అన్వేషించండి

CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు

Andhra News: సోషల్ మీడియాలో మహిళలను కించపరిచేలా పోస్టులు పెడుతున్నారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఆ సైకోలను నియంత్రించాల్సిన అవసరం ఉందని అన్నారు.

CM Chandrababu Comments: సామాజిక మాధ్యమాల్లో విపరీత ధోరణులు కనిపిస్తున్నాయని.. వ్యక్తిత్వ హననానికి పాల్పడడం దారుణమని సీఎం చంద్రబాబు (CM Chandrababu) మండిపడ్డారు. ఢిల్లీలో పర్యటించిన ఆయన ఓ జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన లీడర్ షిప్ సమ్మిట్‌లో పాల్గొన్నారు. ప్రజల కోసం పని చేసిన తనను అక్రమ కేసులు పెట్టి వేధించారని.. చెయ్యని తప్పునకు 53 రోజులు జైలు శిక్ష అనుభవించానని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా తాను ఎక్కడా నిరాశకు గురి కాలేదని.. ధైర్యం కోల్పోలేదన్నారు. 53 రోజుల జైలు జీవితం మరింత పట్టుదల పెరిగేలా చేసిందని, ఆ పట్టుదలనే ప్రజలకు సేవ చేయడానికి ఉపయోగిస్తున్నానని అన్నారు. 'సోషల్ మీడియాలో మహిళలను కించపరిచేలా పోస్టులు పెడుతున్నారు. మమ్మల్ని మాత్రమే కాదు.. సొంత తల్లి, చెల్లిని కూడా బూతులు తిట్టిస్తున్న వాళ్లని ఏం చేయాలి.?. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోకూడదంటే ఎలా.?. సోషల్ మీడియాలో మహిళల్ని వేధించే వారిని ఎలా నియంత్రించాలనే అంశంపై తీవ్ర స్థాయిలో చర్చ జరగాలి. సామాజిక మాధ్యమాల్లో వేధించే సైకోలను నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.' అని పేర్కొన్నారు.

'తొలిసారిగా వాట్సాప్ గవర్నెన్స్'

దేశంలోనే తొలిసారిగా వాట్సాప్ గవర్నెన్స్ విధానాన్ని తీసుకొస్తున్నామని.. దీని ద్వారా ప్రజలకు నేరుగా, సులువుగా మరిన్ని సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. 'ఏపీ అన్ని రంగాల్లో అగ్రభాగాన నెంబర్ వన్‌గా ఉండాలనేదే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఏఐ, డీప్ టెక్నాలజీలను ఉపయోగించి అన్ని రంగాల్లో పరిష్కారాలు సాధించవచ్చు. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే ప్రపంచంలో ఏ మూల ఉన్నా మన పనులు మనం చేసుకుంటూ పోవచ్చు.' అని పేర్కొన్నారు.

'అందుకే ఆ నిబంధన'

'భారతదేశంలో 145 కోట్ల జనాభా ఉంది. పాపులేషన్ మేనేజ్మెంట్ చేస్తే ప్రపంచంలో మనల్ని కొట్టేవారే ఉండరు. మనం ప్రణాళికాబద్ధంగా అమల్లోకి తీసుకువస్తే.. 30 - 40 కోట్ల మంది భారతీయులు ప్రపంచంలో అన్ని మూలలకు వెళ్లి పని చేసి దేశానికి ఆదాయం తీసుకొస్తారు. ఒకప్పుడు ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండా నిబంధనలు పెట్టాను. ఇప్పుడు ఆ నిబంధన తొలగించి.. కనీసం ఇద్దరు పిల్లలుంటే తప్ప పోటీకి అర్హత లేదని పెట్టాలని చెబుతున్నా. మానవ వనరులు, నైపుణ్యాల అభివృద్ధి జరగాలి. అందుకు అనుగుణంగా పెద్ద ఎత్తున ఉపాధి, ఉద్యోగ కల్పన జరగాలి. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఒకటో తరగతి నుంచే ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి.' అని చంద్రబాబు పేర్కొన్నారు.

'కూటమి దీర్ఘకాలం కొనసాగుతుంది'

'ఏపీలో 2029 ఎన్నికలకు ఇప్పటి నుంచే సమాయత్తం అవుతున్నాం. రాష్ట్రంలో గత ప్రభుత్వ పాలన పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత, అసంతృప్తితో పాటు.. ఎన్డీయే కూటమిపై జనానికి భరోసా కలిగింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా వస్తాయని మేం ముందే ఊహించాం. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 93 శాతం సీట్లు కూటమికి ప్రజలు ఇచ్చారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా పవన్ కల్యాణ్ 3 పార్టీలను కలిపారు. కూటమిలో ఎలాంటి సమస్యలు లేవు. అందరం కలిసికట్టుగా ముందుకు సాగుతున్నాం. మా కూటమి దీర్ఘకాలం కొనసాగుతుంది.' అని చంద్రబాబు పేర్కొన్నారు.

Also Read: Maharastra Elections : ఇది శివాజీ పుట్టిన నేల మా సహనం పరీక్షించకండి- మహారాష్ట్ర వేదికగా పవన్ కల్యాణ్ హెచ్చరిక

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Jeevan Reddy: ఈ 25న కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి రాజీనామా.. జగిత్యాలలో మారనున్న రాజకీయ ముఖచిత్రం
ఈ 25న కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి రాజీనామా.. జగిత్యాలలో మారనున్న రాజకీయ ముఖచిత్రం
Narendra Modi Tenure: ప్రధాని మోదీ అరుదైన ఘనత.. అత్యధిక కాలం ప్రభుత్వ అధినేతగా రికార్డ్- టాప్ 5 లిస్ట్ ఇదే
ప్రధాని మోదీ అరుదైన ఘనత.. అత్యధిక కాలం ప్రభుత్వ అధినేతగా రికార్డ్- టాప్ 5 లిస్ట్ ఇదే
Congress Jeevan Reddy: జీవన్ రెడ్డిని బుజ్జగించిన మంత్రులు -తగ్గని సీనియర్ నేత - 25న గుడ్ బై?
జీవన్ రెడ్డిని బుజ్జగించిన మంత్రులు -తగ్గని సీనియర్ నేత - 25న గుడ్ బై?
Bengal Assembly elections 2026: రాజకీయ వారసుడికి పార్టీపై పట్టు పెంచుతున్న దీదీ - బెంగాల్‌లో ఇక అభిషేక్ హయాం ప్రారంభం కానుందా?
రాజకీయ వారసుడికి పార్టీపై పట్టు పెంచుతున్న దీదీ - బెంగాల్‌లో ఇక అభిషేక్ హయాం ప్రారంభం కానుందా?

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
PM Modi Telangana Tour: ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
Dhurandhar 2 : ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
AP Nandi Awards: నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
Embed widget