఎంత ముఖ్యమో, తమ ప్రధాన జాతీయ ప్రత్యర్థి అయిన కాంగ్రెస్‌ను కోలుకోకుండా చేయడం అంతకంటే ముఖ్యం. ప్రాంతీయ పార్టీల పతనం పూర్తి కాగానే, అవసరమైన తరుణంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీలోనే అతిపెద్ద చీలిక తెచ్చి, ఆ పార్టీని పార్లమెంట్‌లో నామమాత్రంగా మార్చాలనేది తెరవెనుక వ్యూహం. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీలు  బీజేపీలో విలీనమైన చరిత్ర ఉంది. అదే ఫార్ములాను ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో ఎంపీలపై ప్రయోగించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

 ఇండీ కూటమి భవిష్యత్తు ప్రశ్నార్థకమే! 

ప్రస్తుత పార్లమెంట్ నెంబర్ గేమ్ చూస్తుంటే, ఎన్డీయే కూటమి క్రమంగా రాజ్యసభలో మెజారిటీకి చేరువవుతోంది, లోక్‌సభలోనూ బలపడుతోంది. డీఎంకే, తృణమూల్, ఆప్ లాంటి శక్తులే ఒత్తిడిని తట్టుకోలేక చేతులెత్తేస్తున్న తరుణంలో... కాంగ్రెస్ పార్టీ తన ఎంపీలను ఎంతవరకు కాపాడుకోగలదనేది మిలియన్ డాలర్ల ప్రశ్నే. ఒకవేళ కాంగ్రెస్ ఎంపీలలో గనుక చీలిక వస్తే, అది ‘ఇండీ’ కూటమి పతనానికి ఆఖరి మేకు  కొట్టినట్లవుతుంది. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

New Political Parties in Telangana: తెలంగాణలో కొత్త పార్టీల ప్రచారం - కల్వకుంట్ల కవిత తెలంగాణ రక్షణ సేన స్పీడ్.. రేవంత్ రెడ్డి, హరీష్ రావులపై పొలిటికల్ రూమర్స్!
తెలంగాణలో కొత్త పార్టీల ప్రచారం - కల్వకుంట్ల కవిత తెలంగాణ రక్షణ సేన స్పీడ్.. రేవంత్ రెడ్డి, హరీష్ రావులపై పొలిటికల్ రూమర్స్!
Almatti Dam Height Dispute 2026: దక్షిణాది జలవివాదాలకు ముగింపు - ముగ్గురు సీఎంలది ఒకే సంకల్పం - ఆల్మట్టి వివాదాలూ తేల్చేసుకుంటారా?
దక్షిణాది జలవివాదాలకు ముగింపు - ముగ్గురు సీఎంలది ఒకే సంకల్పం - ఆల్మట్టి వివాదాలూ తేల్చేసుకుంటారా?
Telangana Cabinet Expansion Postponed 2026: తెలంగాణ కాంగ్రెస్‌లో మీనాక్షి నటరాజన్ సెగ - కేబినెట్ విస్తరణ ఒక మిథ్యేనా? శల్యపరీక్షలో రాహుల్-రేవంత్ వ్యూహం!
తెలంగాణ కాంగ్రెస్‌లో మీనాక్షి నటరాజన్ సెగ - కేబినెట్ విస్తరణ ఒక మిథ్యేనా? శల్యపరీక్షలో రాహుల్-రేవంత్ వ్యూహం!
Modi Cabinet Reshuffle 2026: కేంద్ర కేబినెట్ విస్తరణ - విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అవుట్? జెన్‌జీని మోదీ చల్లబరుస్తారా?
కేంద్ర కేబినెట్ విస్తరణ - విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అవుట్? జెన్‌జీని మోదీ చల్లబరుస్తారా?
Advertisement

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indiramma Housing Scheme: ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
Afghanistan Earthquake: అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
Tirumala Devotees Rush: తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Made in Jonnagiri Gold Biscuits: బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
KTR Politics: కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
NRI Priest Arrest: పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
Vizag Land Scam: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
Jai Moondra Cricket Career: ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
Embed widget