అన్వేషించండి

Congress Joinings: ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు షాక్ - కాంగ్రెస్ లో చేరిన రంజిత్ రెడ్డి, దానం నాగేందర్

Tealngana News: బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నేతలు రంజిత్ రెడ్డి, దానం నాగేందర్ ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్, రాష్ట్ర ఏఐసీసీ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో హస్తం పార్టీలో చేరారు.

Brs Leaders Danam And Ranjith Reddy Joined in Congress: లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బల తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన కీలక నేతలు చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్జి (Ranjith Reddy), ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagendar) ఆదివారం కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ ఏఐసీసీ ఇంఛార్జీ దీపాదాస్ మున్షీ.. వారికి హస్తం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా, ఆదివారం ఉదయమే రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల దృష్ట్యా తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అటు, దానం నాగేందర్ ఇటీవలే సీఎం రేవంత్ ను కలిశారు. బీఆర్ఎస్ ను వీడే ప్రసక్తే లేదని.. నియోజకవర్గ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. అయితే, తాజాగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా..

ఎన్నికల నేపథ్యంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో చేరికలు ఎక్కువవుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నేతలను హస్తం పార్టీలో చేరేలా సీఎం రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారు. రంజిత్ రెడ్డిని చేవెళ్ల పార్లమెంట్ స్థానం నుంచే బరిలో నిలపాలని కాంగ్రెస్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి పట్నం మహేందర్ రెడ్డి భార్య సునీతారెడ్డి చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తారనే ప్రచారం సాగింది. అయితే, ఆమెను మల్కాజిగిరి నుంచి బరిలో నిలపాలనే యోచనతో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక, ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దానం ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత 2018లో ఆయన బీఆర్ఎస్ లో చేరారు. ఇటీవల సీఎం రేవంత్ ను కలిసిన దానం.. ప్రజల, నియోజకవర్గం సమస్యలు వివరించేందుకే ఆయన్ను కలిశానని.. బీఆర్ఎస్ ను వీడే ప్రసక్తే లేదని తెలిపారు. అయితే, అనూహ్యంగా గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. సికింద్రాబాద్ ఎంపీగా దానం పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, సీఎం రేవంత్ రెడ్డిని తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, యాదయ్య కలిశారు. అలాగే, ఇటీవల కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో మల్కాజిగిరి, మేడ్చల్ ఎమ్మెల్యేలు, మల్లారెడ్డి భేటీ అయ్యారు.

బీఆర్ఎస్ కు ఐదుగురు ఎంపీలు గుడ్ బై
Congress Joinings: ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు షాక్ - కాంగ్రెస్ లో చేరిన రంజిత్ రెడ్డి, దానం నాగేందర్

తెలంగాణలో 2019 లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున గెలుపొందిన ఐదుగురు ఎంపీలు ఆ పార్టీని వీడారు. జహీరాబాద్, నాగర్ కర్నూలు ఎంపీలు బీబీ పాటిల్, రాములు ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అలాగే, పెద్దపల్లి, వరంగల్ ఎంపీలు వెంకటేశ్ నేత, పసునూరి దయాకర్ గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి సైతం బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. దీంతో, బీఆర్ఎస్ కు ప్రస్తుతం నలుగురు ఎంపీలు మాత్రమే ఉన్నారు.

Also Read: Aroori Ramesh: బీజేపీలో చేరిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే - రెండ్రోజుల్లోనే ట్విస్ట్!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Visakhapatnam News: వైజాగ్ టూరిస్ట్ లకు గుడ్‌న్యూస్.. ఇకపై మ్యూజియాలన్నీ ఉదయమే ఓపెన్: VMRDA చైర్మన్ ప్రణవ్
వైజాగ్ టూరిస్ట్ లకు గుడ్‌న్యూస్.. ఇకపై మ్యూజియాలన్నీ ఉదయమే ఓపెన్: VMRDA చైర్మన్ ప్రణవ్
Vijayawada Temple Power Cut: విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
Taiwan Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
Amaravati Farmers: ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై

వీడియోలు

India vs Sri Lanka 3rd T20 Highlights | మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం
Rohit Sharma Golden Duck | రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్
Virat Kohli Half Century in Vijay Hazare Trophy | 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన కింగ్
Rinku Singh Century in Vijay Hazare Trophy | విజయ్ హజారే ట్రోఫీలీ రింకూ సింగ్ సెంచరీ
Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam News: వైజాగ్ టూరిస్ట్ లకు గుడ్‌న్యూస్.. ఇకపై మ్యూజియాలన్నీ ఉదయమే ఓపెన్: VMRDA చైర్మన్ ప్రణవ్
వైజాగ్ టూరిస్ట్ లకు గుడ్‌న్యూస్.. ఇకపై మ్యూజియాలన్నీ ఉదయమే ఓపెన్: VMRDA చైర్మన్ ప్రణవ్
Vijayawada Temple Power Cut: విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
Taiwan Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
Amaravati Farmers: ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
YSRCP Politics: ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
Year Ender 2025: ఈ ఏడాది NPS లో 5 భారీ మార్పులు.. ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే రూల్స్ ఇవే
ఈ ఏడాది NPS లో 5 భారీ మార్పులు.. ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే రూల్స్ ఇవే
Hyderabad Crime Report: హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
Embed widget