అన్వేషించండి

Andhra Politics: పార్టీ, ప్రభుత్వం ఒక్కటేనా - ఏపీలో అన్ని హద్దులు చెరిగిపోయాయా ?

Andhra Politics: ఏపీలో పార్టీ, ప్రభుత్వం ఒకటేనా ? ప్రజాధనంతో పార్టీ ప్రచారం చేసుకోవచ్చా ?

 

Andhra Politics:  వైసీపీ పార్టీ, ప్రభుత్వం వేరు వేరు కాదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ( Sajjala ) స్పష్టం చేశారు. పార్టీ ప్రచారాన్ని ప్రభుత్వం ద్వారా నిర్వహిస్తున్నారని వస్తున్న విమర్శలపై ఆయన ఇలా స్పందించారు. అయితే నిజంగా పార్టీ , ప్రభుత్వం ఒకటేనా అంటే.. పార్టీ వేరు, ప్రభుత్వం వేరు అని  చెప్పక తప్పదు. పార్టీ ప్రచారాలను విడిగా చేసుకోవాలి. ప్రభుత్వ కార్యక్రమాలు ప్రభుత్వ కార్యక్రమాలుగానే నిర్వహించుకోవాలి. అలాంటి కార్యక్రమాలకు కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ప్రోటోకాల్ ఉంటుంది. కానీ ఏపీలో అవేమీ లేవని.. ఇష్టారాజ్యంగా పాలన చేస్తున్నారన్న విమర్శలు విపక్షాలు ఎక్కువగా  చేస్తున్నాయి. 

వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో వైసీపీ జెండాలు ఎగరేస్తున్న అధికారులు

ప్రస్తుతం వై ఏపీ నీడ్స్ జగన్  ( Why AP Needs Jagan ) పేరుతో ఓ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇది పార్టీ కార్యక్రమం అనుకుంటారు ాకనీ.. ప్రభుత్వ కారక్రమం అని ప్రభుత్వమే ప్రకటించింది. వైసీపీ నేతలతో కలిసి అధికారులు పాల్గొంటున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో వైసీపీ జెండాలు ప్రభుత్వ అధికారులు ఎగురవేస్తున్నారు. ఇవి మీడియాలో వైరల్ అవుతున్నాయి. పార్టీ కార్యక్రమాలను ఇలా అధికారులతో నిర్వహింప చేయడం ఏమిటన్న చర్చ విస్తృతంగా జరుగుతోంది. 

ఇది మొదటి సారి కాదు ! 

ఇప్పటికే గడప గడపకూ మన ప్రభుత్వం పేరుతో పెద్ద ఎత్తున ప్రజాధనం ఖర్చు పెట్టి అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకుని పార్టీ ప్రచారం చేసుకున్నారని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.  పాంప్లెట్లు, టోపీలు, సంచుల కోసం కనీసం వందల కోట్లు ఖర్చు పెట్టారని..  ఇదంతా ప్రజాధనమననంటున్నారు.  వైసీపీ సొంత ఖర్చు కాదు. కానీ ఈ  కార్యక్రమంలో పాల్గొన్నవారంతా వైసీపీ నేతలే. వాలంటీర్లు, గృహసారధులు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు ఉన్న చోట ఇంచార్జులు నిర్వహించారు. అందుకే ప్రభుత్వ ఖజానాను పూర్తి స్థాయిలో వైసీపీ పార్టీని నడిపేందుకు ఖర్చు పెట్టేస్తున్నారని  టీడీపీ నేతలు ఇలాంటి కార్యక్రమాల వల్లే ఆరోపిస్తున్నారు.   పార్టీ ప్రచారాలను ప్రభుత్వం ఖాతాలో వేసేందుకు విచ్చలవిడిగా కార్యక్రమాలు నిర్వహిస్తూ... ప్రజాధనంతో పాటు అధికారుల్ని వాడేస్తూ  అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అంటున్నారు. 
  
