అన్వేషించండి

Sri Lanka Free Visa: భారత్‌ సహా ఏడు దేశాలకు ఫ్రీ వీసా- దిద్దుబాటు చర్యల్లో శ్రీలంక

Sri Lanka Free Visa: కరోనా, ఆర్థిక సంక్షోభం తరువాత శ్రీలంక కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌ సహా ఏడు దేశాల పౌరులకు వీసా లేకుండానే శ్రీలంకలో పర్యటించేందుకు అనుమతిచ్చేలా నిర్ణయించింది.

Sri Lanka Free Visa: కరోనా, ఆర్థిక సంక్షోభం తరువాత శ్రీలంక కీలక నిర్ణయం తీసుకుంది. లంక పర్యాటక రంగాన్ని  ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టింది. భారత్‌ సహా ఏడు దేశాల పౌరులకు వీసా లేకుండానే శ్రీలంకలోని పర్యాటక ప్రదేశాలను సందర్శించేందుకు అనుమతివ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు భారత్‌, చైనా, రష్యా, మలేషియా, జపాన్‌, ఇండోనేషియా, థాయ్‌లాండ్‌ దేశాల టూరిస్టులకు ఉచిత వీసాలు జారీ చేసేందుకు లంక కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

ఆ దేశ విదేశాంగ మంత్రి అలీ సబ్రీ (Ali Sabry)  ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా వెల్లడించారు. పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టే ఈ కార్యక్రమం వచ్చే ఏడాది మార్చి 31 వరకూ కొనసాగుతుందని ప్రకటించారు. తద్వారా  ఆయా దేశాల టూరిస్టులు ఎటువంటి ప్రవేశ రుసుము లేకుండా వీసాలు పొందవచ్చు. శ్రీలంక‌ను ఎక్కువగా పర్యటించేవారిలో భారతీయులు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 

భారత్ నుంచే ఎక్కువ
గత సెప్టెంబర్‌లో ఇండియా నుంచి 30,000 కంటే ఎక్కువ మంది శ్రీలంకలో పర్యటించారు. ఇది ఆదేశానికి వెళ్లే మొత్తం టూరిస్టుల శాతంలో 26 శాతంతో భారత్ అగ్రస్థానంలో ఉంది. చైనా నుంచి 8,000 కంటే ఎక్కువ మంది పర్యాటకులు వెళ్లారు. 2019 ఈస్టర్ సండే బాంబు పేలుళ్ల తర్వాత 11 మంది భారతీయులతో సహా 270 మంది మరణించారు. 500 మందికి పైగా గాయపడ్డారు. ఈ ప్రమాదంతో ఈ ద్వీపానికి వెళ్లే పర్యాటకుల సంఖ్య తగ్గింది.

పర్యాటకమే ఆధారం
ద్వీప దేశమైన శ్రీలంకకు పర్యాటక రంగమే ప్రధాన ఆదాయ వనరు. దేశ జీడీపీలో 10 శాతం పర్యాటక రంగం నుంచే వస్తోంది. కరోనాకు ముందు లంక పర్యాటక ఆదాయం రూ.360 కోట్లకు పైగా ఉండేది. కోవిడ్, ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రస్తుతం 60 కోట్ల డాలర్ల దిగువకు పడిపోయింది. దానికి తోడు ఆర్థిక, రాజకీయ అనిశ్చితితో దేశం మొత్తం సంక్షోభంలో పడిపోయింది. దీంతో ఆ దేశానికి వెళ్లే పర్యాటకుల గణనీయంగా తగ్గిపోయింది. 

దిద్దుబాటు చర్యలు
ఏటా శ్రీలంకకు వచ్చే పర్యాటకుల్లో 30 శాతం మంది రష్యా, ఉక్రెయిన్‌, పోలండ్‌, బెలారస్‌కు చెందినవారు ఉంటారు. అయితే అక్కడ యుద్ధం నేపథ్యంలో శ్రీలంకకు వచ్చే పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయి, ఆదాయం పడిపోయింది. ఆపై పేరుకుపోతున్న అప్పులతో అస్తవ్యస్థంగా ఉన్న ఆర్థిక పరిస్థితిని పునర్నిర్మించేందుకు చర్యలు చేపట్టింది. పరిస్థితిని సాధారణ స్థితికి తెచ్చేందుకు నడుం కట్టిన శ్రీలంక ప్రస్తుతం దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. 

పెరుగుతున్న సంఖ్య
ఈ నేపథ్యంలోనే లంక ప్రోత్సాహానికి ఊతమిచ్చేలా సంస్కరణలను చేపట్టింది. 2023 సంవత్సరానికి 20 లక్షల మందిని ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఫ్రీ వీసా పాలసీని తీసుకొచ్చింది. కాగా శ్రీలంకలో ఇప్పుడు పరిస్థితులు కాస్త మెరుగుపడుతున్నాయి. 2023 సెప్టెంబర్​లో 10 లక్షల మంది పర్యాటకులు శ్రీలంకకు వెళ్లారు. 2019 తర్వాత ఇంత మొత్తంలో పర్యాటకులు రావడం ఇదే తొలిసారి.

