అన్వేషించండి

వైఎస్‌ఆర్‌సీపీ నేతలతో సీఎం జగన్ కీలక భేటీ- ఏం చెప్పబోతున్నారు?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో జరిగే సమావేశంలో సీఎం ఏమి చెప్తారు? ఏమని దిశానిర్దేశం చేస్తారు? గృహ సారథుల ఎంపిక  జరగక పోవడంపై సీఎం  జగన్ అసంతృప్తితో ఉన్నారా? 

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ రీజనల్‌ ఇంఛార్జ్‌ల ముఖ్యనేతలతో సీఎం జగన్ మోహన్ రెడ్డి సమావేశమవుతున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంతోపాటు కీలక అంశాలు చర్చిస్తారని టాక్ నడుస్తోంది. గృహ సారథుల ఎంపిక నెలాఖరులోగా పూర్తి చేయాలని జగన్ ఆదేశించారు. కానీ ఇంత వరకు ఆ ప్రక్రియ పూర్తి కాలేదని తెలుస్తోంది. మరో వారంలోపు దీన్ని పూర్తి చేసేందుకు మరో అవకాశం ఇవ్వాలని సీఎం జగన్‌ను నేతలు రిక్వస్ట్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. దీనికి సీఎం అంగీకరిస్తారా లేకుంటే నేతలకు క్లాస్ తీసుకుంటారా అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. 

కొన్ని  జిల్లాల్లో  పార్టీ  నేతల  మధ్య  విభేదాలు  ఈ భేటీలో ప్రస్తావనకు రానున్నాయి.  అత్యంత  కీలకమైన  నెల్లూరు  జిల్లాలో  పరిస్థితి ఇబ్బందిగా  ఉంది. ఒకవైవు  కోటంరెడ్డి, మరోవైపు  ఆనం. దీంతో  ఇలాంటి  ఇబ్బందులు  ఉన్న  జిల్లాలపై  ప్రధానంగా  దృష్టి పెట్టనున్నారు  సీఎం  జగన్. అదే జాబితాలో ఉమ్మడి కృష్ణా జిల్లా కూడా ఉందని నేతలు చెబుతున్నారు. మచిలీపట్టణం పార్లమెంట్ పరిధిలో ఎంపీ బాలశౌరితో అవనిగడ్డ శాసన సభ్యుడు సింహాద్రి రమేష్, మచిలీపట్టణం శాసన సభ్యుడు మాజీ మంత్రి పేర్ని నాని మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. ఎంపీకి వ్యతిరేకంగా రెండు నియోజకవర్గాలకు చెందిన శాసన సభ్యులు, వారి అనుచురులు బాహాటంగా గొడవలకు దిగారు. ఈ పంచాయితీ కూడ జగన్ టేబుల్‌పై ఉంది.

మైలవరం, పెడన నియోజకవర్గాలకు చెందిన శాసన సభ్యుల వ్యవహరం కూడ జగన్ లిస్ట్‌లో ఉందని చెబుతున్నారు. బీసీ వర్గానికి చెందిన మంత్రి కావటంతో జోగి రమేష్‌కు అత్యంత వెయిట్ ఇస్తున్నారు సీఎం జగన్. దీంతో పార్టీలోనే ఇతర పెద్దలు కూడా జగన్‌నే ఫాలో అవుతున్నారు. దీంతో కమ్మ సామాజిక వర్గానికి చెందిన మైలవరం శాసన సభ్యుడు వసంత కృష్ణ ప్రసాద్ తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. నియోజకవర్గంలో తనను పని చేసుకోనివ్వకుండా మంత్రి జోగి రమేష్ రెచ్చిపోయి వ్యవహరించటంపై వసంత తీవ్ర అసహనంతో ఉన్నారు. ఇలాంటి వివాదాలు ఇంకా పలు నియోజకవర్గాల్లో కూడ ఉన్నాయి. వాటికి  ఫుల్ స్టాప్  పెట్టకపోతే  భవిష్యత్‌లో మరింత  ఇబ్బందిగా మరే  అవకాశం కూడా ఉంది. దీనిపై  చర్చ జరగనుంది.

లోకేష్ పాదయాత్ర....

ప్రస్తుతం  లోకేష్  పాదయాత్ర  జరుగుతోంది. త్వరలో  పవన్  కూడా  రెడీ అవుతారు. పొత్తులపై  కూడా దాదాపు  క్లారిటీ  వచ్చినట్టే కనిపిస్తోంది. దీంతో రెండు మూడు నెలల్లో ఇంచుమించు అసెంబ్లీ సమావేశాలు పూర్తి  అయ్యే నాటికి పార్టీలో ఉన్న  సమస్యలను  పరిష్కరించి  ముందుకు  వెళ్లే  ఆలోచనలో ఉన్నారు జగన్. దీంతో గడప గడపకు మన ప్రభుత్వంపై కూడా త్వరలో పూర్తి అవుతుంది. ఈ అంశాలపై కూడా పార్టీ నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని, ఎన్నికల వాతావరణం పూర్తిగా ఏర్పడినందు వల్ల పార్టీ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు, వాటి అమలుకు ఎలాంటి వ్యూహం ఉండాలనే అంశాలను జగన్ పార్టీ నేతలకు సూచిస్తారని అంటున్నారు.

ఎవరెవరికి వార్నింగ్
ఎమ్మెల్యేల పరిస్థితి ఎవరికి  సీట్ డౌట్ అనే అంశంపై కూడా క్లారిటీ వచ్చేస్తుందని నేతలు అంటున్నారు. ఈ అంశంపై జగన్ ముఖ్య నేతలకు  చెప్పే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతుంది. పని తీరు అంతంత మాత్రంగా ఉన్న నేతలతో జగన్ ప్రత్యేకంగా మాట్లాడటంతో పాటుగా, రాబోయే  రెండు నెలలకు టాస్క్ ఇచ్చే ఆలోచనలో కూడా ఉన్నట్టు సమాచారం. మొత్తానికి పార్టీ ముఖ్యనేతలతో జగన్ జరిపే  సమావేశం కీలకం కానుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Election Commission: నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Assam Assembly Elections 2026: అస్సాం గణ పరిషత్ .. ఒకప్పుడు ఊపేసిన పార్టీ -ఇప్పుడెందుకు ఉనికి కోల్పోయింది?
అస్సాం గణ పరిషత్ .. ఒకప్పుడు ఊపేసిన పార్టీ -ఇప్పుడెందుకు ఉనికి కోల్పోయింది?

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Election Commission: నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Seetha Payanam OTT : ఓటీటీలోకి సీతాపయనం - అర్జున్ కుమార్తె లవ్ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలోకి సీతాపయనం - అర్జున్ కుమార్తె లవ్ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Petrol Pump Scam: ఇప్పుడు 0 కాదు.. పెట్రోల్- డీజిల్ సాంద్రతతో మోసం చేస్తున్న పెట్రోల్ పంపులు!
ఇప్పుడు 0 కాదు.. పెట్రోల్- డీజిల్ సాంద్రతతో మోసం చేస్తున్న పెట్రోల్ పంపులు!
Lavanya Tripathi : టార్గెట్ చేసి వేధించారు - ఒంటరిగా రూంలో కూర్చుని ఏడ్చేశా... మెగా కోడలి లైఫ్‌లో షాకింగ్ ఘటన
టార్గెట్ చేసి వేధించారు - ఒంటరిగా రూంలో కూర్చుని ఏడ్చేశా... మెగా కోడలి లైఫ్‌లో షాకింగ్ ఘటన
Embed widget