అన్వేషించండి

CM Jagan : సీఎం జగన్‌లో చేసిన ఆ కామెంట్స్‌తో వైసీపీలో దడ- నేతల మైండ్‌లో చంద్రబాబు, కేసీఆర్‌

Jagan News: APలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ...ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆసక్తికరంగా వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికిప్పుడు దిగిపోవాల్సిన పరిస్థితి వచ్చినా...తనకు ఎలాంటి విచారమూ లేదన్నారు.

Jagan Comments On Elections : ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ...ముఖ్యమంత్రి (Chief Minister) జగన్మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) ఆసక్తికరంగా వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికిప్పుడు దిగిపోవాల్సిన పరిస్థితి వచ్చినా...తనకు ఎలాంటి విచారమూ లేదన్నారు. తిరుపతి (Tirupati) లో జరిగిన ఓ సదస్సులో ఆయనీ వ్యాఖ్యలు చేయడంతో తెలుగు రాష్ట్రాల్లో కొత్త చర్చ మొదలైంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు...సింపతీ కోసం ఈ వ్యాఖ్యలు చేస్తున్నారా ? లేదంటే ఓటమి భయమా ? జగన్ లో నిర్వేదం మొదలైందా అన్నది హాట్ టాపిక్ గా మారింది.

కోట్ల మంది ప్రజలకు సహాయం అందించడం సంతృప్తినిచ్చిందంటూనే...ఇప్పటికిప్పుడు దిగిపోవాల్సిన పరిస్థితి వచ్చినా ఎలాంటి విచారమూ లేదని చెప్పడం పార్టీ శ్రేణులకు మింగుడు పడటం లేదు. మ్యానిఫెస్టోలో 99 శాతం అమలు చేశామని, రెండోసారి అధికారంలో వస్తామంటున్న సీఎం జగన్..ఎందుకిలా మాట్లాడారంటూ వైసీపీలో కొత్త చర్చ మొదలైంది. పార్టీ అధినేతే ఇలా మాట్లాడితే...ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, కార్యకర్తల పరిస్థితి ఇంకెలా ఆలోచించాలని అంటున్నారు.

2019లో చంద్రబాబు, 2023లో కేసీఆర్ ప్రజల్లో సానుభూతి సంపాదించేందుకు ఇలా కామెంట్స్ చేసినా...ప్రజలు ఆదరించలేదు. ఇపుడు అదే పరిస్థితి జగన్ కూడా వస్తుందా అన్నది చర్చనీయాంశంగా మారింది. తెలుగుదేశం పార్టీకి అస్త్రంగా మారుతున్నాయి. ఓటమి ఖాయమని ముఖ్యమంత్రి జగన్...ఎన్నికలకు ముందే అంగీకరించారంటూ ప్రచారం చేస్తున్నారు.

2019లో చంద్రబాబు నోట ఓటమి మాట 
తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా పని చేసిన నేతలు...ప్రస్తుతం ముఖ్యమంత్రులు చేస్తున్న కామెంట్స్ చర్చనీయాంశంగా మారుతున్నాయి. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఎన్నికల్లో ఓడిపోయినా వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని ఎన్నికల ప్రచారంలో పలు సందర్బాల్లో చెప్పారు.  ప్రధాని మోడీకి కుటుంబ సభ్యులు కూడా లేరని విమర్శించారు. ప్రధాని పదవి పోయిన తర్వాత ఎక్కడికి వెళ్లాలో కూడా మోడీకి తెలియదన్నారు చంద్రబాబు. అయితే తనకు అలాంటి ఇబ్బందేమీ లేదని, ఎన్నికల్లో ఓడిపోతే నాకు భార్య, కొడుకు,కోడలితోపాటు మనవడు కూడా ఉన్నాడని చంద్రబాబు వ్యాఖ్యానించారు. చంద్రబాబు నోట ఓటమి మాట రావడం, తాను ఓడిపోయినా ఇబ్బంది లేదని చెప్పడంతో టీడీపీ నాయకులే కంగుతిన్నారు. ఆ తర్వాత ఏపీలో వైసీపీ అధికారంలో వచ్చింది. జగన్ ముఖ్యమంత్రయ్యారు. 

