అన్వేషించండి
Fire Accident In Andhra Pradesh Secretariat: సచివాలయంలో అగ్నిప్రమాద ప్రదేశాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు
Fire Accident In Andhra Pradesh Secretariat: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఈ ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. రెండో బ్లాక్లో ఉంచిన బ్యాటరీలు కారణంగా ఇలా జరిగిందని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు.
సచివాలయంలో అగ్నిప్రమాద ప్రదేశాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు
1/8

వెలగపూడి సచివాలయంలోని రెండవ బ్లాక్లో తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు.
2/8

సీఎస్ విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, హోంమంత్రి అనిత, జీఏడీ పొలిటికల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనాతో కలిసి సీఎం చంద్రబాబు పరిశీలించారు.
3/8

అగ్నిప్రమాదం ఎలా, ఏ సమయంలో చోటు చేసుకుందని సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రతిచోటా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, తద్వారా ప్రమాదానికి కారణాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు.
4/8

అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశానికి ఫోరెన్సిక్ బృందం ఎన్ని గంటలకు వచ్చిందని అడిగారు సీఎం. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు అవసరమైన ఆధారాలను సేకరించారా లేదా అని చంద్రబాబు అడిగారు.
5/8

సచివాలయంలో అన్ని చోట్లా భద్రతా ప్రమాణాలన్నీ పాటిస్తున్నారా లేదా అన్నది ఆడిట్ చేయాలని సూచించారు చంద్రబాబు.
6/8

మొదటి బ్లాక్లోని బ్యాటరీ రూమ్ను కూడా సీఎం పరిశీలించారు. ఇటువంటి బ్యాటరీ గ్యాలరీనే రెండో బ్లాక్లో అగ్నిప్రమాదానికి గురైందని సీఎంకు సీఎస్ వివరించారు.
7/8

సీఎంఆర్ఎఫ్ విభాగాన్ని పరిశీలించిన చంద్రబాబు అక్కడి అపరిశుభ్రతపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. 24 గంటల్లో చెత్తనంతా క్లీన్ చేయాలని ఆదేశించారు.
8/8

పని ప్రదేశాల్లో ఎక్కడా తాత్కాలికంగా కూడా చెత్త కనబడటానికి వీళ్లేదని అన్నారు.
Published at : 04 Apr 2025 03:23 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















