అన్వేషించండి

Andhra Pradesh : సీఎంగా విపత్తుల్లో బయటకు రాని జగన్ - ఫీల్డులోనే చంద్రబాబు ! ఎవరు బెటర్ ?

Babu And Jagan : వరద నిర్వహణలో చంద్రబాబు ఫెయిలయ్యారని జగన్ తేల్చేశారు. ఏమీ చేయకుండా ఇంట్లో పడుకుంటే బాగా చేసినట్లా అని జగన్‌పై టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. క్రైసిస్ మేనెజ్‌మెంట్‌లో ఎవరు బెటర్ ?

Chandrababu Or Jagan whose performance is better when calamities occur : వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల పాటు విజయవాడలో పర్యటించారు. రెండు సార్లు ప్రభుత్వ వైఫల్యమేనని తీర్మానించారు. బుధవారం విజయవాడ పర్యటనలో ఆయన చంద్రబాబు సీఎంగా ఫెయిలయ్యారని వరదల్ని సరిగ్గా డీల్ చేయలేదని స్పష్టం చేశారు. అదే తాము అధికారంలో ఉంటే ముందుగా వరదలు ఎప్పుడు వస్తాయో తెలుసుకుని వాలంటీర్ల సాయంతో ముందుగానే పునరావాస కేంద్రాలకు తరలించే వారమన్నారు. ప్రజలకు జరుగుతున్న కష్టనష్టాలకు చంద్రబాబే కారణమన్నారు. చంద్రబాబు ఇల్లు మునిగిపోియందనే.. కలెక్టరేట్ లో పడుకుంటున్నారని ఆరోపించారు. ఇంకా చాలా అన్నారు. అయితే జగన్ గతంలో సీఎంగా చేసి ఉండకపోతే ఈ విమర్శలకు మంచి వాల్యూ ఉండేదేమో కానీ ఇప్పుడు ఆయన ఐదేళ్లు సీఎంగా చేశారు.. ఆ కాలంలో ఎన్నో విపత్తులు వచ్చాయి. ఆయన పనితీరు కూడా ప్రజల ముందు ఉంది. అందుకే టీడీపీ నేతలు అనేక రకాల ప్రశ్నలు సంధిస్తున్నారు. 

అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయినా పట్టించుకోకపోవడం సమర్థతనా ? 

వైఎస్ జగన్ హయాంలో అత్యంత ఘోరమైన విపత్తు అన్నమయ్య డ్యాం కొట్టుకుపోవడం. డ్యాములు కొట్టుకుపోవడం అంటే చిన్న విషయం కాదు. దీని వెనుక మానవ తప్పిదం ఉందని సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్ లో ప్రకటించారు. అనూహ్యమైన వరద వస్తుందని పక్కా సమాచారం ఉంది. అదే సమయంలో డ్యామ్ గేట్లు ఎత్తలేదు. ఇసుక లారీల కోసం డ్యామ్ గేట్లు ఎత్తలేదన్న ఆరోపణలు కూడా వచ్చాయి. కారణం ఏదైనా డ్యాం కొట్టుకుపోయింది. పట్టించుకోలేదు. గ్రామాలకు గ్రామాలు కొట్టుకుపోయిన తర్వాత కూడా జగన్ పెద్దగా స్పందించలేదు. వారం రోజుల తర్వాత ముంపు ప్రాంతాల పరిశీలనకు వెళ్లారు. అంతా తాను చూసుకుంటానని చెప్పారు. కానీ ఇప్పటికీ అక్కడి ప్రజలు గుడారాల్లోనే బతుకుతున్నారు. 

