అన్వేషించండి

YCP opposes capital bill: రాజధాని బిల్లును లోక్‌సభలో వ్యతిరేకించిన వైసీపీ - వాకౌట్ చేసిన ఎంపీలు

Capital Bill: రాజధాని బిల్లును వ్యతిరేకిస్తూ వైసీపీ ఎంపీలు లోక్‌సభ నుంచి వాకౌట్ చేశారు. ప్రస్తుత రూపంలో తాము బిల్లును వ్యతిరేకిస్తున్నట్లుగా మిథున్ రెడ్డి స్పష్టం చేశారు.

YSRCP  opposing Capital Bill: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతి బిల్లును లోక్ సభలో వ్యతిరేకించింది. అమరావతికి వ్యతిరేకం కాదని తాము చర్చలో పాల్గొంటామని మిథున్ రెడ్డి సమావేశం ప్రారంభానికి ముందు మీడియా ప్రతినిధులతో చెప్పారు. అయితే సభలో చర్చ ప్రారంభమయ్యే సరికి పూర్తిగా వ్యూహం మారిపోయింది. తాడేపల్లిలో జగన్ మోహన్ రెడ్డి ప్రెస్మీట్ చూసిన తర్వాత మిథున్ రెడ్డి తన వ్యూహం మార్చుకున్నారేమో కానీ..  ప్రస్తుత రూపంలో తాము బిల్లును వ్యతిరేకిస్తున్నామని చెప్పి వాకౌట్ చేస్తున్నట్లుగా ప్రకటించి . .. మిగిలిన ముగ్గురు ఎంపీలతో కలిసి బయటకు వెళ్లిపోయారు.               

అమరావతికి వ్యతిరేకం కాదు కానీ ..బిల్లుకు వ్యతిరేకమన్న మిథున్ రెడ్డి                 

ప్రసంగంలో మిథున్ రెడ్డి బిల్లును వ్యతిరేకిస్తూనే తమ పార్టీ అమరావతికి వ్యతిరేకం కాదని, కానీ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధిని ఆకాంక్షిస్తుందని స్పష్టం చేశారు. కేవలం ఒకే ప్రాంతానికి రూ. 15 వేల కోట్లు కేటాయించడం వల్ల మిగిలిన వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్రలు నిర్లక్ష్యానికి గురవుతాయన్నారు.   కేంద్రం ఇచ్చే ఈ నిధులు గ్రాంటుగా ఉండాలని, అప్పుల రూపంలో ఇస్తే రాష్ట్రం మరింత ఆర్థిక సంక్షోభంలో పడుతుందన్నారు. రాజధాని నిర్ణయం అన్నది రాష్ట్ర నిర్ణయం అని గతంలో కేంద్రం హైకోర్టులో అఫిడవిట్ వేసిందన్నారు. అమరావతి రైతులకు ప్లాట్లు ఎప్పుడిస్తారో బిల్లులో పెట్టాలన్నారు. ఇప్పటికే యాభై వేల ఎకరాలున్నాయని..మరో యాభై వేల ఎకరాలెందుకని మితున్ రెడ్డి ప్రశ్నించారు.                                   

విభజన హామీలను కేంద్ర విస్మరించిందని మిథున్ రెడ్డి విమర్శలు                         

విభజన చట్టంలోని హామీలను కేంద్రం అమలు చేయడం లేదన్నారు.  ఏడు వెనుకబడిన జిల్లాలకు ఇస్తామన్న బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీని వెంటనే విడుదల చేయాలని కోరారు.  రాజధాని కోసం తీసుకున్న రుణాలు భవిష్యత్తులో రాష్ట్ర ప్రజలపై భారంగా మారుతాయని, ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలని కోరారు. అలాగే, పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను విడుదల చేయాలని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని విస్మరించకూడదని ఆయన ప్రసంగంలో  చెప్పారు.    

వికేంద్రీకరణ ఆలోచనను కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదని వైసీపీ వాకౌట్                                  

కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పట్ల చూపిస్తున్న వివక్షకు నిరసనగా వైఎస్సార్‌సీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు. కేవలం ఒకే నగరానికి ప్రాధాన్యత ఇస్తూ, రాష్ట్రం మొత్తం సమతుల్యంగా ఎదగాలన్న వికేంద్రీకరణ ఆలోచనను కేంద్రం పరిగణనలోకి తీసుకోకపోవడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు.   రాష్ట్ర ప్రయోజనాల కోసం, వెనుకబడిన ప్రాంతాల హక్కుల కోసం తమ పోరాటం పార్లమెంటు లోపల , వెలుపల కొనసాగుతుందని చెప్పారు. 

 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
Netanna Sevalo Scheme: ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
Uravakonda latest News: ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
498A IPC to Live In Relationships: సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
Telangana Constable: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
Spider Man Collections : ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
Netanna Sevalo Scheme: ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Varanasi : వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
Embed widget