అన్వేషించండి

Hindupur YSRCP : హిందూపురం వైఎస్ఆర్‌సీపీ నేతల తిరుగుబాటు - ఆయనొస్తే ఎవరూ వెళ్లరట !

ఎంపీ మాధవ్ హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటిస్తూ ఎవరం హాజరు కాబోమని ఇతర నేతలు ప్రకటించారు. స్థానికులే ఇంచార్జులుగా కావాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు.


హిందూపురం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తమ ఆధిపత్య పోరాటాన్ని మరో స్టేజ్‌కుతీసుకు వెళ్తున్నారు. మొన్నటి వరకూ నాలుగు గ్రూపులు ఒకరిపై ఒకరు పోరాటం చేసుకోగా.. ఇప్పుడు మూడు గ్రూపులు ఏకమై మరో గ్రూప్‌పై పోరాటం ప్రారంభించాయి. వైఎస్ఆర్‌సీపీలో హిందూపురం నేతల కథ కీలక మలుపులు తిరుగుతోంది. ప్రస్తుతం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకూ హిందూపురంలో ఎమ్మెల్సీ ఇక్బాల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నడిచింది. ఆయన వ్యక్తిగత పర్యటన కోసం విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా తన నియోజకవర్గంలో కార్యక్రమాన్ని చూసుకోవాల్సిందిగా ఆయన ఎంపీ మాధవ్‌కు అప్పజెప్పారు. దీంతో  మిగిలిన నేతలు అవమానం ఫీలయ్యారు. 
  
మొన్నటి వరకు ఎంపీ మాధవ్ ను హిందూపూర్ వైపు తిరిగి చూడనివ్వకుండా చేసి ..తీరా విదేశాలకు వెళుతున్నప్పుడు మాత్రం పగ్గాలు మాధవ్ కు అప్పజెప్పడం ఏంటని ఇతర నేతలు ప్రశ్నిస్తున్నారు.  గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమాలు నిర్వహించే సత్తా తమకు కూడా ఉందంటున్నారు. హిందూపురం వైఎస్ఆర్‌సీపీకి   మాజీ సమన్వయకర్తలు నవీన్ నిశ్చల్, అబ్దుల్ గని, కొండూరు వేణుగోపాల్ రెడ్డి ఉన్నారు. వీరిలో ఒకరంటే ఒకరికి పడదు. ఇప్పుడు ఇక్బాల్... తమ ముగ్గురిలో ఎవరినీ కాదని మళ్లీ ఎంపీని తెచ్చి పెట్టడంతో ముగ్గురు నేతలూ  విభేదాలు పక్కన పెట్టి ఇప్పుడు ఏకతాటి పైకి వచ్చారు. 

ఎమ్మెల్సీ ఇక్బాల్ మాజీ పోలీస్ అధికారి.. ఎంపీ మాధవ్ కూడా సీఐగా పని చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని  ఈ పోలీసు బాసులు మాకు వద్దు.. ఇన్చార్జిలుగా మా హిందూ పురానికి చెందిన స్థానికులకే అవకాశం ఇవ్వాలంటూ లోకల్ సెంటిమెంట్ ను  వినిపించడం ప్రారంభించారు. ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ వైసిపి నాయకులు అందరూ బెంగళూరు సమీపంలోని ని దేవనహళ్లి లో ప్రైవేట్ రిసార్టులో రహస్య సమావేశాన్ని నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించారు.  

హిందూపురం లోని బాల యేసు విద్యా సంస్థలో సమావేశం నిర్వహించి రెండు రోజుల్లో బహిరంగ సభ నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నారు. దీంతో హిందూపురం నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు జోరుగా మారుతున్నాయి.  ఎమ్మెల్సీ ఇక్బాల్ , ఎంపీ గోరంట్ల మాధవ్ నాయకత్వం మాకు వద్దంటూ తెగేసి చెబుతున్నారు.  దీంతో ఇప్పటికే  చీలికలు పీలికలు గా ఉన్న వైసిపి కి హిందూపురంలో మరిన్ని కష్టాలు తప్పేలా లేవు.  గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఎంపీ గోరంట్ల మాధవ్ వస్తే ఎవరు హాజరు కాకుండా నిర్ణయం తీసుకున్నారు.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget