అన్వేషించండి

CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు

Andhra News: సోషల్ మీడియాలో మహిళలను కించపరిచేలా పోస్టులు పెడుతున్నారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఆ సైకోలను నియంత్రించాల్సిన అవసరం ఉందని అన్నారు.

CM Chandrababu Comments: సామాజిక మాధ్యమాల్లో విపరీత ధోరణులు కనిపిస్తున్నాయని.. వ్యక్తిత్వ హననానికి పాల్పడడం దారుణమని సీఎం చంద్రబాబు (CM Chandrababu) మండిపడ్డారు. ఢిల్లీలో పర్యటించిన ఆయన ఓ జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన లీడర్ షిప్ సమ్మిట్‌లో పాల్గొన్నారు. ప్రజల కోసం పని చేసిన తనను అక్రమ కేసులు పెట్టి వేధించారని.. చెయ్యని తప్పునకు 53 రోజులు జైలు శిక్ష అనుభవించానని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా తాను ఎక్కడా నిరాశకు గురి కాలేదని.. ధైర్యం కోల్పోలేదన్నారు. 53 రోజుల జైలు జీవితం మరింత పట్టుదల పెరిగేలా చేసిందని, ఆ పట్టుదలనే ప్రజలకు సేవ చేయడానికి ఉపయోగిస్తున్నానని అన్నారు. 'సోషల్ మీడియాలో మహిళలను కించపరిచేలా పోస్టులు పెడుతున్నారు. మమ్మల్ని మాత్రమే కాదు.. సొంత తల్లి, చెల్లిని కూడా బూతులు తిట్టిస్తున్న వాళ్లని ఏం చేయాలి.?. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోకూడదంటే ఎలా.?. సోషల్ మీడియాలో మహిళల్ని వేధించే వారిని ఎలా నియంత్రించాలనే అంశంపై తీవ్ర స్థాయిలో చర్చ జరగాలి. సామాజిక మాధ్యమాల్లో వేధించే సైకోలను నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.' అని పేర్కొన్నారు.

'తొలిసారిగా వాట్సాప్ గవర్నెన్స్'

దేశంలోనే తొలిసారిగా వాట్సాప్ గవర్నెన్స్ విధానాన్ని తీసుకొస్తున్నామని.. దీని ద్వారా ప్రజలకు నేరుగా, సులువుగా మరిన్ని సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. 'ఏపీ అన్ని రంగాల్లో అగ్రభాగాన నెంబర్ వన్‌గా ఉండాలనేదే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఏఐ, డీప్ టెక్నాలజీలను ఉపయోగించి అన్ని రంగాల్లో పరిష్కారాలు సాధించవచ్చు. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే ప్రపంచంలో ఏ మూల ఉన్నా మన పనులు మనం చేసుకుంటూ పోవచ్చు.' అని పేర్కొన్నారు.

'అందుకే ఆ నిబంధన'

'భారతదేశంలో 145 కోట్ల జనాభా ఉంది. పాపులేషన్ మేనేజ్మెంట్ చేస్తే ప్రపంచంలో మనల్ని కొట్టేవారే ఉండరు. మనం ప్రణాళికాబద్ధంగా అమల్లోకి తీసుకువస్తే.. 30 - 40 కోట్ల మంది భారతీయులు ప్రపంచంలో అన్ని మూలలకు వెళ్లి పని చేసి దేశానికి ఆదాయం తీసుకొస్తారు. ఒకప్పుడు ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండా నిబంధనలు పెట్టాను. ఇప్పుడు ఆ నిబంధన తొలగించి.. కనీసం ఇద్దరు పిల్లలుంటే తప్ప పోటీకి అర్హత లేదని పెట్టాలని చెబుతున్నా. మానవ వనరులు, నైపుణ్యాల అభివృద్ధి జరగాలి. అందుకు అనుగుణంగా పెద్ద ఎత్తున ఉపాధి, ఉద్యోగ కల్పన జరగాలి. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఒకటో తరగతి నుంచే ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి.' అని చంద్రబాబు పేర్కొన్నారు.

'కూటమి దీర్ఘకాలం కొనసాగుతుంది'

'ఏపీలో 2029 ఎన్నికలకు ఇప్పటి నుంచే సమాయత్తం అవుతున్నాం. రాష్ట్రంలో గత ప్రభుత్వ పాలన పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత, అసంతృప్తితో పాటు.. ఎన్డీయే కూటమిపై జనానికి భరోసా కలిగింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా వస్తాయని మేం ముందే ఊహించాం. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 93 శాతం సీట్లు కూటమికి ప్రజలు ఇచ్చారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా పవన్ కల్యాణ్ 3 పార్టీలను కలిపారు. కూటమిలో ఎలాంటి సమస్యలు లేవు. అందరం కలిసికట్టుగా ముందుకు సాగుతున్నాం. మా కూటమి దీర్ఘకాలం కొనసాగుతుంది.' అని చంద్రబాబు పేర్కొన్నారు.

Also Read: Maharastra Elections : ఇది శివాజీ పుట్టిన నేల మా సహనం పరీక్షించకండి- మహారాష్ట్ర వేదికగా పవన్ కల్యాణ్ హెచ్చరిక

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Thalapathy Vijay: అమ్మ వారసుడిగా విజయ్ - అన్నాడీఎంకే కోటను కూల్చే మాస్టర్ ప్లాన్ - కాపాడుకోవడం పళనిస్వామికి కష్టమేనా?
అమ్మ వారసుడిగా విజయ్ - అన్నాడీఎంకే కోటను కూల్చే మాస్టర్ ప్లాన్ - కాపాడుకోవడం పళనిస్వామికి కష్టమేనా?
Telangana Politics: బండి భగీరథ కేసుతో ముగిసిన దోస్తీ ముచ్చట.. తెలంగాణలో ఇక గులాబీ వర్సెస్ కమలం డైరెక్ట్ ఫైట్! బీఆర్ఎస్ తట్టుకుంటుందా?
బండి భగీరథ కేసుతో ముగిసిన దోస్తీ ముచ్చట.. తెలంగాణలో ఇక గులాబీ వర్సెస్ కమలం డైరెక్ట్ ఫైట్! బీఆర్ఎస్ తట్టుకుంటుందా?
YS Jagan: కేంద్రం పెంచిన పెట్రో రేట్లపై వైసీపీ ఆందోళనలు - కానీ బీజేపీపై విమర్శలు నిల్ - జగన్ ప్లాన్ అదేనా?
కేంద్రం పెంచిన పెట్రో రేట్లపై వైసీపీ ఆందోళనలు - కానీ బీజేపీపై విమర్శలు నిల్ - జగన్ ప్లాన్ అదేనా?
Bhuma Mounika Reddy: రాజకీయాల్లోకి మరో భూమా వారసురాలు - మౌనిక పోటీపై మంచు మనోజ్ అధికారిక ప్రకటన - ఏ పార్టీలోకి ?
రాజకీయాల్లోకి మరో భూమా వారసురాలు - మౌనిక పోటీపై మంచు మనోజ్ అధికారిక ప్రకటన - ఏ పార్టీలోకి ?

వీడియోలు

Jaanvi on BucchiBabu: ఈ డైరక్టర్ మామూలోడు కాదు.. పెద్ద రౌడీ.. బుచ్చిబాబుపై జాన్వీ కామెంట్స్
Adilabad Garden Village: ఇంటింటికి పూలవనం... దానితోనే ధనం
RTC Bus Overtake Shock సిరిసిల్ల ప్రమాదంలో ట్విస్ట్.. కొత్త CCTVలో బయటపడిన అసలు కారణం
“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Modi In Italy: మెలోనీకి ‘మెలొడీ’ చాక్లెట్లు ఇచ్చిన మోదీ.. ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న క్రేజీ పిక్స్!
మెలోనీకి ‘మెలొడీ’ చాక్లెట్లు ఇచ్చిన మోదీ.. ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న క్రేజీ పిక్స్!
CBN In Kuppam: కుప్పంలో చంద్రబాబు దంపతుల ఆధ్యాత్మిక యాత్ర - గంగమ్మకు పట్టువస్త్రాలు.. రోడ్డు పక్కన తాటి ముంజల విందు!
కుప్పంలో చంద్రబాబు దంపతుల ఆధ్యాత్మిక యాత్ర - గంగమ్మకు పట్టువస్త్రాలు.. రోడ్డు పక్కన తాటి ముంజల విందు!
Caste Census 2027: కుల గణనపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు- ప్రభుత్వానికి తెలియాల్సిందే .. వ్యతిరేక పిటిషన్ కొట్టివేత
కుల గణనపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు- ప్రభుత్వానికి తెలియాల్సిందే .. వ్యతిరేక పిటిషన్ కొట్టివేత
Bandi Bhagirath POCSO Case: బండి భగీరథ్ కేసులో కీలక మలుపు! వెలుగులోకి మరికొందరు బాధితులు! సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై పోలీసుల ఫోకస్!
బండి భగీరథ్ కేసులో కీలక మలుపు! వెలుగులోకి మరికొందరు బాధితులు! సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై పోలీసుల ఫోకస్!
Dragon Glimpse vs Peddi Trailer: డ్రాగన్ గ్లింప్స్‌ vs పెద్ది ట్రైలర్... ఏది బావుంది? ఎన్టీఆర్ vs రామ్ చరణ్... ఎవరిది అప్పర్ హ్యాండ్?
డ్రాగన్ గ్లింప్స్‌ vs పెద్ది ట్రైలర్... ఏది బావుంది? ఎన్టీఆర్ vs రామ్ చరణ్... ఎవరిది అప్పర్ హ్యాండ్?
Andhra Pradesh Heatwave: మండుతున్న ఆంధ్రప్రదేశ్‌! 47 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు! ఈ జిల్లావాసులు అవసరమైతే తప్ప బయటకు రావద్దు! 
మండుతున్న ఆంధ్రప్రదేశ్‌! 47 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు! ఈ జిల్లావాసులు అవసరమైతే తప్ప బయటకు రావద్దు! 
Telangana Heatwave : నిప్పుల కొలిమిలా తెలంగాణ! 13 జిల్లాలకు రెడ్ అలర్ట్! బయటకు రావద్దని హెచ్చరికలు!
నిప్పుల కొలిమిలా తెలంగాణ! 13 జిల్లాలకు రెడ్ అలర్ట్! బయటకు రావద్దని హెచ్చరికలు!
అరటి పండు తొక్క ఎలా తీయాలి? అదే మీ వ్యక్తిత్వం, మనస్తత్వాన్ని చెబుతుందా?
అరటి పండు తొక్క ఎలా తీయాలి? అదే మీ వ్యక్తిత్వం, మనస్తత్వాన్ని చెబుతుందా?
Embed widget