అన్వేషించండి

AP Capital MAVIGUN: రాజధాని అమరావతి కాదు, మావిగన్- వైసీపీ ప్లాన్ B పై జగన్ కీలక వ్యాఖ్యలు

YS Jagan | ఏపీ రాజధానికి సంబంధించిన బిల్లు లోక్‌సభలో ప్రవేశపెట్టిన సమయంలో మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మచిలిపట్నం, విజయవాడ, గుంటూర్ లకు పొడిగిస్తూ రాజధానికి మావిగన్ అని పేరు పెట్టాలన్నారు.

AP Capital Amaravati | న్యూఢిల్లీ /అమరావతి: అమరావతికి చట్టబద్ధత కల్పించే అంశానికి సంబంధించి రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లు లోక్‌సభలో ప్రవేశపెట్టిన సమయంలో ఏపీ రాజధాని అంశంపై వైఎస్సార్ సీపీ ప్లాన్ బీ తెరమీదకు తెచ్చింది. మచిలీపట్నం- విజయవాడ- గుంటూరు వరకూ కొత్త రాజధానిని ప్రకటించాలని... దానికి MAVIGUN(మావిగన్) అని పేరు పెట్టాలని ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. మచిలీపట్నం (MA)- విజయవాడ (Vi)- గుంటూరు (GUN) పేర్లతో మావిగన్ పేరు పెట్టాలని.. తన పేరు వస్తుందనిపిస్తే మరో పేరు పెట్టాలని జగన్ సూచించారు. ఓవైపు అమరావతికి తాము వ్యతిరేకం కాదంటూనే అన్ని ప్రాంతాల అభివృద్ధి కోరుకుంటున్నామని స్పష్టం చేశారు. అంతలోనే రాజధాని అంశంలో కొత్త రాజధాని పేరు తెరమీదకు తేవడం ఏపీ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.

తాడేపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జగన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘రాజధాని అంశంపై మేం చెప్పిన విషయం నచ్చకపోతే ప్లాన్ బీ కూడా ఇచ్చాం. దానిపై నిర్ణయం తీసుకున్నా ప్రయోజనం ఉంటుంది. మచిలీపట్నం నుంచి విజయవాడ 70 కి.మీ.. విజయవాడ నుంచి గుంటూరు 40 కి.మీ.. ఉంటుంది. నేషనల్ హైవే ఉన్న ఈ ఏరియాను క్యాపిటల్ గా తీసుకుని అభివృద్ధి చేయండి. మచిలీపట్నం నుంచి MA, విజయవాడ నుంచి VI, గుంటూరు నుంచి GUN తీసుకోండి. రాజధానికి మావిగన్ అని పేరు పెట్టండి. గన్ అయితే బాగుండదనుకుంటే, జగన్ గుర్తొస్తారనుకుంటే వేరే పేరు పెట్టి 110 కి.మీ క్యాపిటల్ కారిడార్ ఏర్పాటు చేస్తే ప్రయోజనం ఉంటుంది. మచిలీపట్నంలో వైసీపీ హయాంలో పోర్టుకు శ్రీకారం చుట్టాం. పర్మిషన్లు తెచ్చి, పని మొదలుపెట్టాం. ల్యాండ్ కొనుగోలు చేసి ఇచ్చాం. ఆర్థిక పరమైన ఏర్పాట్లు చేశాం. ఈరోజు చెన్నై, బాంబే పోర్ట్ సిటీలుగా ఉన్నాయి.  2 లక్షల కోట్లలో పది శాతం నిధులు ఖర్చు చేస్తే ఈ మావిగన్ రాజధాని ఏర్పాటు అవుతుందని’ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

