అన్వేషించండి

Amaravati Bill approved: లోక్‌సభలో అమరావతి బిల్లు ఆమోదం - ఇండీ కూటమి పార్టీలు కూడా మద్దతు!

AP Capital Bill: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని చేరుస్తూ విభజన చట్టానికి చేసిన సవరణ బిల్లు లోక్‌సభ ఆమోదం పొందింది. ఇండీ కూటమి పార్టీలు కూడా మద్దతు తెలిపాయి.

Amaravati billapproved in Loksabha: లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన (సవరణ) బిల్లు-2026కు ఆమోదం లభించింది.  ఆంధ్రప్రదేశ్ ఏకైక శాశ్వత రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన  ఆంధ్రప్రదేశ్ పునర్విభజన  సవరణ  బిల్లు-2026 కు లోక్‌సభ బుధవారం ఆమోదం తెలిపింది. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ సుదీర్ఘ చర్చలో వైఎస్ఆర్‌సీపీ మినహా అన్ని పార్టీలు సమర్థించాయి.  పదేళ్లుగా నెలకొన్న అనిశ్చితికి తెరదించుతూ, 2024 జూన్ 2 నుండి అమరావతిని అధికారిక రాజధానిగా గుర్తించేలా ఈ బిల్లులో నిబంధనలను చేర్చారు. ఈ బిల్లు ఆమోదంతో అమరావతికి రాజ్యాంగబద్ధమైన గుర్తింపు లభించినట్లయింది.                     

అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. మూజువాణీ ఓటు ద్వారా బిల్లుకు ఆమోదం తెలిపారు. అనంతరం ఈ బిల్లు రాజ్యసభకు వెళ్లనుంది.#Amaravathi #amaravathiresolution #APCapital #LokSabha #ABPDesam pic.twitter.com/jxgHaChesq

 ఈ చర్చలో  ఇండీ   కూటమి అనూహ్యంగా బిల్లుకు మద్దతు ప్రకటించడం విశేషం. కాంగ్రెస్ పార్టీ తరపున మాణికం ఠాగూర్ వంటి నేతలు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజధాని ఏర్పాటు ఉండాలని, అమరావతికి తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. కేవలం రాజకీయాల కోసం కాకుండా రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రతిపక్ష సభ్యులు పేర్కొన్నారు. దీంతో బిల్లుపై చర్చలో మెజారిటీ పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి సానుకూలత వ్యక్తం చేశాయి.  

అయితే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించింది. వైసీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్  చేశారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఈ చర్చకు సమాధానమిస్తూ.. ఏపీ అసెంబ్లీ తీర్మానం మేరకే ఈ సవరణ చేస్తున్నామని, ఇది రాష్ట్ర ప్రగతికి ఊతమిస్తుందని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు , ఇతర విభజన హామీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. చర్చ అనంతరం స్పీకర్ ఓం బిర్లా సమక్షంలో మూజువాణి ఓటు ద్వారా ఈ బిల్లును ఆమోదించారు. గురువారం ఈ బిల్లు రాజ్యసభ ముందుకు వెళ్లనుంది.  రాజ్యసభలో ఆమోదం తర్వాత రాష్ట్రపతి కి పంపుతారు . అక్కడ తుది ఆమోదం తరవాత గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. దాంతో ఏపీ రాజధానిగా అమరావతి శాశ్వతం అవుతుంది.  మళ్లీ మార్చాలంటే..  పార్లమెంట్ లోనే చట్టం చేయాల్సి ఉంటుంది.           

టాప్ హెడ్ లైన్స్

Breaking News: అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్షను సమర్థించిన గుజరాత్ హైకోర్టు
అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్షను సమర్థించిన గుజరాత్ హైకోర్టు
Nara Lokesh: దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
Andhra Pradesh Zones: 2 మల్టీ జోన్లు... 6 జోన్లు- 26 జిల్లాల ప్రకారం ఏపీలో ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు
2 మల్టీ జోన్లు... 6 జోన్లు- 26 జిల్లాల ప్రకారం ఏపీలో ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు
Pradhan Mantri Fasal Bima Yojana: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పంట బీమా పథకాల అమలుకు ఉత్తర్వులు
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పంట బీమా పథకాల అమలుకు ఉత్తర్వులు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
DSP Bheem Reddy Remand: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
Modi Cabinet Expansion Postponed: మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
Ahmedabad Serial Blasts: అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
Cristiano Ronaldo Retirement: స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
Andhra Pradesh Zones: 2 మల్టీ జోన్లు... 6 జోన్లు- 26 జిల్లాల ప్రకారం ఏపీలో ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు
2 మల్టీ జోన్లు... 6 జోన్లు- 26 జిల్లాల ప్రకారం ఏపీలో ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు
Jangaon Crime News: నగ్నంగా మహిళ ఇంట్లోకి ప్రవేశించిన కౌన్సిలర్.. నోరు మూసి అత్యాచారయత్నం! జనగామలో దారుణం
నగ్నంగా మహిళ ఇంట్లోకి ప్రవేశించిన కౌన్సిలర్.. నోరు మూసి అత్యాచారయత్నం! జనగామలో దారుణం
Pradhan Mantri Fasal Bima Yojana: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పంట బీమా పథకాల అమలుకు ఉత్తర్వులు
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పంట బీమా పథకాల అమలుకు ఉత్తర్వులు
Embed widget