రేపు ఏపీకి కేంద్ర బృందం, 3 జిల్లాల్లోని వరద ప్రాంతాల్లో పర్యటన

కరోనా సమయంలోనూ బయటే రాని జగన్ - ఐదేళ్ల అద్భుత పాలన చేశామని వాదన  

ఇక జగన్ హయాంలో అత్యంత  భారీ విపత్తు కరోనా.  ఈ సమయంలో ముఖ్యమంత్రి అసలు బయటకే రాలేదు. ఆయన పూర్తిగా తాడేపల్లి క్యాంప్ ఆఫీసుకే పరిమితమయ్యారు. పైగా అది పెద్ద వైరస్ కాదని.. స్థానిక ఎన్నికలు నిర్వహించడానికి ప్రయత్నించారు. అసలు కరోనాను సీరియస్ గా తీసుకోలేదు కానీ..ఆయన మాత్రం బయటకే రాలేదు. క్వారంటైన్ సెంటర్లను సందర్శించి ధైర్యం చెప్పలేదు. మమతా బెనర్జీ, స్టాలిన్ వంటి పెద్ద వయసు సీఎంలు క్వారంటైనా సెంటర్లను కరోనా ఆస్పత్రులను సందర్శించారు.కానీ జగన్ మాత్రం ఎప్పుడూ బ యటకు రాలేదు. అయితే జగన్ మాత్రం తమ ప్రభుత్వం అద్భుతంగా పని చేసిందని కితాబిచ్చుకుంటున్నారు. ఎవరికీ ఎలాంటి సమస్యలు రాలేదని  చెబుతున్నారు. నిజానికి విపత్తలు వస్తే పట్టించుకోకుండా ఎవరి ఖర్మకు వారిని వదిలేయడమే జగన్ చేసిన పని అని.. గొప్ప అన్నట్లుగా స్వయం కితాబులు ఇచ్చుకుంటున్నారని  టీడీపీ నేతలు మండి పడుతున్నారు. ఫలానా విపత్తు వచ్చినప్పుడు సక్రమంగా పని చేసిందన్న అభిప్రాయం ఏ విషయంలోనూ జగన్  ప్రభుత్వంపై రాలేదని టీడీపీ నేతల వాదన. 

దాన కర్ణుడు పవన్ కల్యాణ్ - వ్యక్తిగత ఆదాయం నుంచి రూ.6 కోట్లు విరాళం !

చంద్రబాబు పని చేయడం తప్పా ? జగన్ లాగే ఉండాలా ?

చంద్రబాబునాయుడు విపత్తులు వస్తే ఫీల్డ్ లోనే ఉంటారు. ఆయన ఫీల్డులో ఉంటే అధికారులు బాధ్యతతో పని చేస్తారు. ప్రతి విషయాన్ని మానిటర్ చేస్తారు. అయితే ఇదంతా చేతకానితనమని జగన్ అంటున్నారు. చంద్రబాబుకు చేతకాలేదు కాబట్టి రాజీనామా చేయాలని అంటున్నారు. అంటే జగన్ మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆయన బయటకు రాలేదు కాబట్టి.. ప్రజల్లో తిరగలేదు కాబట్టి అది సరైన పద్దతి అదే చంద్రబాబు తిరుగుతున్నారు కాబట్టి అది కరెక్ట్ పద్దతి కాదన్నట్లుగా మాట్లాడటం చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది. జగన్ హయాంలో .. విపత్తులు వస్తే ప్రజల్ని గాలికి వదిలేశారని ఆయన సొంత జిల్లా అన్నమయ్య డ్యాం ఘటన జరిగినప్పుడే తేలిపోయిందని..ఇప్పుడు కొత్తగా తానే ఉంటే ఏం చేసేవాడినో చెబితే ఎవరు నమ్ముతారన్న ప్రశ్నలు వస్తున్నాయి. మొత్తంగా ఫీల్డ్ లో తిరుగుతున్న చంద్రబాబును విమర్శించడం..  జగన్ సీఎంగా  బయటకు రాకపోవడంపై చర్చ ప్రారంభమయింది.

 

టాప్ హెడ్ లైన్స్

Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
AP Municipal Elections: ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
Telangana BJP: తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
LPG Lite Instant Cylinder: విశాఖలో భారత్ గ్యాస్ 'జిప్ సిలిండర్' ప్రారంభం.. కేవలం 4 గంటల్లోనే డెలివరీ!
విశాఖలో భారత్ గ్యాస్ 'జిప్ సిలిండర్' ప్రారంభం.. కేవలం 4 గంటల్లోనే డెలివరీ!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Embed widget