అన్వేషించండి

Viral News: నిద్రపోయాడని ఉద్యోగం నుంచి తీసేశారు - కానీ కోర్టుకెళ్లి కంపెనీదే తప్పని నిరూపించాడు - వీడు మామూలోడు కాదు !

Employee : ఓ కంపెనీలో పని చేసే ఉద్యోగి డ్యూటీ టైంలో నిద్రపోయాడని చెప్పి ఉద్యోగం నుంచి తీసేశారు. కానీ కంపెనీదే తప్పు అని చెప్పి ఆ ఉద్దోకి కోర్టుకెళ్లాడు. కోర్టు కూడా కంపెనీదే తప్పని చెప్పింది.

Man sues company that fired him for taking a nap at work: ఉద్యోగం చేస్తూ నిద్రపోతే యాజమాన్యానికి సహజంగానే కోపం వస్తుంది. ఆ ఉద్యోగిపై కోపం ఉంటే.. హెచ్ ఆర్ వాళ్లు ఇంకో రెండు, మూడు కలిపి టెర్మినేట్ చేయమని సూచనలు చేస్తారు. ఇలా ఓ రసాయన పరిశ్రమలో పని చేస్తున్న ఉద్యోగికి టెర్మినేషన్ లెటర్ వచ్చింది. దీనికి కారణం డ్యూటీ టైంలో గంట పాటు నిద్రపోయాడని సీసీ కెమెరాలో గుర్తించడమే. అతని దగ్గర వివరణ తీసుకుని రెండు వరాల తర్వాత ఉద్యోగం నుంచి తొలగించారు. తాను నిద్రపోవడానికి కంపెనీనే కారణం అని అతను కోర్టుకెళ్లాడు.తన వాదనే కరెక్ట్ అని నిరూపించి కంపెనీ దగ్గర పరిహారం పొందాడు. 

ఇరవై ఏళ్ల సర్వీస్ అయినా డిస్మిస్ 

చైనాలోని  చాంగ్ అనే ఉద్యోగి  ఇరవై ఏళ్లుగా ఓ కెమికల్ కంపెనీలో పని చేస్తున్నారు. హార్డ్ వర్కర్ గా గుర్తింపు ఉంది. ఆయన ఓ రోజు ఇరవై గంట ల పాటు డ్యూటీ చేశారు. మళ్లీ వెంటనే తర్వాత రోజు డ్యూటీ కి వచ్చారు. ఆ సమయంలో ఆయన నిద్ర ఆపుకోలేక ఓ గంట సేపు నిద్రపోయాడు. సీసీ కెమెరాలు ఆ దృశ్యాలను పట్టేశాయి. హెచ్‌ఆర్ నోటీసులు జారీ చేసింది. ఆయన అందులో వివరణ కూడా..అందకు ముందు రోజు ఇరవై గంటల పాటు పని చేసిన విషయాన్ని ప్రస్తావించారు. కంపెనీకి మ్యాన్ పవర్ తక్కువగా ఉన్నందున తాను ఇరవై గంటల పాటు పని చేయాల్సి వచ్చిందని అందుకే నిద్ర వచ్చిందని ఆయన చెప్పారు. ఆయన వివరణ తీసుకున్న రెండు వారాల తర్వాత డిస్మిస్ చేస్తూ కంపెనీ ఉత్తర్వులు ఇచ్చింది. 

Also Read:  పాకిస్థాన్‌లో బంగ్లాదేశ్ తరహా అల్లర్లు - రెచ్చిపోతున్న ఇమ్రాన్ సపోర్టర్లు - అధ్యక్షుడు పారిపోవాల్సిందేనా ?

కంపెనీతో ఒప్పందం ప్రకారం తొలగింపు

ఉద్యోగంలో చేరేటప్పుడు ఇచ్చిన ఒప్పందం ప్రకారం ఖచ్చితంగా చర్యలు తీసుకున్నామని దీన్ని కాదనలేని కంపెనీ స్పష్టం చేసింది. ఇది ఉద్యోగ నిబంధనల మేరకు జరిగిందని స్పష్టం చేసింది. అయితే చాంగ్ మాత్రం దీన్ని ఒప్పుకోలేదు. ఇరవై గంటలు పని చేయాలని ఒప్పందంలో చెప్పలేదని..అయినా చేయించుకున్నారని దానికి నిద్ర వస్తే.. ఉద్యోగం నుంచి తీసేస్తారా అని ప్రశ్నించారు. కానీ కంపెనీ ఒప్పుకోకపోవడంతో కోర్టుకు వెళ్లారు. 

Also Read: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు

కంపెనీదే తప్పని చెప్పిన కోర్టు 

కోర్టు ముందు కూడా తన వాదనలను ఉద్యోగి చాంగ్ గట్టిగా వినిపించారు. కంపెనీ కోసంతాను పని చేస్తే.. తన ఉద్యోగం తీసేశారని తెలిపారు. చాంగ్ వాదనలతో లేబర్ కోర్టు కూడా ఏకీభవించింది. కంపెనీ తప్పు చేసిందని చెప్పి రూ. 40లక్షల పరిహారాన్న ఇవ్వాలని ఆదేశించింది. మళ్లీ ఉద్యోగంలోకి తీసుకుంటామని ఆ కంపెనీ చెప్పినా ఉద్యోగి చాంగ్ మాత్రం.. అంత అవమానించిన కంపెనీ దగ్గర తాను పని చేయబోనని చెప్పి .. పరిహారం తీసుకుని వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు. 

 

టాప్ హెడ్ లైన్స్

Elon Musk Reject Racism Claims: నా కొడుకు పేరు శేఖర్ - జాతివివక్ష ఆరోపణలపై ఇలోన్ మస్క్ షాకింగ్ కామెంట్స్!
నా కొడుకు పేరు శేఖర్ - జాతివివక్ష ఆరోపణలపై ఇలోన్ మస్క్ షాకింగ్ కామెంట్స్!
Diamond Merchant Kidnap: మాలిలో కిడ్నాపైన భారత వజ్రాల వ్యాపారి విడుదల.. రూ. 44 కోట్లు చెల్లించిన ఫ్యామిలీ!
మాలిలో కిడ్నాపైన భారత వజ్రాల వ్యాపారి విడుదల.. రూ. 44 కోట్లు చెల్లించిన ఫ్యామిలీ!
Iran US Conflict: 13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
Breaking News: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
"63 కోర్ట్ ధిక్కార కేసులు భూ మాఫియావే!" - హైకోర్టు తీర్పుపై HYDRA క‌మిష‌న‌ర్ రంగనాథ్ వివరణ
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Kishan ReddY Latest News:
"రేవంత్ రెడ్డి హయాంలో ప్రశ్నపత్రాల లీకేజ్‌- రాజీనామా చేయాలి" కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ 
Embed widget