అధ్వాన్నంగా ఆర్థిక పరిస్థితి
1948లో స్వాతంత్ర్యం పొందినప్పటి నుంచి శ్రీలంక ఇంతటి అధ్వాన్నమైన స్థితిలో లేదు. తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఆ దేశాన్ని అతాలకుతలం చేసింది. ఈ పరిస్థితికి కారణమైన శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే రాజీనామాను డిమాండ్ చేస్తూ నిరసనకారులు పెద్ద ఎత్తన ఆందోళన చేపట్టారు. దీంతో రాజకీయ అశాంతిని కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆహారం, ఔషధం, వంటగ్యాస్, ఇతర ఇంధనం, టాయిలెట్ పేపర్, అగ్గిపెట్టెలు వంటి అవసరమైన వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kokapet land auction: 150 కోట్లు దాటిన కోకాపేటలో ఎకరం భూమి- తాజా వేలంలో కొత్త రికార్డులు
150 కోట్లు దాటిన కోకాపేటలో ఎకరం భూమి- తాజా వేలంలో కొత్త రికార్డులు
Pinnelli Brothers: పిన్నెల్లి బ్రదర్స్ ను నిండా ముంచిన లాయర్లు - ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
పిన్నెల్లి బ్రదర్స్ ను నిండా ముంచిన లాయర్లు - ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
Kavitha Politics: కాళేశ్వరం నుంచి కామారెడ్డికి ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదు: కవిత సంచలనం
కాళేశ్వరం నుంచి కామారెడ్డికి ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదు: కవిత సంచలనం
Goa Sarswat Math: పనాజీలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముని విగ్రహం ఆవిష్కరించిన ప్రధాని మోదీ
పనాజీలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముని విగ్రహం ఆవిష్కరించిన ప్రధాని మోదీ
Advertisement

వీడియోలు

Asifabad DCC President Athram Suguna Interview | ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా రాణిస్తానంటున్న ఆత్రం సుగుణ | ABP Desam
Philosophy Behind Avatar Movie | అవతార్ 3 చూసే ముందు ఓ సారి ఇది ఆలోచించు | ABP Desam
ఐయామ్ సారీ.. మేం సరిగా ఆడలేకపోయాం.. కానీ..!
డబ్ల్యూపీఎల్‌ మెగా వేలంలో ఆంధ్రా అమ్మాయికి రికార్డ్ ధర..
ధోనీ ఇంట్లో కోహ్లీ, రోహిత్ గంభీర్‌పై రెచ్చిపోతున్న ఫ్యాన్స్!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kokapet land auction: 150 కోట్లు దాటిన కోకాపేటలో ఎకరం భూమి- తాజా వేలంలో కొత్త రికార్డులు
150 కోట్లు దాటిన కోకాపేటలో ఎకరం భూమి- తాజా వేలంలో కొత్త రికార్డులు
Pinnelli Brothers: పిన్నెల్లి బ్రదర్స్ ను నిండా ముంచిన లాయర్లు - ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
పిన్నెల్లి బ్రదర్స్ ను నిండా ముంచిన లాయర్లు - ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
Kavitha Politics: కాళేశ్వరం నుంచి కామారెడ్డికి ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదు: కవిత సంచలనం
కాళేశ్వరం నుంచి కామారెడ్డికి ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదు: కవిత సంచలనం
Goa Sarswat Math: పనాజీలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముని విగ్రహం ఆవిష్కరించిన ప్రధాని మోదీ
పనాజీలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముని విగ్రహం ఆవిష్కరించిన ప్రధాని మోదీ
Pawan Kalyan: రాజోలు పర్యటనలో పవన్ కల్యాణ్ పై కుట్ర - అపరిచిత వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు
రాజోలు పర్యటనలో పవన్ కల్యాణ్ పై కుట్ర - అపరిచిత వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు
India GDP: భారత్‌ GDP బుల్లెట్ ట్రైన్ వేగంతో దూసుకెళ్తోంది! అంచనాలకు మించిన గణాంకాలు
భారత్‌ GDP బుల్లెట్ ట్రైన్ వేగంతో దూసుకెళ్తోంది! అంచనాలకు మించిన గణాంకాలు
కొత్త చిక్కుల్లో హైడ్రా రంనాథ్! బతుకమ్మ కుంట వివాదంలో కోర్టును ధిక్కరించి చేసిన తప్పేంటి? అరెస్ట్ తప్పదా!?
కొత్త చిక్కుల్లో హైడ్రా రంనాథ్! బతుకమ్మ కుంట వివాదంలో కోర్టును ధిక్కరించి చేసిన తప్పేంటి? అరెస్ట్ తప్పదా!?
Annagaru Vostaru Teaser : నో డైలాగ్స్... నో యాక్షన్ - అన్నగారి ఎంట్రీనే అదిరిపోయింది...  వెరైటీగా కార్తీ 'అన్నగారు వస్తారు' టీజర్
నో డైలాగ్స్... నో యాక్షన్ - అన్నగారి ఎంట్రీనే అదిరిపోయింది... వెరైటీగా కార్తీ 'అన్నగారు వస్తారు' టీజర్
Embed widget