బటన్ నొక్కే బహిరంగసభలపైనా విమర్శలు 

సీఎం  జగన్ ప్రభుత్వ పథకాలకు  బటన్ నొక్కేందుకు వివిధ జిల్లాల్లో ప్రభుత్వం తరపున సభలు నిర్వహిస్తున్నారు. అయితే అవి పేరుకే ప్రభుత్వ సభలు. పూర్తిగా రాజకీయ కోణంలోనే జరుగుతూంటాయి. సీఎం జగన్ కూడా రాజకీయ ప్రసంగాలే చేస్తూంటారు.  వేదికలను కూడా పూర్తిగా వైసీపీ ప్రచారసభ లుగా అలంకరిస్తారు. ఇలాంటి అంశాల ద్వారా ప్రజాధనాన్ని వైసీపీ కోసం వాడుకుంటున్నారన్న విమర్శలువస్తున్నాయి. 

ఇటీవల ఐ ప్యాక్ కోసం ఓ అధికారిని యమించుకోవడానికి మార్కెటింగ్ శాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. ఎలక్షనీరింగ్ ను అర్హతగా నిర్ణయించారు. అంటే ఎన్నికల్లో ఉపయోగించుకోవడానికి ప్రజాధనంతో ఇలా నియమించుకుంటున్నారని టీడీపీ నేతలు ారోపిస్తున్నారు.  పార్టీ, ప్రభుత్వం ఒకటేనని సజ్జల ఎందుకు అంటున్నా సులువుగా అర్థం చేసుకోవచ్చని..  ప్రజాధనాన్ని పార్టీ కోసం ఖర్చు పెట్టుకునేందుకే ఇలా చెప్పుకుంటున్నారని టీడీపీ నేతలంటున్నారు.  

టాప్ హెడ్ లైన్స్

Mamata Banerjee Lok Sabha: బెంగాల్‌ పీఠం కోల్పోయిన మమత ఢిల్లీ కోటపై కన్నేశారా? యూసఫ్‌ పఠాన్ సీటు ఖాళీ వెనుక అసలు కథేంటీ?
బెంగాల్‌ పీఠం కోల్పోయిన మమత ఢిల్లీ కోటపై కన్నేశారా? యూసఫ్‌ పఠాన్ సీటు ఖాళీ వెనుక అసలు కథేంటీ?
K Annamalai New Political Party: అన్నామలై సొంత పార్టీ ప్రకటన - రజనీకాంత్ ప్రస్తావన - తమిళనాడు రాజకీయాల్లో కలకలం
అన్నామలై సొంత పార్టీ ప్రకటన - రజనీకాంత్ ప్రస్తావన - తమిళనాడు రాజకీయాల్లో కలకలం
Revanth Reddy target GHMC :తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
Karnataka Congress Crisis: డీకే శివకుమార్‌కు షాక్ ఇస్తున్న మంత్రులు! కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం!
డీకే శివకుమార్‌కు షాక్ ఇస్తున్న మంత్రులు! కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం!

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karnataka Congress Crisis: డీకే శివకుమార్‌కు షాక్ ఇస్తున్న మంత్రులు! కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం!
డీకే శివకుమార్‌కు షాక్ ఇస్తున్న మంత్రులు! కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం!
Revanth Reddy target GHMC :తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
Nandus World Scam: నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
K. Annamalai:
"అందుకే బీజేపీలో చేరా, ఏడాదిన్నర నుంచి విభేదాలు"అన్నామలై సంచలన వ్యాఖ్యలు! కొత్త రాజకీయ వేదిక ప్రకటన!
Breaking News:
"ఒక్కో ఉద్యోగం 40 లక్షలు" టీటీడీ ఇంజినీరింగ్ పోస్టుల భర్తీపై భూమన కరుణాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు 
Hyderabad Metro Fact Check:
"అమీర్‌పేట అగ్ని ప్రమాదంలో మెట్రో పిల్లర్‌కు నష్టం జరగలే, పగుళ్లు ప్రచారం ఫేక్" హైదరాబాద్‌ మెట్రో ఎండీ ప్రకటన
Andhra Pradesh Rajya Sabha Elections:అన్నామలై ఎఫెక్ట్‌! ఏపీలో రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ! కూటమిలో కొత్త లెక్కలేంటీ?
అన్నామలై ఎఫెక్ట్‌! ఏపీలో రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ! కూటమిలో కొత్త లెక్కలేంటీ?
Karnataka Minister Ramalinga Reddy : కర్ణాటక సీఎం డీకేకు షాక్! పోర్ట్‌పోలియోపై అసంతృప్తితో మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!
కర్ణాటక సీఎం డీకేకు షాక్! పోర్ట్‌పోలియోపై అసంతృప్తితో మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!
Embed widget