అన్వేషించండి
KCR Nanded Meeting: బీఆర్ఎస్ సర్కార్ రాగానే మహారాష్ట్రలో 24 గంటల కరెంటు: కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో భాగంగా నేడు మహారాష్ట్రలో పర్యటించారు. నాందేడ్ లో బీఆర్ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
నాందేడ్ లో బీఆర్ఎస్ సభ
1/17

భారత్ రాష్ట్ర సమితి పార్టీ మహారాష్ట్ర నాందేడ్ లో భారీ బహిరంగ సభ నిర్వహించింది.
2/17

వనరులు ఉన్నా ప్రభుత్వాల చేతకాని పరిస్థితుల వల్లే ఇది జరిగిందన్నారు. బీఆర్ఎస్ పార్టీకి దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోందని సీఎం కేసీఆర్ అన్నారు.
3/17

దేశంలో విప్లవాత్మక మార్పు అవసరం ఉందని కేసీఆర్ స్పష్టం చేశారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లు పరిస్థితి ఉందని ఆవేదన చెందారు.
4/17

ఈ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో మహారాష్ట్రకు చెందిన పలువురు నేతలు బీఆర్ఎస్ లో చేశారు. వారికి సీఎం కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
5/17

ఇన్నేళ్లయినా చాలా గ్రామాల్లో తాగునీరు, సాగు నీరు లేదన్నారు. కరెంట్ సదుపాయం లేకుండా వందల గ్రామాలు చీకట్లో మగ్గుతున్నాయన్నారు.
6/17

మరఠ్వాడా గడ్డ ఎంతో మంది మహానీయులకు జన్మనిచ్చిందని సీఎం కేసీఆర్ అన్నారు.
7/17

దేశంలో నాయకత్వ మార్పు రావాలని ఆయన ఆకాంక్షించారు. మహారాష్ట్రలో అత్యధిక ఆత్మహత్యలు జరుగుతున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు.
8/17

ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో స్థానిక ప్రభుత్వాలు ఆలోచించాలన్నారు. ఎంత కష్టం, ఆవేదన ఉంటే రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుందో ఆలోచించాలన్నారు.
9/17

దేశానికి అన్నంపెట్టే రైతన్నల ఉసురు తీసుకోవడం శ్రేయస్కరం కాదన్నారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అని నినదించిన పార్టీ దేశంలో బీఆర్ఎస్ ఒక్కటే అన్నారు.
10/17

ఇప్పుడు తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలుస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ మహారాష్ట్రకు రోటీ - భేటీ బంధం ఉందన్నారు.
11/17

బీఆర్ఎస్ సభా వేదికపై రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మరఠా యోధులకు సీఎం కేసీఆర్ పుష్పాంజలి ఘటించారు. మహానుభావులకు కేసీఆర్ తో పాటు నేతలు నివాళులర్పించారు.
12/17

నిత్యం తెలంగాణకు వచ్చేవాళ్లంతా అక్కడ ఏం జరుగుతుందో గమనిస్తున్నారన్నారు. తెలంగాణలో రైతు బీమాతో కుటుంబాలకు భరోసా దొరికిందన్నారు.
13/17

సీఎం కేసీఆర్ వెంట ఆయన కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో పాటు పలువురు ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు.
14/17

రైతు ఏ కారణంతో చనిపోయినా వారం రోజుల్లో రూ.5 లక్షలు సాయం అందిస్తున్నామన్నారు.
15/17

మహారాష్ట్రలో గులాబీ సర్కార్ రాగానే 24 గంటల కరెంటు వస్తుందన్నారు. నాయకులు అంటే ఎక్కడి నుంచో రారని, మీ నుంచే వస్తారన్నారు.
16/17

నాందేడ్ జిల్లా కేంద్రానికి చేరుకున్న సీఎం కేసీఆర్ కు ఘన స్వాగతం లభించింది. అనంతరం కేసీఆర్ నాందేడ్ లోని చారిత్రక గురుద్వారాను సందర్శించారు.
17/17

గురుద్వారాకు వెళ్లిన సీఎం కేసీఆర్కు సిక్కు మతగ గురువులు ఘనస్వాగతం పలికారు. అనంతరం గురుద్వారాలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సీఎం కేసీఆర్ గురుద్వారా వద్ద సిక్కు మత గురువుల ఆశీర్వాదం తీసుకున్నారు.
Published at : 05 Feb 2023 08:50 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
శుభసమయం

Nagesh GVDigital Editor
Opinion




















