అన్వేషించండి

CM YS Jagan: ఏప్రిల్ 7నుంచి వైఎస్ జగన్ సరికొత్త ప్రచారం- టీజర్ రిలీజ్ చేసిన పార్టీ

ఎన్నికలకు ఏడాది ముందు నుంచే ఎన్నికల ప్రచారానికి వైఎస్ఆర్సీపీ సమరశంఖం పూరించబోతోంది. ‘జగనన్నే మా భవిష్యత్తు’ పేరుతో ఇప్పటివరకు కనీవినీ ఎరగని రీతిలో సరికొత్త ఎన్నికల ప్రచారం ప్రారంభించబోతోంది.

2024 ఎన్నికల మెగా బ్యాటిల్‌కు ప్రజల మద్దతును పొందేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ‘మాస్ ఇంటరాక్షన్ స్ట్రాటజీ’ని రచించారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి ఒక్కరికీ ఉమ్మడి సందేశాన్ని చేరవేసేందుకు ‘జగనన్నే మా భవిష్యత్తు’  పేరుతో పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. 

ఎన్నికలకు ఏడాది ముందు నుంచే ఎన్నికల ప్రచారానికి వైఎస్ఆర్సీపీ సమరశంఖం పూరించబోతోంది. ‘జగనన్నే మా భవిష్యత్తు’ పేరుతో ఇప్పటివరకు కనీవినీ ఎరగని రీతిలో సరికొత్త ఎన్నికల ప్రచారం ప్రారంభించబోతోంది. మొదటి దశ ఏప్రిల్ 7 నుంచి 20వరకు అంటే రెండు వారాల పాటు ఈ క్యాంపెయిన్ కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ లోని ఇంటింటికి ఈ ప్రచారాన్ని తీసుకెళ్లేందుకు ప్రణాళిక రూపొందించినట్టు తెలుస్తోంది. 

వైఎస్ఆర్సీపీ వర్గాలు అందిస్తున్న సమాచారం ప్రకారం రెండువారాల పాటు అంటే ఏప్రిల్ 7-14వరకు  ‘జగనన్నే మా భవిష్యత్తు’  క్యాంపెయిన్ స్టార్ట్ అవుతుంది. కొత్తగా నియమితులైన జగనన్న సచివాలయం కన్వీనర్లు, గృహ సారథిలు ఇందులో ప్రధానంగా పాల్గొంటారు. దాదాపు 7లక్షల మంది జగనన్న సచివాలయం కన్వీనర్లు, గృహ సారథులతో కలిసి ఆంధ్రప్రదేశ్ లోని 1.65 కోట్ల ఇళ్లకు వెళ్లి ఈ ప్రచారం నిర్వహించనున్నట్లు వైఎస్సార్‌సీపీ నేతలు తెలిపారు.

రాజకీయ వర్గాల్లో ప్రతిధ్వనించేలా వైఎస్‌ఆర్‌సీపీ క్యాడర్ ఏకగ్రీవంగా సందేశాన్ని ప్రసారం చేస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ అట్టడుగు వర్గాలకు రెండు కీలక సందేశాలను పంచుతుందని నాయకులు వివరించారు. ఇంటింటికీ ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్సీపీ బృందాలు కరపత్రాలు, పుస్తకాలు, స్టిక్కర్లు పంపిణీ చేస్తారు. "గతంలో ఏం చేశారు ఇప్పుడేం చేస్తున్నారని కరపత్రంలో ముద్రించి అందిస్తారు. 2019లో జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన తరువాత చేసిన అభివృద్ధి-సంక్షేమ పనులు, చంద్రబాబునాయుడు హయాంలో చేసిన పనులను పోలుస్తూ తయారు చేసిన పాంప్లెట్లను ఇంటింటికి పంచుతారు. 

