అన్వేషించండి

Andhra Pradesh news: ఏపీ ఎన్నికలపై బీజేపీ స్పెషల్‌ ఫోకస్- ఒకట్రెండు రోజుల్లో పొత్తులపై క్లారిటీ

Andhra Pradesh news:

Andhra Pradesh news: బీజేపీ(BJP) అధిష్ఠానం ఆంధ్రప్రదేశ్‌()Andhra Pradeshలో జరగబోయే ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఓవైపు ప్రత్యర్థి పార్టీలు వివిధ కార్యక్రమాలతో ప్రజల్లో ఉంటున్నారు. మరోవైపు పొత్తులపై కూడా క్లారిటీతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఎన్నికల నాటికి ఏం చేయాలనే స్పష్టత లేకుండా బీజేపీ ఉందని ప్రచారం నడుస్తోంది. అందుకే ఇలాంటి దుష్ప్రచారాన్ని కట్టడి చేసి శ్రేణులను సమాయత్తం చేసేలా బీజేపీ కార్యచరణ సిద్ధం చేయబోతోందని టాక్. 

పొత్తుతో సంబంధం లేకుండా

పొత్తు ఉంటుందా ఉండదా అనే విషయంతో సంబంధం లేకండా ఎలా ప్రజల్లోకి వెళ్లాలి.. ఎలాంటి అంశాలు లేవనెత్తాలనే విషయాలపై ఫోకస్ పెట్టింది బీజేపీ. పొత్తు ఉన్నా లేకపోయినా అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల్లో మరింత బలపడేలా ప్లాన్ చేస్తున్నారు. జనసేనతో పొత్తు ఉన్నట్టు ప్రకటిస్తున్నా ఆ పార్టీ నుంచి మాత్రం అంత సానుకూలత లేదని టాక్. అందుకే పొత్తుల ఎత్తులను పట్టించుకోకుండా ప్రజల్లో ఉండేలా కార్యచరణ సిద్ధం చేస్తున్నారు. 

క్లస్టర్‌వారీగా భేటీలు

ఈ మధ్యే పార్లమెంట్‌ నియోజకవర్గాల క్లస్టర్ ఇన్‌ఛార్జీలతో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమావేశమయ్యారు. ఐదేసీ పార్లమెంటు స్థానాలను కలిపి మరో క్లస్టర్‌గా చేసారు. దానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులను ఇన్‌ఛార్జిలుగా నియమించారు. వీళ్లతో ఢిల్లీలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహప్రతివ్యూహాలపై చర్చించారు. ఎన్నికల నిర్వహణ కమిటీల, క్షేత్రస్థాయిలో బూత్ కమిటీలు, శక్తి కేంద్రాలు ఎలాంటి ప్లాన్‌తో వెళ్లాలో వివరించారు. 

పోటీ చేసే జాబితా రెడీ
పొత్తులపై స్పష్టత లేకపోయినా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉన్నవారి జాబితాను అధినాయకత్వానికి చేరింది. ఈ మధ్య కాలంలో రాష్ట్ర నాయకులు జిల్లాల్లో పర్యటించి ఆశావాహుల లిస్ట్ రెడీ చేశారు. రాష్ట్ర స్థాయిలో వడపోత తర్వాత ఫిల్టర్ జాబితాను ఢిల్లీ పంపించారు. దీనిపై అక్కడ మరోసారి కసరత్తు పూర్తి చేసి పోటీదారులను ప్రకటిస్తారు. 

మరోవైపు పొత్తులపై కూడా సీరియస్‌గానే దృష్టి పెట్టినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ మధ్య జాతీయ సహసంఘటనా మంత్రి శివప్రకాశ్‌ విజయవాడలో నేతలతో సమావేశమయ్యారు. పొత్తులపై నేతల అభిప్రాయాలు తీసుకున్నారు. వాటిని షీల్డ్ కవర్‌లో జాతీయ నాయకత్వానికి చేరవేశారు. దీనిపై ఒకట్రెండు రోజుల్లో సమావేశమై అధినాయకత్వం ఓ నిర్ణయానికి రానుంది. 

