అన్వేషించండి
In Pics: సూపర్ స్టార్ కృష్ణకు సీఎం జగన్ నివాళి - మహేశ్ను ఆలింగనం చేసుకొని పరామర్శ
సూపర్ స్టార్ కృష్ణ భౌతిక కాయానికి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నివాళి అర్పించారు.

మహేశ్ బాబును ఓదారుస్తున్న సీఎం
1/12

సూపర్ స్టార్ కృష్ణ భౌతిక కాయానికి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నివాళి అర్పించారు.
2/12

ఉదయం 11 గంటలకు హైదరాబాద్ పద్మాలయ స్టూడియోకు చేరుకున్న జగన్ దిగ్గజనటుడి పార్థివదేహాన్ని సందర్శించారు.
3/12

ఆయనకు నివాళి అర్పించిన తర్వాత మహేష్ బాబు ఫ్యామిలీని ఓదార్చారు.
4/12

కాసేపు వారితో మాట్లాడారు. సుమారు 15 నిమిషాల పాటు అక్కడ ఉన్న జగన్ తర్వాత తిరుగు పయనమయ్యారు.
5/12

కృష్ణ భౌతిక కాయాన్ని సందర్శించే టైంలో నందమూరి బాలకృష్ణ కూడా అక్కడే ఉన్నారు.
6/12

మహేష్బాబు, ఆయన ఫ్యామిలీతో మాట్లాడిన అనంతరం సీఎం జగన్ మోహన్ రెడ్డి బాలకృష్ణకు కూడా పలకరించారు.
7/12

ఇద్దరు ఒకరినొకరు పలకరించుకున్న తర్వాత బాలకృష్ణ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
8/12

సీఎం జగన్ మోహన్ రెడ్డితో పలువురు మంత్రులు, పార్టీ లీడర్లు కూడా కృష్ణ భౌతిక కాయానికి అంజలి ఘటించారు.
9/12

కృష్ణ తుది శ్వాస విడిచినప్పుడు కూడా సీఎం జగన్ ట్విటర్ ద్వారా సంతాపం తెలియజేశారు.
10/12

తెలుగువారి సూపర్ స్టార్ కృష్ణ అని... ఆయనే అల్లూరి... ఆయనే మన జేమ్స్ బాండ్ అని కామెంట్ పెట్టారు.
11/12

నిజ జీవితంలో కూడా మనసున్న మనిషిగా, సినీరంగంలో తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్న ఆయన మరణం తెలుగు సినీ రంగానికి, తెలుగు వారికి తీరని లోటు అని అభిప్రాయపడ్డారు.
12/12

సీఎం జగన్ వెంట వైఎస్ఆర్ సీపీకి చెందిన పలువురు నాయకులు ఉన్నారు.
Published at : 16 Nov 2022 01:30 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
క్రికెట్
సినిమా
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion