అన్వేషించండి

Shock For Somu Veerraju : జగన్, మీరు తోడు దొంగలు - అమరావతిలో సోము వీర్రాజుకు షాకిచ్చిన రైతు !

రాజధాని పాదయాత్ర చేస్తున్న సోము వీర్రాజుకు రైతు ఒకరు షాకిచ్చారు. ఆయన అన్నమాటలకు ఏపీ బీజేపీ అధ్యక్షుడికి మైండ్ బ్లాంక్ అయింది.


Shock For Somu Veerraju :   రాజధాని గ్రామాల్లో బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు చేదు అనుభవం ఎదురైంది.  "మన అమరావతి బీజేపీ సంకల్ప యాత్ర"ను ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు సోమువీర్రాజు ఉండవల్లిలో ప్రారంభించారు. నాల్గో తేదీ సాయంత్రం తుళ్ళూరులో యాత్రను ముగించనున్నారు.ఈ పాదయాత్రలో భాగంగా పెనుమాక వెళ్లిన సోము వీర్రాజు అక్కడ రాజధానికి భూములు ఇచ్చిన రైతులతో మాట్లాడారు.  తమకు అధికారం ఇస్తే సంవత్సరంలో రాజధాని నిర్మిస్తామని రైతులకు  సోమువీర్రాజు హామీ ఇచ్చారు. అయితే అక్కడే ఉన్న పెనుమాకకు చెందిన వృద్ధ రైతు సోము వీర్రాజుతో వాగ్వాదానికి దిగారు.  జగన్, మీరు కలిసి తోడు దొంగలై రాజధానిని సర్వనాశనం చేశారని మొహం మీదనే చెప్పేశారు. ఆ రైతుకు సర్ది చెప్పాలని సోము వీర్రాజు ప్రయత్నించారు కానీ ఆయన వినిపించుకోలేదు. దీంతో  సోము వీర్రాజు ముందుకెళ్లిపోయారు. 

కేసినోలకు వెళ్తా, పేకాట ఆడతా కానీ చీకోటి ప్రవీణ్‌తో సంబంధం లేదు - ఏపీ మాజీ మంత్రి క్లారిటీ !

సోము వీర్రాజును పెనుమాక రైతు ప్రశ్నిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు.. ఇతరులు విస్తృతంగా షేర్ చేస్తున్నారు.

 

అమరావతిని రాజధానిగా ఏకగ్రీవంగా నిర్ణయించింది గత ప్రభుత్వం. ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. పాలనా వ్యవహారాలన్నీ అమరావతి నుంచి జరుగుతున్నాయి. అయితే వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత  మూడు రాజధానుల ప్రస్తావన తీసుకు వచ్చారు. అమరావతిలో పనులన్నీ నిలిపివేశారు. ఆ సమయంలో బీజేపీ నేతలు తాము అమరావతికే మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు. కానీ రాజధాని అనేది రాష్ట్ర ప్రభుత్వ చాయిస్ అని కేంద్రానికి సంబంధం లేదని వాదిస్తూ వచ్చారు. ఈ క్రమంలో బీజేపీ కూడా వైఎస్ఆర్‌సీపీకి సహకరిస్తోందని ఎక్కువ మంది భావించారు. పలువురు బీజేపీ నేతలు అమరావతి రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఈ నమ్మకం మరింత బలపడింది. అందుకే పెనుమాక రైతు సోము వీర్రాజుపై అలా విరుచుకుపడినట్లుగా భావిస్తున్నారు. 

25 మంది ఎంపీలు రిజైన్ చేయండి, పోలవరం నిధులొస్తాయి - ఆయనో కోడికత్తి కమల్ హాసన్: చంద్రబాబు

అయితే అమరావతికి తాము మొదటి నుంచి మద్దతుగా ఉన్నామని బీజేపీ నేతలు చెబుతున్నారు.  కేంద్రం రాజధాని అమరావతి కోసం 4వేల‌కోట్లు ఓసారి, 2500కోట్లు మరోసారి నిధులు ఆనాడు కేంద్రం మంజూరు చేసిందని గుర్తు చేశారు. అమరావతి స్మార్ట్‌ సిటీ కోసం ఈ డబ్బుల వినియోగించలేదని బీజేపీ నేతలు చెబుతున్నారు. తాము అధికారంలోకి వస్తే ఏడాదిలో రాజధాని నిర్మిస్తామని హామీ ఇస్తున్నారు. గత పరిణామాలతో  రైతుల్ని నమ్మించడానికి బీజేపీ నేతలు చాలా కష్టాలు పడాల్సి వస్తోంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Mohan Lal : దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?

వీడియోలు

నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్
North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Mohan Lal : దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
Telangana Panchayat Elections 2025:తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
Tirupati Outer Ring Road: తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
Pragathi : సరదాగా అనుకున్నా... డెడికేషన్‌తో ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించారు - నటి ప్రగతిపై నాగబాబు ప్రశంసలు
సరదాగా అనుకున్నా... డెడికేషన్‌తో ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించారు - నటి ప్రగతిపై నాగబాబు ప్రశంసలు
Embed widget