మరోవైపు క్లస్టర్‌ వారీగా జాతీయ నేతలు ఏపీలో పర్యటించనున్నారు. ముందుగా జేపీ నడ్డా వస్తారు. అనంతరం హోంమంత్రి అమిత్‌షా రానున్నారు. తర్వాత రాజ్‌నాథ్ సింగ్ పర్యటిస్తారు. ముగ్గురు కూడా వేర్వేరు తేదీల్లో వేర్వేరు క్లస్టర్స్‌ సమావేశాల్లో పాల్గొంటారు. ఒకట్రెండు రోజుల్లో ఈ పర్యటనలు ఖరారు కానున్నాయి.  

టాప్ హెడ్ లైన్స్

Rahul Gandhi Protest Modi House: బీజేపీ గేమ్‌లో పావుగా మారిన కాంగ్రెస్ - కాక్రోచ్‌లకు అడ్డుగా రాహుల్ - ఇదే మాస్టర్ క్లాస్ రాజకీయం?
బీజేపీ గేమ్‌లో పావుగా మారిన కాంగ్రెస్ - కాక్రోచ్‌లకు అడ్డుగా రాహుల్ - ఇదే మాస్టర్ క్లాస్ రాజకీయం?
Revanth Reddy About Rahul Gandhi Arrest: దేశం కోసం రక్తం చిందించడం, పదవులు త్యాగం రాహుల్ గాంధీ కుటుంబానికి కొత్త కాదు: రేవంత్ రెడ్డి
దేశం కోసం రక్తం చిందించడం, పదవులు త్యాగం రాహుల్ గాంధీ కుటుంబానికి కొత్త కాదు: రేవంత్ రెడ్డి
CPM West Bengal Revival: బెంగాల్‌లో ఎర్రజెండా పునరుజ్జీవం సాధ్యమేనా? టీఎంసీ సంక్షోభం.. సీపీఎంకు దక్కే ఛాన్స్ ఎంత?
బెంగాల్‌లో ఎర్రజెండా పునరుజ్జీవం సాధ్యమేనా? టీఎంసీ సంక్షోభం.. సీపీఎంకు దక్కే ఛాన్స్ ఎంత?
TDP YSRCP Political Row: అమరరాజా గిగా పోరు - తెలంగాణ సిగలో రత్నం.. ఏపీ రాజకీయాల్లో పెట్టుబడుల చిచ్చు!
అమరరాజా గిగా పోరు - తెలంగాణ సిగలో రత్నం.. ఏపీ రాజకీయాల్లో పెట్టుబడుల చిచ్చు!

వీడియోలు

NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్
Telugu Serial Actor Debjani Modak Biography | ఎన్నెన్నో జన్మల బంధం' వేద అన్‌సీన్ లైఫ్
Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan On Panchadarla Land Issue: పంచదార్ల భూముల వివాదంపై పవన్ సంచలన నిర్ణయం- వైసీపీ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం
పంచదార్ల భూముల వివాదంపై పవన్ సంచలన నిర్ణయం- వైసీపీ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం
Tirumala Anjaneya Swamy Idol Stolen Case: తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- ఒంగోలు రైల్వేస్టేషన్‌లో నిందితుడు అరెస్టు 
తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- ఒంగోలు రైల్వేస్టేషన్‌లో నిందితుడు అరెస్టు 
Telangana Schools Bandh On Friday: తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
Bigg Boss 10: బిగ్‌బాస్ 10 కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!
బిగ్‌బాస్ కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!
Mee Bhoomi Blockchain Project:ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌!
ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌! "మీ భూమి–బ్లాక్‌ చెయిన్" ప్రాజెక్టు ప్రయోజనమేంటి?
Sonam Wangchuk Letter:సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ! నిరాహార దీక్ విరమణకు షరతులు!
సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ రాశారు! నిరాహార దీక్ విరమణకు షరతులు విధించారు!
Adilabad Latest News:
"ఆదిలాబాద్‌ సీసీఐ కర్మాగార పునరుద్ధరణకు రూ.250 కోట్లు కేటాయించలేరా?" రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ!
Rahul Gandhi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
Embed widget