అన్వేషించండి

Andhra Politics: పార్టీ, ప్రభుత్వం ఒక్కటేనా - ఏపీలో అన్ని హద్దులు చెరిగిపోయాయా ?

Andhra Politics: ఏపీలో పార్టీ, ప్రభుత్వం ఒకటేనా ? ప్రజాధనంతో పార్టీ ప్రచారం చేసుకోవచ్చా ?

 

Andhra Politics:  వైసీపీ పార్టీ, ప్రభుత్వం వేరు వేరు కాదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ( Sajjala ) స్పష్టం చేశారు. పార్టీ ప్రచారాన్ని ప్రభుత్వం ద్వారా నిర్వహిస్తున్నారని వస్తున్న విమర్శలపై ఆయన ఇలా స్పందించారు. అయితే నిజంగా పార్టీ , ప్రభుత్వం ఒకటేనా అంటే.. పార్టీ వేరు, ప్రభుత్వం వేరు అని  చెప్పక తప్పదు. పార్టీ ప్రచారాలను విడిగా చేసుకోవాలి. ప్రభుత్వ కార్యక్రమాలు ప్రభుత్వ కార్యక్రమాలుగానే నిర్వహించుకోవాలి. అలాంటి కార్యక్రమాలకు కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ప్రోటోకాల్ ఉంటుంది. కానీ ఏపీలో అవేమీ లేవని.. ఇష్టారాజ్యంగా పాలన చేస్తున్నారన్న విమర్శలు విపక్షాలు ఎక్కువగా  చేస్తున్నాయి. 

వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో వైసీపీ జెండాలు ఎగరేస్తున్న అధికారులు

ప్రస్తుతం వై ఏపీ నీడ్స్ జగన్  ( Why AP Needs Jagan ) పేరుతో ఓ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇది పార్టీ కార్యక్రమం అనుకుంటారు ాకనీ.. ప్రభుత్వ కారక్రమం అని ప్రభుత్వమే ప్రకటించింది. వైసీపీ నేతలతో కలిసి అధికారులు పాల్గొంటున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో వైసీపీ జెండాలు ప్రభుత్వ అధికారులు ఎగురవేస్తున్నారు. ఇవి మీడియాలో వైరల్ అవుతున్నాయి. పార్టీ కార్యక్రమాలను ఇలా అధికారులతో నిర్వహింప చేయడం ఏమిటన్న చర్చ విస్తృతంగా జరుగుతోంది. 

ఇది మొదటి సారి కాదు ! 

ఇప్పటికే గడప గడపకూ మన ప్రభుత్వం పేరుతో పెద్ద ఎత్తున ప్రజాధనం ఖర్చు పెట్టి అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకుని పార్టీ ప్రచారం చేసుకున్నారని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.  పాంప్లెట్లు, టోపీలు, సంచుల కోసం కనీసం వందల కోట్లు ఖర్చు పెట్టారని..  ఇదంతా ప్రజాధనమననంటున్నారు.  వైసీపీ సొంత ఖర్చు కాదు. కానీ ఈ  కార్యక్రమంలో పాల్గొన్నవారంతా వైసీపీ నేతలే. వాలంటీర్లు, గృహసారధులు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు ఉన్న చోట ఇంచార్జులు నిర్వహించారు. అందుకే ప్రభుత్వ ఖజానాను పూర్తి స్థాయిలో వైసీపీ పార్టీని నడిపేందుకు ఖర్చు పెట్టేస్తున్నారని  టీడీపీ నేతలు ఇలాంటి కార్యక్రమాల వల్లే ఆరోపిస్తున్నారు.   పార్టీ ప్రచారాలను ప్రభుత్వం ఖాతాలో వేసేందుకు విచ్చలవిడిగా కార్యక్రమాలు నిర్వహిస్తూ... ప్రజాధనంతో పాటు అధికారుల్ని వాడేస్తూ  అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అంటున్నారు. 
  
బటన్ నొక్కే బహిరంగసభలపైనా విమర్శలు 

సీఎం  జగన్ ప్రభుత్వ పథకాలకు  బటన్ నొక్కేందుకు వివిధ జిల్లాల్లో ప్రభుత్వం తరపున సభలు నిర్వహిస్తున్నారు. అయితే అవి పేరుకే ప్రభుత్వ సభలు. పూర్తిగా రాజకీయ కోణంలోనే జరుగుతూంటాయి. సీఎం జగన్ కూడా రాజకీయ ప్రసంగాలే చేస్తూంటారు.  వేదికలను కూడా పూర్తిగా వైసీపీ ప్రచారసభ లుగా అలంకరిస్తారు. ఇలాంటి అంశాల ద్వారా ప్రజాధనాన్ని వైసీపీ కోసం వాడుకుంటున్నారన్న విమర్శలువస్తున్నాయి. 

ఇటీవల ఐ ప్యాక్ కోసం ఓ అధికారిని యమించుకోవడానికి మార్కెటింగ్ శాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. ఎలక్షనీరింగ్ ను అర్హతగా నిర్ణయించారు. అంటే ఎన్నికల్లో ఉపయోగించుకోవడానికి ప్రజాధనంతో ఇలా నియమించుకుంటున్నారని టీడీపీ నేతలు ారోపిస్తున్నారు.  పార్టీ, ప్రభుత్వం ఒకటేనని సజ్జల ఎందుకు అంటున్నా సులువుగా అర్థం చేసుకోవచ్చని..  ప్రజాధనాన్ని పార్టీ కోసం ఖర్చు పెట్టుకునేందుకే ఇలా చెప్పుకుంటున్నారని టీడీపీ నేతలంటున్నారు.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget