అన్వేషించండి

వైఎస్‌ఆర్‌సీపీ నేతలతో సీఎం జగన్ కీలక భేటీ- ఏం చెప్పబోతున్నారు?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో జరిగే సమావేశంలో సీఎం ఏమి చెప్తారు? ఏమని దిశానిర్దేశం చేస్తారు? గృహ సారథుల ఎంపిక  జరగక పోవడంపై సీఎం  జగన్ అసంతృప్తితో ఉన్నారా? 

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ రీజనల్‌ ఇంఛార్జ్‌ల ముఖ్యనేతలతో సీఎం జగన్ మోహన్ రెడ్డి సమావేశమవుతున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంతోపాటు కీలక అంశాలు చర్చిస్తారని టాక్ నడుస్తోంది. గృహ సారథుల ఎంపిక నెలాఖరులోగా పూర్తి చేయాలని జగన్ ఆదేశించారు. కానీ ఇంత వరకు ఆ ప్రక్రియ పూర్తి కాలేదని తెలుస్తోంది. మరో వారంలోపు దీన్ని పూర్తి చేసేందుకు మరో అవకాశం ఇవ్వాలని సీఎం జగన్‌ను నేతలు రిక్వస్ట్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. దీనికి సీఎం అంగీకరిస్తారా లేకుంటే నేతలకు క్లాస్ తీసుకుంటారా అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. 

కొన్ని  జిల్లాల్లో  పార్టీ  నేతల  మధ్య  విభేదాలు  ఈ భేటీలో ప్రస్తావనకు రానున్నాయి.  అత్యంత  కీలకమైన  నెల్లూరు  జిల్లాలో  పరిస్థితి ఇబ్బందిగా  ఉంది. ఒకవైవు  కోటంరెడ్డి, మరోవైపు  ఆనం. దీంతో  ఇలాంటి  ఇబ్బందులు  ఉన్న  జిల్లాలపై  ప్రధానంగా  దృష్టి పెట్టనున్నారు  సీఎం  జగన్. అదే జాబితాలో ఉమ్మడి కృష్ణా జిల్లా కూడా ఉందని నేతలు చెబుతున్నారు. మచిలీపట్టణం పార్లమెంట్ పరిధిలో ఎంపీ బాలశౌరితో అవనిగడ్డ శాసన సభ్యుడు సింహాద్రి రమేష్, మచిలీపట్టణం శాసన సభ్యుడు మాజీ మంత్రి పేర్ని నాని మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. ఎంపీకి వ్యతిరేకంగా రెండు నియోజకవర్గాలకు చెందిన శాసన సభ్యులు, వారి అనుచురులు బాహాటంగా గొడవలకు దిగారు. ఈ పంచాయితీ కూడ జగన్ టేబుల్‌పై ఉంది.

మైలవరం, పెడన నియోజకవర్గాలకు చెందిన శాసన సభ్యుల వ్యవహరం కూడ జగన్ లిస్ట్‌లో ఉందని చెబుతున్నారు. బీసీ వర్గానికి చెందిన మంత్రి కావటంతో జోగి రమేష్‌కు అత్యంత వెయిట్ ఇస్తున్నారు సీఎం జగన్. దీంతో పార్టీలోనే ఇతర పెద్దలు కూడా జగన్‌నే ఫాలో అవుతున్నారు. దీంతో కమ్మ సామాజిక వర్గానికి చెందిన మైలవరం శాసన సభ్యుడు వసంత కృష్ణ ప్రసాద్ తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. నియోజకవర్గంలో తనను పని చేసుకోనివ్వకుండా మంత్రి జోగి రమేష్ రెచ్చిపోయి వ్యవహరించటంపై వసంత తీవ్ర అసహనంతో ఉన్నారు. ఇలాంటి వివాదాలు ఇంకా పలు నియోజకవర్గాల్లో కూడ ఉన్నాయి. వాటికి  ఫుల్ స్టాప్  పెట్టకపోతే  భవిష్యత్‌లో మరింత  ఇబ్బందిగా మరే  అవకాశం కూడా ఉంది. దీనిపై  చర్చ జరగనుంది.

లోకేష్ పాదయాత్ర....

ప్రస్తుతం  లోకేష్  పాదయాత్ర  జరుగుతోంది. త్వరలో  పవన్  కూడా  రెడీ అవుతారు. పొత్తులపై  కూడా దాదాపు  క్లారిటీ  వచ్చినట్టే కనిపిస్తోంది. దీంతో రెండు మూడు నెలల్లో ఇంచుమించు అసెంబ్లీ సమావేశాలు పూర్తి  అయ్యే నాటికి పార్టీలో ఉన్న  సమస్యలను  పరిష్కరించి  ముందుకు  వెళ్లే  ఆలోచనలో ఉన్నారు జగన్. దీంతో గడప గడపకు మన ప్రభుత్వంపై కూడా త్వరలో పూర్తి అవుతుంది. ఈ అంశాలపై కూడా పార్టీ నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని, ఎన్నికల వాతావరణం పూర్తిగా ఏర్పడినందు వల్ల పార్టీ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు, వాటి అమలుకు ఎలాంటి వ్యూహం ఉండాలనే అంశాలను జగన్ పార్టీ నేతలకు సూచిస్తారని అంటున్నారు.

ఎవరెవరికి వార్నింగ్
ఎమ్మెల్యేల పరిస్థితి ఎవరికి  సీట్ డౌట్ అనే అంశంపై కూడా క్లారిటీ వచ్చేస్తుందని నేతలు అంటున్నారు. ఈ అంశంపై జగన్ ముఖ్య నేతలకు  చెప్పే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతుంది. పని తీరు అంతంత మాత్రంగా ఉన్న నేతలతో జగన్ ప్రత్యేకంగా మాట్లాడటంతో పాటుగా, రాబోయే  రెండు నెలలకు టాస్క్ ఇచ్చే ఆలోచనలో కూడా ఉన్నట్టు సమాచారం. మొత్తానికి పార్టీ ముఖ్యనేతలతో జగన్ జరిపే  సమావేశం కీలకం కానుంది.

టాప్ హెడ్ లైన్స్

Malla Reddy Skips KTR Meeting:కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
HYDRAA Inaction On Owaisi Encroachments: ఓవైసీ కాలేజీలకు ప్రభుత్వం క్లీన్ చిట్ - చెరువులోనే లేదని క్లారిటీ - మజ్లిస్ కోసం రూల్స్ మార్చేశారా?
ఓవైసీ కాలేజీలకు ప్రభుత్వం క్లీన్ చిట్ - చెరువులోనే లేదని క్లారిటీ - మజ్లిస్ కోసం రూల్స్ మార్చేశారా?
Allu Arjun Political Party Rumors: ఐకాన్ స్టార్ టు పొలిటికల్ స్టార్? అల్లు అర్జున్ నయా పార్టీ ప్రచారం వెనుక అసలు నిజమెంత?
ఐకాన్ స్టార్ టు పొలిటికల్ స్టార్? అల్లు అర్జున్ నయా పార్టీ ప్రచారం వెనుక అసలు నిజమెంత?
Telangana Political Mind Games: విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?
విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
IND vs ENG T20I: బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
Embed widget