2023లో ఓడిపోతే మాకు పోయేదేం లేదన్న కేసీఆర్, కేటీఆర్‌
2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ కూడా చంద్రబాబు నాయుడు లాగే మాట్లాడారు. ఓడిపోతే మాకు పోయేదేం లేదని...ఇంటికెళ్లి రెస్ట్ తీసుకుంటాం..కానీ మీరే నష్టపోతారంటూ అచ్చంపేట సభలో ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు కేసీఆర్‌. కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు అప్పట్లో రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌ అయ్యాయి. ఆయన వ్యాఖ్యల మర్మమేంటని ప్రజలతో పాటు అన్ని పార్టీల మధ్య జోరుగా చర్చ జరిగింది. బీఆర్ఎస్ గెలవకుంటే ప్రజలే నష్టపోతారన్న మాటలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. కాంగ్రెస్ గెలిస్తే.. రైతు బంధు రాదు.. కరెంట్ రాదని ప్రచారం చేశారు. మళ్లీ బీఆర్ఎస్ గెలిస్తేనే ఈ అభివృద్ధి కొనసాగుతుందని.. కాంగ్రెస్ గెలిస్తే పరిస్థితులు మళ్లీ మొదటికి వస్తాయన్నారు. పొరపాటున వేరే పార్టీని గెలిపిస్తే...కైలాసం ఆటలో పెద్ద పాము మింగినట్లు అవుతుందంటూ వ్యాఖ్యానించారు. సీన్ కట్ చేస్తే...గులాబీ పార్టీ ఓటమి పాలయింది. కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కేసీఆర్ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Rahul Jiu-Jitsu Strategy: రాహుల్ జియాజిట్సు వ్యూహం - మార్షల్ ఆర్ట్స్ పాఠాలు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశాయా ?
రాహుల్ జియాజిట్సు వ్యూహం - మార్షల్ ఆర్ట్స్ పాఠాలు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశాయా ?
Bengal Assembly Elections 2026 : బెంగాల్‌లో ఉన్నట్లుగా కూడా తెలియకుండా మాయమైన కమ్యూనిస్టులు - ఇలా ఎలా?
బెంగాల్‌లో ఉన్నట్లుగా కూడా తెలియకుండా మాయమైన కమ్యూనిస్టులు - ఇలా ఎలా?
Telangana Govt: కూల్చివేతల్లో ప్రజాస్వామ్య దారి మర్చిపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం - వ్యతిరేకతను ఎందుకు గుర్తించలేకపోతున్నారు?
కూల్చివేతల్లో ప్రజాస్వామ్య దారి మర్చిపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం - వ్యతిరేకతను ఎందుకు గుర్తించలేకపోతున్నారు?
BJP grip on communist strongholds: ఎర్రకోటల్లో కాషాయ జెండా - కమ్యూనిస్టు ఓటు బ్యాంక్ బీజేపీకి ఎలా మారుతోంది?
ఎర్రకోటల్లో కాషాయ జెండా - కమ్యూనిస్టు ఓటు బ్యాంక్ బీజేపీకి ఎలా మారుతోంది?

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran Israel War 2026:వార్‌ అంటే ఏంటీ? ఇరాన్‌పై అమెరికా చేస్తున్న దాడి సైనిక చర్యనా? యుద్ధమా? 
వార్‌ అంటే ఏంటీ? ఇరాన్‌పై అమెరికా చేస్తున్న దాడి సైనిక చర్యనా? యుద్ధమా? 
CPM leader impeached: జీవిత కాలం కమ్యూనిస్టుని అభిశంసించిన సీపీఎం - తమ్మినేని వీరభద్రం చేసిన తప్పేమిటి?
జీవిత కాలం కమ్యూనిస్టుని అభిశంసించిన సీపీఎం - తమ్మినేని వీరభద్రం చేసిన తప్పేమిటి?
Pawan Kalyan Meets CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, చర్చించిన అంశాలివే
ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, చర్చించిన అంశాలివే
Renu Desai: సైబర్ క్రైమ్ డీసీపీని కలిసిన రేణూ దేశాయ్... ట్రోలర్స్‌పై కంప్లైంట్!
సైబర్ క్రైమ్ డీసీపీని కలిసిన రేణూ దేశాయ్... ట్రోలర్స్‌పై కంప్లైంట్!
Tatkal Booking New Rules: రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్‌లో మార్పులు! సామాన్యులకు గుడ్ న్యూస్; ఏజెంట్ల ఆగడాలకు చెక్!
రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్‌లో మార్పులు! సామాన్యులకు గుడ్ న్యూస్; ఏజెంట్ల ఆగడాలకు చెక్!
Jubilee Hills traffic: కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ఫ్లైఓవర్ పనులు ప్రారంభం - ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా ఇవిగో ప్రత్యామ్నాయ రూట్స్
కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ఫ్లైఓవర్ పనులు ప్రారంభం - ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా ఇవిగో ప్రత్యామ్నాయ రూట్స్
Ayatollah Khomeini trap Story: సీసీ కెమెరాలతోనే ఖొమైనీని టార్గెట్ చేసిన ఇజ్రాయెల్ - ఈ రియల్ స్టోరీతో వెబ్ సిరీస్ తీయెచ్చు !
సీసీ కెమెరాలతోనే ఖొమైనీని టార్గెట్ చేసిన ఇజ్రాయెల్ - ఈ రియల్ స్టోరీతో వెబ్ సిరీస్ తీయెచ్చు !
Iran Israel War 2026: ఓమన్ తీరంలో ముగ్గురు భారతీయ నావికుల మృతి; 20 మందికిపైగా గాయాలు !
ఓమన్ తీరంలో ముగ్గురు భారతీయ నావికుల మృతి; 20 మందికిపైగా గాయాలు !
Embed widget