By: ABP Desam | Updated at : 16 Apr 2022 05:16 PM (IST)
ఉక్రెయిన్, రష్యా, ఉక్రెయిన్పై దాడులు, రష్యా క్షిపణి దాడులు, కీవ్పై రష్యా ఎటాక్స్
ఉక్రెయిన్ రాజధాని నగరం కీవ్పై రష్యా మళ్లీ దాడులు ప్రారంభించింది. నల్ల సముద్రంలోని రష్యా యుద్ధ నౌక మాస్క్వా విధ్వంసం ఉదంతం తర్వాత కీవ్ను టార్గెట్గా చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. దీంతో యుద్ధం మరింత కాలం సాగబోతోందని ప్రపంచదేశాలు అంచనాకు వచ్చాయి. అసలు యుద్ధం ఎంత కాలం సాగుతుందో ఎవరికీ స్పష్టత లేకుండా పోయింది. ఉక్రెయిన్ ఎదురుదాడులకు దిగుతోందని రాష్యా ఆరోపిస్తూండటం మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందేమో అన్న అనుమానాలు ప్రారంభ కావడానికి కారణం అవుతోంది.
మార్చి నెలాఖరులో జరిగిన చర్చల్లో భాగంగా కీవ్, చెర్నిహీవ్ నుంచి సేనలను ఉపసంహరించుకుంటామని రష్యా చెప్పింది ఆ మేరకు ఉక్రెయిన్ ఉత్తరానికి బలగాలను తరలించింది. ఆ తర్వాత దురాక్రమణను దక్షిణ, తూర్పు ప్రాంతాలకే పరిమితం చేసింది. అయితేరష్యా యుద్ధ నౌక మాస్క్వా విధ్వంసం జరగడంతో రష్యా మల్లీ దాడులు ప్రారంభించింది. క్యాలిబర్ మి సైల్స్తో.. కీవ్పై దాడులు చేసేందుకు సిద్ధమయింది. నల్ల సముద్రం నుంచి కీవ్ శివార్లలోని ఓ రక్షణ పరిశ్రమపై క్షిపణులతో దాడిచేసింది. ఈ పరిశ్రమలో యాంటీ-ట్యాంక్, యాంటీ-షిప్ క్షిపణులు తయారవుతా యి. ఈ ఘటనలో భారీగానే ఆయుధ నష్టం సంభవించినట్లు రష్యా వెల్లడించింది. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతాలైన సివెర్స్కీ, స్లోబోజెన్స్కీ, డోనెట్స్క్, లుహాన్స్క్, టవ్రిస్కీ నగరాల్లో పోరు ఉధృతంగా సాగుతోంది. ఇంతకాలం ఖెర్సోన్లో దాడులను నిలిపివేసిన రష్యా.. శుక్రవారం ఆ నగరంపై విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఇద్దరు పౌరులు మృతిచెందారు. నల్లసముద్ర తీర నగరాలు మైకొలైవ్, మారియుపోల్పైనా క్షిపణి దాడులు జరిగాయి.
#Ukraine
Last moment of the Russian’s Moskva. pic.twitter.com/lkpDNQlbt6— Alex C (@cmhwee) April 15, 2022
రష్యాపై ఉక్రెయిన్ దాడులు చేస్తోందని రష్యా ఆరోపిస్తోంది. యాబై రోజులుగా కొనసాగుతున్న ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో గత రెండు రోజులుగా తమ భూభాగంలోని గ్రామాలపై ఉక్రెయిన్ దాడి చేస్తోందని రష్యా చెబుతోంది. రష్యా సరిహద్దు బ్రైయాన్స్క్ రీజియన్లోని ఓ గ్రామంపై ఉక్రెయిన్ హెలికాప్టర్లు బాంబులు విడిచాయని రష్యా గురువారం ప్రకటించింది. ఉక్రెయిన్ దాడుల్ని ఖండిస్తున్న ప్రకటించిన రష్యా.. తమ భూభాగంలో తీవ్రవాద దాడులు లేదంటే విధ్వంసానికి పాల్పడితే ఉక్రెయిన్ రాజధాని కీవ్పై తమ మిసైళ్ల దాడుల సంఖ్య పెరుగుతుందని హెచ్చరించింది. అయితే రష్యా చేస్తున్న ప్రకటనలు అవాస్తవమని ఉక్రెయిన్ అంటోంది. అవి కేవలం ఆరోపణలు మాత్రమేనని .. తమపై దాడులు చేయడానికి కారణంగా చూపిస్తున్నారని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది.
The new cemetery in Eastern #Ukraine's #Severodonetsk, where the hundreds of dead from #Russia's war are buried, grows larger by the day. A silent testament to the meat grinder this conflict has become. https://t.co/nTYTMADfnu pic.twitter.com/pYnNU5TIew
— Nabih (@nabihbulos) April 16, 2022
ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్నది మూడో ప్రపంచయుద్ధమేనంటూ రష్యా సంచలన వ్యాఖ్యలు చేసింది. పాశ్చాత్య, నాటో దేశాల అండతో ఉక్రెయిన్కు ఆయుధాలు అందుతున్నాయి. రష్యా సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి రష్యా పోరాటం చేస్తోందని ప్రకటించారు. ఐదు రోజుల్లో ఉక్రెయిన్ను ఆక్రమిస్తామంటూ మొదట్లో ప్రకటన చేసిన రష్యా.. 50 రోజులైనా ముందుకు సాగలేకపోయిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెబుతున్నారు. కొత్తగా రెండు దేశాల మధ్య యుద్ధం .. దాడులు మరోసారి ప్రారంభం కావడంతో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ ప్రపంచం మొత్తం ఏర్పడుతోంది.
Nobel Prize In Physics: భౌతికశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం, ప్రకటించిన రాయల్ స్వీడిష్ అకాడమీ
Delhi-NCR Earthquake: ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో భూప్రకంపనలు, నేపాల్ లో 6.2 తీవ్రతతో భూకంపం
Nobel Prize 2023: కరోనా సమయంలో సేవలకు అత్యుత్తమ గుర్తింపు, నోబెల్ పురస్కారంతో సత్కారం
Elon Musk: కెనడాలో మాట్లాడే స్వేచ్ఛ లేకపోవడం సిగ్గుచేటు- ప్రధాని ట్రూడోపై ఎలన్ మస్క్ ఫైర్
Pakistani Beggars: సౌదీలో యాచనకు ఫ్లైట్ ఎక్కిన పాకిస్థానీలు- పాతిక మందిని అరెస్టు చేసిన ఎఫ్ ఐఏ
KTR About PM Modi: ఎన్డీఏలో చేరడానికి మాకు పిచ్చికుక్క ఏం కరవలేదు - ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్
RK Roja: మీడియా ముందు ఏడ్చేసిన మంత్రి రోజా! మీ ఇంట్లో ఆడబిడ్డలను ఇలానే అంటారా అంటూ నిలదీత
Amitabh Bachchan: 'తలైవర్ 170'లో బిగ్ బి - 32 ఏళ్ళ తర్వాత ఒకే సినిమాలో ఇద్దరు 'సూపర్ స్టార్స్'
Asian Games India Wins Gold: భారత్ ఖాతాలో మరో 2 స్వర్ణాలు - అన్ను రాణి, పారుల్ చౌదరి మన బంగారాలు!
/body>