‘ప్రజా మద్దతు పుస్తకం’ కింద ప్రశ్నాపత్రాన్ని పూరించి, నివాసితులకు రసీదు ఇస్తారు. 'డోర్, మొబైల్ స్టిక్కర్లను అందిస్తారు. కుటుంబ యజమాని అనుమతితో ఫోన్, డోర్‌పై అతికిస్తారు. ‘మిస్డ్ కాల్’ కార్యక్రమం కింద, జగనన్న పాలనకు తమ మద్దతును తెలియజేయడానికి 8296082960 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వాలని వారు ఇంటింటా అభ్యర్థిస్తారు.  ఈ వినూత్న ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ నేరుగా ప్రజలతో మమేకం కావడానికి సహాయపడుతుందని వైఎస్ఆర్సీపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Amaravati YCP Strategy: పార్లమెంట్‌లో అమరావతిని వైసీపీ సమర్థిస్తుందా? వ్యతిరేకిస్తుందా?
పార్లమెంట్‌లో అమరావతిని వైసీపీ సమర్థిస్తుందా? వ్యతిరేకిస్తుందా?
BRS MLA Padi Kaushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు.. వెనక్కి తగ్గేది లేదంటూనే ప్రభుత్వంపై ఆరోపణలు
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు.. వెనక్కి తగ్గేది లేదంటూనే ప్రభుత్వంపై ఆరోపణలు
Tamil Nadu Elections 2026: పొత్తుల్లో ఉన్నా.. డీఎంకే, అన్నాడీఎంకే గుర్తులపైనే పోటీ - తమిళ రాజకీయాల్లో చిన్న పార్టీల స్టైల్ - ఇలా ఎలా ?
పొత్తుల్లో ఉన్నా.. డీఎంకే, అన్నాడీఎంకే గుర్తులపైనే పోటీ - తమిళ రాజకీయాల్లో చిన్న పార్టీల స్టైల్ - ఇలా ఎలా ?
KCR Disqualification: అసెంబ్లీకి రాని కేసీఆర్ - రేవంత్ అనర్హతా వేటు వ్యూహం అమలు చేస్తారా?
అసెంబ్లీకి రాని కేసీఆర్ - రేవంత్ అనర్హతా వేటు వ్యూహం అమలు చేస్తారా?

వీడియోలు

CSK Plays Without Dhoni in 17 Years IPL 2026 | ధోనీ, రైనా, జడేజా లేకుండా CSK మ్యాచ్ | ABP Desam
Jadeja Destroys CSK vs RR IPL 2026 | ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసిన జడేజా | ABP Desam
IPL 2026 RR VS CSK Highlights | చెన్నైపై రాజ‌స్థాన్ ఈజీ విక్ట‌రీ | ABP Desam
Vaibhav Suryavanshi RR vs CSK IPL 2026 | వైభవ్ కు సలహా ఇచ్చిన జైస్వాల్ | ABP Desam
Rohit Suggestions to Hardik IPL 2026 | హిట్ మ్యాన్ వ్యూహంతో ముంబై విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Vaidya Seva: ఏపీలో బుధవారం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ బంద్ - ఆస్పత్రుల నిర్ణయం - బిల్లులు ఇవ్వలేదనే!
ఏపీలో బుధవారం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ బంద్ - ఆస్పత్రుల నిర్ణయం - బిల్లులు ఇవ్వలేదనే!
BRS MLA Padi Kaushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు.. వెనక్కి తగ్గేది లేదంటూనే ప్రభుత్వంపై ఆరోపణలు
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు.. వెనక్కి తగ్గేది లేదంటూనే ప్రభుత్వంపై ఆరోపణలు
AP handloom weavers: ఏపీలో చేనేతలకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ - అమల్లోకి ఉచిత విద్యుత్ పథకం
ఏపీలో చేనేతలకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ - అమల్లోకి ఉచిత విద్యుత్ పథకం
Kerala Assembly Elections: కేరళలో బీజేపీ అగ్రనేతల విస్తృత ప్రచారం - మార్పు కనిపిస్తోందని ధీమా!
కేరళలో బీజేపీ అగ్రనేతల విస్తృత ప్రచారం - మార్పు కనిపిస్తోందని ధీమా!
Donald Trump: దారిలోకి రాని ఇరాన్! ట్రంప్‌లో పెరిగిపోతున్న అసహనం! మిత్రదేశాలకు తీవ్ర హెచ్చరిక!
దారిలోకి రాని ఇరాన్! ట్రంప్‌లో పెరిగిపోతున్న అసహనం! మిత్రదేశాలకు తీవ్ర హెచ్చరిక!
IT Rules 2021 Amendments:డిజిటల్ మీడియాపై పట్టుకు కేంద్రం ప్రయత్నిస్తోందా? కొత్తగా తీసుకొస్తున్న మార్పులేంటీ?
డిజిటల్ మీడియాపై పట్టుకు కేంద్రం ప్రయత్నిస్తోందా? కొత్తగా తీసుకొస్తున్న మార్పులేంటీ?
Bihar Stampede: ఆలయంలో తొక్కిసలాట, 8 మంది భక్తులు మృతి.. సీఎం నితీష్ కుమార్ దిగ్భ్రాంతి
ఆలయంలో తొక్కిసలాట, 8 మంది భక్తులు మృతి.. సీఎం నితీష్ కుమార్ దిగ్భ్రాంతి
Third Temple In Israel: ఇజ్రాయెల్‌లో మూడో టెంపుల్ గొడవేంటి..? మెస్సియా కోసం యూదుల ఎదురుచూపులు.. ఇరాన్‌తో యుద్ధంలో నెతన్యాహు మతం సెంటిమెంట్
ఇజ్రాయెల్‌లో మూడో టెంపుల్ గొడవేంటి..? మెస్సియా కోసం యూదుల ఎదురుచూపులు.. ఇరాన్‌తో యుద్ధంలో నెతన్యాహు మతం సెంటిమెంట్
Embed widget