అమరావతి చట్టబద్ధతపై వైఎస్ జగన్ ధ్వజం

అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఘాటుగా స్పందించారు. రాజ్యాంగంలో రాష్ట్ర రాజధాని అనే పదమే లేదని, అసెంబ్లీలో తీర్మానం చేయడం కేవలం చంద్రబాబు ఆడుతున్న డ్రామా అని విమర్శించారు. ఒక ప్రభుత్వం తెచ్చిన సవరణలను మరో ప్రభుత్వం మార్చలేదా అని ఆయన ప్రశ్నించారు. అమరావతి అభివృద్ధి పేరుతో గత ఏడేళ్లలో కేవలం 8000 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసి, ఇప్పుడు ₹2 లక్షల కోట్ల అంచనాలతో అవినీతికి తెరలేపుతున్నారని మండిపడ్డారు.

లక్ష ఎకరాల్లో మౌలిక సదుపాయాల కోసం ఎకరాకు ₹2 కోట్లు ఖర్చవుతుందని చెప్పడం హాస్యాస్పదమని, ఇది దశాబ్దాల కాలం పట్టే ప్రక్రియ అని జగన్ పేర్కొన్నారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతుల ప్రయోజనాలను కాపాడటమే తమ ప్రాధాన్యతని, కేంద్రం తెచ్చే బిల్లుపై పార్లమెంటులో వైసీపీ ఎంపీలు గళమెత్తుతారని స్పష్టం చేశారు. బాహుబలి సెట్టింగ్స్ చూపిస్తూ చంద్రబాబు ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.

ఏపీ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు బుధవారం పార్లమెంటు ముందుకు వచ్చింది. గతంలో ఏపీ రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ విభజన చట్టం- 2014లోని సెక్షన్‌ 5(2)కి సవరణ చేస్తూ కేంద్రం రూపొందించిన బిల్లును హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టడంతో చర్చ మొదలైంది. ఈ బిల్లుకు కాంగ్రెస్ మద్దతు తెలిపింది. ఎంపీ మాణిక్కం ఠాగూర్ మాట్లాడుతూ.. విభజన హామీలు ఇంకా నెరవేర్చలేదన్నారు. ముఖ్యంగా ప్రత్యేక హోదా హామీ ఇంకా పెండింగ్ లో ఉందన్నారు.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

SIR in Andhra Pradesh: ఓటర్ల జాబితా సవరణకు నేటితో యుగియనున్న గడువు.. 39.8 లక్షల అన్ కలెక్టబుల్ ఎన్యూమరేషన్ పత్రాలు
ఓటర్ల జాబితా సవరణకు నేటితో యుగియనున్న గడువు.. 39.8 లక్షల అన్ కలెక్టబుల్ ఎన్యూమరేషన్ పత్రాలు
Yarlagadda Venkatrao: ప్రత్యర్థులకు ప్రభుత్వం కాంట్రాక్టులు, టీడీపీ కార్యకర్తల్లో అసంతృప్తి: ఎమ్మెల్యే యార్లగడ్డ
ప్రత్యర్థులకు ప్రభుత్వం కాంట్రాక్టులు, టీడీపీ కార్యకర్తల్లో అసంతృప్తి: ఎమ్మెల్యే యార్లగడ్డ
Andhra Pradesh RTGS: భార్య బైక్ కొట్టేసిన భర్త! పట్టించిన చంద్రబాబు టెక్నాలజీ! ఒక్క దెబ్బకు 80 కేసులు ఛేదించిన పోలీసులు!
భార్య బైక్ కొట్టేసిన భర్త! పట్టించిన చంద్రబాబు టెక్నాలజీ! ఒక్క దెబ్బకు 80 కేసులు ఛేదించిన పోలీసులు!
Supreme Court: పోలవరం వివాదం.. సుప్రీంకోర్టులో తెలంగాణకు చుక్కెదురు, ఏపీకి నోటీసులు ఇచ్చేందుకు నిరాకరణ
పోలవరం వివాదం.. సుప్రీంకోర్టులో తెలంగాణకు చుక్కెదురు, ఏపీకి నోటీసులు ఇచ్చేందుకు నిరాకరణ

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mudragada Padmanabham Funeral:ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వివాదం! కుమార్తె రాకను అడ్డుకున్న కుటుంబం! కిర్లంపూడిలో ఉద్రిక్తత!
ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వివాదం! కుమార్తె రాకను అడ్డుకున్న కుటుంబం! కిర్లంపూడిలో ఉద్రిక్తత!
HYDRAA Demolitions: హైడ్రా టార్గెట్ చేస్తున్న ప్రాజెక్టులన్నీ కేటీఆర్ సన్నిహితులవేనా ? - తెలంగాణ రాజకీయాల్లో తెర వెనుక ఏం జరుగుతోంది?
హైడ్రా టార్గెట్ చేస్తున్న ప్రాజెక్టులన్నీ కేటీఆర్ సన్నిహితులవేనా ? - తెలంగాణ రాజకీయాల్లో తెర వెనుక ఏం జరుగుతోంది?
Kaleshwaram Project: కాళేశ్వరం నీళ్లు వదలకుంటే హైదరాబాద్‌లో బిందెల యుద్ధమే :ABP Desamతో మాజీ ఇరిగేషన్ ఇంజనీర్ టి. వెంటేశం
కాళేశ్వరం నీళ్లు వదలకుంటే హైదరాబాద్‌లో బిందెల యుద్ధమే :ABP Desamతో మాజీ ఇరిగేషన్ ఇంజనీర్ టి. వెంటేశం
US Iran War: తీవ్ర స్థాయికి అమెరికా, ఇరాన్‌ మధ్య యుద్ధం! 20 యుద్ధనౌకలు, వందలాది ఫైటర్ జెట్‌లతో హోర్ముజ్‌తో రౌండప్‌!
తీవ్ర స్థాయికి అమెరికా, ఇరాన్‌ మధ్య యుద్ధం! 20 యుద్ధనౌకలు, వందలాది ఫైటర్ జెట్‌లతో హోర్ముజ్‌తో రౌండప్‌!
TTD Latest News: తిరుమల ట్రస్టులు, పథకాల దాత‌ల ప్రివిలేజెస్‌లో భారీ మార్పులు! ఒంటిమిట్ట అభివృద్ధికి నిధులు! టీటీడీ కీలక నిర్ణయాలు! 
తిరుమల ట్రస్టులు, పథకాల దాత‌ల ప్రివిలేజెస్‌లో భారీ మార్పులు! ఒంటిమిట్ట అభివృద్ధికి నిధులు! టీటీడీ కీలక నిర్ణయాలు! 
Telangana Latest News: 9,000 రూపాయల ఖరీదు చేసే డ్రోన్ 91 రూపాయలకే! టీబీ రోగుల పాలిట వరంలా సేవలు! 
9,000 రూపాయల ఖరీదు చేసే డ్రోన్ 91 రూపాయలకే! టీబీ రోగుల పాలిట వరంలా సేవలు! 
Visakhapatnam Latest News:వందల సంఖ్యలో జంతువుల సంరక్షణకు ఒకడే పశువైద్యుడా? విశాఖ జూలో ఉద్యోగ ఖాళీలపై అయ్యన్న విస్మయం!
వందల సంఖ్యలో జంతువుల సంరక్షణకు ఒకడే పశువైద్యుడా? విశాఖ జూలో ఉద్యోగ ఖాళీలపై అయ్యన్న విస్మయం!
Maruti S-Presso Price in Hyderabad: హైదరాబాద్‌లో మారుతి ఎస్‌ప్రెస్సో ఆన్‌రోడ్ ధరలు! వేరియంట్స్, మైలేజీ పూర్తి వివరాలు ఇవే!
హైదరాబాద్‌లో మారుతి ఎస్‌ప్రెస్సో ఆన్‌రోడ్ ధరలు! వేరియంట్స్, మైలేజీ పూర్తి వివరాలు ఇవే!
Embed widget