China : చైనాలో సంచలనం.. ఇద్దరు మాజీ రక్షణ మంత్రులకు మరణశిక్ష - అవినీతిపై చేశారనే !
China death sentence:చైనాలో ఇద్దరు మాజీ రక్షణ మంత్రులు కోర్టు మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. వారు అవినీతికి పాల్పడటమే కారణం.

China sentences two ex-defence ministers to death for corruption: చైనా రక్షణ రంగంలో భారీ కుంభకోణాలు , అవినీతి ఆరోపణలతో ఆ దేశం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇద్దరు మాజీ రక్షణ మంత్రులు వీ ఫెంఘే , లీ షాంగ్ఫులకు చైనా కోర్టు మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. అయితే, దీనిని రెండు సంవత్సరాల నిలిపివేత కాలంతో ప్రకటించారు. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ 2012లో అధికారంలోకి వచ్చినప్పటి నుండి సైన్యంలో సాగిస్తున్న సుదీర్ఘ అవినీతి వ్యతిరేక ఉద్యమంలో భాగంగా ఈ కఠినమైన చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ ఇద్దరు మాజీ మంత్రులు తమ పదవులను అడ్డం పెట్టుకుని భారీగా ముడుపులు స్వీకరించినట్లు, వ్యక్తిగత ప్రయోజనాల కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు రుజువైంది. సాధారణంగా చైనా చట్టాల ప్రకారం, రెండేళ్ల రీప్రీవ్ పీరియడ్ తర్వాత, వీరి ప్రవర్తనను బట్టి మరణశిక్షను పెరోల్ లేని జీవిత ఖైదుగా మార్చే అవకాశం ఉంది. చైనా సాయుధ దళాల చరిత్రలో ఉన్నత స్థాయి అధికారులపై తీసుకున్న అత్యంత కఠినమైన చర్యలలో ఇది ఒకటిగా నిలిచిపోనుంది.
చైనా రక్షణ వ్యవస్థలో అత్యంత కీలక బాధ్యతలు నిర్వర్తించిన వీ ఫెంఘే, లీ షాంగ్ఫులను శిక్షించడం ద్వారా సైన్యంలో క్రమశిక్షణను కఠినతరం చేయాలని జిన్పింగ్ భావిస్తున్నారు. ముఖ్యంగా అణు క్షిపణి వ్యవస్థలను పర్యవేక్షించే ఎలైట్ యూనిట్లలో పేరుకుపోయిన అవినీతిని ప్రక్షాళన చేయడమే లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నాయి. సైనిక సామర్థ్యాన్ని , విశ్వసనీయతను దెబ్బతీసే అవినీతి మూలాలను తొలగించడం దేశ భద్రతకు అత్యవసరమని చైనా అధికారులు స్పష్టం చేస్తున్నారు.
China has given former defense ministers Wei Fenghe and Li Shangfu suspended death sentences over corruption charges, part of Xi Jinping’s anti-graft campaign in the military. pic.twitter.com/1mGf9JwWMQ
— TaiwanPlus News (@taiwanplusnews) May 8, 2026
ఈ పరిణామం భారతదేశం కూడా షాక్కు గురయింది. ఎందుకంటే మరణశిక్ష పడ్డ వారిలో ఒకరైన జనరల్ లీ షాంగ్ఫు, 2023లో భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో ఢిల్లీలో భేటీ అయ్యారు. 2020 గాల్వన్ లోయ ఘర్షణల తర్వాత భారత్-చైనా రక్షణ మంత్రుల మధ్య జరిగిన తొలి ఉన్నత స్థాయి సమావేశం అది. షాంఘై సహకార సంస్థ రక్షణ మంత్రుల సమావేశం సందర్భంగా జరిగిన ఆ చర్చల్లో లీ షాంగ్ఫు కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు అదే నేత అవినీతి కేసులో మరణశిక్షకు గురికావడం అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో చర్చనీయాంశమైంది.
అధ్యక్షుడు షీ జిన్పింగ్ తన పదేళ్ల పాలనలో సైన్యాన్ని తన పూర్తి నియంత్రణలోకి తెచ్చుకునేందుకు ఇటువంటి ప్రక్షాళనలను ఆయుధంగా వాడుకుంటున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ పట్ల విధేయతను విస్మరించి, అధికార దుర్వినియోగానికి పాల్పడే ఏ అధికారినికైనా ఇవే శిక్షలు ఉంటాయని సైనిక కేడర్కు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఈ భారీ శిక్షల ద్వారా చైనా మిలిటరీలో అవినీతికి చరమగీతం పాడాలని జిన్పింగ్ ప్రభుత్వం పట్టుదలతో ఉంది.
Before You Go
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
ట్రెండింగ్ వార్తలు





















